జై తెలుగుదేశం నినాదం.. కమలదళానికి బలం...!

Publish Date:Nov 5, 2024

Advertisement

ఆంధ్రప్రదేశ్ లో  బీజేపీకి సొంత బలం లేదు. ఆ విషయం ఇప్పటికే ఎన్నోసార్లు సందేహాలకు అతీతంగా రుజువైంది. ఆ పార్టీ తెలుగుదేశం పార్టీతో  కలిసి ఉన్నప్పుడు మాత్రమే ఎమ్మెల్యేలను, ఎంపీలను గెలిపించుకోగలిగింది. జాతీయ పార్టీగా తన బలానికి మించిన సీట్లను కూడా బేరమాడి సాధించుకోగలిగింది. అలా పొత్తు లేకుండా ఎన్నికలకు వెళ్లిన ప్రతి సారీ ఆ పార్టీ స్కోర్ బిగ్ జీరోయే. అందుకే ఇప్పుడు బీజేపీ రాష్ట్రంలో తెలుగుదేశం బలమే తన బలం అనుకుని సర్దుకు పోతున్నట్లు కనిపిస్తోంది. అలవికాని చోట అధికులమనరాదన్న సూక్తిని అక్షరాలా పాటిస్తున్నట్లు కనిపిస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక వర్గంలో రాష్ట్రం నుంచి బీజేపీ కోటా కింద ఒకే ఒక్కరినే నియమించినా బీజేపీ నుంచి ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం కాలేదు. సరికదా అదే మహాప్రసాదం అన్నట్లుగా ఆనందంతో తబ్బిబ్బు అవుతోంది. అసలు రాష్ట్రంలో బీజేపీ స్టేక్ కోరుకోవడం లేదు. తెలుగుదేశం మిత్రపక్షంగా సంసారపక్షంగా సర్దుకు పోవడమే మేలని భావిస్తోంది. దక్షిణాదిలో బలపడాలన్న తన ఆకాంక్ష నెరవేరాలంటే, కేంద్రంలో మోడీ సర్కార్ సజావుగా సాగాలంటే.. ఏపీలో వేలు పెట్టకపోవడమే మేలన్న నిర్ణయానికి వచ్చేసింది.  అయితే బీజేపీ ఈ నిర్ణయానికి రావడానికి వెనుక పదేళ్ల కథ, వ్యథ ఉన్నది. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తరువాత 2014లో జరిగిన ఎన్నికలలో రాష్ట్రంలో తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది. ఆ ఎన్నికలలో తెలుగుదేశం, బీజేపీ కలిసి పోటీ చేయగా, బయట నుంచి జనసేన మద్దతు ఇచ్చింది. ఆ ఎన్నికలలో తెలుగుదేశం, బీజేపీ కూటమి విజయం సాధించి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేశాయి. అలాగే కేంద్రంలో కూడా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ లో తెలుగుదేశం చేరింది.  

అయితే  విభజిత ఆంధ్రప్రదేశ్ ను బీజేపీ తన రాజకీయ ప్రయోగశాలగా మార్చుకుంది. ఒక వైపు రాష్ట్ర ప్రభుత్వంలో భాగంగా ఉండి కూడా విపక్ష పార్టీతో చేతులు కలిపింది. రాష్ట్ర విభజనతో తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రానికి అన్ని విధాలుగా చేయూత నివ్వాల్సిన కేంద్రం స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని దగా చేసింది. విభజన హామీలు నెరవేర్చడం అటుంచి.. రాష్ట్ర ప్రగతికి అడుగడుగునా అడ్డుపడుతూ వచ్చింది. అప్పటి  ప్రతిపక్ష  వైసీపీకి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ.. 2019 ఎన్నికలలో ఆ పార్టీ అధికారంలోకి రావడానికి తన వంతు దోహదం చేసింది. మోడీ సర్కార్ పేరుకే ఎన్డీయే ప్రభుత్వమైనా.. మిత్రపక్షాలను ఏనాడూ లెక్క చేసిన పాపాన పోలేదు. అన్నిటికీ మించి తన చిరకాల మిత్రుడైన తెలుగుదేశం పార్టీ పట్ల ఒక విధమైన కక్ష సాధింపు ధోరణితో వ్యవహరించింది. 

