ర‌జ‌నీకి గవర్నర్ గిరీ ఎర.. దక్షిణాదిలో పాగాకు బీజేపీ ఎత్తుగడ!

Publish Date:Aug 18, 2022

Advertisement

వల‌వేసిన‌వాడు చిన్న‌చేప కోస‌మే రోజంతా వేచి ఉండ‌డు. వల వేసిన ప్రతి సారీ ఏదో ఒక పెద్ద చేప‌ను ప‌ట్టాల‌నే ప‌ట్టుద‌ల‌తోనే ఉంటాడు. కచ్చితంగా పెద్ద చేప చిక్కుతుంద‌న్న‌ది అత‌ని న‌మ్మ‌కం. ఆ న‌మ్మ‌కంతోనే ఎంత‌టి ప‌నైనా సాధించ‌వ‌చ్చ‌న్న‌ది బీజేపీ వ్యూహ‌కారులు ఇటీవ‌లి కాలంలో స్ప‌ష్టం చేసింది.  దేశంలో త‌మ‌కు ఎదురులేకుండా చేసుకోవ‌డానికి విప‌క్షాల‌ను దెబ్బ‌తీయ‌డంలో అనేక వ్యూహ‌ వ‌ల‌ల‌ను కమలం పార్టీ వేసింది. ఒక్క‌టి రెండు త‌ప్ప అన్నీ మంచి ఫ‌లితాల‌నే ఇచ్చాయి. ఇపుడు ద‌క్షిణాదినా వారి అజ‌మాయిషీ సాధిం చుకోవ‌డానికి త‌మిళ‌నాట తాజాగా వ‌ల విసిరేరు.  ఆ వలకు రజనీకాంత్ అనే పెద్ద చేప చిక్కింది.

ఒక్క డైలాగ్‌తో సినీ ప్రేక్ష‌కుల‌ను వెర్రెక్కించి త‌న వీరాభిమానుల‌ను చేసుకోగ‌ల స‌త్తా ఉన్న న‌టుడు ర‌జ నీ. త‌మిళ‌నాడులో ఎంజీఆర్‌,  శివాజీగ‌ణేష‌న్‌, క‌మ‌ల్ త‌ర్వాత అంత‌టి  స్థానాన్ని సంపాదించిన న‌టుడు ర‌జ‌నీకాంత్. ర‌జ‌నీ సినిమాలంటే ప‌డి చ‌చ్చే జ‌నం ఆయ‌న రాజ‌కీయాల్లోకీ వ‌చ్చి రాజ‌కీయ రంగాన్ని ప్ర‌క్షా ళ‌న చేయాల‌ని వీరాభిమానులు   ఆశించారు. ఓకే మీ మాటే నా మాట అని పార్టీని ప్ర‌క‌టించారు ర‌జ‌నీ. కానీ ప‌రిస్థితులు అంత‌గా అనుకూలించ‌క‌పోవ‌డంతో రేపు, ఎల్లుండీ అంటూ క్రియాశీల రాజకీయాల్లోకి పూర్తిగా కాళ్లూ చేతులూ పెట్ట‌డానికి ముందు వెనుకలాడారు. చివరికి అనారోగ్యం అంటూ రాజకీయ ప్రవేశం చేయకుండానే రాజకీయ సన్యాసం ప్రకటించేవారు.  క్ర‌మేపీ సామా జిక ప‌రంగా ఎంతో సేవచేయాల్సి ఉంద‌ని అభిమానుల‌కు ర‌జ‌నీ త‌న మాట‌గా ప్ర‌క‌టించి రాజ‌కీయాల సంగ‌తి ఆలోచించ‌కుండా చేయ‌గ‌లిగారు. అయితే తాను వాస్త‌వానికి క‌ర్ణాట‌క నుంచి మ‌ద్రాసు వ‌చ్చి సినీ న‌టునిగా స్థిర‌ప‌డి త‌మిళుల హృద‌యాల్లో తిష్ట వేసిన మ‌హా న‌టుడు రజనీకాంత్. 

ఇప్పటికీ త‌మిళుల భావ‌న అదే. అయితే కాల‌క్ర‌మంలో రాజ‌కీయాల రంగు కూడా పుల‌మ‌డంతో ఆయ‌న మ‌న‌వాడు కాదు గ‌నుక ఆయ‌న్ను దూరంగా పెట్టాల‌న్న అభిప్రాయాలు వెల్లువెత్తాయి.  దీంతో ప‌రిస్థితులు  ర‌జ నీకి ప్రతికూలంగా మారాయి. ర‌జ‌నీ త‌న స్థాయిని, జ‌నాల్లో ప‌ట్టును, ప్ర‌తిష్ట‌ను కాపాడుకోవ‌డానికి బీజేపీ వారి స‌హాయ స‌హ కారాల‌ను కోరారు.

ఇలా చాలా కాలం నుంచే ర‌జ‌నీ బీజేపీతో  స‌ఖ్య‌ంగా ఉంటూ వచ్చారు. ఇక తాజా రాజ‌కీయ ప‌రిస్థితులు, ప‌రిణామాల దృష్ట్యా ఇది బీజేపీ   ఆస‌రాగా ఉప‌యోగ‌ప‌డుతోంది. త‌మిళ‌నాట  ర‌జ‌నీ ఇంటి దేవ‌త‌తో స‌మానం. ఇలాంటి అత్యంత పాప్యుల‌ర్ న‌టుడిని, వ్య‌క్తిని త‌మ‌కు గొప్ప అస్త్రంగా దొర‌క‌డం, దాన్ని మ‌రింత ప‌దునుపెట్టి ఉప‌యోగించుకోవ‌డం ద్వారా ద‌క్షిణాదిన త‌మ రాజ‌కీయ ఎత్తు గ‌డ‌లు విజ‌య‌వంతంగా వేయ‌వ‌చ్చ‌ని, ముందుకు దూసుకుపోవ‌చ్చ‌న్న ఆలోచ‌న చేసింది టీమ్ మోదీ!

ర‌జ‌నీకాంత్ కి త‌మిళ‌నాట ఉన్న అపార అభిమాన జ‌నం బీజేపీ కీ కూడా ఎంతో కొంత ఉప‌యోగ‌ప‌డుతుంద‌న్న ఆలోచ‌న‌లోనే ఆయ‌న్ను వ‌ల‌వేసి ప‌ట్టింద‌న్న అభిప్రాయాలు ఉన్నాయి. ఆయ‌న‌కు గ‌న‌క గవర్నర్ ప‌ద‌వి ఇస్తే, రాష్ట్రంలో తిరుగులేకుండా పోతుంద‌న్నది బీజేపీ వ‌ర్గాల న‌మ్మ‌కం కూడా. అస‌లే ద‌క్షిణాది రాష్ట్రాల్లో బీజేపీకి ఎదురుగాలి వీస్తున్న ఈ త‌రుణంలో ర‌జ‌నీని ద‌గ్గ‌ర‌వానిగా మ‌రింత ఆత్మీయునిగా చేసుకుని ఉన్న‌త ప‌ద‌విని క‌ట్ట‌బెట్ట‌గిలిగితే త‌మిళ‌నాడు, ద‌క్షిణాది రాష్ట్రాల్లో పార్టీని బ‌లోపేతం చేసే ఆలోచ‌న‌లు మ‌రింత ప‌దునుగా అమ‌లు చేయ‌డానికి ఎంతో ఆస్కారం ఉంద‌న్న‌ది బీజేపీ మేథోవ‌ర్గానికి అనిపించి ఉండ‌వ‌చ్చు. మ‌రో విధంగా, ర‌జ‌నీ కూడా ఇటీవ‌ల సినిమాల‌కు కాస్తంత విశ్రాంతి ఇచ్చి రాజ‌కీయ‌ప‌రంగా త‌న స్నేహితుల‌ను ద‌రిచేర్చుకోవ‌డానికి ఆస‌క్తి చూపుతున్నార‌న్న‌ది విశ్లేష‌కుల మాట‌. ఈ నేప‌థ్యంలో బీజేపీ ఆహ్వానాన్ని త‌ప్ప‌కుండా స్వీక‌రించితే త‌న స్థాయిని పెంచుకోవ‌డంతో పాటు, త‌న‌కు త‌మిళ‌నాట  పెరుగుతోన్న రాజ‌కీయ వ్య‌తిరేక‌త‌కు అడ్డుక‌ట్ట వేయ‌చ్చ‌న్న ఆలోచ‌నా చేసి ఉండ‌వ‌చ్చు. క‌నుక త‌మిళ నాట ర‌జ‌నీ ఫాన్స్‌కి ఇదో శుభ‌వార్తే అవుతుంది. ర‌జ‌నీ బ్లాక్‌బ‌స్ట‌ర్లు అరుణాచ‌లం, భాషా, బాబా,ముత్తు వంటి సినిమాలు ర‌జ‌నీని ఆధ్యాత్మిక గురువుగానూ మ‌రో కోణంలో అభిమానులు ద‌ర్శించారు. 

