Publish Date:Nov 20, 2024
అగ్రరాజ్యం అమెరికా ఎన్నికల ఫలితం మూడో ప్రపంచ యుద్ధానికి తెరలేపిందా? అమెరికా అధ్యక్ష ఎన్నికలలో ట్రంప్ విజయాన్ని జీర్ణించుకోలేని బైడెన్.. ప్రపంచ యుద్ధానికి తెరలేపే నిర్ణయం తీసుకున్నారా? అంటే ప్రపంచ దేశాల మేధావులు అవుననే అంటున్నారు. బైడెన్ ఓటమి ఉక్రోషంతో తీసుకున్నా, వయస్సు రిత్యా వివేకం, వివేచనా కోల్పోయి తీసుకున్నా.. ఆయన నిర్ణయం ప్రపంచాన్ని మూడో ప్రపంచ యుద్ధం ముంగిట నిలిపింది. ఇంతకీ బైడెన్ ఏం చేశారంటే.. అమెరికా ఇచ్చిన క్షిపణులను ఉక్రెయిన్ రష్యాపై ప్రయోగించడానికి అనుమతి ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో పుతిన్... అణ్వాయుధాలను యుద్ధంలో ఉపయోగించడానికి అనుమతి ఇస్తూ ఉత్తర్వ్యులు ఇచ్చేశారు. దీంతో ప్రపంచం అంతటా యుద్ధ మేఘాలు అలుముకున్నాయి. ఉక్రెయిన్ కు ఆయుధాలు సరఫరా చేసే ఏ దేశంపైనైనా దాడులు చేస్తామని పుతిన్ గతంలోనే హెచ్చరించిన సంగతి తెలిసిదే. ఆ సమయంలోనే ఆయన అణు దాడికి కూడా వెనుకాడబోమని విస్ఫష్టంగా చెప్పారు.
ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు బైడెన్ అధికారం నుంచి దిగిపోవడానికి సరిగ్గా రెండు నెలల ముందు తమ దేశం సరఫరా చేసిన క్షిపణులను రష్యాపై ప్రయోగించడానికి ఉక్రెయిన్ కు అనుమతి ఇచ్చేశారు. దీంతో మండిపడిన పుతిన్ అణ్వాయుధాల వినియోగానికి తమ సైన్యానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. వాస్తవానికి ట్రంప్ ఎన్నికలలో గెలవడానికి ప్రధాన కారణం తాను అధికారంలోకి వస్తే రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేస్తానని ఇచ్చిన హామీయే అని చెప్పడానికి సందేహించాల్సిన అవసరం లేదు. పుతిన్, ట్రంప్ ల మధ్య సత్సంబంధాలు ఉన్నాయి. దీంతో అమెరికన్లు ఆయన అధికార పగ్గాలు చేపడితే రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపగలరని నమ్మారు. అదే సమయంలో ట్రంప్ కు ప్రత్యర్థిగా అమెరికా ఎన్నికలలో పోటీ చేసిన బైడెన్ విధానాల కారణంగానే ఓటమి పాలయ్యారు. బైడెన్ అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టిన నాటి నుంచీ ఇజ్రాయెల్ కు మద్దతుగా నిలిచారు. పరోక్షంగా పాలస్తీనా, ఇజ్రాయెల్ మధ్య యుద్ధాన్ని ప్రోత్సహించారు.
ఈ నేపథ్యంలోనే ప్రపంచానికి పెద్దన్నగా తనకు తాను చెప్పుకునే అమెరికా ఉక్రెయిన్ కు తన క్షిపణుల వినియోగానికి అనుమతించడం ద్వారా రష్యాను ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టిందని ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ అధికార పగ్గాలు చేపట్టేంత వరకూ రష్యా, ఉక్రెయిన్ల మధ్య ఉద్రిక్తతలు, పరస్పర దాడులు పెచ్చరిల్లకుండా ఇరు దేశాలు నియంత్రణ పాటించాలని ప్రపంచ దేశాలు కోరుతున్నాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/biden-provoke-putin-39-188698.html
ఇరు రాష్ట్రాల మధ్యా జలవివాదాలు ఉండకూడదన్న లక్ష్యంతోనే నాడు కాంగ్రెస్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి పచ్చ జెండా ఊపిందన్న రేవంత్ రెడ్డి, రాజకీయాలకు అతీతంగా నీటి వివాదాలను ఇరు రాష్ట్రాలూ పరిష్కరించుకోవాలన్నారు.
