బిజెపి నేతకు సమైక్యాంధ్ర సెగ
Publish Date:Oct 26, 2011
Advertisement
విశాఖపట్నం: బిజెపి సీనియర్ నేత బండారు దత్తాత్రేయకు విశాఖపట్నంలో సమైక్యాంధ్ర సెగ తగిలింది. దత్తాత్రేయకు వ్యతిరేకంగా సమైక్యాంధ్ర జెఎసి కార్యకర్తలు ఆందోళనకు దిగారు.బండారు దత్తాత్రేయ దిగిన హోటల్ వద్ద వారు నినాదాలు చేస్తూ ఆందోళన సాగించారు. హోటల్లో దత్తాత్రేయ మీడియా ప్రతినిధుల సమావేశాన్ని అడ్డుకోవడానికి వారు ప్రయత్నించారు. గో బ్యాక్ అంటూ దత్తాత్రేయకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బిజెపి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును బలపరుస్తుండడంతో దత్తాత్రేయకు వ్యతిరేకంగా సమైక్యాంధ్ర జెఎసి ప్రతినిధులు ఆందోళనకు దిగారు.రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలనే డిమాండు సీమాంధ్ర ప్రాంతంలో రోజు రోజుకూ ఉధృతమవుతోంది. విశాఖ జిల్లా శాసనసభ్యుడు ద్రోణంరాజు శ్రీనివాస్ ఇంటిని సమైక్యాంధ్ర విద్యార్థి ఐక్య కార్యాచరణ సమితి నేతలు మంగళవారం ముట్టడించారు.
సమైక్యాంధ్రకు మద్దతుగా కేంద్ర ప్రభుత్వంతో స్పష్టమైన ప్రకటన చేయించాలని వారు డిమాండ్ చేశారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని ముక్కలు చేస్తే సహించేది లేదన్నారు.కాగా సమైక్యాంధ్ర ఐక్య కార్యాచరణ సమితి రాష్ట్రాన్ని సమైక్యాంగానే ఉంచుతామని ప్రకటన చేయాలని కేంద్రానికి నవంబర్ 1వ తేది డెడ్ లైన్ విధించిన విషయం తెలిసిందే. ఐకాస ప్రకటన మేరకు గత నాలుగైదు రోజులుగా సీమాంధ్రలో సమైక్య రాష్ట్రం కోసం ఆందోళనలు జరుగుతున్నాయి. డెడ్ లైన్ లోగా కేంద్రం సమైక్య రాష్ట్రానికి అనుకూలంగా ప్రకటన చేయకుంటే ఆ తర్వాత అసెంబ్లీ ముందు దీక్షకు దిగుతామని హెచ్చరించారు.
http://www.teluguone.com/news/content/bandaru-dathatiya-24-7920.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





