Publish Date:Jul 19, 2022
మనిషి శక్తిసామర్ధ్యాలకు అంతే ఉండదు. ప్రతీవారిలో ఆ శక్తి ఉంటుందని అంటారు. కానీ చాలాతక్కువ మందే దాన్ని గ్రహించుకోగల్లుతారు. ఊహాతీతంగా ఆ శక్తియుక్తులే ఇతరులకు అతీతంగా తయారు చేస్తాయి. ఇది కళాకారుడిని చేయవచ్చు, కుంగ్ ఫూ పైటర్గానూ చేయవచ్చు. రెప్పపాటులో శరవేగంగా శరీరావయవాలను కదిపి ఎదుటివారిని నిశ్చేష్టులను చేయగల అపార సామర్ధ్యం పొందడం బ్రూస్ లీకి మాత్రమే సాధ్యపడింది. అతనికి ముందు, ఆ తర్వాత మరెవ్వరూ లేరన్నది యావత్ ప్రపంచ ఫైటర్లూ, యువతా అంగీకరిస్తున్నారు. బహు శాంతంగా కనిపించే బ్రూస్లీ లో ఇంతటి అత్యంత వేగంతో కూడిన కుంగ్ ఫూ కదలికలు కేవలం భగవత్ కృపతోనే సాధ్యపడిందనే వాదనా ఉంది. ఏమైనప్పటికీ కుంగ్ ఫూ అంటే లీ, లీ అంటే ఎంటర్ ద డ్రాగన్!
లీ అసలు పేరు లి జున్ ప్యాన్. 1940 నవంబర్ 27న శాన్ఫ్రాన్సిస్కోలో జన్మించాడు. అతని తండ్రి ఒపెరా సింగర్ , పార్ట్ టైమ్ యాక్టర్ కావడం తో అతను చిన్న వయస్సులోనే సినిమా రంగానికి పరిచయం అయ్యాడు. చిన్నవాడైన లీ చిన్నతనంలోనే సినిమాల్లో కనిపించడం ప్రారంభించాడు, తరచూ బాల్య నేరస్థుడుగా నటించాడు. యుక్తవయసులో, అతను స్థానిక గ్యాంగ్లతో కలిసి తనను తాను రక్షించుకోవడానికి కుంగ్ ఫూ నేర్చుకోవడం ప్రారంభించాడు. ఆ సమయంలో అతను నృత్య పాఠాలను కూడా ప్రారంభించాడు, ఇది అతని ఫుట్వర్క్, సమతుల్యతను మరింత మెరుగుపరిచింది; 1958లో లీ హాంకాంగ్ చా-చా ఛాంపి యన్ షిప్ గెలుచుకున్నాడు. హాంగ్కాంగ్లో పెరిగిన లీ అతను యుద్ధ కళల నైపుణ్యానికి ప్రసిద్ధి చెందాడు. అతనిలో ఏదో అతీత శక్తి ఉందన్న ప్రచారం కూడా బాగానే ఉండేది. ఊహించని అతివేగవంత కదలికల్లోనే అతనికి తెలీని శక్తి దాగిందనే వాదన పెద్ద చర్చగా ఉంది.
మనిషి తన శక్తిసామర్ధ్యాలను అనుసరించి జీవించడంలోనే అత్యంత ఆనందాన్ని పొందుతాడనేవాడు లీ. అంతర్జాతీయ తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి పరిచయం అతన్ని ఎంతో మార్చిందన్న వాదనా ఉంది. అతనిలో లోకాన్ని చూసే దృష్టిలో ఎంతో మార్ప వచ్చిందంటారు. అతనిలో సౌమ్యుడు ఉన్నాడు అని చాలామంది గ్రహించారు. కేవలం ఆత్మరక్షణకే యుద్ధకళలను నేర్చకు న్నాడే గాని ఇతరులను ఇబ్బందిపెట్టడానికి కాదని, అతని జీవితాన్ని గమనిస్తే తెలుస్తుందని తోటి నటీ నటులు అంటూండే వారు. గొప్ప వ్యక్తిని, మంచి మిత్రుడిని కోల్పోయానని అంటూంటారు. బ్రూస్ లీ 1973 జులై 20 వ తేదీన హాంగ్కాంగ్లో మృతి చెందాడు. చిత్రమేమంటే అతనికి ప్రపంచఖ్యాతి ఆర్జించిపెట్టిన ఎంటర్ ద డ్రాగన్ సినిమా రిలీజ్ కాకుండానే మృత్యువు తీసికెళ్లిందని బంధువులు, యావత్ ప్రపంచ వీరాభిమానులు ఇప్పటికీ ఎంతో బాధపడుతూంటారు. లీ లాంటి వ్యక్తులు మళ్లీ జన్మిస్తారా అనే ప్రశ్నకు సమాధానం చెప్పడం కష్టమనే అంటున్నారు హాంగ్ కాంగ్ వాసులు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/bruce-leee-39-140124.html
తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఏబీ వెంకటేశ్వరరావు తమిళనాడులో ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలను.. ముఖ్యంగా విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ సాధించిన విజయాలను ఏబీ వెంకటేశ్వరరావు ఆసక్తికరంగా విశ్లేషించారు. ఎవరూ ఊహించని మార్పులు రాజకీయాల్లో సంభవిస్తాయని, ప్రజలు మార్పును కోరుకున్నప్పుడు అసాధ్యం సుసాధ్యం అవుతుందని అన్నారు.
