దామచర్ల, బాలినేనికి తెలుగుదేశం, జనసేన సమన్వయ కమిటీ వార్నింగ్.!

Publish Date:Aug 10, 2026

Advertisement

ఒంగోలులో దామచర్ల, బాలినేని వ్యవహారంపై ఇటు తెలుగుదేశం, అటు జనసేన హైకమాండ్ సీరియస్ అయ్యాయి. తెలుగుదేశం హైకమాండ్ దామచర్లకు, జనసేన అధిష్ఠానం బాలినేనికి సీరియస్ గా వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది.  ఒం  మాజీ మంత్రి, జనసేన నాయకుడు   బాలినేని శ్రీనివాసరెడ్డి,   తెలుగుదేశం ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ ల నడుమ గత కొంత కాలంగా విభేదాలు ఉన్నాయి.  తాజాగా ఈ ఇరుురు నేతలూ పరస్పరం అవినీతి ఆరోపణలు, విమర్శలతో ఒకరిపై ఒకరు విరుచుకుపడటం సంచలనం రేపింది.  

ఈ ఇద్దరు కీలక నేతల   వైరం   కూటమి ప్రతిష్టకు భంగం కలిగించేలా మారడంతో తెలుగుదేశం, జనసేన పార్టీలహై కమాండ్ లు  ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్నాయి. పొత్తు ధర్మానికి విరుద్ధంగా, శ్రేణుల్లో అయోమయం సృష్టించేలా వ్యవహరిస్తున్నవీరి వైఖరిపై  అసంతృప్తి వ్యక్తం చేస్తూ రెండు పార్టీల హైకమాండ్ లూ రంగంలోకి దిగాయి.  ఇకపై ఎలాంటి బహిరంగ విమర్శలకు దిగకూడదని, సంయమనం పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని ఇరు నేతలకు అధిష్ఠానాల నుంచి సీరియస్ వార్నింగ్ లు వెళ్లినట్లు విశ్వసనీయంగా తెలిసింది. దామచర్ల, బాలినేని వ్యహార శైలిపై తెలుగుదేశం, జనసేన పార్టీలకు చెందిన ఉమ్మడి సమన్వయ కమిటీ నేతలు  టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు. కూటమి భాగస్వామ్య పక్షాలుగా కలసికట్టుగా ముందుకు సాగాల్సిన సమయంలో, నేతలు ఇలా   పరస్పరం విమర్శలూ, దూషణలతో  రోడ్డెక్కడం ఏమాత్రం సరికాదని కమిటీ పేర్కొంది.   నేతల మధ్య  విబేధాలు, సమస్యలు   ఉంటే వాటిని పార్టీల అంతర్గత వేదికలపై  మాట్లాడటంలేదా,  అధిష్టానం దృష్టి తీసుకురావడం చేయాలే తప్ప..  మీడియా  ఎదుటకు వచ్చి వ్యక్తిగత విమర్శలకు దిగడం కరెక్ట్ కాదనీ, కూటమి ఐక్యతకు ఇది భంగం కలిగిస్తుందనీ కమిటీ దామచర్ల జనార్దన్, బాలినేని శ్రీనివాసరెడ్డిలను తీవ్రంగా మందలించినట్లు తెలుస్తోంది.  ఈ వివాదానికి వెంటనే స్వస్తి పలకాలని,   ఇలాంటి ఘటనలు పునరావృతమైతే సహించేది లేదని  ఇరువురికీ కుండబద్దలు కొట్టినట్లు చెప్పినట్లు తెలుస్తోంది.  

ఇరు వర్గాలు రోడ్డెక్కి బహిరంగంగా విమర్శలు చేసుకోవడం వల్ల ఒంగోలు నియోజకవర్గంలోని తెలుగుదేశం, జనసేన శ్రేణులలో తీవ్ర అయోమయం నెలకొంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన కొత్తలోనే ఇటువంటి వర్గపోరు, ఆధిపత్య పోరాటాలు తెరపైకి రావడం వల్ల క్షేత్రస్థాయిలో పనులు నిలిచిపోవడమే కాకుండా, ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయని రెండు పార్టీల అగ్రనాయకత్వాలు భావించాయి. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలకు ఇది రాజకీయ అస్త్రంగా మారే ప్రమాదం ఉందని ముందే గ్రహించిన హైకమాండ్, ఈ వ్యవహారాన్ని మరింత ముదరకుండా అరికట్టేందుకు తక్షణ చర్యలు చేపట్టింది. కూటమిలో ఏ చిన్నపాటి విభేదాలు వచ్చినా స్థానిక స్థాయిలోనే పరిష్కరించుకోవాలి లేదా సమన్వయ కమిటీల దృష్టికి తీసుకురావాలి తప్ప, మీడియాని వేదికగా చేసుకుని పరస్పర బురదజల్లుడు కార్యక్రమాలు చేపడితే ఎవరినీ విడిచిపెట్టేది లేదని స్పష్టమైన సందేశాన్ని పంపింది.