ఇదిలాఉండ‌గా, గతంలో ఆధ్యాత్మిక చింత‌న భారంతోనే ర‌జ‌నీ అనేక రాజ‌కీయ అంశాల‌మీద ఎలాంటి ఆరోప‌ణ‌లు, విమర్శ‌లూ చేయ‌లేదు. అయితే రాజ‌కీయ‌విశ్లేష‌కులు మాత్రం అదంతా న‌ట‌నే, బీజేపీ, కేంద్ర నాయ‌క‌త్వాన్ని ఆక‌ట్టుకోవ‌డంలో ర‌జ‌నీ వేసిన ఎత్తుగ‌డే త‌ప్ప మ‌రోటి కాద‌న్నారు. ముఖ్యంగా జ‌మ్ము కాశ్మీర్ అంశంలో ర‌జ‌నీ ఎలాంటి కామెంట్ చేయ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. కేంద్రంలో బీజేపీ నాయ‌క‌త్వాన్ని సీనియ‌ర్ నాయ‌కుల‌ను భ‌జ‌న చేయ‌డం కూడా జ‌రిగింది. చాలా కాలం క్రిత‌మే అమిత్‌షాను పొగ‌డ్త‌ల‌తో ముంచేత్తారు ర‌జ‌నీ. మీరు పార్ల‌మెంటులో చేసిన భాష‌ణ మ‌హాద్భుతం.. ఎవ‌రివ‌ల్లా కాదు మిత్ర‌మా అంటూ పొగిడేశారు. అంత‌టితో ఆగ‌లేదు.. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ, అమిత్ షా ల జంట మ‌హాభార‌తంలో  కృష్ణార్జునుల వంటిదని ర‌జ‌నీ పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తారు. వీరిద్ద‌రి వ‌ల్లే దేశం ఊహించ‌ని  అభివృద్ధి దిశ‌లో వెళుతోంద‌ని దేశ‌మంతా వినిపించేలా ప్ర‌శంసించారు.  2018లో తూత్తుకుడిలో యాంటీ స్టిరెటైట్ ప్రొటెస్టుల సంద‌ర్భంగా జ‌రిగిన గొడ‌వ‌లు, అల్ల‌ర్ల‌ను ర‌జ‌నీ వ్య‌తిరేకించారు. ఆ స‌మ‌యంలో జ‌రిగిన పోలీసు కాల్పుల్లో ఏకంగా 13మంది చ‌నిపోయారు. జూలైలో నెటిజెన్లు శాంతాకుళం లో ఇద్ద‌రు వ్యాపారుల మ‌ర‌ణం గురించి నెటిజ‌న్లు హోరెత్తితే ఇక త‌ప్ప‌ని స్థితిలో ర‌జ‌నీ కామెంట్ చేయ‌వ‌ల‌సి వ‌చ్చిందే గాని, కేంద్రం ఏమ‌నుకుంటుందోన‌న్న భీతి ఆయ‌న‌లో లేక‌పోలేద‌న్న‌ది విశ్లేష‌కుల మాట‌. రాష్ట్రంలో రాజ‌కీయ ప‌రిణామాల మీద సామాన్య‌జ‌నులూ విరుచుకుప‌డుతున్న త‌రుణంలో, విప‌క్షాలు మండిప‌డుతున్న స‌మ యంలోనూ ర‌జ‌నీ అంత‌గా స్పందించ‌లేదు. ఆయ‌న ఆధ్యాత్మిక చింత‌న సారాంశం కేవ‌లం కేంద్రం లోని బీజేపీవారిని ఆక‌ట్టుకోవ‌డానికే అన్న విమ‌ర్శ‌లూ ర‌జ‌నీ ఎదుర్కొన‌వ‌ల‌సి వ‌చ్చింది.

