గంగతో రాంబాబు సినిమాతో పూరీకి భారీ లాభం
Publish Date:Oct 25, 2012
Advertisement
ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాధ్ కొత్త సినిమా కెమెరామెన్ గంగతో రాంబాబు రాజకీయవర్గాల్లో తీవ్రస్థాయిలో కలకలం రేపింది. పూరీ ఉద్దేశపూర్వకంగా వై.ఎస్ ని నెత్తికెత్తుకుని, మిగతా పార్టీల నేతల్ని అవమానించారంటూ చాలా పెద్ద ఎత్తున రగడ జరుగుతోంది. తెలంగాణ ని అవమానించే రీతిలో ఉన్న డైలాగ్స్ ని తొలగించాలని తెలంగాణ వాదులు డిమాండ్ చేస్తున్నారు. రాజకీయ లబ్ధికోసమే పూరీ ఈ సినిమాని తీశారంటూ చాలామంది తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. త్వరలో పూరీ జగన్ పార్టీలో చేరబోతున్నారని, అనకాపల్లి లోక్ సభ స్థానానికి బరిలో నిలబడాలనుకుంటున్నారని పుకార్లు షికార్లు చేస్తున్నాయ్. పూరీ సోదరుడు గణేష్.. ఇప్పటికే వైకాపాలో యాక్టివ్ పార్ట్ పోషిస్తున్నారు. పాదయాత్ర సందర్భంగా విజయలక్ష్మి, షర్మిల పూరీ ఇంట్లోనే బసచేయడం మరో సంచలనం. వాళ్లిలా తనింటికి రావాడం ఎంతో ఆనందాన్ని కలిగించిందని ట్వీట్ చేసి తన ఆనందాన్ని అందరితోనూ పంచుకున్నాడు పూరీ.. వై.ఎస్ మీద అభిమానాన్ని చాటుకోవడానికే సినిమాలో ముఖ్యమంత్రికి పంచెకట్టుని సెట్ చేశారని రాజకీయ వర్గాలు అనుకుంటున్నాయ్.
http://www.teluguone.com/news/content/camera-man-ganga-news-31-18487.html





