Publish Date:Mar 15, 2025
తిరుమల శ్రీవారి దర్శనానికి తెలంగాణ ప్రజా ప్రతినిథుల సిఫారసు లేఖల అంశం మరోసారి తెర మీదకు వచ్చింది. ఈ సారి బీజేపీ ఎంపీ రఘునందనరావు ఈ విషయాన్ని లేవనెత్తారు. తిరుమల గడ్డపై నిలబడి రుబాబు చేశారు. తెలంగాణ భక్తులను తిరుమల తిరుపతి దేవస్థానం నిర్లక్ష్యం చేస్తోందంటూ విమర్శలు గుప్పించారు. తెలంగాణ ప్రజాప్రతినిథుల సిఫారసు లేఖలను టీటీడీ పరిగణనలోనికి తీసుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీకి, ఆంధ్రప్రదశ్ ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చారు. అల్టిమేటమ్ జారీ చేసినట్లుగా మాట్లాడారు. ఈ వేసవి సెలవుల్లో తెలంగాణ ప్రజాప్రతినిథుల సిఫారసు లేఖలను టీటీడీ అంగీకరించకపోతే.. తెలంగాణ ప్రజాప్రతినిథులం అందరం తిరుమల వచ్చి చేయగలిగింది చేస్తామని హెచ్చరించారు. అసలాయన ఎక్కడి వారు, ఎక్కడకు వచ్చి ఏం మాట్లాడారు? అంటూ నెటిజనులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గతంలో తెలంగాణ మంత్రి కొండా సురేఖ, మాజీ మంత్రి పద్మారావు వంటి వారు కూడా తిరుమలలో తెలంగాణ ప్రజా ప్రతినిథుల సిఫారసు లేఖలను అనుమతించాలంటూ డిమాండ్ చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇదే విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి లేఖ కూడా రాశారు. ఆ లేఖపై సానుకూలంగా స్పందించిన ఏపీ సీఎం ఫిబ్రవరి నుంచి తెలంగాణ ప్రజాప్రతినిథుల లేఖలను తిరుమలలో పరిగణనలోనికి తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఇప్పుడు తాజాగా మార్చి నెల సగం గడిచిపోయిన తరువాత కూడా తెలంగాణ ప్రజాప్రతినిథుల సిఫా రసు లేఖను టీటీడీ పరిగణనలోనికి తీసుకోవడం లేదంటూ రఘునందనరావు తిరుమలలో రుబాబు చేశారు. శుక్రవారం (మార్చి 14)న ఆయన తిరుమలేశుని దర్శించుకున్నారు. తెలంగాణ ప్రజాప్రతినిథి హోదాలో ఆయనకు టీటీడీ ప్రొటోకాల్ దర్శనం కల్పించింది. అయితే ఆయన సిఫారసు లేఖలకు అనుమతిపై ఏపీ సర్కార్, టీటీడీపై విమర్శలు గుప్పించడమే కాకుండా హెచ్చరిక కూడా జారీ చేశారు. వాస్తవానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రంలోని మొత్తం 294 మంది ఎమ్మెల్యేలు, 42 మంది ఎంపీల సిఫారసు లేఖలను టీటీడీ అనుమతించేది. వారి సిఫారసు లేఖల మేరకు భక్తులకు దర్శనం కల్పించేది. అయితే రాష్ట్ర విభజన తరువాత తిరుమలలో తెలంగాణ ప్రజాప్రతినిథుల సిఫారసు లేఖలను అనుమతించాలా వద్దా అన్నది పూర్తిగా టీటీడీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయిం చుకోవలసిన అంశం. దీనిపై పొరుగు రాష్ట్రానికి చెందిన ప్రజాప్రతినిథులు రుబాబు చేయడం పూర్తిగా అనుచితం అంటూ నెటిజనులు ఓ రేంజ్ లో రఘునందనరావుపై విరుచుకుపడుతున్నారు.
ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ లో కేవలం పది శాతం మంది భక్తులకు మాత్రమే రాష్ట్రప్రజాప్రతినిథుల లేఖల ద్వారా బ్రేక్, ప్రత్యేక ప్రవేశ దర్శనం లభ్యమౌతోంది. మిగిలిన 90శాతం మందీ కూడా సామాన్య భక్తులే. అయినా టీటీడీలో శ్రీవారి దర్శనం కోసం రాష్ట్రాల వారీ కోటా ఏమీ లేదు. మరి ఈ విషయంలో తెలంగాణ ప్రజాప్రతినిథులు తమ లేఖలను పరిగణనలోనికి తీసుకోవాలంటే హఠం చేయడం ఎంత వరకూ సబబు అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ రాష్ట్రం, ఆ రాష్ట్రం అన్న తేడా లేకుండా తిరుమలేశుని దర్శనం కోసం టికెట్లు ఆన్ లైన్ లో అందుబాటులో ఉంటాయి. రాష్ట్రాల వారీ రిజర్వేషన్లు ఏమీ ఉండవు. అంటే తెలంగాణ భక్తులు కానీ మరో రాష్ట్రం భక్తులు కానీ తిరుమలేశుని దర్శనం విషయంలో వివక్షకు గురి కావడం లేదు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ వాసులకు ప్రత్యేక వెసులుబాటు కూడా ఏమీ లేదు.
తెలంగాణ ప్రజా ప్రతినిధులు తిరుమల వచ్చిన సందర్భంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారికి ప్రొటోకాల్ దర్శనం కల్పిస్తోంది. ఇప్పుడు రఘునందరనావు కూడా కుటుంబ సమేతంగా వతిరుమలలో వీఐపీ దర్శనం చేసుకున్నారు. ఇక సిఫారసు లేఖలను కూడా అనుమతించాలని పట్టుబట్టడంలో అర్ధం లేదని నెటిజనులు విమర్శిస్తున్నారు. సామాన్య భక్తులకు సత్వర దర్శన భాగ్యం కల్పించడంపైనే టీటీడీ దృష్టి సారించాలని కోరుతున్నారు. రఘునందనరావు తిరుమలలో చేసిన రుబాబు ఆయన స్థాయికి తగినట్లుగా లేదని విమర్శలు గుప్పిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/bjp-mp-raghunandanarao-ultimatum-to-ap-government-and-ttd-25-194438.html
ఫోన్ ట్యాపింగ్ ఎక్విపిమెంట్ కొనుగోలుకు అవసరమైన డబ్బును సమకూర్చింది నవీన్ రావే అని సిట్ విచారణలో తేలింది. అంతే కాకుండా, పాల్ రవి కుమార్ ద్వారా ట్యాపింగ్ ఎక్విపిమెంట్ను సమకూర్చినట్లు సిట్ నిర్ధారణకు వచ్చింది. పోన్ ట్యాపింగ్ కు ఒక ప్రైవేటు వ్యవహారంగా కాకుండా అది వ్యవస్థీకృతంగా పని చేసిందని నవీన్ రావు విచారణలో బయటపడినట్లు తెలుస్తోంది.
ఈ కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ను సుప్రీం ధర్మాసనం డిస్మిస్ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు.
రద్దు చేసిన కమిటీల స్థానంలో నెల రోజుల పాటు ఉండేలా అడ్ హాక్ కమిటీలను నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కమిటీలు రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించి అందజేసే నివేదిక ఆధారంగా కొత్త కమిటీలను ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత మరోసారి హరీష్ రావుపై హాట్ కామెంట్స్ చేశారు.
కొత్త సంవత్సరం చేతినిండా, నోటి నిండా పని పెట్టనుంది. ఎందుకంటే ఈ ఏడాది పలు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలన్నీతమతమ వ్యూహాలు, ఎత్తుగడలకు పని చెప్పనున్నాయి. పెద్ద రాష్ట్రాలుగా ఉన్న పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల అసెంబ్లీలకు 2026 తొలి అర్ధ భాగంలోనే ఎన్నికలు జరగనున్నాయి.
అందె శ్రీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందనీ, ఇందుకోసం చట్టపరమైన మద్దతు అవసరమని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో 1994పబ్లిక్ సర్వీస్ కమిషన్ చట్టంలోని నిబంధనలు సవరించాల్సి ఉందని తెలిపారు. అందె శ్రీ కుమారుడికి ఉద్యోగ అవకాశం కల్పించడం కోసం చేసిన సవరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టామన్నారు.
