Publish Date:Sep 24, 2024
ప్రత్యేక రాష్ట్ర కలని సాకారం చేసుకోవడం కోసం తెలంగాణ ప్రజలు పోరాటం చేసిన సమయంలో, ఒక్క టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ మాత్రమే ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టేలా ప్రవర్తించింది. అందరూ మా రాష్ట్రం మాకు కావాలి అని పోరాటం చేస్తుంటే, టీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ మాత్రం ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారిని దారుణంగా తిడుతూ ప్రాంతీయ విద్వేషాలను పెంచి పోషించారు. తెలంగాణ పోరాటం జరిగిన సమయంలో మాత్రమే కాకుండా అధికారంలో వున్న పదేళ్ళలో కూడా ఆంధ్రావాళ్ళని తిట్టనిదే కేసీఆర్కి, ఆయన పార్టీ నాయకులకు తిన్నది అరిగేది కాదు. ఆంధ్రవాళ్ళ మీద విషం కక్కకపోతే ‘కేసీఆర్ అండ్ కో’కి మనశ్శాంతిగా వుండేది కాదు. అధికారంలో వున్నప్పుడు మాత్రమే కాదు.. అధికారం పోయిన తర్వాత కూడా బీఆర్ఎస్ తన ఆంధ్ర విద్వేషాన్ని వదులుకోలేదు. నిన్నగాక మొన్న ఎమ్మెల్యే ఆరికెపూడి గాంధీ మీద ‘ఆంధ్రావాడు’ అంటూ విమర్శలు చేసిన ఘన బీఆర్ఎస్ పార్టీ నాయకులది. మొత్తమ్మీద ఆంధ్రుల విషయంలో బీఆర్ఎస్ వైఖరి ఎప్పుడూ ఒకేలా వుంది. అధికారంలోకి రాకముందు.. అధికారంలోకి వచ్చిన తర్వాత.. అధికారం పోయిన తర్వాత.. ఈ మూడు దశల్లోనూ ప్రాంతీయ ద్వేషంతోనే బీఆర్ఎస్ కొనసాగింది. ఇంతవరకు ఆంధ్రుల మీద పడి ఏడ్చి, ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారి మీద విద్వేషం పెంచడానికి ప్రయత్నించిన బీఆర్ఎస్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని కూడా ప్రాంతాల వారీగా చీల్చడానికి కుట్రలు ప్రారంభించింది. తెలంగాణలోనే ఒక ప్రాంతానికి, మరో ప్రాంతానికి మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది.
గత పన్నెండేళ్ళుగా కేసీఆర్ పుణ్యమా అని ఒక్కడ అడుగు కూడా ముందుకు వేయని రీజినల్ రింగ్ రోడ్ ప్రాజెక్టుని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరుగులు తీయించడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. తాను రూపకల్పన చేస్తున్న ఫోర్త్ సిటీకి కూడా ఉపయోగపడే విధంగా వుండాలని ఆయన రీజినల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ని కొద్దిగా మార్చారు. అంతే, బీఆర్ఎస్ సొంత మీడియా విమర్శలు ప్రారంభించేసింది. ముఖ్యమంత్రి తన సొంత జిల్లాకి, తన సొంత ప్రాంతానికి లాభం జరిగేలా చేస్తున్నారని బీఆర్ఎస్ మీడియా మొత్తుకుంటోంది. ప్రతీరోజూ ఇదే తరహా కథనాలను బీఆర్ఎస్ మీడియా వండి వడ్డిస్తోంది. ఇంతకాలం ఆంధ్రా మీద పడి ఏడిచిన బీఆర్ఎస్ ఇప్పుడు తెలంగాణలోని ఒక ప్రాంతం మీద పడి ఏడుస్తోంది. ఎప్పుడూ ఎవరో ఒకరి మీద పడి ఏడవకపోతే ఈ బీఆర్ఎస్ వాళ్ళకి తెల్లారదేమో!
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/brs-regional-hatreds-39-185488.html
అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ మధ్య పోరు హోరాహోరీగా సాగే అవకాశం ఉంది, దీని ఫలితాన్ని అనేక నిర్మాణాత్మక మరియు రాజకీయ అంశాలు ప్రభావితం చేస్తున్నాయి.
కాపు రిజర్వేషన్ ఉద్యమ నేతగా ముద్రగడ పద్మనాభం తన చోటుకు ఎసరు వస్తున్నదా అన్న అనుమానంతో.. ఆ కాపు నేత తానేనని చాటుకోవడానికి తన వంతు ప్రయత్నాలు మొదలెట్టేశారంటున్నారు. నేను సైతం అంటూ ఆయన రంగంలోకి దిగినట్లు వైసీపీ వర్గీయులే అంతర్గత సంభాషణల్లో చెప్పుకుంటున్నారు. ఇందుకు తార్కానాలు కూడా చూపుతున్నారు.
