పవన్ కు బీజేపీ నుంచి పిలుపు.. పవన్ వ్యాఖ్యలతో కమలంలో కుదుపు

Publish Date:Oct 19, 2022

Advertisement

మంగళగిరిలో మంగళవారం జరిగిన జనసేన కార్యకర్తల సదస్సులో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు బీజేపీలో ఒక్కసారిగా ప్రకంపనలు పుట్టించాయి. మిత్రపక్షమైనా బీజేపీతో కలిసి నడవడానికి రాష్ట్రంలో ఆ పార్టీ  నాయకత్వం వ్యవహరిస్తున్న తీరు పెద్ద అవరోధంగా మారిందని పవన్ కల్యాణ చేసిన వ్యాఖ్యలతో బీజేపీ హై కమాండ్ లో కదలిక వచ్చింది. వెంటనే స్పందించింది. జనసేనాని పవన్ కల్యాణ్ ను హస్తిన రావాల్సిందిగా బీజేపీ హైకమాండ్ నుంచి పిలుపు వచ్చింద. ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అయితే మంగళవారంమే పార్టీ అధిష్ఠానం పిలుపు మేరకు హుటాహుటిన ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై సోము వీర్రాజు తన అధిష్టానానికి ఏమి వివరణ ఇచ్చారో.. ఏమో గానీ.. బుధవారం మధ్యాహ్నానికల్లా సీన్ మారిపోయింది. ఆ వెంటనే పవన్ కళ్యాణ్ ను ఢిల్లీ రావాల్సిందిగా బీజేపీ పెద్దల నుంచి పిలుపు వచ్చిందని మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి.

‘నేను వ్యూహాలు మార్చుకోవాల్సి వచ్చింది. ఇకపై ఏపీలో కొత్త రాజకీయ ముఖచిత్రం చూస్తారు’ అంటూ జనసేన నేతలు, కార్యకర్తల సమావేశంలో పవన్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. బీజేపీని రోడ్ మ్యాప్ ఇవ్వమని అడిగి నెలలు గడుస్తున్నా ఆ పార్టీ పట్టించుకోకపోవడంతో సమయం గడిచిపోతోందంటూ పవన్ కళ్యాణ్ అసహనం వ్యక్తం చేయడమే బీజేపీ వర్గాల్లో కంగారుకు కారణమై ఉంటుందని పరిశీలకులు అంటున్నారు.  దానికి తోడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా పవన్ కళ్యాణ్ బస చేసిన నోవాటెల్ హోటల్ కు వెళ్లి సుమారు గంట సేపు ప్రైవేటుగా చర్చలు జరపడం కూడా బీజేపీలో కంగారు కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. బీజేపీ మీద, మోడీ మీద తనకు గౌరవం ఉందంటూనే   ‘అలా అని చెప్పి నా స్థాయిని చంపుకోలేను.. ఊడిగం చేయలేను’ అంటూ పవన్ కల్యాణ్ చేసిన ఘాటు వ్యాఖ్యలు కమలం పెద్దలను ఇరుకున పెట్టాయని పరిశీలకులు అంటున్నారు.  వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ తమతో కలిసి నడుస్తారని ఇప్పటి దాకా   బీజేపీ నేతలు భావిస్తూ వచ్చారు. ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ వ్యూహాలు మార్చుకుంటున్నట్లు ప్రకటించడంతో కమలం పార్టీకి గాలి ఆడని పరిస్థితి ఎదురైందని అంటున్నారు.

నిజానికి బీజేపీ- జనసేన మధ్య 2019 ఎన్నికల తరువాత నుంచీ పొత్తు ఉంది. అయితే  చాలా కాలంగా పవన్ కళ్యాణ్ ను బీజేపీ అంతగా పట్టించుకున్న దాఖలాలు లేవు. జనసేనతో తాము పొత్తులోనే ఉన్నాయని బీజేపీ రాష్ట్ర నాయకత్వం అప్పుడప్పుడూ చెబుతున్నా కొంతకాలంగా ఆ రెండు పార్టీలు కలిసి ఎలాంటి ఉద్యమం కానీ కార్యక్రమం కానీ నిర్వహించలేదు. విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ పర్యటించకుండా పోలీసులు అడ్డుకోవడంతో పాటు రెండు రోజులు ఆయన బసచేసిన హొటల్ నుంచి బయటకు రానివ్వకుండా నిర్బంధించారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గత ఆదివారంనాడు విజయవాడకు తిరిగివచ్చి ‘ఇక్కడే తేల్చుకుంటా’ అని చెప్పడం.. మంగళగిరి ఆఫీసులో తమ పార్టీ నేతలు, శ్రేణుల సమావేశంలో ఆవేశపూరితంగా మాట్లాడారు.

