తాడేపల్లి ప్యాలెస్ డొంకలు కదులుతున్నాయా?

Publish Date:May 26, 2023

Advertisement

వివేకా హత్య కేసులో తాడేపల్లి ప్యాలెస్ డొంకలు కదులుతున్నాయా? అంటే సీబీఐ శుక్రవారం(మే26) తెలంగాణ హైకోర్టులో దాఖలు చేసిన అడిషనల్ కౌంటర్ అఫిడవిట్ ఔననే అంటోంది. అవినాష్ సీబీఐ విచారణకు సహకరించకపోవడం, అరెస్టును తప్పించుకోవడానికి ఉన్న దారులన్నీ ఉపయోగించుకుంటూ.. చివరకు ఆ దారులన్నీ మూసుకుపోయిన తరువాత అనుచరులు, పోలీసులను అడ్డుపెట్టుకుని కర్నూలు విశ్వ భారతి ఆస్పత్రిలో షెల్టర్ పొంది.. ముందస్తు బెయిలు విచారణ వేకేషన్ బెంచ్ చేపట్టేలా ఆదేశాలివ్వాలంటూ సుప్రీంను ఆశ్రయించడం తోలిపిందే. ఒక ఎంపి, అదీ అధికార పార్టీ ఎంపీ కేంద్ర దర్యాప్తు సంస్థను ఇలా ముప్పు తిప్పలు పెట్టడమేమిటన్న ఆనుమానాలు అందరిలో వ్యక్తమయ్యాయి. చివరకు తెలంగాణ హైకోర్టులో సీబీఐ దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్ లో ఈ అనుమానాలకు సమాధానాలు దొరికాయి. ఆ కౌంటర్ అఫిడవిట్ లో సీబీఐ జగన్ పేరు ప్రస్తావించింది. వివేకా హత్య గురించి జగన్ కు ప్రపంచానికి తెలియడం కంటే ముందే తెలుసునన్నది తమ అనుమానమని, ఆ విషయాన్ని అవినాష్ రెడ్డే ఆయనకు తెలిపాడని సీబీఐ పేర్కొంది. వివేకా హత్యను మందుగా చూసినట్లుగా చెబుతున్న ఎంవీ కృష్ణారెడ్డి ఆ విషయాన్ని బయటకు వెళ్లడించడానికి ముందే..   హత్య జరిగిందన్న విషయాన్ని అవినాష్ జగన్ కు చెప్పారా అనేది దర్యాప్తు చేయాల్సి ఉందని సీబీఐ తన అడిషనల్ కౌంటర్ అఫిడవిట్ లో పేర్కొంది.   శుక్రవారం సీబీఐ తప వాదనలు వినిపించలేదు. అవినాష్ రెడ్డి, సునీత తరపు లాయర్లు వాదనల అనంతరం కోర్టు అవినాష్ ముందస్తు బెయిలు విచారణను శనివారం (మే 27)కు వాయిదా వేసింది. దీంతో శనివారం(మే27) సీబీఐ తరపు లాయర్లు వాదనలు వినిపించనున్నారు. ఈ సందర్భంగా వివేకా కేసులో జగన్ అంశంపై మరిన్ని కీలక విషయాలు వెల్లడయ్యే అవకాశాలు ఉన్నాయి.

ఇప్పటికే వివేకా హత్య జరిగిన రోజు తెల్లవారుజామున నాలుగున్నర గంటలకే జగన్  హత్య గురించి.. తనతో పాటు సమావేశంలో ఉన్న వారికి చెప్పారన్న ప్రచారం జరిగింది. ఆ నలుగురిలో ఒకరైన మాజీ సీఎస్, ప్రభుత్వ సలహాదారు కల్లాం అజేయరెడ్డి ఇటీవల మీడియా సమావేశం పెట్టారు. తాను సీబీఐకి వాంగ్మూలం ఇచ్చానని వెల్లడించారు కూడా. అలాగే జగనే తమకు వివేకానందరెడ్డి చనిపోయారని చెప్పారని..అయితే గుండెపోటా కాదా అన్నది మాత్రం చెప్పలేదన్నారు. మరో వైపు ఉదయమే వివేకా హత్య గురించి బయట ప్రపంచానికి తెలియక ముందే అవినాష్ రెడ్డి .. జగన్‌, భారతి పీఏలకు ఫోన్లు చేసి.. మాట్లాడారని గుర్తించిన సీబీఐ గుర్తించి వారినీ విచారించింది. ప్రశ్నించింది. దీంతో శనివారం (మే 28) తెలంగాణ హైకోర్టులో అవినాష్ ముందస్తు బెయిలు పిటిషన్ విచారణలో మరిన్ని సంచలనాలు వెలుగులోకి వచ్చే అవకాశాలున్నాయని పరిశీలకులు అంటున్నారు.

ఇలా ఉండగా  సీఎం జగన్మోహన్ రెడ్డి  ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఇక  అవినాష్ రెడ్డి తన తల్లిని హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రిలో చేర్పించి అక్కడే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో కర్నూలు విశ్వభారతి ఆస్పత్రి ముందు సీన్ హైదరాబాద్ ఆస్పత్రి ముందు రిపీట్ అవుతుందా అన్న అనుమానాలు పొలిటికల్ సర్కిల్స్ లో వ్యక్తం అవుతున్నాయి.  ఇందుకూ కారణాలు లేకపోలేదు.

