భద్రాచలంలో జరుగుతున్న అతిరాత్ర యాగం విశేషాలు
Publish Date:May 1, 2012
.jpg)
Advertisement
వేదకాలంలో ప్రపంచానికి శక్తినిచ్చేది సూర్యుడని మన పూర్వీకులు బలంగా విశ్వసించారు. అటువంటి సూర్యదేవునికి భూమ్మీద ప్రతినిధిగా అగ్నిని భావిస్తారు. అందుకే ఏ యాగం చేసినా అగ్నిదేవునికి "స్వాహా" అంటూ ఆ యాగంలో భాగాన్ని సమర్పిస్తారు. మనం ఇక్కడ అగ్నికి సమర్పించేది సూర్యుడికి చేరుతుందని కూడా వారి ప్రగాఢ విశ్వాసం. ఆ విధంగా మన పూర్వీకులు యజ్ఞాలు, యాగాలు, క్రతువులూ లోక కళ్యాణార్థం జరిపించేవారు. ఈ యాగాలకు అయ్యే ఖర్చుని ఆ యా సమయాల్లో రాజ్యం ఏలుతున్న రాజులు భరించేవారు. తమ రాజ్యం సుభిష్టంగా, సస్యశ్యామలంగా ఉండాలనీ, ప్రజలంతా నీతివంతులుగా సుఖశాంతులతో మనుగడ సాగించాలనీ, ఎటువంటి ప్రకృతి వైపరీత్యాలూ జరుగకూడదనీ వారు ఇటువంటి అనేక యాగాలను నిర్వహించేవారు.
అటువంటి యాగాల్లో "అతిరాత్ర" యాగం ఒకటి...! ఈ అతియాత్ర యాగాన్ని21 ఏప్రిల్ నుండి 2 మే వరకు ఖమ్మం జిల్లాలోని భద్రాచల పుణ్యక్షేత్ర సమీపాన కల ఏటపాక లో కేరళ నుండి వచ్చి ఈ యాగాన్ని తన ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు శ్రీ నంబూద్రి గారు. ఈ రోజు (01-05-2012) అతియాత్ర యాగంలో భాగంగా "పుత్రకామేష్టి "యాగాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి రఘువీరా రెడ్డి అక్కడ పూజల్లో పాల్గొన్నారు. ఈ రోజు ఈ యాగశాల చుట్టూతా గరుడపక్షులు ఆకాశంలో ప్రదక్షణలు చేయటం అక్కడకు విచ్చేసిన భక్తులు ప్రత్యక్షంగా వీక్షించారు. రేపటితో ఈ "అతిరాత్ర" యాగం మొదలై పన్నెండురోజులు పూర్తవుతుంది. ఈ "అతిరాత్ర" యాగం చేయటం వల్ల రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకూ ఎన్నో ప్రయోజనాలు ఒనగూడుతాయని యాగ నిర్వాహకులు శ్రీ నంబూద్రి గారు వివరించారు. ముఖ్యంగా, యాగము పూర్తయిన తర్వాత కుంభ వృష్టి కురుస్తుందని ప్రతీతి. ఇందుకోసమై పలువురు శాస్త్రవేత్తలు యాగము మొదలయిన దగ్గర నుండి యాగశాల వద్దే వుండి వివిధమైన శాస్త్రీయ పరీక్షలు జరుపుతున్నారు. ప్రస్తుతము రాష్ట్రం లో పడుతున్న చెదురుమదురు వానలు కూడా ఈ యాగం వల్లేనని పలువురు అభిప్రాయం వ్యక్తం చేసారు.
http://www.teluguone.com/news/content/bhadrachalam-athirathram-24-13761.html

సుబ్రతో రాయ్ అరెస్ట్ ...

ఖరారైన రాష్ట్రపతి పాలన ...

రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...

విఫలమైన 'టి' కాంగ్రెస్
.jpg)
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
.jpg)
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
.jpg)
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
.jpg)
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
.jpg)
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
.jpg)
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
.jpg)
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
.jpg)
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
.jpg)
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.