Publish Date:Aug 27, 2025
భూమన ఐఏఎస్ శ్రీలక్ష్మి గురించి మాట్లాడుతూ.. ఆమె ఒక తాటకి, పూతన, లంకిణి.. ఆధునిక రజియా సుల్తానా అంటూ మండి పడ్డారు. మనకు తాటకి తెలుసు, రామాయణంలో కనిపిస్తుందీ పాత్ర. ఇక పూతన అంటే భాగవతంలో వస్తుంది. లంకిణి కూడా రామాయణ పాత్రే. రజియా సుల్తానా ఎవరనే దగ్గర అందరి ఆలోచనలు ఆగిపోతున్నాయ్.
ఒక వేళ అదే నిజమైతే.. రజియా సుల్తానా ఢిల్లీ సుల్తానేట్- మొదటి మహిళా పాలకురాలిగా చెప్పాల్సి వస్తుందని అంటారు. ఆమె 1236 నుంచి 1240 వరకూ ఢిల్లీని పాలించారు. ఆమె మహిళ అయినా ఆనాటి స్థితిగతులను తనకు అనువుగా మార్చుకుని, పురుషాధిక్యతను అధిగమించి.. సింహాసనం అధిరోహించి.. సైన్యాన్ని నడిపించి, రాజ్య వ్యవహారాలు చూసుకున్న ఏకైక డేరింగ్ డ్యాషింగ్ డైనమిక్ లేడీ లీడర్ గా చెబుతుంది ఆమె బయోగ్రఫీ.
ఆమె ఎలాంటి దుస్తులు లేకుండా.. బహిరంగ ప్రదేశాల్లో గుర్రాలపై, ఏనుగులపై సవారీ చేసేదని అంటారు. సైనికులతో కలసి యుద్ధరంగంలో పోరాడేదని చెబుతుంది చరిత్ర. అంతే కాదు.. ఆమె పేరిట పలు సైనిక విజయాలు కూడా లిఖించబడ్డాయి. ఆమె తన రాజ్యానికి చెందిన సొంత నాణేలపై సుల్తానాగా తన పేరు లిఖింప చేసుకున్నారు. మాములుగా అయితే ఆమె పేరు కేవలం రజియా మాత్రమే. కానీ తనకు తాను ఒక సుల్తాన్ గా ప్రకటించుకున్న ధీరోదాత్తగా పేరు.
ఇదంతా ఇలా ఉంటే.. ఒకప్పుడు కలెక్టర్ శ్రీలక్ష్మి అంటే అదో నేమ్ అండ్ ఫేమ్. అప్పట్లో ఆమె నెల్లూరు కలెక్టర్ గా పని చేస్తున్నపుడు ఎందరో ఆడపిల్లలకు ఐఏఎస్ అనే ఒకానొక పదం తమ పేరు తర్వాత తగిలించుకోవడం ఒక ప్యాషన్ గా మార్చుకున్నారంటే అతిశయోక్తి కాదు. అలాంటి శ్రీలక్ష్మి వైయస్ హయాంలో.. భారీ ఎత్తున అవినీతికి పాల్పడ్డారనే చెడ్డ పేరు మూట కట్టుకున్నారు. ఒక సమయంలో ఆమె చేత చేయించుకోవాల్సిన సంతకాలు అన్నీ చేయించుకుని.. ఇప్పుడామెను తాటకి, పూతన, అభినవ రజియా అంటూ లేని పోని మారు పేర్లను తగిలించడం.. ఏమనుకోవాలన్నది చాలా మంది వేస్తున్న ప్రశ్న.
ఒకప్పుడు సీపీఐ నారాయణ వంటి వారి చేత అందాల రాణిగా అభినందనలు అందుకున్న శ్రీలక్ష్మి- వైయస్ ఫ్యామిలీతో పెట్టుకున్నందుకు అనారోగ్యం పాలై.. జుట్టు మొత్తం పోగొట్టుకున్నారు. దీంతో ఆమె విగ్గులు వాడే వరకూ వచ్చేశారు. చివరికి ఆమె పరిస్థితి ఎలాంటిదంటే ఎవరి కోసమైతే తాను ఇంత కష్టపడ్డానో... ఆ వర్గం నుంచి కూడా ఇలాంటి చీత్కార సత్కారాలను ఎదుర్కోవడం. ఈ లెక్కన రాజకీయ నాయకుల కోసం వారి స్వలాభ.. స్వార్ధం కోసం పాటుపడే ఉన్నతాధికారుల పరిస్థితి ఏమై పోతుందో చెప్పడానికి ఒక నిలువెత్తు ఉదాహరణగా నిలుస్తున్నారు ఐఏఎస్ శ్రీలక్ష్మి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/bhumana-karunakar-reddy-39-205096.html
కోలీవుడ్లోని మరికొందరు స్టార్స్ రాజకీయాలలోకి అడుగులు వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే స్టార్ హీరో ధనుష్ కూడా రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారు.
రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన విలువలతో కూడిన రాజకీయాలకు నిలువెత్తు రూపంగా నిలిచారు. సొంత ఇల్లు కూడా లేకుండా, ఒక పాత స్కూటర్ మినహా ఎలాంటి ఆస్తులు కూడబెట్టకుండా నిరాడంబరంగా జీవించారు.
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్కతాలోని కాళీఘాట్లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.