దేశంలో మోడీ పాలన అంతమవ్వాలంటే.. పొరుగు దేశాలైన శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్లలో జరిగిన ఉద్యమాల వంటివి ఇక్కడ కూడా రావాలని ఆయన అన్నారు.
ఏపీలో వైసీపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ రాష్ట్రంలో ప్రజలు తమకు ఇవ్వని ప్రతిపక్ష హోదా కోసం వైసీపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేస్తే.. తెలంగాణలో ప్రతిపక్ష హోదాలో ఉన్న బీఆర్ఎస్ అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యులను దీటుగా ఎదుర్కోవడంలో వైఫల్యం కారణంగా బాయ్ కాట్ చేస్తున్నదన్న చర్చ జరుగుతోంంది.
ఇంత కాలం కల్వకుంట్ల కవిత తన విమర్శలను హరీష్ రావు, సంతోష్, జగదీశ్వరరెడ్డి వంటి నాయకులకే పరిమితం చేసిన కవిత ఇప్పుడు బీఆర్ఎస్ అధినాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు, సవాళ్లు సంధిస్తున్నారు.
తాజా చిట్ చాట్ లో ఆమె తన తండ్రి కేసీఆర్ నే నేరుగా నిలదీశారు. కేసీఆర్ అసెంబ్లీకి డుమ్మా కొడితే రాష్ట్రంలో బీఆర్ఎస్ ఇక ఖతమేనన్నారు. అయినా ఎటువంటి తప్పూ చేయకపోతే కేసీఆర్ సభకు ఎందుకు రావడం లేదని నిలదీశారు.
గత కొంత కాలంగా తన స్వంత కుమారుడు, కుమార్తెల మధ్య పంచాయతీని పరిష్కరించే విషయంలో విఫలమైన ఆయన ఇప్పుడు తెలుగు రాష్ట్రాల మధ్య జలపంచాయతీలు, కాంగ్రెస్, బీజేపీలపై విమర్శలు గుప్పిస్తున్నారని ఎద్దేవా చేశారు. రానున్న రోజులలో బీఆర్ఎస్ కనుమరుగైపోవడం ఖాయమని తాను భావిస్తున్నట్లు చెప్పారు.
స్థానిక ఎమ్మెల్యే భరత్ రెడ్డి అనుచరుడు సతీష్ రెడ్డి గాలి జనార్ధన్ రెడ్డిపై రెండు రౌండ్లు కాల్పులు జరపగా, ప్రతిగా గాలి జనార్దన్ రెడ్డి అనుచరులు కూడా ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో కాంగ్రెస్ కార్యకర్త రాజశేఖర్ మరణించాడు.
Publish Date:Dec 31, 2025
తనను పార్టీ నుంచి బయటకు గెంటేసిన బీఆర్ఎస్ కు చుక్కలు చూపిస్తానని హెచ్చరించారు. బీఆర్ఎస్ హయాంలో అవినీతి జరిగిందని ఇప్పటికే బాహాటంగా విమర్శలు గుప్పిస్తూ వచ్చిన కల్వకుంట్ల కవిత ఈ సారి కేటీఆర్ రాజకీయాలను ఎండగట్టారు. తన సోదరుడు కేటీఆర్ కంటే పార్టీ కోసం తానే ఎక్కువగా కష్టపడ్డాన విస్పష్టంగా తేల్చేశారు.
Publish Date:Dec 31, 2025
శివాజీ చేసిన వివాదాస్పద కామెంట్లపై నాగబాబు కౌంటర్ ఒకింత ఘాటుగా ఉంది. అందులో సందేహం లేదు. అయితే మామూలుగా అయితే నాగబాబు కౌంటర్ వివాదాస్పదం అయ్యే అవకాశం లేదు. కానీ శివాజీ వ్యాఖ్యలపై మెగా ఫ్యాన్స్ ఒకింత సానుకూలత వ్యక్తం చేయడంతో నాగబాబును వివాదంలోకి లాగారు. సోషల్ మీడియా వేదికగా నాగబాబుపై ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు.