జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బీఆర్ఎస్ లో గుబులు పుట్టిస్తోందా? ఈ ఎన్నికలో పార్టీ అభ్యర్థి విజయంపై ఆ పార్టీ నమ్మకంగా లేదా? అంటే జరుగుతున్న పరిణామాలు, పరిశీలకులు విశ్లేషణలు గమనిస్తే ఔననే సమాధానమే వస్తుంది. 2023 అసెంబ్లీ జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన మాగంటి గోపినాథ్ అనారోగ్యంతో ఇటీవల మరణించారు. దీంతో జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే.
ఈ ఉప ఎన్నికలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ లు పోటీకి రెడీ అవుతున్నాయి. అభ్య ర్థుల ఎంపికపై కసరత్తులు ప్రారంభించేశాయి. అయితే బీఆర్ఎస్ మాత్రం సిట్టింగ్ సీటు కావడంతో ఈ ఉప ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. త్రిముఖ పోటీలో విజయంపై అనుమానాలు వ్యక్తం అవుతుండటంతో సెంటిమెంట్ ను తెరపైకి తీసుకు వచ్చి ఎన్నికను ఏకగ్రీవం చేయాలన్న వ్యూహంతో ముందుకు సాగుతోంది.
అయితే కాంగ్రెస్ ఇప్పటికే కంటోన్మెంట్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో విజయం సాధించి బీఆర్ఎస్ సిట్టింగ్ సీటును తన ఖాతాలో వేసుకున్న కాంగ్రెస్ జూబ్లీహిల్స్ లోనూ అదే రిపీట్ చేయడానికి పకడ్బందీగా ప్రణాళికలు రచిస్తోంది. ఈ నేపథ్యంలో సిట్టింగ్ సీటును నిలబెట్టుకోవడానికి బీఆర్ఎస్ తన అభ్యర్థిగా మాగంటి కుటుంబంలోని వ్యక్తినే నిలబెట్టాలన్న నిర్ణయానికి వచ్చింది. మాగంటీ గోపీనాథ్ సతీమణి పోటీకి సుముఖంగా లేకపోవడంతో మాగంటి గోపీనాథ్ సోదరుడు వజ్రనాథ్ లేదా మాగంటి గోపీనాథ్ కుమారుడిని రంగంలోకి దింపాలని ఇప్పటికే ప్రాథమికంగా ఒక నిర్ణయానికి వచ్చేసినట్లు తెలుస్తోంది.
అయినా త్రిముఖ పోటీలో విజయం నల్లేరు మీద బండి నడక కాదన్న ఉద్దేశంతో ‘ఏకగ్రీవం’ అంశాన్ని తెరమీదకు తీసుకువస్తున్నది. గతంలో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సిస్టింగ్ ఎమ్మెల్యే మరణించి ఉప ఎన్నిక వచ్చిన సందర్భంలో ఆ దివంగత ఎమ్మెల్యే కుటుంబ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకునే సంప్రదాయం ఉండేది. దీనిని అప్పట్లో అన్ని రాజకీయ పార్టీలూ పాటించాయి. అయితే రాష్ట్ర విభజన తరువాత ఆ సంప్రదాయానికి బ్రేక్ పడింది. వాస్తవానికి దానిని పక్కన పెట్టేసింది బీఆర్ఎస్ పార్టీయే అని చెప్పాలి. అయితే ఇప్పుడు మళ్లీ తన సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకోవడానికి ఆ పాత సంప్రదాయాన్ని తెరపైకి తీసుకురావడానికి బీఆర్ఎస్ పావులు కదుపుతోంది. ఇప్పటికే ఈ దిశగా బీఆర్ఎస్ ఎంఐఎం, బీజేపీలతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ తానే గండి కొట్టిన సంప్రదాయాన్ని ఇప్పుడు మళ్లీ తీసుకువచ్చి లబ్ధి పొందాలని ప్రయత్నాలు చేస్తున్నది. బీఆర్ఎస్ ప్రయత్నాలు ఏ మేరకు సఫలీకృతమౌతాయన్నది తెలియాలంటే మరి కొంత కాలం వేచి చూడక తప్పదు. అయితే మాగంట గోపీనాథ్ కు అన్ని రాజకీయపార్టీలతో సత్సంబంధాలు ఉన్నాయి. ఆయన కుటుంబం పట్ల సానుభూతి ఉంది. దీనినే బీఆర్ఎస్ తనకు అనుకూలంగా మార్చుకోవాలని ప్రయత్నిస్తోందని పరిశీలకులు అంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/brs-strtegis-to-jubleehills-by-poll-unanimous-39-201260.html
బీహార్ లో 65 లక్షల ఓట్లు గల్లంతయ్యే ప్రమాదంలో ఉంటే.. తమిళనాడులో ఆరున్నర లక్షల ఓట్లు కొత్తగా వచ్చి చేరాయట. ఈ ఓట్లు ఎక్కడివాని చూస్తే ఇవి వలస వచ్చిన వారివిగా తెలుస్తోంది. ఇదెలా సాధ్యం అని ప్రశ్నిస్తున్నారు కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ, మాజీ మంత్రి చిదంబరం. ఎందుకంటే వలస వచ్చిన వాళ్లకు ఇక్కడేం జరుగుతుందో తెలీదు. ఇక్కడి రాజకీయాలు అసలే పట్టవు.
