వినోద్ కు ఈడీ నోటీసులు.. బీజేపీ, బీఆర్ఎస్ రహస్య మైత్రికి నిదర్శనమేనా?

Publish Date:Dec 31, 2023

Advertisement

బీజేపీ  బీఆర్ఎస్ బంధం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల అనంతరం కూడా కొనసాగుతోందా? లోక్ సభ ఎన్నికలకు కూడా కాంగ్రెస్ లక్ష్యంగా ఆ రెండు పార్టీలూ కలిసే పని చేస్తున్నాయా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హిందుత్వ ఎజెండా ఎత్తుకోవడం, రాహుల్ గాంధీపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ హిందూ వ్యతిరేకి అంటూ విమర్శలు చేయడం చూస్తుంటే.. లోక్ సభ ఎన్నికలలో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా తెలంగాణలో బీఆర్ఎస్ బీజేపీలు తమ రహస్య మైత్రిని కొనసాగిస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఇక బీజేపీ అధిష్ఠానం కూడా ఎన్నికలలో అంచనాల మేరకు రాణించలేకపోవడానికి    బీఆర్ఎస్ తో రహస్య బంధం ఉందని ప్రజలు నమ్మడమే కారణమని తెలిసినా.. ఆ బంధాన్ని కొనసాగించడానికే నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది. 

అందుకే ఢిల్లీ మద్యం కుంభకోణంలో పీకల్లోతు ఇరుక్కున్న బీఆర్ఎస్ అధినేత తనయ, ఎమ్మెల్సీ కవితను కాకుండా.. కాంగ్రెస్ నేతలను టార్గెట్ చేసుకుని కేంద్ర దర్యాప్తు సంస్థలు దాడులకు పాల్పడుతున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  కేంద్రంలోని మోడీ సర్కార్ తన ప్రత్యర్థులను, ప్రత్యర్థి పార్టీ నేతలను వేధించేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలను ఇష్టారీతిగా ఉపయోగిస్తున్నదన్న విమర్శలు చాలా కాలంగా ఉన్నాయి. సరిగ్గా ఎన్నికల ముందు విపక్ష పార్టీలను ఇబ్బందులలోకి నెట్టే లక్ష్యంతోనే కేంద్ర దర్యాప్తు సంస్థలు పని చేస్తున్నాయన్న ఆరోపణలకు కూడా ఉన్నాయి. ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఆప్ సీనియర్ నాయకుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను అరెస్టు చేసిన ఈడీ, కవిత విషయంలో మాత్రం ఆ పని చేయలేదు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ ఈ అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావించిన సంగతి తెలిసిందే. సరే అది పక్కన పెడితే ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల ముంగిట.. తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ లక్ష్యంగా ఈడీ, ఐటీలు దాడులు సోదాలు నిర్వహిస్తుండడానికి బీజేపీ, బీఆర్ఎస్ రహస్య మైత్రే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

తాజాగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్ సి ఏ) మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్ నేత వినోద్ ను విచారించిన ఈడీ ఆయనక నోటీసులు జారీ చేసింది.    ఉప్పల్ స్టేడియం నిర్మాణంలో 20 కోట్ల రూపాయల  అవకతవకలపై దర్యాప్తు లో భాగంగా శనివారం (డిసెంబర్ 30)  తెల్లవారు జామున హెచ్ సి ఏ మాజీ అధ్యక్షుడు వినోద్  ను ఈడీ అధికారులు విచారించారు.