టీవీకే నేత ఆదవ అర్జునకు, వీసీకే అధినేత తిరుమావళవన్ స్వయంగా మద్దతు లేఖను అందజేశారు. ఈ కీలక పరిణామంతో అసెంబ్లీలో టీవీకే కూటమి సంఖ్యా బలం ఇప్పుడు 118కి చేరింది.
అధికారులు సచివాలయంలోని ఏసీ గదులలో కూర్చుని పని చేసే విధానానికి స్వస్థి చెప్పారు. అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో ప్రసంగిస్తూ.. పౌరుల ఫిర్యాదులను నేరుగా క్షేత్రస్థాయిలో పరిష్కరించడానికి అధికారులు తమ కార్యాలయాలను విడిచిపెట్టి ప్రజల వద్దకు వెళ్లాలని ఆదేశించారు.
సువేందు అధికారి రాజకీయ నేపథ్యాన్ని పరిశీలిస్తే.. కాంగ్రెస్ సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన సువేందు, రాజకీయ ఓనమాలు అక్కడే నేర్చుకున్నారు. ఆయన తాత కెనరామ్ అధికారి స్వాతంత్ర్య సమరయోధుడు కాగా, తండ్రి శిశిర్ అధికారి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా రాణించారు. సువేందు అధికారి మమతా బెనర్జీ స్థాపించిన తృణమూల్ కాంగ్రెస్లో చేరి ఆ పార్టీలో కీలక నేతగా ఎదిగారు.
కరీంనగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై జరిగిన దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకత్వం బంద్ పిలుపునిచ్చిన నేపథ్యంలో . శనివారం ( మే 9) ఉదయం నుండే నగరంలోని ప్రధాన కూడళ్లలో పోలీసులు భారీగా మోహరించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నిరసనలో పాల్గొనకుండా పోలీసులు ఆయన ఇంటి వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీనిపై బీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ముఖ్యంగా పార్టీలో అభిషేక్ బెనర్జీ పెత్తనం పెరగడం వల్లే సువేందు అధికారి వంటి బలమైన నేతలు టీఎంసీని వీడారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పట్టున్న నాయకులను కాదని, కార్పొరేట్ తరహా రాజకీయాలకు అభిషేక్ బెనర్జీ ప్రాధాన్యత ఇవ్వడం తృణమూల్కు ప్రతికూలంగా మారిందంటున్నారు.
ఆంధ్రోళ్లను తిట్టి ఓట్లు దండుకున్న బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రాజెక్టుల పేరుతో దోపిడీకి పాల్పడిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుత ఎన్నికల ఫలితాలు కేరళలో పెను మార్పులకు నాంది పలికాయి. యూడీఎఫ్ స్పష్టమైన మెజారిటీ సాధించడంతో.. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై కసరత్తు జరుగుతోంది. కేసీ వేణుగోపాల్ అనుభవం, రాహుల్ గాంధీతో ఉన్న సాన్నిహిత్యం ఆయనకు ప్రధాన బలంగా మారాయి.
టీవీకే అధినేత విజయ్కు కాంగ్రెస్ మద్దతు తెలపడంపై ఆగ్రహంగా ఉన్న డీఎంకే.. కాంగ్రెస్కు కటీఫ్ చెప్పేసింది. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, లోక్సభలో తమ పార్టీ సభ్యులకు కాంగ్రెస్ ఎంపీలతో కాకుండా విడిగా సీటింగ్ కేటాయించాలని డీఎంకే ఎంపీ కనిమొళి స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
తాజా సమాచారం ప్రకారం.. విజయ్ తన పార్టీకి ఉన్న బలానికి తోడుగా మరో మూడు పార్టీల మద్దతును కూడగట్టుకున్నారు. ఆ పార్టీల మద్దతుతో అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118ని ఆయన సాధించారు.
తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవ్వగా.. మెజారిటీ నిరూపణ విషయంలో రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కచ్చితమైన నిబంధనలు పాటించాలని పట్టుబడుతున్నారు. విజయ్ కు తన పార్టీ ఎమ్మెల్యేలు 107 మందికి అదనంగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది.
పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనకు ముందే తెలుసని, నాయకత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు. అయితే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి.. క్షేత్రస్థాయిలో కేడర్ను కాపాడుకుంటూ వచ్చిన తనకు ఈ పరిణామం మనస్తాపానికి గురిచేసిందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు.
బాబు కూటమిని ఎందుకంత విలువైనదిగా భావిస్తున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూటమి ఎప్పుడెప్పుడు చీలిపోతుందాని కాచుకుని కూర్చుని ఉంది. ఏ అవకాశం వచ్చినా వారు వదిలిపెట్టినట్టే కనిపించదు. మొన్న కోట వినుత ఘటన, నిన్న అరవ శ్రీధర్ వ్యవహారం, ఇవాళ వర్మ ఇష్యూ.. ఇలా సమయం దొరికినపుడల్లా ఆయా అంశాలను బాగా హైలెట్ చేసి.. కూటమిలో ఏదో ఒక చిచ్చు రాజేయాలని చూస్తోంది వైసీపీ అధినాయకత్వం.