  వివేకా హత్య కేసు దర్యాప్తులో భాగంగా కడప ఎంపీ  అవినాష్ రెడ్డికి నోటీసులు ఇస్తే చాలు ఏపీ సీఎం జగన్ తన పర్యటనలను, కార్యక్రమాలను రద్దు చేసేసుకుంటారు. గతంలో   మూడుసార్లు అదే జరిగింది.  అందులో రెండు సార్లు ఆయన హుటాహుటిన హస్తిన బయలుదేరి వెళ్లారు. అలా వెళ్లిన ప్రతి సారీ సీబీఐ దర్యాప్తులో వేగం మందగించింది.  ఇక ఈ నెల 19 నుంచి అవినాష్ సీబీఐతో టామ్ అండ్ జెర్రీ ఆట ఆడుతున్నారు. మే 19న ఆయన సీబీఐ విచారణకు హాజరు కావాల్సి ఉండగా తల్లి అనారోగ్యం కారణంతో విచారణకు డుమ్మా కొట్టారు. సరే మే 22న విచారణకు రావాలని సీబీఐ మరో సారి నోటీసులు ఇస్తే వాటినీ ఖాతరు చేయలేదు. సుప్రీం ను ఆశ్రయించి హైకోర్టులో పెండింగ్ లో ఉన్న తన ముందస్తు బెయిలు పిటిషన్ విచారణ పూర్తయ్యే వరకూ సీబీఐ అరెస్టు చేయకుండా ఆదేశించాలని కోరారు.

అరెస్టు చేయకుండా ఆదేశాలు జారీ చేయకుండానే.. ముందస్తు బెయిలు పిటిషన్ విచారించి ఉత్తర్వులు ఇవ్వాల్సిందిగా సుప్రీం కోర్టు తెలంగాణ హైకోర్టును ఆదేశించింది. ఈ లోగా అవినాష్ సీబీఐకు రాసిన లేఖలో తల్లి అనారోగ్యం కారణంగా విచారణకు హాజరు కాలేననీ, మే 27 తరువాత ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తానంటూ లేఖ రాశారు. ఆ లేఖే మరిన్ని అనుమానాలకు తావిచ్చింది. ఎందుకంటే జగన్ ముందుగా శుక్రవారం( మే26) నుంచి మూడు రోజుల పాటు హస్తిన పర్యటనలో ఉంటారు. అంటే ఆయన హస్తిన పర్యటనకూ అవినాష్ సీబీఐ విచారణకు హాజరు కాకపోవడానికి లింకు ఉందని పరిశీలకులు గత సంఘటనలను ఉటంకిస్తూ విశ్లేషిస్తున్నారు. జగన్ ఏ కారణాలు చెప్పి హస్తిన వెళ్లినా.. ఆయన పర్యటన లక్ష్యం మాత్రం ఎలాగోలా సీబీఐ అరెస్టు నుంచి అవినాష్ ను బయటపడేయడమేనని పరిశీలకులు అంటున్నారు. ఆ పని  జగన్ చేసుకు వస్తారన్న ఆశతోనే మే 27 వరకూ విచారణకు హాజరు కాలేనని అవినాష్ సీబీఐకి లేఖ రాశారని అంటున్నారు.

తండ్రి భాస్కరరెడ్డిని సీబీఐ అరెస్టు చేసి ఇంత కాలమైనా ఇప్పటి వరకూ ఆయనకు బెయిలు కోసం కనీసం దరఖాస్తు కూడా చేయని అవినాష్ రెడ్డి, జైలులో ఉన్న తండ్రిని ఒక్కసారి కూడా ములాఖత్ ద్వారా కలవని అవినాష్ రెడ్డి.. తన దాకా వచ్చే సరికి మాత్రం  బెంబేలెత్తిపోతున్నారు. జైలులో ఉన్న అవినాష్ రెడ్డి తండ్రి అస్వస్థతకు గురి కావడంతో ఆయనకు ఉస్మానియాలో చికిత్సకు శుక్రవారం (మే26) తీసుకువచ్చి తిరిగి జైలుకు తరలించారు. ఆ సందర్భంగా కూడా అవినాష్ కనీసం ఆయనకు చూడటానికి ఉస్మానియాకు వెళ్లలేదు. ఇవన్నీ చూస్తుంటే అవినాష్ జగన్ హస్తిన పర్యటనపై చాలా ఆశలు పెట్టుకున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కానీ ఇప్పుడు సీబీఐ తన అడిషనల్ కౌంటర్ అఫిడవిట్ లో స్వయంగా తన పేరే ప్రస్తావించడంతో జగన్  అవినాష్ ను కాపాడేందుకు ఢిల్లీ పెద్దల వద్ద ఒక వేళ ఏమైనా ప్రయత్నాలు చేసినా అవి ఫలిస్తాయా అన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమౌతున్నాయి. 

By
en-us Political News

  
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు  ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది.  కవితను పోలీసులు  పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
ఉప్పల్‌లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.