చంద్ర‌బాబు, ప‌వ‌న్ బిగ్‌ప్లాన్‌.. రేషన్ బియ్యం మాఫియాకు ఇక దడదడే!

Publish Date:Dec 3, 2024

Advertisement

రేష‌న్ బియ్యం దందాకు కూట‌మి ప్ర‌భుత్వం చెక్ పెట్ట‌బోతోందా.. బియ్యం మాఫియా వెనుక ఉన్న సూత్ర‌దారుల లెక్క తేల్చ‌డ‌మే కూట‌మి పెద్ద‌ల టార్గెటా..  కూక‌టివేళ్ల‌తో  బియ్యం మాఫియా సామ్రాజ్యాన్ని పెకలించి వేసేందుకు వ్యూహాత్మ‌కంగా అడుగులు ప‌డుతున్నాయా.. తాజాగా సీఎం చంద్ర‌బాబు నాయుడు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ భేటీలో జ‌రిగిన చ‌ర్చ‌ను ప‌రిశీలిస్తే అవున‌నే స‌మాధానం వినిపిస్తోంది. రాష్ట్రంలో రేష‌న్ బియ్యాన్ని అక్ర‌మంగా షిప్ ల ద్వారా దేశ స‌రిహ‌ద్దులు దాటిస్తున్న మాఫియాపై కూట‌మి ప్ర‌భుత్వం గురిపెట్టింది.

అయితే,  ఈ ప్ర‌క్రియ‌ ఏదో ఆషామాషీగా, హ‌డావుడిగా మొద‌లు పెట్టింది కాదు. కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన నాటినుంచి కాకినాడ పోర్టు వేదిక‌గా జ‌రుగుతున్న రేష‌న్ బియ్యం దందాపై ఫోక‌స్ పెట్టింది. మాఫియా సామ్రాజ్యాన్ని ఛేదించుకుంటూ ఒక్కో అడుగు ముందుకేస్తూ అస‌లు దందా ఎలా జ‌రుగుతుంది.. దానికి కార‌ణం ఏమిటి.. ఎలా రేష‌న్‌ బియ్యం అక్ర‌మ ర‌వాణా దందాకు చెక్ పెట్టాల‌నే విష‌యాలపై చంద్ర‌బాబు, ప‌వ‌న్, మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్‌ క‌నుస‌న్న‌ల్లో సీక్రెట్ ఆప‌రేష‌న్ జ‌రిపిన‌ట్లు తెలుస్తోంది. ఈ దందాపై ఓ అవ‌గాహ‌నకు వ‌చ్చిన త‌రువాత డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ రంగంలోకి దిగారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లోనే కాక‌.. ఈ విష‌యంపై జాతీయ స్థాయిలో చ‌ర్చ‌కు  తెర‌లేచింది. ఆ త‌రువాత రేష‌న్ బియ్యం మాఫియా దారుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి లేఖ రావ‌డం.. వెంట‌నే రేష‌న్ బియ్యం మాఫియాకు చంద్ర‌బాబు వార్నింగ్ ఇవ్వ‌టం చ‌క‌చ‌కా జ‌రిగిపోయాయి. తాజాగా చంద్ర‌బాబుతో ప‌వ‌న్ భేటీ కావ‌డంతో ఈ ప్ర‌క్రియ అంతా వ్యూహాత్మ‌కంగానే జ‌రిగిన‌ట్లు ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతుంది.