చిరకాల మిత్రుడని ఎందుకు అనాల్సి వచ్చిందంటే.. వాజ్ పేయి హయాంలో తెలుగుదేశం బీజేపీకి అత్యంత విశ్వాస పాత్రమైన మిత్రపక్షం. ఆ పార్టీ అధినేత, అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అత్యంత విశ్వాసపాత్రుడైన మిత్రుడు. వాజ్ పేయి హయాంలో తెలుగుదేశం, బీజేపీల మధ్య పరస్పర గౌరవం, విశ్వాసం మెండుగా ఉండేవి. మిత్ర ధర్మం పాటించే విషయంలో రెండు పార్టీలూ ఒకదానితో ఒకటి పోటీ పడేవి. అయితే అది వాజ్ పేయి హయాం. మోడీ హయాం వచ్చే సరికి ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది.  మోడీ హయాంలో మిత్రపక్షాలను గౌరవం ఇవ్వడం అటుంచి ఏ మాత్రం అవకాశం చిక్కినా వాటిని కబలించడానికి లేదా బలహీన పరచ డానికి వెనుకాడని పరిస్థితి నెలకొంది. 

మరీ ముఖ్యంగా ఒక్క శాతం ఓటు బ్యాంకు కూడా లేని ఆంధ్రప్రదేశ్ లో బలమైన ప్రభుత్వం, దార్శనికత, ప్రజాభిమానం మెండుగా ఉన్న చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండటం బీజేపీకి రుచించలేదు. అందుకే  ఎన్డీయే కూటమి నుంచి తెలుగుదేశం బయటకు వెళ్లే వరకూ నానా రకాలుగా ఇబ్బందులు పెట్టింది. విభజన హామీల మాట అటుంచి రాష్ట్రానికి న్యాయంగా రావలసిన నిధులను కూడా విడుదల చేయకుండా వేధించింది. సరే చివరికి తెలుగుదేశం ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చేసింది.  సరే 2019 ఎన్నికలలో రాష్ట్రంలో ఒంటరిగా పోటీ చేసిన బీజేపీ నోటాతో పోటీ పడి ఓట్లు తెచ్చుకుంది.  అయినా  కేంద్రంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని, రాష్ట్రంలో చక్రం తిప్పేందుకు బీజేపీ ఢిల్లీ పెద్దలు రాష్ట్ర నేతలు పావులు కదిపింది. ఆ ఎన్నికలలో తెలుగుదేశం కూడా పరాజయం పాలై విపక్షానికి పరిమితమైంది. ఆర్థిక  కేసులలో నిండా మునిగి ఉన్న వైసీపీ అధినేత జగన్ పార్టీ వైసీపీ విజయం సాధించి అధికార పగ్గాలు అందుకుంది. దీంతో బీజేపీ జగన్ ను గుప్పిట ఉంచుకుని తెలుగుదేశం పార్టీని బలహీన పరచడమే ధ్యేయంగా పావులు కదిపింది.  అందులో  భాగంగానే, బీజేపీ జాతీయ నాయకత్వం  ఓ వంక ముఖ్యమంత్రి జగన్ రెడ్డిని కేసుల నుంచి రక్షిస్తూ మరో వంక వైసేపీ సర్కార్  బుజం మీద తుపాకీ పెట్టి టీడీపీని బలహీనం చేసే కుట్రలు చేసింది. లేదా ఆ కుట్రలకు వత్తాసు పలికింది.  