విశాఖ ఘటన తర్వాత బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు పవన్ కళ్యాణ్ ను పరామర్శించి, మద్దతు తెలిపినప్పటికీ తనకు బీజేపీ పూర్తి మద్దతు ఇచ్చిన దాఖలాలు పవన్ కళ్యాణ్ కు కనిపించలేదు. మరో పక్కన విశాఖ ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అందరి కంటే ముందుగా స్పందిచి పవన్ కు సంఘీభావం ప్రకటిస్తూ ట్వీట్ చేయడం..  మంగళగిరి సమావేశంలో పవన్ కళ్యాణ్ ప్రసంగించిన కొద్ది సేపటికే తెలుగుదేశం అధినేత చంద్రబాబు వెళ్లి పవన్ కు కలసి సంఘీభావం తెలపడంతో   బీజేపీ నేతల్లో కంగారు మొదలైనట్లు కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఢిల్లీకి రావాలని పవన్ కళ్యాణ్ కు బీజేపీ పెద్దల నుంచి పిలుపు వచ్చిందని అంచనా వేస్తున్నారు.

 పవన్ కల్యాణ్ విషయంలో బీజేపీ అధిష్టానం వైఖరిపై ఆ పార్టీ ఏపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ తో సఖ్యత విషయంలో ఏపీ బీజేపీ నాయకత్వం విఫలమైందని బాంబు పేల్చడం గమనార్హం. పవన్ తో సమన్వయం చేసుకోవడంలో సోము వీర్రాజు దారుణంగా విఫలమయ్యారని తన మనసులో మాటను కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు. బీజేపీ అధిష్టానం పవన్ కళ్యాణ్ ను లైట్ తీసుకోవడం, రాష్ట్ర నాయకత్వం కూడా పవన్ కు అంతగా ప్రాముఖ్యం ఇవ్వకపోవడం వల్లే జనసేనకు బీజేపీ దూరమయ్యే పరిస్థితి వచ్చిందని కన్నా లక్ష్మీనారాయణ విస్పష్టంగా తేల్చి చెప్పడంతో.. జనసేనతో మైత్రిని కొనసాగించడంలో బీజేపీ నేతల ఉదాశీనతపై కమలం పార్టీలో ఇంత వరకూ నివురుగప్పిన నిప్పులా ఉన్న అసంతృప్తి ఒక్కసారిగా భగ్గుమందని పరిశీలకులు అంటున్నారు.

ముఖ్యంగా బీజేపీ ఏపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చేసిన వ్యాఖ్యలు కమలంలో సెగలు పుట్టించాయి. ఏపీలో బీజేపీ పరిస్థితి ఇంత దయనీయంగా మారడానికి, చివరికి రాష్ట్రంలో పార్టీకి ఉన్న ఏకైక మిత్రపక్షం కూడా దూరమవ్వడానికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వైఖరే కారణమని కన్నా కుండబద్దలు కొట్టారు.

అసలు రాష్ట్ర పార్టీలో ఏం జరుగుతోందో తమకెవరికీ తెలియడం లేదని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర పార్టీ అంటే తానొక్కడినే అన్న భావంతో సోము వ్యవహరించడం వల్లనే ఈ పరిస్థితి వచ్చిందని కన్నా ఆగ్రహం వ్యక్తం చేశారు.  అసలు సమస్య అంతా సోము వీర్రాజు వల్లేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోము వీర్రాజు వైఖరి పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ అసంతృప్తి సెగలు హస్తినను కూడా తాకడంతోనే పవన్ కల్యాణ్ కు బీజేపీ హై కమాండ్ నుంచి ఆహ్వానం వచ్చిందని అంటున్నారు.  