 మాజీ క్రికెటర్లు అర్షద్, అయూబ్, శివలాల్ యాదవ్ లను కూడా ఈడీ  ప్రశ్నించింది. హెచ్ సి ఏ మాజీ  అధ్యక్షుడు, చెన్నూర్ మాజీ  ఎమ్మెల్యే గడ్డం వినోద్ కు   నోటీసులు జారి చేసింది. జనవరి మొదటి వారంలో హాజరు కావాలని  పేర్కొంది.
 వాస్తవానికి హెచ్ సీఏ అధ్యక్షుడిగా వినోద్ ఉన్న కాలంలో జరిగిన ఉప్పల్ స్టేడియం నిర్మాణంలో అవినీతి కేసు నేటిది కాదు. కానీ సరిగ్గా లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఈడీ కాంగ్రెస్ నేతకు నోటీసులు జారీ చేయడం వెనుక బీజేపీ ఉందన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి.  

ఈ సందర్భంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు  చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థిగా   వివేక్ వెంకటస్వామికి టికెట్ ఖరారైన వెంటనే ఆయన నివాసంపై  ఐటీ దాడులు జరగడాన్ని పరిశీలకులు ప్రస్తావిస్తున్నారు.  ఓటమి భయంతోనే అధికార బీఆర్ఎస్ తో కుమ్మక్కై బీజేపీ ఈ దాడులు చేయిస్తోందని అప్పట్లోనే కాంగ్రెస్ ఆరోఫణలు చేసిన విషయం తెలిసిందే. సరిగ్గా ఎన్నికల సమయంలోనే బీజేపీ వ్యతిరేకులపై కేంద్ర దర్యాప్తు సంస్థల దృష్టి పెట్టడం రాజకీయ వేధింపులు వినా మరోటి కాదని అంటున్నారు.