అయితే 2024 ఎన్నికల నాటికి బీజేపీకి వాస్తవం బోధపడింది. వైసీపీ అరాచక అస్తవ్యస్థ పాలన పట్ల ప్రజాగ్రహాన్ని గ్రహించి తెలుగుదేశంతో జట్టు కట్టింది. ఎన్నికలలో తెలుగుదేశం కూటమి ఘన విజయం సాధించింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రజలు ఏకపక్షంగా తెలుగుదేశం కూటమికి పట్టం గట్టారు. దీంతో తత్వం బోధపడిన బీజేపీ రాష్ట్రంలో సొంతంగా బలోపేతం అన్న అంశాన్ని పక్కన పెట్టేసి, తెలుగుదేశం మద్దతుతో కేంద్రంలో అధికారాన్ని పదిలపరుచుకుంటే చాలన్నట్లు వ్యవహరిస్తున్నది. 

By
en-us Political News

  
ఆ రోజు సభలో ఓ మంత్రి తనపై చెయ్యి చేసుకున్నారని పేర్కొన్నారు. మరో మంత్రి ఏకవచనంతో తిట్టిపోశారు, కులం పేరుతో దూషిస్తూ తన పుట్టుకను నిందించారన్నారు. శాసనమండలిలో తన సిబ్బందినీ దగ్గరికి రాకుండా వైసీపీ సభ్యులు అడ్డుపడ్డారని, తన చుట్టూ చేరి బెదిరింపులు, ప్రలోభాలతో రకరకాలుగా ఇబ్బంది పెట్టారన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలకు 5 కోట్ల మంది ప్రజల తరఫున కృతజ్ణతలు తెలిపారు. దేశం మొత్తానిది ఒక దారైతే... తమదో దారి అన్నట్లు వైసీపీ వ్యవహరించిందని దుయ్యబట్టారు. రాష్ట్రం, దేశం నాశనమైనా పర్వాలేదు.. మాకు స్వార్థ రాజకీయమే ముఖ్యమన్నట్లుగా వైసీపీ వ్యవహరించిందని విమర్శించారు.
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ సంస్కృతి ఒక పెను సవాలుగా మారింది. ఇటీవలి కాలంలో రాజకీయ నాయకులు, ప్రముఖుల పేర్లు డ్రగ్స్ కేసుల్లో వినిపిస్తుండటం సమాజంలో తీవ్రసంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. వాస్తవ వేదిక చర్చలో డోలేంద్ర ప్రసాద్, కంఠంనేని రవిశంకర్ లు ఇది కేవలం శాంతిభద్రతల సమస్య మాత్రమే కాదనీ, సమాజ భవిష్యత్తుకు పెనుముప్పుగా పరిణమించిన ఒక సామాజిక రుగ్మత అని పేర్కొన్నారు.
ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో విజయ్ రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే జననాయగన్‌ సినీమా విడుదలపై నెలకొన్న అనిశ్చితిని ఆయన ప్రజల ముందు ఉంచారు. అలాగే.. కరూర్ ప్రాంతంలో చోటుచేసుకున్న విషాద ఘటనను ప్రస్తావిస్తూ.. అది యాధృచ్ఛికంగా జరిగింది కాదని, దాని వెనుక కూడా లోతైన కుట్ర దాగి ఉందన్న అనుమానాలున్నాయన్నారు.
నిజానికి తాను రాజ‌కీయ స‌న్యాసం చేసిన‌ట్టు చెబుతూనే ఉన్నా.. ఇప్ప‌టికీ ఆయ‌న‌ త‌న టీం ద్వారా అకౌంట్ స‌ర్వీసెస్ అందిస్తూనే ఉన్నారు. ఆపై జ‌గ‌న్ కి లోపాయికారిగా సహకరించేందుకే ఈ రాజీనామా డ్రామాల‌ని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. బేసిగ్గా విజ‌య‌సాయిరెడ్డి కామెంట్ చేయాల్సింది ఏదైనా ఉందంటే.. ఇటీవ‌ల జ‌గ‌న్ అర్ధంప‌ర్దం లేకుండా చేసిన మావిగ‌న్ అనే ప్ర‌తిపాద‌న‌ మీదే. కానీ రేణుక చౌద‌రి స‌భ‌లో లేవ‌నెత్తిన క‌మ్మ‌రావ‌తిని ప‌ట్టుకుని.. పోస్టులు పెట్ట‌డం స‌రికాద‌ంటున్నారు.
