భటింగే తో కటింగే.. నినాదం కాదు, నిజం!

Publish Date:Jun 5, 2025

Advertisement

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారధ్యంలోని ఎన్డీఎ ప్రభుత్వానికి వరసగా మూడవసారి ప్రజా పట్టాభిషేకం జరిగి సంవత్సరం పూర్తయింది. అవును.. గత సంవత్సరం జూన్ 4,5 తేదీలలో  2004 లోక్ సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరిగింది. ఫలితాలు వెలువడ్డాయి. ఎన్డీఎ విజయ కేతనం ఎగరేసింది. మోదీ సర్కార్ ముచ్చటగా మూడవసారి అధికారంలోకి వచ్చింది. హ్యాట్రిక్ కొట్టింది. స్వతంత్ర భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ తర్వాత వరసగా మూడవ సారి ప్రధాని పదవిని చేపట్టిన తొలి ప్రధానిగా మోదీ చరిత్రలో స్థానం  సంపాదించుకున్నారు. అంతవరకు బాగుంది..  అయితే  ఈ ఎన్నికల్లో ప్రజలు అంతకు మించిన సందేశమే ఇచ్చారు.  2024 సార్వత్రిక ఎన్నికల్లో దేశ  ప్రజలు వరసగా మూడవ సారి  ప్రధాని మోదీ పాలన పట్ల విశ్వాసాన్ని వ్యక్తపరిచారు. అయితే అది సంపూర్ణమా అంటే కాదు. ఎన్డీయేకి అధికారాన్నిఅయితే అప్పగించారు కానీ.. ఎన్డీఎకు ఆశించిన మెజారిటీ రాలేదు. అలాగే..  ఎన్డీఎ కూటమికి సారధ్యం వహిస్తున్న బీజేపీకి కూడా ఆశించిన ఫలితాలు రాలేదు.  కమల దళం కలలు కన్న 400 ప్లస్  (చార్ సౌ పార్) నెంబర్ కు ఆమడల దూరంలోనే బీజేపీ స్కోర్ ఆగిపోయింది. ఆశించిన నెంబర్ రాక పోవడమే కాదు.. సిట్టింగ్ స్థానాలకే పెద్ద ఎత్తున గండి పడింది.  బీజేపీ బలం 303 నుంచి 240కి పడిపోయింది.  అంతే కాదు వరసగా రెండు ఎన్నికల్లో (2014,2019), సోంతంగానే మెజారిటీ సొంతం చేసుకున్న బీజేపీ మూడవ సారి మాత్రం ఆ మెజారిటీ సాధించలేకపోయింది.  బీజేపీ ఎంపీల సంఖ్య సింపుల్ మెజారిటీకి 32 సీట్ల దూరంలో ఆగిపోయింది. అయినా..  ఎన్డీఎ కూటమి 293 సీట్లు గెలవడంతో అధికారం నిలబడింది. ముఖ్యంగా తెలుగుదేశం (16), జనతదళ్(యు)(11) మద్దతుతో మోదీ ముచ్చటగా మూడవ సారి ప్రధాని అయ్యారు. 

మోదీ ప్రధాని అయ్యారు కానీ..  మోదీ 3.0 ప్రభుత్వం ముందులా కీలక నిర్ణయాలు తీసుకోగల్గుతుందా?  మోదీ  సుస్థిర పాలన కొనసాగించ గలరా? అనే అనుమానాలు  రాజకీయ వర్గాల్లో సర్వత్రా వ్యక్తమయ్యాయి. మరో వంక.. సంకీర్ణ కట్టుబాట్లు  జాతీయవాద ఎజెండాకు బ్రేకులు వేస్తాయా?  అనే సందేహాలు సంఘ్ పరివార్ వర్గాల్లో వ్యక్తమయ్యాయి. 

అయితే.. ఇటు చంద్రబాబు, అటు నితీష్ కుమార్ మోదీకి అండగా నిలవడంతో ఆనాటి అనుమానాలు అన్నీ తొలగి పోయాయి. మోదీ సర్కార్   ప్రయాణం సజావుగా సాగుతోంది.  ఎన్డీయే భాగస్వామ్య పార్టీల నేతలు  ముఖ్యంగా.. టీడీపీ అధినేత,ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, బీహార్ ముఖ్యమంత్రి, జేడీ(యు) అధ్యక్షుడు నితీష్ కుమార్ రాజనీతిజ్ఞతతో   పార్టీలు వేరైనా  అంతరంగం ఒకటే అన్నట్లుగా సుస్థిర అభివృద్దే లక్ష్యంగా ఒకటిగా సాగుతున్నారు. అందుకే.. మోదీ ప్రభుత్వం పేరుకు సంకీర్ణ ప్రభుత్వమే అయినా  సుస్థిరంగా సాగుతోందని విశ్లేషకులు అంటున్నారు. చివరకు,  కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం కూడా  మోదీ 3.0 ప్రభుత్వం  ముందు కంటే మరింత స్థిరంగా ముందుకు సాగుతోందనీ, శషబిషలు లేకుండా స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటోందని అన్నారు.