ఏతావాతా తేలిందేమంటే, ర‌జ‌నీకాంత్ కేవ‌లం భారీ డైలాగ్‌ల‌తో పెద్ద ఎత్తున జ‌నాక‌ర్ష‌క నాయ‌కునిగా ఆరాధ్య‌దైవంగా నిల‌బ‌డ‌ట‌మే కాకుండా త‌న‌లోప‌లి క‌మ‌ల‌నాథుడిని కూడా కాపాడుకోవ‌డానికి స్వీయ ఎత్తుగ‌డ‌లు క‌నిపించి క‌నిపించ‌కుండా చేప‌ట్టి ఢిల్లీ ప్రయాణాలు, ఆహ్వానాల‌కు మోదీ, షాల‌తో  ములా ఖ‌త్‌ల‌కు ట్విస్ట్ .. తన‌కు గ‌వ‌ర్న‌ర్ గిరీ అంటగ‌ట్టే అనుకూల‌త సాధించ‌డ‌మేన‌ని విశ్లేష‌కుల మాట‌.

By
en-us Political News

  
ఇటీవల కాలంలో ముగ్గురుర వైసీపీ నేతలపై నమోదైన మూడు కేసుల్లో ఆ నేతలు వ్యవహరిస్తున్న తీరు, వారికి పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి మద్దతు విమర్శలకు గురౌతోంది. పూర్తిగా కుటుంబ వివాదాలు, ప్రత్యక్షంగా వారు పాల్పడిన అక్రమాలకు సంబంధించిన ఆధారాలతో నమోదైన కేసులను కూడా రాజకీయ వేధింపులంటూ  వారు మాట్లాడుతున్న మాటలు, చేస్తున్న వ్యాఖ్యలు విస్తుగొలుపుతున్నాయి.
ప్రభుత్వ బాకాలుగా వ్యవహరిస్తున్న మరికొన్ని మీడియా సంస్థల విలేకరులపై కూడా జంతర్ మంతర్ వద్ద నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రదర్శనకారులపై పోలీసుల దాష్టీకాన్నీ, తమ ఆందోళనలపై కేంద్రం అనుసరిస్తున్నఅణచివేతనూ ప్రస్తావించకుండా కేంద్ర ప్రభుత్వ అనుకూలతకే ప్రాధాన్యం ఇవ్వడంతోనే ప్రధాన స్రవంతి మీడియా ప్రజాగ్రహానికి గురౌతోందని చెబుతున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేసిన ఈ వీడియో సందేశంపై ప్రముఖ నటుడు, సామాజిక విమర్శకుడు ప్రకాశ్ రాజ్ ప్రధాని ముఖంలో భయం ప్రస్ఫుటంగా కనిపించిందంటూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
పార్లమెంటు ఉభయ సభలలో ఏదో ఒక సభ లో సభ్యత్వం లేని వ్యక్తి ఆరు నెలల కాల పరిమితి మించి కేంద్ర మంత్రిగా కొనసాగే అవకాశం లేదు. దీంతో మోడీ ఆదేశాల మేరకు రవ్ నీత్ సింగ్ బిట్టూ తన పదవికి రాజీనామా సమర్పించారు.
పరీక్షల్లో పారదర్శకత, విద్యారంగంలో సంస్కరణలు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ తో యువత చేపట్టిన పోరాటానికి మద్దతు ప్రకటించడమే కాకుండా.. జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో సోమవారం జరగనున్న ధర్నాలో స్వయంగా పాల్గొంటానని వెల్లడించారు.
కల్వకుంట్ల తారకరామారావు జన్మదినం జులై 24 ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ కేటీఆర్ కు పాతిక కిలోల సన్నబియ్యాన్ని కానుకగా పంపారు. అదీ తాను స్వయంగా ఆ బర్త్ డే గిఫ్ట్ ను అందించకుండా, ర్యాపిడో బైక్ బుక్ చేసి.. ఆ కానుకను తెలంగాణ భవన్ కు కేటీఆర్ కు పంపించారు.