రాజ్యసభలో అమరావతి చట్టబద్ధత బిల్లుకు కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, టీఎంసీ, ఆప్, బీజేడీ, ఆర్జేడీ, బీఆర్ఎస్, జేడీ(యూ), శివసేన మద్దతు ఇచ్చాయి. రాజ్యసభలో అమరావతి చట్టబద్ధతపై జరిగిన చర్చలో 11 పార్టీలు పాల్గొన్నాయి.
గురువారం సాయంత్రం రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు జరుపుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పిలుపునిచ్చారు. ఇక 2015లో దేశంలోని వివిధ పుణ్యక్షేత్రాల నుంచి తెచ్చిన పవిత్ర జలాలు, మట్టిని ఉంచిన ఉద్దండరాయునిపాలెంలో పర్యటించి, రాజధాని సంకల్పంలో పాల్గొన్నారు.
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ఈ బిల్లును రాజ్యసభలో సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఏపీ రాజధాని విషయంలో ఉన్న చట్టపరమైన అస్పష్టతను తొలగించేందుకు ఈ సవరణ అత్యవసరమని పేర్కొన్నారు. బిల్లుపై జరిగిన చర్చ అనంతరం, సభాపతి సి.పి. రాధాకృష్ణన్ క్లాజ్ వారీగా ఓటింగ్‌ నిర్వహించగా సభ్యులు అనుకూలంగా ఓటు వేశారు. దీంతో అమరావతిని రాజధానిగా ఖరారు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయానికి రాజ్యసభ ఆమోదం లభించింది.
. తాము అమరావతిని వ్యతిరేకించడం లేదనీ, అయితే రాజధాని పేరుతో సాగుతున్న పరిణామాలు, ఆర్థిక భారాలనే ప్రశ్నిస్తున్నామన్నారు. రైతుల నుంచి భూములు సేకరించి ఇన్నాళ్లు గడుస్తున్నా ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదని ఆయన విమర్శించారు.
అమరావతికి చట్టబద్ధత అమరావతి రైతుల నైతిక విజయంగా అభివర్ణించారు. సుదీర్ఘకాలం పాటు మొక్కవోని దీక్షతో రైతులు చేసిన పోరాటం వల్లే ఇది సాధ్యమైందన్నారు. రాజధాని ఉద్యమ సమయంలో పాలకులు ప్రయోగించిన అణచివేత చర్యలను ఈ సందర్భంగా రేణుకా చౌదరి గుర్తు చేశారు.
సీఎం హోదాలో నాడు అమరావతి శాసన రాజధాని , విశాఖ పరిపాలన రాజధాని , కర్నూలు న్యాయ రాజధాని అంటూ ఓ కొత్త వాదనను తెరమీదకు తీసుకువచ్చారు. ఆ దిశగా ఒక్కటంటే ఒక్క అడుగు పడకపోయినా.. అప్పటి వరకూ పరుగెడుతున్న అమరావతి నిర్మాణ పనులను నిలిపివేశారు.
దేశంలో ఉన్న అన్ని పార్టీల‌ను ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం వైపు నిలిపి అమ‌రావ‌తి బిల్లుకు చ‌ట్ట‌బ‌ద్ధ‌త క‌ల్పించిన ప్ర‌ధాని న‌రేంద్ర మోదీని పార్ల‌మెంటు హాలులో గురువారం ఉదయం క‌లిసిన లోకేష్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల త‌ర‌ఫున కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు.
వైసీపీ నేతలు అవగాహన లేకుండా ప్లాట్లు, ఖర్చులంటూ అవగాహనా రాహిత్యంతో వ్యాఖ్యలు చేస్తూ తమ అజ్ణానాన్ని చాటుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.