Publish Date:Nov 20, 2024
అగ్రరాజ్యం అమెరికా ఎన్నికల ఫలితం మూడో ప్రపంచ యుద్ధానికి తెరలేపిందా? అమెరికా అధ్యక్ష ఎన్నికలలో ట్రంప్ విజయాన్ని జీర్ణించుకోలేని బైడెన్.. ప్రపంచ యుద్ధానికి తెరలేపే నిర్ణయం తీసుకున్నారా? అంటే ప్రపంచ దేశాల మేధావులు అవుననే అంటున్నారు. బైడెన్ ఓటమి ఉక్రోషంతో తీసుకున్నా, వయస్సు రిత్యా వివేకం, వివేచనా కోల్పోయి తీసుకున్నా.. ఆయన నిర్ణయం ప్రపంచాన్ని మూడో ప్రపంచ యుద్ధం ముంగిట నిలిపింది. ఇంతకీ బైడెన్ ఏం చేశారంటే.. అమెరికా ఇచ్చిన క్షిపణులను ఉక్రెయిన్ రష్యాపై ప్రయోగించడానికి అనుమతి ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో పుతిన్... అణ్వాయుధాలను యుద్ధంలో ఉపయోగించడానికి అనుమతి ఇస్తూ ఉత్తర్వ్యులు ఇచ్చేశారు. దీంతో ప్రపంచం అంతటా యుద్ధ మేఘాలు అలుముకున్నాయి. ఉక్రెయిన్ కు ఆయుధాలు సరఫరా చేసే ఏ దేశంపైనైనా దాడులు చేస్తామని పుతిన్ గతంలోనే హెచ్చరించిన సంగతి తెలిసిదే. ఆ సమయంలోనే ఆయన అణు దాడికి కూడా వెనుకాడబోమని విస్ఫష్టంగా చెప్పారు.
ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు బైడెన్ అధికారం నుంచి దిగిపోవడానికి సరిగ్గా రెండు నెలల ముందు తమ దేశం సరఫరా చేసిన క్షిపణులను రష్యాపై ప్రయోగించడానికి ఉక్రెయిన్ కు అనుమతి ఇచ్చేశారు. దీంతో మండిపడిన పుతిన్ అణ్వాయుధాల వినియోగానికి తమ సైన్యానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. వాస్తవానికి ట్రంప్ ఎన్నికలలో గెలవడానికి ప్రధాన కారణం తాను అధికారంలోకి వస్తే రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేస్తానని ఇచ్చిన హామీయే అని చెప్పడానికి సందేహించాల్సిన అవసరం లేదు. పుతిన్, ట్రంప్ ల మధ్య సత్సంబంధాలు ఉన్నాయి. దీంతో అమెరికన్లు ఆయన అధికార పగ్గాలు చేపడితే రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపగలరని నమ్మారు. అదే సమయంలో ట్రంప్ కు ప్రత్యర్థిగా అమెరికా ఎన్నికలలో పోటీ చేసిన బైడెన్ విధానాల కారణంగానే ఓటమి పాలయ్యారు. బైడెన్ అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టిన నాటి నుంచీ ఇజ్రాయెల్ కు మద్దతుగా నిలిచారు. పరోక్షంగా పాలస్తీనా, ఇజ్రాయెల్ మధ్య యుద్ధాన్ని ప్రోత్సహించారు.
ఈ నేపథ్యంలోనే ప్రపంచానికి పెద్దన్నగా తనకు తాను చెప్పుకునే అమెరికా ఉక్రెయిన్ కు తన క్షిపణుల వినియోగానికి అనుమతించడం ద్వారా రష్యాను ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టిందని ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ అధికార పగ్గాలు చేపట్టేంత వరకూ రష్యా, ఉక్రెయిన్ల మధ్య ఉద్రిక్తతలు, పరస్పర దాడులు పెచ్చరిల్లకుండా ఇరు దేశాలు నియంత్రణ పాటించాలని ప్రపంచ దేశాలు కోరుతున్నాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/biden-provoke-putin-39-188698.html
ఎలాగైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలని అధికార డీఎంకే, బీజేపీతో పొత్తు ఉపయోగించుకుని రాష్ట్రంలో అధికారపగ్గాలు చేజిక్కించుకోవాలని ప్రతిపక్ష అన్నాడీఎంకే వ్యూహాలు రచిస్తున్నాయి. ఇక రాజకీయ పార్టీ స్థాపించి సినీ రంగం నుంచి రాజకీయరంగంలోకి దూకిన హీరో విజయ్ తన టివీకే పార్టీ తరఫున ఒంటరిగా ఎన్నికల రణరంగంలోకి దిగనున్నారు.
