రాజ్యసభ సభ్యుల్లో బిలియనీర్లు.. టాప్ ఎవరో తెలుసా?
Publish Date:Jun 25, 2026
Advertisement
రాజ్యసభలో ప్రజాప్రతినిధుల ఆస్తుల వివరాలను అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) నివేదిక తాజాగా విడుదల చేసింది. రాజ్యసభ సభ్యులలో అత్యధికులు కుబేరులేనని ఆ నివేదిక పేర్కొంది. మొత్తం 233 మంది రాజ్యసభ సభ్యులకు గాను, 226 మంది ఎంపీలు సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ల ఆధారంగా ఏడీఆర్ ఈ నివేదికను రూపొందించింది. ఈ నివేదిక మేరకు.. 226 మంది ప్రజాప్రతినిధుల మొత్తం ఆస్తుల విలువ అక్షరాలా 26 వేల 47 కోట్ల రూపాయలుగా తేలింది. దీని ప్రకారం లెక్కగడితే, సభలోని ఒక్కో రాజ్యసభ ఎంపీ సగటు ఆస్తి విలువ 15 కోట్లకు పైమాటే. మొత్తం సభ్యులలో 31 మంది ఎంపీలు అంటే దాదాపు 14 శాతం మంది ప్రజాప్రతినిధులు 100 కోట్లకు పైగా వ్యక్తిగత ఆస్తుల ఉన్నవారే. అలాగే దాదాసే 100 మంది ఎంపీల ఆస్తుల విలువ 10 కోట్లకు పైగా ఉండగా.. 41 మందికి .5 కోట్ల నుంచి 0 కోట్ల మధ్య, 66 మంది సభ్యులకు 1 కోటి నుండి రూ.5 కోట్ల మధ్య స్థిర, చర ఆస్తులు ఉన్నాయి. దీనికి భిన్నంగా కేవలం నలుగురు ఎంపీలు మాత్రమే తమ మొత్తం ఆస్తి రూ.20 లక్షల లోపు ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్ ద్వారా తేలిందని ఏడీఆర్ నివేదిక బయటపెట్టింది. రాజ్యసభ సభ్యుల కుబేరుల జాబితాలో అగ్రస్థానంలో.. బీఆర్ఎస్ ఎంపీ బండి పార్థసారథి రూ.5,300 కోట్లకు పైగా ఆస్తులతో దేశంలోనే అత్యంత సంపన్న రాజ్యసభ సభ్యుడిగా నిలిచారు. ఇక ఈ నివేదికలో 69 మంది ఎంపీలపై వివిధ క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నట్లు ఏడీఆర్ పేర్కొంది. వీరిలో 36 మంది సభ్యులు ఐదేళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం కఠిన జైలు శిక్ష పడే అవకాశం ఉన్న అత్యంత తీవ్రమైన నేరారోపణలను ఎదుర్కొంటున్నారని వివరించింది. వీరిలో.. ఒక ఎంపీపై ఏకంగా హత్య కేసు, మరో నలుగురిపై హత్యాప్రయత్నం కేసులు ఉన్నాయి. నలుగురు ఎంపీలపై మహిళలపై దాడులు, నేరాలకు సంబంధించిన కేసులు ఉన్నాయి.కాగా తెలుగు రాష్ట్రాలలో తెలుగుదేశం పార్టీకి చెందిన నలుగురు ఎంపీలలో ముగ్గురిపై, బీఆర్ఎస్ కి చెందిన ముగ్గురు ఎంపీలపై కేసులు ఉన్నాయి.
http://www.teluguone.com/news/content/billionaires-among-rajya-sabha-members-36-224079.html





