Publish Date:Nov 20, 2025
భారతీరెడ్డి 400 కిలోల బంగారం కొన్నారంటూ ఆరోపణించారు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి. అయితే ఇందులో వాస్తవమెంత? అవాస్తవమెంత? అన్న విషయానికి వస్తే.. ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం, మరో కుంభకోణం ఏదైనా సరే జగన్ అండ్ కో.. బ్లాక్ మనీ వైట్ చేయడానికి మూడు నాలుగు మార్గాలను ఎంపిక చేసుకుంటే వాటిలో గోల్డ్ బిస్కెట్స్, కాయిన్స్ ఒకటి. ఈ విషయం రాజ్ కేసిరెడ్డి విచారణలో వెలుగులోకి వచ్చింది.
జ్యువెలరీ షాప్స్, రియల్ ఎస్టేట్, యాడ్ ఏజెన్సీస్, ఆపై దేశ విదేశాల్లో కంపెనీల స్థాపన వంటి దారుల గుండా వీరు తమ తమ బ్లాక్ మనీ వైట్ చేసేందుకు శాయశక్తులా కృషిచేసినట్టు రాజ్ కేశిరెడ్డి రిమాండ్ రిపోర్ట్ లో సిట్ పేర్కొంది. అయితే ఈ మొత్తం బినామీల ద్వారా జగన్ కి చేరేలా పకడ్బందీ వ్యూహం ప్రకారం జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. తాజాగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సైతం మద్యం సొమ్ముతో భారీగా ఆస్తులు కూడబెట్టినట్టు తేల్చిన సిట్ ఆయన ఆస్తుల అటాచ్ మెంట్ కు రెడీ అవుతోంది. ప్రభుత్వ అనుమతితో చెవిరెడ్డి భాస్కరరెడ్డి కుటుంబ ఆస్తుల అటాచ్ మెంట్ కోసం ఏసీబీ కోర్టును ఆశ్రయించనుంది.
ఈ నేపథ్యంలోనే మద్యం కుంభకోణం, ఇతర స్కాముల ద్వారా కూడబెట్టిన ఆస్తిపాస్తులు డబ్బు దస్కం జగన్ కి చేరేలా, ఆపై బంగారం వంటివి భారతీరెడ్డికి చేరేలా వైసీపీలోని అక్రమార్కులంతా కలిసి స్కెచ్ వేశారని బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి విమర్శలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ఒకప్పుడు తన భర్తను తాను ఈ రాజకీయాలే వద్దని చెప్పానని భారతీరెడ్డి పలు సందర్బాలలో చెప్పారు. ఇక్కడుంటే జైల్లో పెడతారు కాబట్టి మనం ఎక్కడైనా విదేశాలకు వెళ్లి హాయిగా ఉందామని సూచించాననీ చెప్పిన సందర్భాలున్నాయి. అయితే ఆయన వినలేదని భారతీరెడ్డి ఆవేదన కూడా వ్యక్తం చేశారు. జగన్ కూడా ఆయన తండ్రిలా పేద ప్రజల దేవుడిగా మారాలని భావించారనీ, ఈ విషయాన్ని ఆయన తనతో చెప్పారనీ కూడా గతంలో భారతీ రెడ్డి చెప్పారు. అటువంటి భారతీ రెడ్డి తాజాగా బంగారం మొత్తం నిల్వలు తన పరం చేసుకున్నట్టుగా ఆదినారాయణరెడ్డి వంటి వారు మరి చూడాలి ఈ బంగారాన్ని ఎలా రికవరీ చేస్తారో పోలీసులు. చెవిరెడ్డి ఆస్తులు అటాచ్ చేసినట్టు వీటిని కూడా చేస్తారేమో చూడాలి మరి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/bjp-leader-allege-ys-jagan-wife-own-400kg-gold-39-209801.html
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.