వాస్తవానికి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునే కేబినెట్ భేటీకి డిప్యూటీ సీఎం హాజరు కాకపోవడానికి రాజకీయ కారణాలున్నాయా అన్న అనుమానాలకు ఆస్కారం లేని పరిస్ధితి ఉంది. ఎందుకంటే.. ఇటీవలే ముంబై లోని కోకిలా బెన్ అంబానీ ఆస్పత్రిలో పవన్ కల్యాణ్ భుజానికి శస్త్ర చికిత్స జరిగింది. ఆయనకుపూర్త విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించడం వల్లనే కేబినెట్ భేటీకి రాలేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
మత్స్యకారుల నాయకుడిగా, మాజీ మంత్రిగా గుర్తింపు పొందిన సీదిరి అప్పలరాజు ఇటీవల వార్తల్లో నిలిచారు.
జగన్ సొంత కుంపటి పెట్టుకున్న నాటి నుంచీ వెన్నంటి ఉన్న విజయసాయిరెడ్డి, సమీప బంధువు అయిన బాలినేని లకు పార్టీలో దక్కిన మర్యాద తెలిసిందే. ఇప్పుడు తాజాగా నిన్న మొన్నటి వరకూ జగన్ కు అత్యంత సన్నిహితుడిగా, నమ్మిన బంటుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డికి ఇప్పుడు కనీసం తాడేపల్లి ప్యాలెస్ గేటు వద్ద ఎంట్రీ కూడా దొరకడం లేదు.
ఇటీవల నిరుద్యోగ యువతను ఉద్దేశించి సుప్రీంకోర్టు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు నిరసనగా, సామాజిక మాధ్యమాల్లో రాజుకున్న ఆగ్రహం ఇప్పుడు దేశ రాజధాని జంతర్ మంతర్ వద్ద విశ్వరూపంతో నిలిచింది. ప్రశ్నించే హక్కును కోల్పోయిన తరానికి ప్రాతినిధ్యం వహిస్తూ కాక్రోచ్ జనతా పార్టీ రూపంలో విద్యార్థులు, యువత ఉద్యమిస్తున్నారు.
ఏపీలో కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేని వైసీపీ ఈ అంశాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తోంది. జాతీయ స్థాయి నీట్ లీకేజీ వ్యవహారంలోకి ఏపీ మెగా డీఎస్సీ పరీక్షల అంశాన్ని జోడించి లబ్ధి పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన డీఎస్సీ పరీక్షల్లో అనేక అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వైసిపి నాయకత్వం విమర్శిస్తూ, నీట్ తో పాటు డీఎస్సీ అక్రమాలపై కూడా విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తోంది.
దేశవ్యాప్తంగా నీట్ పరీక్షల నిర్వహణ, ప్రశ్నాపత్రాల లీకేజీ ఆరోపణలు తీవ్ర స్థాయిలో దుమారం రేపుతున్నాయి.
రాజకీయం గురించి కాదు. పార్టీ గురించి కాదు.ఒక నాయకుడి గురించి కూడా కాదు....ఒక తరం గురించి. విజృంభించిన లాఠీల్లో రక్తం చిందించిన ఈ తరం గురించి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.