ఈ పరిణామాల నేపథ్యంలో ఒంగోలు రాజకీయంలో రాబోయే రోజుల్లో ఎలాంటి మార్పులు రానున్నాయనేది ఆసక్తికరంగా మారింది. హైకమాండ్ సీరియస్ హెచ్చరికల తర్వాత బాలినేని శ్రీనివాసరెడ్డి, దామచర్ల జనార్ధన్ తమ విమర్శల దాడిని నిలిపివేసి సంయమనం పాటిస్తారా లేదా అనేది చూడాల్సి ఉంది. పొత్తు ధర్మాన్ని కాపాడుకుంటూ, ఇరువర్గాల కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగడం ఈ ఇద్దరు నేతలకు పెద్ద పరీక్షగా మారనుంది. ఒకవేళ అధిష్టానం ఆదేశాలను తుచ్ఛంగా భావించి మళ్లీ బహిరంగ విమర్శలకు దిగితే, పార్టీల నాయకత్వాలు క్రమశిక్షణా చర్యలు తీసుకునే అవకాశాలు కూడా లేకపోలేదు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన సమయంలో ఇటువంటి అనవసర వివాదాలు పక్కనబెట్టి ఐక్యంగా పనిచేయాలని అధిష్టానం కోరుతోంది.

మొత్తానికి, ఒంగోలులో రగిలిన పొలిటికల్ కాకను చల్లార్చేందుకు తెలుగుదేశం, జనసేన ఉన్నత నాయకత్వాలు తీసుకున్న శీఘ్ర నిర్ణయం కూటమి వర్గాల్లో చర్చనీయాంశమైంది. పాలనలో క్రమశిక్షణ, భాగస్వామ్య పక్షాల మధ్య సయోధ్య ఎంత ముఖ్యమో ఈ హెచ్చరిక ద్వారా స్పష్టమైంది. భవిష్యత్తులో జిల్లా స్థాయిలోనే సమన్వయ కమిటీ సమావేశాలు నిర్వహించి ఇరు వర్గాల మధ్య ఉన్న అపోహలను, ఫిర్యాదులను పరిష్కరించేందుకు ప్రత్యేక ఏర్పాటు చేయాలని నాయకత్వం భావిస్తోంది. నామినేటెడ్ పదవులు, స్థానిక అభివృద్ధి పనుల కేటాయింపుల్లో అందరికీ ప్రాతినిధ్యం కల్పించడం ద్వారా అసంతృప్తిని చల్లార్చేందుకు ప్రణాళికలు రూ పొందిస్తున్నారు. మరి హైకమాండ్ విధించిన గీతను దాటకుండా ఈ ఇద్దరు కీలక నేతలు కలసి పనిచేస్తారా లేదా అనేది రానున్న రోజుల్లో తేలనుంది.

Balineni Srinivasa Reddy,  Damacharla Janardhan, Ongole Alliance Dispute, TDP Jana Sena Warning, Andhra Pradesh Politics, TeluguOne