By
en-us Political News

  
ఢిల్లీ, పంజాబ్ ప్రభుత్వాలపై అవినీతి ఆరోపణలు వ‌స్తుండ‌టంతో ఈ టాపిక్ డైవ‌ర్ష‌న్ డ్రామాను ఆప్ తెర‌పైకి తెచ్చింద‌ని అంటారు రాఘ‌వ్ చ‌ద్దా. ఇది కేవలం చద్దా వ్యక్తిగత నిర్ణయం కాదు, ఒక పెద్ద రాజకీయ వ్యూహం. రాజ్యసభలో ఆప్ కి ఉన్న 10 మంది ఎంపీల్లో ఏడుగురు.. అంటే 2/3 వంతు బీజేపీలో చేరడానికి సిద్ధమయ్యారు. ఇందులో ఉన్న కీలక వ్యక్తులు.. రాఘ‌వ్ చ‌ద్దా, సందీప్ పాఠ‌క్, అశోక్ మిట్ట‌ల్, మాజీ క్రికెట‌ర్ హర్భజన్ సింగ్, స్వాతి మలివాల్, రాజేంద్ర గుప్తా, విక్రమ్ సాహ్ని ఉన్నారు.
పార్టీ పేరు తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్)గా ప్రకటించారు. రాష్ట్రంలోని అట్టడుగు వర్గాల సంక్షేమం, సామాజిక సమానత్వమే ధ్యేయంగా ఈ పార్టీ పనిచేస్తుందని కవిత ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
ఉద్యోగం అడిగిన యువకుడికి చంద్రబాబు ఆటో ఇస్తానని చెప్పినట్లుగా రెండు వేర్వేరు సందర్భాలను కలిపి ఎడిట్ చేశారు. ఉద్యోగం అడిగితే ఆటోతో సరిపెట్టుకోమన్నారనే అర్థం వచ్చేలా ఈ వీడియోను సృష్టించి వైరల్ చేస్తున్నారు. ఈ అంశంపై స్పందించిన మంత్రి లోకేశ్ వైసీపీ తన పాత అలవాట్లను మానుకోవడం లేదనీ.. బురదజల్లే రాజకీయాలే పరమావధిగా పెట్టుకుందని దుయ్యబట్టారు.
జాతీయ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.
గత ఎన్నికలకు ముందు వైనాట్ 175 అంటూ ధీమా వ్యక్తం చేసిన వైసీపీ అధినేత జగన్.. ఇప్పుడు ఎట్ లీస్ట్ 11 అనాల్సిన పరిస్థితి వచ్చేలా ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు ప్రజల మధ్యకు రాకపోవడం, ప్రజాసమస్యలను పట్టించుకోకపోవడం, అన్నిటికీ మించి అసెంబ్లీకి గైర్హాజర్ కావడం వంటి అంశాలు పార్టీని జనాలను దూరం చేస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఏమాట‌కామాట నాదెండ్ల‌, ల‌క్ష్మీపార్వ‌తి ఎన్టీఆర్ జీవితాన్ని మ‌లుపు తిప్పిన వారే.
కార‌ణం విజ‌య్ టీవీకే పార్టీ పెట్టి ఆ పార్టీని ప్ర‌స్తుతం ఎన్నిక‌ల ప‌రీక్ష‌కు నిల‌ప‌డంతో.. ఇతర న‌టుల పార్టీలు, అవి తొలి సారి ఎన్నిక‌ల్లో పాల్గొన్న‌పుడు సాధించిన ఓట్ల శాతం ఎంత‌? అన్న ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ‌కు తెర‌లేచింది.
ప‌సుపు ఒక మ‌హిళ‌కు ఎంత ముఖ్య‌మో తెలిసిందే. ఆపై నీలం అంటే ద‌ళిత సందేశం ఇస్తుంది. ఇక పోతే ఆకుప‌చ్చ అంటే అది భార‌త జెండాలో ఒక భాగం. ముస్లీం మైనార్టీల‌ను ఏకం చేసేది. కాబ‌ట్టి క‌విత జెండా రంగుల్లో ఇవి ప్ర‌ముఖంగా ఉండొచ్చ‌ని తెలుస్తోంది. దీంతో క‌విత ప్ర‌క‌టించ‌బోయే పార్టీ జెండా రంగులు, గుర్తు ఆల్రెడీ సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నారు.
బెంగాల్ ఎన్నికల చరిత్రను పరిశీలిస్తే, ఓటింగ్ శాతం క్రమంగా పెరుగుతూ వస్తోంది. 1969లో కేవలం 70 శాతంగా ఉన్న ఓటింగ్, 1987 నాటికి 78 శాతానికి చేరింది. ఆ తర్వాత 1996లో 80 శాతం, 2011లో 84 శాతంగా నమోదైంది. గత 2021 ఎన్నికల్లో 82 శాతానికి పరిమితమైన ఓటింగ్.. ఇప్పుడు 2026లో ఏకంగా 92 శాతాన్ని దాటి సరికొత్త రికార్డును సృష్టించింది.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు జగిత్యాల వేదికగా జరిగిన సభ తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
రాజకీయ చరిత్రను పరిశీలిస్తే నాదెండ్ల భాస్కరరావుకు, చంద్రబాబు నాయుడుకు మధ్య సుదీర్ఘమైన రాజకీయ వైరం ఉంది. 1984లో ఎన్టీఆర్ అమెరికా వెళ్లిన సమయంలో జరిగిన రాజకీయ పరిణామాలు, ఆపై నాదెండ్ల ముఖ్యమంత్రి కావడం వంటి సంఘటనలు తెలుగు రాజకీయాల్లో ఒక కీలక మలుపు. ఆ సమయంలో ఎన్టీఆర్‌ను తిరిగి అధికారంలోకి తీసుకురావడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారు.
న్టీఆర్ అమెరికాలో గుండె ఆపరేషన్ చేయించుకుని తిరిగి వచ్చేలోపు, నాదెండ్ల భాస్కరరావు కాంగ్రెస్ మద్దతుతో ముఖ్యమంత్రి అయ్యారు. ఆ క్లిష్ట సమయంలో తెలుగుదేశం పార్టీ చెల్లాచెదురు కాకుండా, ఎమ్మెల్యేలను ఏకం చేయడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారు. పార్టీని కాపాడిన రక్షకుడి ఇమేజ్ ఆయనకు అప్పుడే వచ్చింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.