వాస్తవాలకు ఎలాంటి ముసుగులూ తగిలించకుండా ఉన్నది ఉన్నట్లు, కుండబద్దలు కొట్టినట్లుగా సమాజం తీరు తెన్నులను, రాజకీయ నాయకుల మధ్య నెక్సస్ ను, అధికారులు బాధ్యతారాహిత్యం, జవాబుదారీతనం లేని తనాన్ని కళ్లకు కట్టిన వాస్తవ ‘వేదిక’ తెలుగువన్ యూట్యూబ్ చానెల్ లో గురువారం ప్రసారమైంది.
ఇటీవల అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు హాజరైన ప్రతిపక్ష నేత కేసీఆర్ వద్దకు సీఎం స్వయంగా వెళ్లి అభివాదం చేయడం, క్షేమ సమాచారాలు తెలుసుకోవడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇక ఎన్టీఆర్ రాజకీయ రంగప్రవేశం ఒక సంచలనం, ఒక ప్రభంజనం. తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం 9 నెలలలో అధికారంలోకి వచ్చి నభూతో నభవిష్యత్ అన్న రికార్డు సృష్ఠించారు. అప్పటికి మూడున్నర దశాబ్దాలకు పైగా ఆంధ్రప్రదేశ్ లో సాగుతున్న కాంగ్రెస్ ఏకచ్ఛత్రాధిపత్యానికి తెరదించారు.
ప్రజాధనం దుబారాను నియంత్రించాల్సిన బ్యూరోకాట్లు, అఖిల భారత సర్వీసు అధికారులైన ఐఏఎస్ లు ఆ దిశగా ఎటువంటి ప్రయత్నం చేయకుండా కేవలం ప్రేక్షక పాత్ర వహిస్తూ.. ఏలిన వారు అంటే అధికారంలో ఉన్న వారి అడుగులకు మడుగులొత్తుతూ.. ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టేయడం అధికార దుర్వినియోగమే ఔతుందన్నారు.
మెజారిటీ ఉందికదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామంటే అంగీకరించేది లేదన్నారు. మోడీ సర్కార్ పేదల పట్ల కక్ష సాధింపుధోరణితో వ్యవహరిస్తోందనీ, అందుకే మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నీరుగారుస్తోందనీ విమర్శించారు.
సీమ లిఫ్ట్ పై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు, తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సీమకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారనీ, తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి సీమ లిఫ్ట్ పై చేసిన వ్యాఖ్యల ఆధారంగా చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.
రాష్ట్రంలోని ఇండియా పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ-ప్యాక్) ప్రధాన కార్యాలయాంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు నిర్వహించడం కలకలం రేపింది. కాగా ఈడీ దాడులపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆయన పుట్టిన రోజు సందర్భంగా బహిరంగంగా జంతువులను వధించినందుకు రాష్ట్ర వ్యాప్తంగా పలువురు వైసీపీ కార్యకర్తలపై జంతు హింస చట్టం కింద కేసులు నమోదైన సంగతి విదితమే. ఇప్పుడు జగన్ తాజాగా ఈ కేసులు ఎదుర్కొంటున్న తన పార్టీ మద్దతుదారులకు పార్టీ లీగల్ సెల్ అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఈ నెల 16న పోలింగ్ స్టేషన్ల వివరాలతోపాటు ఫొటోతో కూడిన ఓటర్ల తుది జాబితాను ఆయా వార్డుల్లోని పోలింగ్ స్టేషన్ల వారీగా ప్రచురించాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే జనాభా ప్రాతిపదికన వార్డులు, డివిజన్లు, ఆయా మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల రిజర్వేషన్లను ఖరారు చేయనున్నట్లు తెలిపారు.
తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు సవాల్ విసిరారు
ప్రజాసమస్యలపై అధికారులతో చర్చిస్తారు. క్షేత్ర స్థాయిలో పరిశీలన కూడా చేస్తారు.
ఆయన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో శుక్రవారం జరగనున్న సంక్రాంతి సంబరాల్లో పవన్ కల్యాణ్ స్థానికులతో కలిసి పాల్గొంటారు.
ఈ భేటీలో చంద్రబాబు అమరావతి చట్టబద్దత, పోలవరం, బడ్జెట్ కేటాయింపులు, ఉపాధి హామీ పథకంలో వెసలుబాటు వంటి పలు అంశాలను ప్రస్తావించారు. వాటితో బాటుగా కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో టీడీపీకి ఒక బెర్తు సైతం డిమాండ్ చేశారు.