By
en-us Political News

  
జగన్ సర్కార్ సృష్టించిన భూ వివాదాలను శాశ్వతంగా పరిష్కరిస్తున్నామన్నారు.  క్యూఆర్ కోడ్, బ్లాక్‌చైన్ సాంకేతికత,  కరెన్సీ నోట్ల తరహా సెక్యూరిటీ ఫీచర్లతో రూపొందించిన ట్యాంపర్ ప్రూఫ్ పాసు పుస్తకాలను రైతులకు అందిస్తున్నామన్నారు.
రాజమహేంద్రవరంలో డాక్టర్ ప్రియాంక ఘటన అయినా.. కాశీబుగ్ట సమీపంలో మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకుడు సీదిరి అప్పలరాజు అరవవర్మ హిట్ అండ్ రన్ కేసు అయినా.. రాజకీయంతో సంబంధం లేకుండా ఈ విషయంలో నిర్లక్ష్య డ్రైవంగ్ తో నిండు ప్రాణాన్ని బలి తీసుకున్న ఘటనగానే చూసి నిందితులకు శిక్ష పడాలనే ఎవరైనా కోరుకుంటారు. కానీ జగన్ రెడ్డి రూట్ మాత్రం సపరేట్ గా కనిపిస్తోంది.
గత కొంత కాలంగా ఆయన బీజేపీ గూటికి చేరుతారా, లేదా ఫ్యాన్ పార్టీలోనే చేరి హోం కమింగ్ అంటారా అన్న చర్చ జోరుగా సాగుతోంది.  ఆ మధ్య ఒక సారి తాను సొంత పార్టీ పెడతానంటూ ప్రకటించి సంచలనం సృష్టించిన విజయసాయి.. ఆ తరువాత ఆ విషయంలో ఒక అడుగు కూడా ముందుకు వేయలేదు. అయితే గత రెండు మూడు రోజులుగా.. సోషల్ మీడియాలోనూ, పొలిటికల్ సర్కిల్స్ లోనూ మళ్లీ విజయసాయి కొత్త పార్టీ వార్తలు తెగ హల్ చల్ చేస్తున్నాయి.
వివిధ చేతివృత్తులు, సాంప్రదాయ వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న రజక, నాయిబ్రాహ్మణ, కుమ్మరి, చేనేత, మత్స్యకార, గాండ్ల,  ఇతర వెనుకబడిన కులాలకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఉపాధి పరికరాలను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.
కాలంతో పాటు  రాజకీయ పరిస్థితులు కూడా మారుతుంటాయి. ఒకప్పుడు కొందరిని లక్ష్యంగా చేసుకుని విసిరిన ఈ పదబంధం, ఇప్పుడు మారుతున్న రాజకీయ సమీకరణాల మధ్య ఎవరిని ఉద్దేశించాలన్న చర్చ జోరందుకుంది.  రాజకీయ విశ్లేషకులు ,  మేధావులు ఈ అంశంపై భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
మెగా డీఎస్సీ   ప్రక్రియ ఇప్పటికే పూర్తయ్యింది. , మెగా డీఎస్సీ పట్ల యువతలో బై అండ్ లార్జ్ హర్షం వ్యక్తం అవుతోంది. నియామక ప్రక్రియ పారదర్శకంగా ఉందన్న భావనే సర్వత్రా గట్టిగా వ్యక్త మౌతోంది. డీఎస్సీకి వ్యతిరేకంగా వైసీపీ నిరసనలకు వ్యతిరేకంగా జగన్ ఖిల్లా అయిన కడపలో యువత రోడ్డెక్కారు.
 ఒంగోలు ఎమ్మెల్యే  దామచర్ల జనార్ధన్‌రావు, మాజీ మంత్రి,   జనసేన   సీనియర్ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి విభేదాలు ఇరు పార్టీల మధ్యా రాజకీయ రచ్చకు కారణమైంది.  దామచర్ల, బాలినేని మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు, అలాగే ఆరోపణలు, ప్రత్యారోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి.  
యువ రాజకీయనాయకుడిగా గతంలో ఎదుర్కొన్న విమర్శలను పటాపంచలు చేస్తూ, పరిపాలనా విధానాల్లో సాధించిన పరిణతి, స్పష్టమైన వ్యూహాలతో ఆయన తన రాజీకీయ ఇమేజ్‌ను పూర్తిగా ట్రాన్స్ ఫార్మ్ చేసుకున్నారని ఆ కథనం పేర్కొంంది.
ఉత్తర్ ప్రదేశ్ రాజకీయం మళ్లీ ఒక్కసారిగా తీవ్రస్థాయిలో వేడెక్కింది.
టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో యూనిట్ ఇంఛార్జ్‌లకు నిర్వహించిన శిక్షణా తరగతులకు ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు
2024 ఎన్నికల్లో రాష్ట్రంలో వైసీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుని కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా నోచుకోకుండా కేవలం 11 స్థానాలకే పరిమితమైన సంగతి తెలిసిందే. అయితే ఇదే విషయంలో తాజాగా తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన అంబటి రాంబాబు ఆ ఎన్నికల్లో వైసీపీ 11 స్థానాలకు మాత్రమే పరిమితమైనా 40 శాతం ఓటు షేర్ దక్కించుకుందని చెప్పారు.
దశాబ్దాలుగా పార్టీని నమ్ముకుని ఉన్న సీనియర్ నాయకులను పక్కనపెట్టి, కొత్తగా వచ్చిన వారికి ప్రాధాన్యం ఇవ్వడంపై తమ్ముళ్లలో అసంతృప్తి జ్వాలలు రేగుతున్నాయి. ఈ పరిణామాలు నారా లోకేష్ నాయకత్వ తీరుపై, కూటమి ప్రభుత్వ నిర్ణయాలపై పార్టీలోనే అసంతృప్తి వ్యక్తమౌతోంది.
ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీని అడ్డుకునేందుకు వైసీపీ నేతలు హైకోర్టులో ఏకంగా 300 కోర్టు కేసులు వేయించారని, అయితే ధర్మాసనం వారికి తీవ్రంగా మొట్టికాయలు వేసి బుద్ధి చెప్పిందని గుర్తుచేశారు. నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోవడమే వైకాపా నైజమని మండిపడ్డారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.