ఉభయ సభలలో ఆమోదం పొందిన ఆ బిల్లు ఇప్పుడు దేశ ప్రథమ పౌరురాలు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వద్దకు చేరింది. ఇక ఆమె సంతకం పెట్టడానూ ఈ బిల్లు చట్టంగా మారుతుంది. ఆమె నేడో, రేపో ఈ బిల్లుపై సంతకం చేయడం ఖాయమని అంటున్నారు.
తమిళనాడులో 2026 ఎన్నికలు హోరాహోరీగా సాగే పోరుగా రూపుదిద్దుకుంటున్నాయి, ఇందులో స్పష్టమైన విజేత ఎవరూ లేరు. స్వల్ప ఓట్ల మార్పులు సీట్ల ఫలితాలపై నిర్ణయాత్మక ప్రభావాన్ని చూపవచ్చు.
రాజకీయం అంటే కేవలం అధికారంలో ఉండటం మాత్రమే కాదని, ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తూ ముందుకు సాగాలని వైసీపీకి హితవు పలుకుతున్నట్లుగా మాట్లాడుతూనే.. ఆ పార్టీకి కర్తవ్యబోధ చేశారు.
బిజెపికి 1951లో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ స్థాపించిన భారతీయ జనసంఘ్తో పునాదులు పడ్డాయి. అక్కడి నుంచి ఈ పార్టీ అంచలంచలుగా ఎదిగి నేడీ స్థితికి చేరుకుంది. గతంలో వాజ్ పేయి ఈ పార్టీకి అధికార వాసన రుచి చూపడంతో.. ఇప్పుడు వరుసగా మూడు పర్యాయాల పాటు అధికారం చేజిక్కించుకుని.. ప్రస్తుతం అప్రతిహాత జైత్ర యాత్ర చేస్తోంది.
చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక పోలవరం జిల్లా చింతూరు, ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు, ఇబ్రహీంపట్నం మండలాల్లో ఎండలు మండిపోతాయి. వడగాలుల ప్రభావం కూడా తీవ్రంగా ఉంటుంది.
రాఘవ్ చద్దా, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య తలెత్తిన అంతర్గత విభేదాలు ఇప్పుడు బహిరంగ యుద్ధంగా మారాయి.
న్ని ఎన్నికలలో విచిత్రాలు జరగవు. ప్రతిసారీ ఒకటే జరిగితే, దాన్ని విచిత్రం అనరు కదా? ఎన్నికలు జరిగి నిండా రెండేళ్లు కాకముందే నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఓటి పలుకు వినపడుతున్నది. కొందరు ప్రముఖులు పక్కదారులు చూస్తున్నారని, పక్క పార్టీతో బేరసారాలు జరుపుతున్నారని కూడా వినపడుతున్నది.
అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో.. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన పంథాను మార్చుకోలేదనేది స్పష్టమవుతోంది. ఐదేళ్ల పాలనలో మూడు రాజధానుల మంత్రం జపించిన జగన్.. ఇప్పుడు మచిలీపట్నం-విజయవాడ-గుంటూరును కలిపి ఒక మెగా సిటీగా మార్చాలనే సరికొత్త ప్రతిపాదనను ముందుకు తెచ్చారు.
మూడు రాజధానుల అంశం గత ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయానికి ప్రధాన కారణాలలో ఒకటి అన్న విషయాన్ని విస్మరించి.. మళ్ళీ అదే తరహా ప్రత్యామ్నాయ వాదనలు వినిపించడం పట్ల రాజకీయవర్గాలలో విస్మయం వ్యక్తమౌతోంది. పార్టీ కేడర్ సైతం మావిగన్ ఏంటి అదేదో పంటకు పట్టే తెగుల్లా ఉందని నెత్తీ నోరూ బాదుకుంటోంది.
ఆ రోజు సభలో ఓ మంత్రి తనపై చెయ్యి చేసుకున్నారని పేర్కొన్నారు. మరో మంత్రి ఏకవచనంతో తిట్టిపోశారు, కులం పేరుతో దూషిస్తూ తన పుట్టుకను నిందించారన్నారు. శాసనమండలిలో తన సిబ్బందినీ దగ్గరికి రాకుండా వైసీపీ సభ్యులు అడ్డుపడ్డారని, తన చుట్టూ చేరి బెదిరింపులు, ప్రలోభాలతో రకరకాలుగా ఇబ్బంది పెట్టారన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలకు 5 కోట్ల మంది ప్రజల తరఫున కృతజ్ణతలు తెలిపారు. దేశం మొత్తానిది ఒక దారైతే... తమదో దారి అన్నట్లు వైసీపీ వ్యవహరించిందని దుయ్యబట్టారు. రాష్ట్రం, దేశం నాశనమైనా పర్వాలేదు.. మాకు స్వార్థ రాజకీయమే ముఖ్యమన్నట్లుగా వైసీపీ వ్యవహరించిందని విమర్శించారు.