రేష‌న్ బియ్యం ప‌క్క‌దారి ప‌ట్ట‌డానికి పోర్టులే కార‌ణ‌మా.. అస‌లు రీజ‌న్ ఇంకా ఏమైనా ఉందా అనే అంశంపై కూట‌మి ప్ర‌భుత్వం ఫోక‌స్ పెట్టింది. ప్ర‌స్తుతం రేష‌న్ బియ్యం తీసుకుంటున్న‌వారిలో 80శాతం మంది ఆ బియ్యాన్ని రేష‌న్ మాఫియాకు విక్ర‌యిస్తున్నారు. ముఖ్యంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు క‌లిసి కిలో బియ్యానికి రూ. 40 ఖ‌ర్చుచేసి తెల్ల‌రేష‌న్ కార్డుదారుల‌కు ఒక రూపాయికే అందిస్తున్నాయి. అయితే, ఈ బియ్యాన్ని అధిక‌ శాతం మంది రేష‌న్‌ మాఫియాకు రూ. 10 నుంచి 12 రూపాయ‌ల‌కు విక్ర‌యిస్తున్నారు. వారు మాఫియా సామ్రాజ్యం న‌డిపిస్తున్న వారికి రూ.22 చొప్పున విక్ర‌యిస్తున్నారు.. ఆ త‌రువాత ఆ బియ్యాన్ని కాకినాడ పోర్టు ద్వారా అక్ర‌మంగా ఇత‌ర దేశాల‌కు ర‌వాణా చేసి అక్క‌డ భారీ ధ‌ర‌కు విక్ర‌యాలు చేస్తూ కోట్లు గ‌డిస్తున్నారు. ఇలా ఒక్కో నెల‌కు వంద‌ల కోట్ల రూపాయ‌లు మాఫియా సామ్రాజ్యాన్ని న‌డిపేవారు త‌మ జేబుల్లో వేసుకుంటున్నారు. అయితే, ఈ దందాకు అస‌లు సూత్ర‌దారులు వైసీపీ ప్ర‌భుత్వంలో కీల‌క భూమిక పోషించిన వారేనన్న విమర్శలు ఉన్నాయి. ఈ త‌తంగమంతా అప్ప‌టి సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి క‌నుస‌న్న‌ల్లోనే జ‌రిగింద‌న్న ఆరోప‌ణ‌లూ వినిపిస్తున్నాయి. దందాను మ‌రింత విస్తృతం చేసేందుకే గ‌త వైసీపీ ప్ర‌భుత్వం రేష‌న్ బియ్యాన్ని ఇంటింటికి స‌ర‌ఫ‌రా చేసేందుకు వాహ‌నాల‌ను కొనుగోలు చేసింద‌న్న వాద‌న ఉంది. ఆ వాహ‌నాల ద్వారానే రేష‌న్ బియ్యాన్ని నేరుగా మాఫియా దారుల వ‌ద్ద‌కు చేర్చేవార‌న్న విమ‌ర్శ‌లు ఉన్నాయి. ఈ క్ర‌మంలో కోట్లాది రూపాయ‌లు వైసీపీ ప్ర‌జాప్ర‌తినిధుల‌తో పాటు.. ఇత‌ర పార్టీల్లోని ప‌లువురు ప్ర‌జాప్ర‌తినిధుల‌కు చేరిన‌ట్లు ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతున్నది.

కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత కాకినాడ పోర్టు వేదిక‌గా వేళ్లూనుకుపోయిన రేష‌న్ బియ్యం మాఫియా సామ్రాజ్యాన్ని కూక‌టివేళ్ల‌తో పెకిలించేందుకు న‌డుంబిగించింది. ఇందులో భాగంగా వ్యూహాత్మ‌కంగా అడుగులువేస్తూ మాఫియా దారుల్లో వ‌ణికు పుట్టించ‌డంతో పాటు.. ఇందులో ప్ర‌మేయం ఉన్న వైసీపీ నేత‌ల‌ను క‌ట‌క‌టాల వెన‌క్కు నెట్టేందుకు ప్లాక్కా ప్లాన్ తో చంద్ర‌బాబు, ప‌వ‌న్ ముందుకు సాగుతున్నార‌ని ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతున్నది. కాకినాడ పోర్టు వేదిక‌గా రేష‌న్ బియ్యం అక్ర‌మ ర‌వాణా వెనుక వైసీపీ నేత‌ల హ‌స్తం ఉన్న‌ట్లు బ‌హిర్గ‌త‌మ‌వుతున్నది. కాకినాడ పోర్టు అర‌బిందో చేతిలో ఉంది. అత‌ను వైసీపీ ఎంపీకి బంధువు. అయితే, తొలుత కేవీ రావు చేతిలో పోర్టు ఉండేది.. ఆయ‌న‌కు పోర్టులో అత్య‌ధికంగా 41శాతం వాటా ఉంది. వైసీపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నేరుగా రంగంలోకిదిగి కేవీ రావును బెదిరింపుల‌కు గురిచేసి కాకినాడ పోర్టును అర‌బిందోకు అప్ప‌గించిన‌ట్లు స‌మాచారం. అర‌బిందో చేతిలోకి కాకినాడ పోర్టు వ‌చ్చిన త‌రువాత విశాఖ‌, గంగ‌వ‌రం, కృష్ణ‌ప‌ట్నం కంటే ఎక్కువ ఎగుమతి జ‌రుగుతూ వ‌చ్చింది. గ‌డిచిన మూడేళ్ల కాలంలో కోటీ31ల‌క్ష‌ల ట‌న్నుల ఎగుమ‌తి జ‌రిగింద‌ని ఏపీ మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్ ప్రకటించారు. గ‌త మూడేళ్ల‌లో 45 వేల కోట్ల రూపాయ‌ల విలువైన బియ్యాన్ని కికానాడ పోర్టు ద్వారా త‌ర‌లించారు. దీనిపై స‌మ‌గ్ర ద‌ర్యాప్తు జ‌రిపేందుకు కూట‌మి ప్ర‌భుత్వం సిద్ధ‌మైంది.