రండవాణేలోని కల్మాడీ హౌస్లో ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. ఆ తరువాత సాయంత్రం మూడున్నర గంటలకు పుణెలోని వైకుంఠ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ఫోన్ ట్యాపింగ్ ఎక్విపిమెంట్ కొనుగోలుకు అవసరమైన డబ్బును సమకూర్చింది నవీన్ రావే అని సిట్ విచారణలో తేలింది. అంతే కాకుండా, పాల్ రవి కుమార్ ద్వారా ట్యాపింగ్ ఎక్విపిమెంట్ను సమకూర్చినట్లు సిట్ నిర్ధారణకు వచ్చింది. పోన్ ట్యాపింగ్ కు ఒక ప్రైవేటు వ్యవహారంగా కాకుండా అది వ్యవస్థీకృతంగా పని చేసిందని నవీన్ రావు విచారణలో బయటపడినట్లు తెలుస్తోంది.
ఈ కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ను సుప్రీం ధర్మాసనం డిస్మిస్ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు.
రద్దు చేసిన కమిటీల స్థానంలో నెల రోజుల పాటు ఉండేలా అడ్ హాక్ కమిటీలను నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కమిటీలు రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించి అందజేసే నివేదిక ఆధారంగా కొత్త కమిటీలను ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత మరోసారి హరీష్ రావుపై హాట్ కామెంట్స్ చేశారు.
కొత్త సంవత్సరం చేతినిండా, నోటి నిండా పని పెట్టనుంది. ఎందుకంటే ఈ ఏడాది పలు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలన్నీతమతమ వ్యూహాలు, ఎత్తుగడలకు పని చెప్పనున్నాయి. పెద్ద రాష్ట్రాలుగా ఉన్న పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల అసెంబ్లీలకు 2026 తొలి అర్ధ భాగంలోనే ఎన్నికలు జరగనున్నాయి.
అందె శ్రీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందనీ, ఇందుకోసం చట్టపరమైన మద్దతు అవసరమని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో 1994పబ్లిక్ సర్వీస్ కమిషన్ చట్టంలోని నిబంధనలు సవరించాల్సి ఉందని తెలిపారు. అందె శ్రీ కుమారుడికి ఉద్యోగ అవకాశం కల్పించడం కోసం చేసిన సవరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టామన్నారు.
దేశంలో మోడీ పాలన అంతమవ్వాలంటే.. పొరుగు దేశాలైన శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్లలో జరిగిన ఉద్యమాల వంటివి ఇక్కడ కూడా రావాలని ఆయన అన్నారు.
ఏపీలో వైసీపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ రాష్ట్రంలో ప్రజలు తమకు ఇవ్వని ప్రతిపక్ష హోదా కోసం వైసీపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేస్తే.. తెలంగాణలో ప్రతిపక్ష హోదాలో ఉన్న బీఆర్ఎస్ అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యులను దీటుగా ఎదుర్కోవడంలో వైఫల్యం కారణంగా బాయ్ కాట్ చేస్తున్నదన్న చర్చ జరుగుతోంంది.
ఇంత కాలం కల్వకుంట్ల కవిత తన విమర్శలను హరీష్ రావు, సంతోష్, జగదీశ్వరరెడ్డి వంటి నాయకులకే పరిమితం చేసిన కవిత ఇప్పుడు బీఆర్ఎస్ అధినాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు, సవాళ్లు సంధిస్తున్నారు.
తాజా చిట్ చాట్ లో ఆమె తన తండ్రి కేసీఆర్ నే నేరుగా నిలదీశారు. కేసీఆర్ అసెంబ్లీకి డుమ్మా కొడితే రాష్ట్రంలో బీఆర్ఎస్ ఇక ఖతమేనన్నారు. అయినా ఎటువంటి తప్పూ చేయకపోతే కేసీఆర్ సభకు ఎందుకు రావడం లేదని నిలదీశారు.
గత కొంత కాలంగా తన స్వంత కుమారుడు, కుమార్తెల మధ్య పంచాయతీని పరిష్కరించే విషయంలో విఫలమైన ఆయన ఇప్పుడు తెలుగు రాష్ట్రాల మధ్య జలపంచాయతీలు, కాంగ్రెస్, బీజేపీలపై విమర్శలు గుప్పిస్తున్నారని ఎద్దేవా చేశారు. రానున్న రోజులలో బీఆర్ఎస్ కనుమరుగైపోవడం ఖాయమని తాను భావిస్తున్నట్లు చెప్పారు.
స్థానిక ఎమ్మెల్యే భరత్ రెడ్డి అనుచరుడు సతీష్ రెడ్డి గాలి జనార్ధన్ రెడ్డిపై రెండు రౌండ్లు కాల్పులు జరపగా, ప్రతిగా గాలి జనార్దన్ రెడ్డి అనుచరులు కూడా ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో కాంగ్రెస్ కార్యకర్త రాజశేఖర్ మరణించాడు.