ఆంద్రప్రదేశ్ లొ బిజెపి రూట్ మ్యాప్ మారినట్టు కనిపిస్తుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నడవాల్సిన బిజెపి రూట్లో చిరు స్పీడ్ బ్రేకర్ నిలిచింది. అసలు బిజెపి ఏపీలో తానే మార్గ సూచి అని ఇంత కాలం చెప్పుకుంటూ వస్తున్న పవన్ కల్యాణ్ కు చిరు రూపంలో కమలం పార్టీ చెక్ పెట్టింది. చడీ చప్పుడూ లేకుండా మెగా స్టార్ ను తీసుకువచ్చి తెరముందు నిలిపింది.
రాజకీయాల నుంచి తెర మరుగై పోయి వెండి తెరపై వెలుగొందితే చాలని అనుకుంటున్న చిరంజీవిని భీమవరంలో అల్లూరి సభకు ఆహ్వానించి మోడీతో వేదికపై కూర్చో పెట్టడం ద్వారా రాష్ట్రంలో కొత్త రాజకీయ చర్చకు తెరలేచింది. రాష్ట్రంలో బీజేపీ, జనసేన చెట్టా పట్టాలు వేసుకుని నడుస్తున్నాయని అంతా భావిస్తున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన, అందునా ప్రధాని మోడీ హాజరైన కార్యక్రమానికి జనసేనానికి కనీసం ఆహ్వానం కూడా పంపకుండా అవమానించడమే కాకుండా... ఆయన సోదరుడిని ప్రత్యేకంగా ఆహ్వానించి మోడీతో వేదికపై కూర్చోబెట్టి రాచమర్యాదలు చేయడం చూస్తుంటే.. ఇక పవన్ కల్యాణ్..కమలం పార్టీల మధ్య సఖ్యత చెడినట్లేనని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు.
అదే సమయంలో ఇంత కాలం రహస్య మైత్రిగా సాగుతూ వచ్చిన బీజేపీ, వైసీపీ బంధం ఇకపై బహిరంగమేనని కూడా సూత్రీకరిస్తున్నారు. చిరంజీవిని అల్లూరి విగ్రహావిష్కరణకు ఆహ్వానించి ప్రత్యేక గౌరవం ఇవ్వడానికి స్కెచ్ చాలా కాలం కిందటే మొదలై ఇప్పటికి తెరమీదకు వచ్చిందని విశ్లేషకులు అంటున్నారు. సినిమా టికెట్ల వ్యవహారంలో ఒక వైపు జనసేనాని సినిమా భీమ్లానాయక్ కు నష్టం వాటిల్లే విధంగా చర్యలు తీసుకుంటూనే.. ఆ సినిమాను మినహాయించి మిగిలిన సినిమాల విడుదల సమయానికి టికెట్ల రేట్ల పెంపునకు అనుమతిచ్చేందుకు జరిపిన చర్చలలో చిరంజీవి పాల్గొన్న సమయంలోనే ఆయనను రాజకీయ రంగ ప్రవేశానికి సిద్ధం చేయడం మొదలైందని పరిశీలకులు అంటున్నారు.
ఇప్పటికి అది ఒక రూపుదాల్చిందనీ, చిరంజీవి కమలం గూటికి చేరడం, ఏపీలో ఆ పార్టీ తరఫున క్రియాశీలంగా పని చేయడం దాదాపు ఖరారైందని చెబుతున్నారు. మొత్తం మీద ఇంత కాలం బీజేపీ పవన్ తొ మైండ్ గేమ్ ఆడుతూ వచ్చిందనీ, మిత్ర పక్షం అంటూ జనసేనతో కలిసి నడుస్తున్నట్లు కనిపిస్తూ అధికార వైసీపీకి అన్ని విధాలుగా అండగా నిలిచిందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఇక వైసీపీతో మైత్రిని బహిర్గతం చేయడం, జనసేనానికి గుడ్ బై చెప్పడం లాంఛనమే అని అంటున్నారు.