కూట‌మి ప్ర‌భుత్వం ప‌క్కా ప్లాన్ ప్ర‌కారం.. కాకినాడ పోర్టు వేదిక‌గా జ‌రుగుతున్న రేష‌న్ బియ్యం దందాను అరిక‌ట్టేందుకు ముందుకుసాగుతుంది. దీంతో ఈ మాఫియాలో భాగ‌స్వాములుగా ఉన్న వైసీపీ నేత‌ల గుండెల్లో రైళ్లు ప‌రుగెడుతున్నాయి. ఇప్ప‌టికే ప‌లువురు వైసీపీ నేత‌లు అజ్ఞాతంలోకి వెళ్లిన‌ట్లు తెలుస్తోంది. ఈ క్ర‌మంలో కూట‌మి నేత‌లు లేవ‌నెత్తుత‌ున్న అంశాల‌ను ప‌క్క‌దారి ప‌ట్టించేందుకు వైసీపీ నేత‌లు విష‌యాన్ని తెరమీదకు వచ్చారు.  మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ.. స్టెల్లా షిప్ ను తనిఖీ చేసిన పవన్ కల్యాణ్ కెన్‌స్టార్ షిప్‌ను ఎందుకు వదిలేశారని ప్రశ్నించారు. ప్రస్తుత ఆర్థిక మంత్రి వియ్యంకుడు ఆ షిప్ లో బియ్యం తరలిస్తున్నారనే సమాచారం ఉందని చెప్పారు. అంబ‌టి రాంబాబు, బొత్స స‌త్య‌నారాయ‌ణ‌సైతం ఇదే విష‌యాన్ని ప్ర‌స్తావించారు. దీంతో కూట‌మి ప్ర‌భుత్వం లేవ‌నెత్తిన అంశాల‌ను ప‌క్క‌దారి ప‌ట్టించేందుకు వైసీపీ నేత‌లు ప‌డ‌రాని పాట్లు ప‌డుతున్నారని అర్థమౌతోంది. ఇదిలాఉంటే మ‌రోవైపు.. చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్ కాకినాడ పోర్టు వేదిక‌గా రేష‌న్ బియ్యం అక్ర‌మ ర‌వాణా అంశంపై సీరియ‌స్ యాక్ష‌న్ తీసుకున్నారు.  అయితే, ప‌వ‌న్ భేటీ ముగిసిన‌ త‌రువాత చంద్ర‌బాబుతో ఏపీ డీజీపీ ద్వార‌క తిరుమ‌ల‌రావు, ఇంటెలిజెన్స్ డీజీపీ మ‌హేశ్ చంద్ర ల‌డ్డా భేటీ అయ్యారు. కాకినాడ వేదిక‌గా రేష‌న్ బియ్యం దందాకు అడ్డుక‌ట్ట వేసే విష‌యంపై చ‌ర్చించారు. ఈ అంశంలో డీజీపీ నేతృత్వంలో క‌మిటీవేసే ఆలోచ‌న‌లో కూట‌మి ప్ర‌భుత్వం ఉన్న‌ట్లు చెబుతున్నారు. దీంతో  రేష‌న్ బియ్యం దందా వ్య‌వ‌హారం ఎప్పుడు ఎవ‌రి మెడ‌కు చుట్టుకుంటుందోన‌న్న భ‌యంతో వ‌ణికిపోతున్నారు.

