Publish Date:Jul 19, 2022
మనిషి శక్తిసామర్ధ్యాలకు అంతే ఉండదు. ప్రతీవారిలో ఆ శక్తి ఉంటుందని అంటారు. కానీ చాలాతక్కువ మందే దాన్ని గ్రహించుకోగల్లుతారు. ఊహాతీతంగా ఆ శక్తియుక్తులే ఇతరులకు అతీతంగా తయారు చేస్తాయి. ఇది కళాకారుడిని చేయవచ్చు, కుంగ్ ఫూ పైటర్గానూ చేయవచ్చు. రెప్పపాటులో శరవేగంగా శరీరావయవాలను కదిపి ఎదుటివారిని నిశ్చేష్టులను చేయగల అపార సామర్ధ్యం పొందడం బ్రూస్ లీకి మాత్రమే సాధ్యపడింది. అతనికి ముందు, ఆ తర్వాత మరెవ్వరూ లేరన్నది యావత్ ప్రపంచ ఫైటర్లూ, యువతా అంగీకరిస్తున్నారు. బహు శాంతంగా కనిపించే బ్రూస్లీ లో ఇంతటి అత్యంత వేగంతో కూడిన కుంగ్ ఫూ కదలికలు కేవలం భగవత్ కృపతోనే సాధ్యపడిందనే వాదనా ఉంది. ఏమైనప్పటికీ కుంగ్ ఫూ అంటే లీ, లీ అంటే ఎంటర్ ద డ్రాగన్!
లీ అసలు పేరు లి జున్ ప్యాన్. 1940 నవంబర్ 27న శాన్ఫ్రాన్సిస్కోలో జన్మించాడు. అతని తండ్రి ఒపెరా సింగర్ , పార్ట్ టైమ్ యాక్టర్ కావడం తో అతను చిన్న వయస్సులోనే సినిమా రంగానికి పరిచయం అయ్యాడు. చిన్నవాడైన లీ చిన్నతనంలోనే సినిమాల్లో కనిపించడం ప్రారంభించాడు, తరచూ బాల్య నేరస్థుడుగా నటించాడు. యుక్తవయసులో, అతను స్థానిక గ్యాంగ్లతో కలిసి తనను తాను రక్షించుకోవడానికి కుంగ్ ఫూ నేర్చుకోవడం ప్రారంభించాడు. ఆ సమయంలో అతను నృత్య పాఠాలను కూడా ప్రారంభించాడు, ఇది అతని ఫుట్వర్క్, సమతుల్యతను మరింత మెరుగుపరిచింది; 1958లో లీ హాంకాంగ్ చా-చా ఛాంపి యన్ షిప్ గెలుచుకున్నాడు. హాంగ్కాంగ్లో పెరిగిన లీ అతను యుద్ధ కళల నైపుణ్యానికి ప్రసిద్ధి చెందాడు. అతనిలో ఏదో అతీత శక్తి ఉందన్న ప్రచారం కూడా బాగానే ఉండేది. ఊహించని అతివేగవంత కదలికల్లోనే అతనికి తెలీని శక్తి దాగిందనే వాదన పెద్ద చర్చగా ఉంది.
మనిషి తన శక్తిసామర్ధ్యాలను అనుసరించి జీవించడంలోనే అత్యంత ఆనందాన్ని పొందుతాడనేవాడు లీ. అంతర్జాతీయ తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి పరిచయం అతన్ని ఎంతో మార్చిందన్న వాదనా ఉంది. అతనిలో లోకాన్ని చూసే దృష్టిలో ఎంతో మార్ప వచ్చిందంటారు. అతనిలో సౌమ్యుడు ఉన్నాడు అని చాలామంది గ్రహించారు. కేవలం ఆత్మరక్షణకే యుద్ధకళలను నేర్చకు న్నాడే గాని ఇతరులను ఇబ్బందిపెట్టడానికి కాదని, అతని జీవితాన్ని గమనిస్తే తెలుస్తుందని తోటి నటీ నటులు అంటూండే వారు. గొప్ప వ్యక్తిని, మంచి మిత్రుడిని కోల్పోయానని అంటూంటారు. బ్రూస్ లీ 1973 జులై 20 వ తేదీన హాంగ్కాంగ్లో మృతి చెందాడు. చిత్రమేమంటే అతనికి ప్రపంచఖ్యాతి ఆర్జించిపెట్టిన ఎంటర్ ద డ్రాగన్ సినిమా రిలీజ్ కాకుండానే మృత్యువు తీసికెళ్లిందని బంధువులు, యావత్ ప్రపంచ వీరాభిమానులు ఇప్పటికీ ఎంతో బాధపడుతూంటారు. లీ లాంటి వ్యక్తులు మళ్లీ జన్మిస్తారా అనే ప్రశ్నకు సమాధానం చెప్పడం కష్టమనే అంటున్నారు హాంగ్ కాంగ్ వాసులు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/bruce-leee-25-140125.html
దేశంలో ఉగ్రవాదులు, నక్సలైట్లపై చర్యలు తీసుకునేందుకు ఉద్దేశించిన అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ (ఉపా) గురించి కనీస అవగాహన లేకుండా కొడాలి నాని మాట్లాడుతున్నారన్నారు. కొడాలి నాని వ్యాఖ్యలు అజ్ణానంతో చేశారని తాను భావిస్తున్నాననీ, ఒకవేళ ఆయన తెలిసి బుద్ధిపూర్వకంగానే ఉపా చట్టాన్ని ఉప్మా యాక్ట్ అని అవమానించి ఉంటే, భారత రాజ్యాంగాన్ని, చట్టాలను కించపరిచినందుకు ఆయనపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు.
పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి, పార్టీలో నంబర్ 2 నాయకుడిగా ఇప్పుడు చలామణి అవుతున్న పార్టీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి కి మధ్య ఇటీవలి కాలంలో తీవ్ర విభేదాలు తలెత్తినట్లు పార్టీ వర్గాలలో జోరుగా ప్రచారం సాగుతోంది.
అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు అమరావతి ప్రతిపాదన తెచ్చినప్పుడు దొనకొండ పేరును గట్టిగా వినిపించాలని జగన్కు సీనియర్ నేత మైసూరా రెడ్డి సహా పలువురు సూచించారు. కానీ.. జగన్ అసెంబ్లీలో ఆ విషయాన్ని మర్చిపోయి విజయవాడ చుట్టుపక్కల రాజధాని పెట్టాలంటూ మాట్లాడారని, ఆ తర్వాత మాట మార్చలేక కాలయాపన చేశారని మధుసూదన్ రెడ్డి చెప్పారు.
రాయలసీమలో వైసీపీ కీలక నేతలు, మాజీ ప్రజాప్రతినిధులు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. జగన్ ఏకపక్ష నిర్ణయాలతో విసిగిపోయిన వారి చూపు ఇప్పుడు జనసేనపై ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ నుంచి భారీగా వలసలు ఉంటాయని, త్వరలోనే గ్రేటర్ రాయలసీమలో వైసీపీ ఖాళీ అయిపోయినా ఆశ్చర్యం లేదనీ అంటున్నారు.
ఒకవేళ కోర్టులో ఇవి ఎడిటెడ్ వెర్షన్లు అని రుజువైతే.. న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించినందుకు ప్రభుత్వ ప్రతిష్ట మసకబారుతుందని, ఇది ఎన్డీయే కూటమి ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బ అవుతుందని హెచ్చరించారు.
తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్.. తాను గ్రౌండ్ రియాలటీని గత ఎన్నికల సమయంలో చెప్పినా నమ్మలేదనీ, తాను 2014 ఎన్నికల్లోనూ, మొన్నటి 2024 ఎన్నికల్లోనూ కూడా ఆరు నెలల ముందే చంద్రబాబు, లోకేష్లకు సీట్ల మార్జిన్ గురించి కచ్చితమైన అంచనాలు చెప్పినా వినలేదని.. తీరా చూస్తే క్షేత్రస్థాయిలో తాను చెప్పిన ఫలితాలే వచ్చాయని ఉదహరించారు.
తాజాగా గుడివాడలో కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ.. యూట్యూబర్ రావణ్ అరెస్ట్ ఉదంతంపై.. తనదైన శైలిలో తనకు మాత్రమే సాధ్యమైన రీతిలో కొత్త రాజకీయ కుట్ర సిద్ధాంతాన్ని తెరపైకి తెచ్చారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనలకు అనుగుణంగా, రాష్ట్రంలో పారిశ్రామిక విప్లవాన్ని తీసుకురావడమే ధ్యేయంగా సాగిన ఈ పర్యటన ఏపీ యువతకు ఉపాధి అవకాశాల వెల్లువను తీసుకురానుంది. స్పీడ్, స్టెబిలిటీ, సర్వీస్ అనే మూడు సూత్రాల 3ఎస్ మోడల్ తో పారదర్శక పాలన అందిస్తామని కొరియా దిగ్గజాలకు లోకేష్ భరోసా ఇచ్చారు.
2020 ఎన్నికల్లో అప్పటి అధికార పార్టీ బీఆర్ఎస్ ఏకంగా 56 స్థానాలను కైవసం చేసుకుని తన ఆధిపత్యాన్ని నిరూపించుకుంది. ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకున్న బీజేపీ 48 స్థానాలతో గట్టి పోటీ ఇవ్వగా, ఎంఐఎం 44 స్థానాల్లో విజయం సాధించి పట్టు నిలుపుకుంది. కానీ, నాటి అధికార పీఠం కోసం పోరాడిన కాంగ్రెస్ పార్టీ మాత్రం కేవలం 2 స్థానాలకే పరిమితమైంది.
తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్లుగా.. వాగ్వాదం కాస్తా ఘర్షణగా మారింది. పరస్పర దాడులకు దారి తీసింది. రాళ్లు, కర్రలతో ఇరువర్గాలూ పరస్పర దాడులకు తెగబడ్డారు. దీంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది.
వైఎస్ఆర్ జయంతిని పురస్కరించుకుని, ఒంగోలులోని వైసీపీ కార్యాలయంలో ఆయనకు నివాళులు అర్పించేందుకు ఏర్పాట్లు చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి నివాళులర్పించే క్రమంలో స్వల్ప తొక్కిసలాట జరిగింది.
గన్నవరం పోలీసులు సమర్పించిన నివేదిక ప్రకారం, ప్రశ్న రావణ్ దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగించేలా ప్రవర్తించారనే బలమైన ఆరోపణలు ఉన్నాయి. నిషేధిత మావోయిస్టు పార్టీకి మద్దతుగా, యువతను ఆ మార్గం వైపు ప్రేరేపించేలా ఆయన కంటెంట్ ఉందనేది పోలీసుల ప్రధాన అభియోగం.
ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుంచి ఇప్పటివరకు లక్ష్మారెడ్డి గన్మెన్లను వెంట పెట్టుకోకుండా ప్రజల మధ్యకు వస్తున్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం ఆయనకు ప్రభుత్వం భద్రతా సిబ్బందిని కేటాయించినప్పటికీ.. తనకు ప్రత్యేక భద్రత అవసరం లేదని చెబుతూ వారిని విధుల్లో కొనసాగనివ్వలేదు.