మరోవంక.. 2024 ఎన్నికల ఫలితాలు  ప్రతిపక్ష ఇండియా కూటమి, ముఖ్యమంగా కూటమికి సారథ్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీలో కొత్త ఆశలకు అవకాశం కల్పించాయి.  వరసగా రెండు ఎన్నికల్లో ప్రతిపక్ష హోదాకు కూడా నోచుకోని  కాంగ్రస్ పార్టీకి ఈ ఎన్నికల్లో ప్రజలు ప్రతిపక్ష హోదాను ఇచ్చారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ప్రతిపక్ష  నాయకుడయ్యారు.  అదొకటి అయితే..  2024 ఎన్నికలలో ప్రజలు ఇచ్చిన తీర్పును, విశ్లేషించుకుంటే, అటు బీజేపీకి అయినా ఇటు కాంగ్రెస్ కు అయినా  మిత్ర పక్షాల చేదోడు అవసరమని స్పష్టం చేశాయి. మిత్రపక్షాల సహకారం లేకుండా  అధికారమే కాదు.. ప్రతిపక్ష హోదా కూడా అసాధ్యమనే వాస్తవాన్ని 2024 ఎన్నికల ఫలితాలు విశదీకరించాయి.  

నిజానికి.. 2024 ఎన్నికల ఫలితాలే కాదు, ఈసంవత్సర కాలంలో జరిగిన వివిధ రాష్ట్రాల శాసన సభల ఎన్నికల ఫలితాలు కూడా అదే స్పష్టం చేస్తున్నాయి. అందుకే, బీజేపీ  ఎక్ హై తో సేఫ్ హై.. భటింగే తో కటింగే’ (కలిసి ఉంటే కలదు సుఖం,విడిపోతే పడిపోతాం) అనే  నినాదాన్ని ఉభయ తారకంగా ఉపయోగించుకుని  లోక్ సభ ఎన్నికల నష్టాన్ని  మహరాష్ట్ర, ఢిల్లీ, హర్యానా రాష్ట్రాల్లో పూడ్చుకుంది. ఆయా రాష్ట్రాలలో అధికారంలోకి రావడంమే కాకుండా.. అసెంబ్లీ ఎన్నికలు జరిగిన జమ్మూ కశ్మీర్, ఝారఖండ్  తదితర రాష్ట్రల్లోనూ  ప్రధాన ప్రతిపక్ష హోదాను పొందగలిగింది. మరో వంక కాంగ్రెస్ పార్టీ  పరిస్థతి ఏమిటో వేరే చెప్పనక్కరలేదు. దేశ రాజధానిలో వరసగా అరవ సారి జీరో’ గా మిగిలింది.  సో...   ఎక్ హై తో సేఫ్ హై.. భటింగే తో కటింగే’ నినాదం కాదు నిజం అంటున్నారు.