By
en-us Political News

  
రాబోయే రోజుల్లో ఏ ప్రాంతీయ పార్టీని దగ్గరకు చేర్చుకొనే అవకాశం లేదని ఆయన కుండబద్దలు కొట్టారు. ఎన్డీయే ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చి బుధవారంతో 12 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో మంగళవారం (జూన్ 9) ఢిల్లీలో ఆయన విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ ఈ సోలో ఎజెండా ప్రకటించారు.
మొత్తంగా తెలుగు రాష్ట్రాలలో బీజేపీ వ్యూహం ఏమిటన్న విషయాన్ని అమిత్ షా తేటతెల్లం చేసేశారు. దేశవ్యాప్తంగా కూటమి రాజకీయాలు నడుస్తున్న తరుణంలో.. కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా తెలంగాణ రాజకీయాలపై చేసిన వ్యాఖ్యలు జనసేనకు ఒకింత ఇబ్బందికలిగేలా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
పార్టీ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న కీలక నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడి బయటకు వచ్చేస్తున్నారు. తాజాగా టీఎంసీకి చెందిన రాజ్యసభ ఎంపీ సుస్మితా దేవ్ తన పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. వారం రోజుల వ్యవధిలో టీఎంసీకి గుడ్ బై చెప్పిన రెండో రాజ్యసభ సభ్యురాలు సుస్మితాదేవ్.
కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ నామినేషన్‌ తిరస్కరనకు గురి కావడం దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. మీనాక్షీ నటరాజన్ రాజ్యసభ నామినేషన్ ను ఎన్నికల సంఘం తిరస్కరించడంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. మీనాక్షి నటరాజన్‌పై తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని స్పష్టం చేశారు.
పునర్విభజన ప్రక్రియ వల్ల ఏ ఒక్క రాష్ట్రానికి గానీ, ఎవరికీ గానీ ఎలాంటి అన్యాయం జరగదని పునరుద్ఘాటించారు. డీలిమిటేషన్ బిల్లుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న విమర్శలను అమిత్ షా కొట్టిపారేశారు. రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యల్లో సీరియస్‌నెస్ లేదని, వాటిని పట్టించుకోవలసిన అవసరం లేదనీ అన్నారు.
మోదీ ప్రధాని పీఠంపై విజయవంతంగా 12 ఏళ్ల సుదీర్ఘ పదవీకాలాన్ని పూర్తి చేసుకున్నారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే 4,399 రోజుల పాటు ఆయన నిరంతరాయంగా ప్రధాని పదవిలో ఉన్నారు. 1952లో భారతదేశంలో మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగిన తర్వాత.. జవహర్‌లాల్ నెహ్రూ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికై 4,398 రోజుల పాటు నిరవధికంగా ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు.
ఒక్క తెలంగాణ అని కాదు, ఏ రాష్ట్రంలోనైనా ఒంటరిగానే బరిలోకి దిగుతామని చెప్పారు. ఆ దిశగా ముందు.. తెలంగాణ, పంజాబ్ రాష్ట్రాల్లో వచ్చే ఎన్నికలలో ఒంటరి పోరుకు సిద్ధమౌతున్నట్లు చెప్పారు.
ఈ ఎన్నికలకు సంబంధించి దాఖలైన నాలుగు నామినేషన్ పత్రాలు పూర్తిగా సక్రమంగా ఉన్నాయని రిటర్నింగ్ అధికారి, అసెంబ్లీ సంయుక్త కార్యదర్శి ఆర్. వణితా రాణి ప్రకటించారు. శాసనసభ భవనంలోని తన చాంబర్‌లో అభ్యర్థుల సమక్షంలో జరిగిన ఈ స్కృటినీ ప్రక్రియలో ఎలాంటి సాంకేతిక లోపాలు లేవని తేలడంతో కూటమి శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో 2027 సంవత్సరం ఒక సరికొత్త సంచలనానికి వేదిక కాబోతోందా? అంటే రాజకీయ పరిశీలకులు ఔననే ఉంటున్నారు. 2024లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న జగన్, అలాగే 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పరాజయాన్ని చవిచూసిన కేసీఆర్ ఇద్దరూ 2027 సంవత్సరంలో మళ్లీ ప్రజలతో మమేకమై పూర్వ వైభవాన్ని అందిపుచ్చుకోవాలన్నవ్యూహరచనలో ఉన్నారు.
సాక్షాత్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగి ఆదేశాలు జారీ చేసినప్పటికీ.. క్షేత్రస్థాయిలో అధికారులు ఆ ఫైళ్లను పక్కన పెట్టేయడం రాజకీయ, అధికార వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
మహారాష్ట్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన 20 అడుగుల ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ వేడుకలో వివాదం తలెత్తింది. ఈ భారీ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి అయిన ఏక్‌నాథ్ షిండేకు కనీసం ఆహ్వానంఅందలేదు.
దేశరాజకీయాల్లో ప్రతిపక్ష ఇండియా కూటమి అత్యంత కీలకమైన అడుగులు వేస్తోంది.
రాజ్యసభ ఎంపీ అభ్యర్థులుగా తెలుగు దేశం పార్టీ తరుపున సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ లు నామినేషన్ లు దాఖలు చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.