అయితే ఏపీ బీజేపీలోనే చిరంజీవి విషయంలో అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయని కమలం శ్రేణులు అంటున్నాయి. గతంలో ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి పదవులు పొంది.. ఆ పదవీ కాలం పూర్తవ్యగానే సినిమాలే నా ప్రపంచం అంటూ వెళ్లిపోయిన చిరంజీవిని దగ్గరకు తీయడం వల్ల బీజేపీ ఇమేజ్ దెబ్బతింటుందని వారు అంటున్నారు. ఏది ఏమైనా జనసేన బీజేపీ మైత్రికి రోజులు దగ్గపడ్డాయన్నది మాత్రం ఖాయమైనట్లేనని రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/bjp-focuses-chiranjeevi-as-speed-breaker-to-pawan-39-139100.html
కరీంనగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై జరిగిన దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకత్వం బంద్ పిలుపునిచ్చిన నేపథ్యంలో . శనివారం ( మే 9) ఉదయం నుండే నగరంలోని ప్రధాన కూడళ్లలో పోలీసులు భారీగా మోహరించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నిరసనలో పాల్గొనకుండా పోలీసులు ఆయన ఇంటి వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీనిపై బీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ముఖ్యంగా పార్టీలో అభిషేక్ బెనర్జీ పెత్తనం పెరగడం వల్లే సువేందు అధికారి వంటి బలమైన నేతలు టీఎంసీని వీడారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పట్టున్న నాయకులను కాదని, కార్పొరేట్ తరహా రాజకీయాలకు అభిషేక్ బెనర్జీ ప్రాధాన్యత ఇవ్వడం తృణమూల్కు ప్రతికూలంగా మారిందంటున్నారు.
ఆంధ్రోళ్లను తిట్టి ఓట్లు దండుకున్న బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రాజెక్టుల పేరుతో దోపిడీకి పాల్పడిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుత ఎన్నికల ఫలితాలు కేరళలో పెను మార్పులకు నాంది పలికాయి. యూడీఎఫ్ స్పష్టమైన మెజారిటీ సాధించడంతో.. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై కసరత్తు జరుగుతోంది. కేసీ వేణుగోపాల్ అనుభవం, రాహుల్ గాంధీతో ఉన్న సాన్నిహిత్యం ఆయనకు ప్రధాన బలంగా మారాయి.
టీవీకే అధినేత విజయ్కు కాంగ్రెస్ మద్దతు తెలపడంపై ఆగ్రహంగా ఉన్న డీఎంకే.. కాంగ్రెస్కు కటీఫ్ చెప్పేసింది. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, లోక్సభలో తమ పార్టీ సభ్యులకు కాంగ్రెస్ ఎంపీలతో కాకుండా విడిగా సీటింగ్ కేటాయించాలని డీఎంకే ఎంపీ కనిమొళి స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
తాజా సమాచారం ప్రకారం.. విజయ్ తన పార్టీకి ఉన్న బలానికి తోడుగా మరో మూడు పార్టీల మద్దతును కూడగట్టుకున్నారు. ఆ పార్టీల మద్దతుతో అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118ని ఆయన సాధించారు.
తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవ్వగా.. మెజారిటీ నిరూపణ విషయంలో రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కచ్చితమైన నిబంధనలు పాటించాలని పట్టుబడుతున్నారు. విజయ్ కు తన పార్టీ ఎమ్మెల్యేలు 107 మందికి అదనంగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది.
పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనకు ముందే తెలుసని, నాయకత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు. అయితే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి.. క్షేత్రస్థాయిలో కేడర్ను కాపాడుకుంటూ వచ్చిన తనకు ఈ పరిణామం మనస్తాపానికి గురిచేసిందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు.
బాబు కూటమిని ఎందుకంత విలువైనదిగా భావిస్తున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూటమి ఎప్పుడెప్పుడు చీలిపోతుందాని కాచుకుని కూర్చుని ఉంది. ఏ అవకాశం వచ్చినా వారు వదిలిపెట్టినట్టే కనిపించదు. మొన్న కోట వినుత ఘటన, నిన్న అరవ శ్రీధర్ వ్యవహారం, ఇవాళ వర్మ ఇష్యూ.. ఇలా సమయం దొరికినపుడల్లా ఆయా అంశాలను బాగా హైలెట్ చేసి.. కూటమిలో ఏదో ఒక చిచ్చు రాజేయాలని చూస్తోంది వైసీపీ అధినాయకత్వం.
అతి కొద్ది మంది నేతలు జగన్ ప్రకటనను సమర్దిస్తూ.. అనుకూల ప్రకటనలు చేస్తుండగా.. మెజారిటీ లీడర్, క్యాడర్ మాత్రం జగన్ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
టీవీకే అధినేత విజయ్తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.