ఢిల్లీ నుంచి విజయవాడ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో విమానం టేకాఫ్ కు దాదాపు మూడు గంటలు ఆలస్యం అయ్యింది. సరిగ్గా టేకాఫ్ కు ముందు ఈ సాంకేతిక లోపాన్ని గుర్తించడంతో పెను ప్రమాదం తప్పింది.
జార్ఖండ్ ప్రత్యేక రాష్ట్ర సాధనలో, గిరిజన సమస్యల పోరాటంలో, మడమ తిప్పని పోరాట యోధుడిగా.. శిబుసోరెన్ కి పేరుంది. ఇప్పటి వరకూ ఆయన 8 సార్లు లోక్ సభ కు, రెండు సార్లు రాజ్య సభకు ఎన్నికైన శిబుసొరేన్ , జార్ఖండ్ సీఎంగా ఎనలేని సేవలందించారు.
మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ దంపతులు సైకిల్ పై ప్రయాణించారు. జిల్లా కేంద్రమైన మెదక్ నుంచి అక్కడికి 20 కిలోమీటర్ల దూరంలోని రామాయంపేట వరకూ సైకిళ్లపై ప్రయాణించి వచ్చారు.
భారత్, రష్యాలను టార్గెట్ చేస్తూ అమెరికా బెదిరింపు అస్త్రాలు సంధిస్తూనే ఉంది. రష్యాను ఏకాకిని చేయాలనో? లేక భారత్ను తన కంట్రోల్లోకి తెచ్చుకోవాలనో? కారణం ఏదైతేనేం అమెరికా అధికార ప్రతినిధులు ఒకరి తర్వాత మరొకరు భారత్ కు హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారు.
మొత్తం 15 మంది ఋత్వికులు కేసీఆర్ దంపతులు కర్తలుగా యాగాన్ని నిర్వహించనున్నారు.
పార్టీ ఫిరాయించిన 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటీషన్ పై మూడు నెలలలోగా నిర్ణయం తీసుకోవాలని, సుప్రీం కోర్టు ధర్మాసనం స్పష్టమైన గడవు విధించిన నేపధ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీ అత్మరక్షణలో పడిందా? అందుకే ఏదో విధంగా ఈ గండం నుంచి కట్టేక్కేందుకు వ్యూహాలు రచిస్తోందా? మళ్ళీ మరోమారు ఆపరేషన్ ఆకర్ష్ పై దృష్టిని కేంద్రీకరించిందా?
ఆంధ్రప్రదేశ్ లో కుంకీ ఏనుగులు పని మొదలు పెట్టేశాయి. అటవీ ప్రాంతానికి ఆనుకుని ఉన్న పంటపొలాలు, గ్రామాలపై ఏనుగుల గుంపు పడి విధ్వంసం సృష్టిస్తుండటం, కొన్ని సార్లు ప్రాణనష్టం కూడా కలిగిస్తున్న నేపథ్యంలో ఏనుగుల బెడద నుంచి గ్రామాలను, పొలాలను కాపాడే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చొరవతో కర్నాటక నుంచి కుంకీ ఏనుగులను రప్పించారు.
జార్ఖండ్ మాజా ముఖ్యమంత్రి శిబూ సొరేన్ కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం ( ఆగస్టు 4) ఉదయం కన్నుమూశారు. కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ఆయన జూన్ నెలలో ఢిల్లీలోని గంగారామ్ ఆస్పత్రిలో చేరారు.
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ నివాసానికి బాంబు బెదరింపు కాల్ వచ్చింది.ఆదివారం (ఆగస్టు 3) గుర్తు తెలియని అగంతకుడి నుంచి గడ్కరీ నివాసంలో బాబు పెట్టినట్లు ఫోన్ చేశాడు. ఈ ఫోన్ కాల్ తో పోలీసులు ఒక్కసారిగా ఉలక్కిపడ్డారు. వెంటనే రంగంలోకి దిగిన బాంబ్ స్క్వాడ్ గడ్కరీ నివాసంలో క్షుణ్ణంగా తనిఖీలు చేసి బాంబు లేదని తేల్చారు.
పూజకు దైవభక్తి మెండు. నిత్యం పూజలూ, పునస్కారాలతోనే గడుపుతుంటుంది. ఆమె భక్తి మూఢ భక్తి లిమిట్ కూడా దాటిపోయింది.
నాన్నా విదేశాలకు వెళ్లిపోదాం పదండి.. ఇదీ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తన తండ్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో చేస్తున్న కొత్త ప్రతిపాదనగా పార్టీ వర్గాలు, పరిశీలకులు అంటున్నారు.
పులివెందల..ఆ పేరు చెప్తేనే రెండు తెలుగు రాష్ట్రాల్లో వినిపించే పేరు వైఎస్ కుటుంబం. వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుంచీ.. అంటే 1978 నుంచి ఇప్పటివరకు పులివెందుల లో ఎన్నికలు ఏవైనా గెలుపు మాత్రం ఆ కుటుంబానిదే అన్నట్లుగా వైఎస్ హవా సాగింది. వైయస్ మరణానంతరం ఆయన కుమారుడు, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆ హావా కొనసాగిస్తూ వచ్చారు.