By
en-us Political News

  
వైసీపీ అధినేత జగన్ రెంటపాళ్ల పర్యటన సందర్భంగా వైసీపీ నేతలు నిబంధనలను ఉల్లంఘించారని తెలుగుదేశం ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ అన్నారు.
తిరుమలలో భక్తుల సౌకర్యార్థం ఏపీఎస్‌ఆర్టీసీ ఉచిత బస్సు సర్వీసులను ప్రారంభించింది. టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి, ఆర్టీసీ అధికారులతో కలిసి ఈ సేవలను గురువారం (జూన్ 19) ప్రారంభించారు. ప్రైవేట్ వాహనాల దోపిడీని, కాలుష్యాన్ని నివారించడమే లక్ష్యంగా ఈ సర్వీసులను ప్రారంభించినట్లు వెంకయ్య చౌదరి తెలిపారు.
సీఎం చంద్రబాబును సంతోషం కోసమే పోలీసులు తనపై, తన కుటుంబ సభ్యులపై అక్రమ కేసులను బనాయిస్తున్నారని చంద్రగిరి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి పేర్కొన్నారు. లిస్కర్‌ స్కాం కేసులో ఆయన్ని సిట్‌ అధికారులు అరెస్ట్‌ చేసిన నేపథ్యంలో ఆయన సిట్ కు ఓ బహిరంగ లేఖ విడుదల చేశారు.
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యం అయింది. ఈ నేపథ్యంలో అధికార పార్టీ నుంచి ఎవరు పోటీ చేస్తారని అంశంపై పార్టీలోనూ, నియోజకవర్గంలోనూ పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.
ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అరెస్టు కాబోతున్నారా? కేసీఆర్ కేబినెట్ లో మంత్రిగా పని చేసి ఆ తరువాత ఆయనతో విభేదించి బయటకు వచ్చ బీజేపీ గూటికి చేరిన ఈటల రాజేందర్ మాటల సంకేతమదేనా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు.
ఇప్పుడు ఎటు చూసినా యుద్ధమే కనిపిస్తోంది .. దేశాల మధ్యనే కాదు, రాజకీయ పార్టీల మధ్యన కూడా యుద్ద వాతావరణమే కనిపిస్తోంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అయితే .. ప్రత్యర్ధి పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తుంటే, పార్టీల లోపల సాగుతున్న అంతర్గత కుమ్ములాటలలో కూడా యుద్ధ వాతావరణమే కనిపిస్తోంది.
భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య యుద్ధాన్ని ఆపింది నేనే.. ఉభయ దేశాలను అదిరించి, బెదిరించి దారికి తెచ్చింది నేనే.. కాల్పుల విరమణ చేయించింది నేనే... అంటూ పదే పదే ప్రకటించిన అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఒక్క సారిగా యు టర్న్ తీసుకున్నారు.
కాంగ్రెస్ అధినేత, లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తన 55వ పుట్టిన రోజు గురువారం( జూన్ 19) జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మొదలు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరకు, ఇండియా కూటమి నాయకులు, వందల వేల మంది రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఆంధ్రా, ఒడిశా సరిహద్దులో అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో బుధవారం (జూన్ 18) జరిగిన ఎన్ కౌంటర్లో మరణించిన మావోయిస్టు నేత గాజర్ల రవి మృతదేహం కోసం ఆయన సోదరుడు, మాజీ నక్సల్ గాజర్ల అశోక్ రంపచోడవరం ఆస్పత్రికి చేరుకున్నారు.
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి మానసిక పరిస్థితి సరిగాలేక గంజాయి బ్యాచ్ ను,  ఉన్మాదులను, బెట్టింగులకు పాల్పడే నేరగాళ్లను కలుస్తున్నారని మంత్రి అనగాని సత్యప్రసాద్  అన్నారు.
ఆపరేషన్ కగార్‌లో మావోయిస్టుల కీలక నేత నంబాల కేశవరావు సహా సీనియర్‌ నాయకులను వరుసగా కోల్పోయి కుదేలైన మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. కేంద్ర కమిటీ సభ్యుడు, ఏవోబీ కార్యదర్శి గాజర్ల రవి అలియాస్‌ ఉదయ్‌ అల్లూరి జిల్లా మారేడుమిల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని కింటుకూరు అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటరులో మరణించారు. మరో అగ్ర నాయకురాలు, ఏవోబీ కమిటీ సీనియర్‌ సభ్యురాలు రావి వెంకటగిరి చైతన్య అలియాస్‌ అరుణ, మరో నక్సల్‌ అంజూ కూడా ఈ ఘటనలో చనిపోయారు.
మాజీమంత్రి, వైసీపీ సీనియర్ నాయకుడు అంబటి రాంబాబుపై సత్తెనపల్లి పోలీసు స్టేషన్ లో కేసు నమోదైంది. బుధవారం (జూన్ 18) జగన్‌ పర్యటన సందర్భంగా పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ సత్తెన పల్లి పోలీసులు అంబటిపై కేసు నమోదైంది.
ఉమ్మడి చిత్తూరు జిల్లా అనగానే వైసీపీ కంచుకోట అనేలా గత ఐదు సంవత్సరాలు పాలన సాగించారు. ఓవైపు పెద్దిరెడ్డి, ద్వారకానాథ రెడ్డి, మిథున్ రెడ్డి, మరో వైపు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, రోజా, ఇంకో వైపు కరుణాకర్ రెడ్డి ఇలా ఒక్కరేమిటి జిల్లాలోని మాజీ ఎమ్మెల్యే లు, వైసీపీ కీలక నాయకులు చేసిన హడావిడి అంతాఇంతా కాదు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.