By
en-us Political News

  
తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఏబీ వెంకటేశ్వరరావు తమిళనాడులో ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలను.. ముఖ్యంగా విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ సాధించిన విజయాలను ఏబీ వెంకటేశ్వరరావు ఆసక్తికరంగా విశ్లేషించారు. ఎవరూ ఊహించని మార్పులు రాజకీయాల్లో సంభవిస్తాయని, ప్రజలు మార్పును కోరుకున్నప్పుడు అసాధ్యం సుసాధ్యం అవుతుందని అన్నారు.
టీవీకే నేత ఆదవ అర్జునకు, వీసీకే అధినేత తిరుమావళవన్ స్వయంగా మద్దతు లేఖను అందజేశారు. ఈ కీలక పరిణామంతో అసెంబ్లీలో టీవీకే కూటమి సంఖ్యా బలం ఇప్పుడు 118కి చేరింది.
అధికారులు సచివాలయంలోని ఏసీ గదులలో కూర్చుని పని చేసే విధానానికి స్వస్థి చెప్పారు. అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో ప్రసంగిస్తూ.. పౌరుల ఫిర్యాదులను నేరుగా క్షేత్రస్థాయిలో పరిష్కరించడానికి అధికారులు తమ కార్యాలయాలను విడిచిపెట్టి ప్రజల వద్దకు వెళ్లాలని ఆదేశించారు.
సువేందు అధికారి రాజకీయ నేపథ్యాన్ని పరిశీలిస్తే.. కాంగ్రెస్ సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన సువేందు, రాజకీయ ఓనమాలు అక్కడే నేర్చుకున్నారు. ఆయన తాత కెనరామ్ అధికారి స్వాతంత్ర్య సమరయోధుడు కాగా, తండ్రి శిశిర్ అధికారి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా రాణించారు. సువేందు అధికారి మమతా బెనర్జీ స్థాపించిన తృణమూల్ కాంగ్రెస్‌లో చేరి ఆ పార్టీలో కీలక నేతగా ఎదిగారు.
కరీంనగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై జరిగిన దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకత్వం బంద్ పిలుపునిచ్చిన నేపథ్యంలో . శనివారం ( మే 9) ఉదయం నుండే నగరంలోని ప్రధాన కూడళ్లలో పోలీసులు భారీగా మోహరించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నిరసనలో పాల్గొనకుండా పోలీసులు ఆయన ఇంటి వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీనిపై బీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ముఖ్యంగా పార్టీలో అభిషేక్ బెనర్జీ పెత్తనం పెరగడం వల్లే సువేందు అధికారి వంటి బలమైన నేతలు టీఎంసీని వీడారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పట్టున్న నాయకులను కాదని, కార్పొరేట్ తరహా రాజకీయాలకు అభిషేక్ బెనర్జీ ప్రాధాన్యత ఇవ్వడం తృణమూల్‌కు ప్రతికూలంగా మారిందంటున్నారు.
ఆంధ్రోళ్లను తిట్టి ఓట్లు దండుకున్న బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రాజెక్టుల పేరుతో దోపిడీకి పాల్పడిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుత ఎన్నికల ఫలితాలు కేరళలో పెను మార్పులకు నాంది పలికాయి. యూడీఎఫ్ స్పష్టమైన మెజారిటీ సాధించడంతో.. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై కసరత్తు జరుగుతోంది. కేసీ వేణుగోపాల్ అనుభవం, రాహుల్ గాంధీతో ఉన్న సాన్నిహిత్యం ఆయనకు ప్రధాన బలంగా మారాయి.
టీవీకే అధినేత విజయ్‌కు కాంగ్రెస్ మద్దతు తెలపడంపై ఆగ్రహంగా ఉన్న డీఎంకే.. కాంగ్రెస్‌కు కటీఫ్ చెప్పేసింది. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, లోక్‌సభలో తమ పార్టీ సభ్యులకు కాంగ్రెస్ ఎంపీలతో కాకుండా విడిగా సీటింగ్ కేటాయించాలని డీఎంకే ఎంపీ కనిమొళి స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
తాజా సమాచారం ప్రకారం.. విజయ్ తన పార్టీకి ఉన్న బలానికి తోడుగా మరో మూడు పార్టీల మద్దతును కూడగట్టుకున్నారు. ఆ పార్టీల మద్దతుతో అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118ని ఆయన సాధించారు.
తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవ్వగా.. మెజారిటీ నిరూపణ విషయంలో రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కచ్చితమైన నిబంధనలు పాటించాలని పట్టుబడుతున్నారు. విజయ్ కు తన పార్టీ ఎమ్మెల్యేలు 107 మందికి అదనంగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది.
పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనకు ముందే తెలుసని, నాయకత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు. అయితే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి.. క్షేత్రస్థాయిలో కేడర్‌ను కాపాడుకుంటూ వచ్చిన తనకు ఈ పరిణామం మనస్తాపానికి గురిచేసిందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు.
బాబు కూటమిని ఎందుకంత విలువైన‌దిగా భావిస్తున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూట‌మి ఎప్పుడెప్పుడు చీలిపోతుందాని కాచుకుని కూర్చుని ఉంది. ఏ అవ‌కాశం వ‌చ్చినా వారు వ‌దిలిపెట్టినట్టే క‌నిపించ‌దు. మొన్న కోట వినుత ఘ‌ట‌న‌, నిన్న అర‌వ శ్రీధ‌ర్ వ్య‌వ‌హారం, ఇవాళ వ‌ర్మ ఇష్యూ.. ఇలా స‌మ‌యం దొరికిన‌పుడ‌ల్లా ఆయా అంశాల‌ను బాగా హైలెట్ చేసి.. కూట‌మిలో ఏదో ఒక చిచ్చు రాజేయాల‌ని చూస్తోంది వైసీపీ అధినాయ‌క‌త్వం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.