ధనవంతులైనా సరే.. ఈ అలవాట్లు మానకపోతే కటిక  పేదవాడిగా మారిపోతాడట.!

Publish Date:Dec 18, 2023

Advertisement

ధనవంతులు, పేదవారు అనే వర్గాలు  ఎప్పుడూ తారుమారవుతూ ఉంటాయి. ఈ రోజు పేదవాడిగా ఉన్నవాడు రేపు ధనవంతుడు కావచ్చు. అలాగే ఈ రోజు ధనవంతుడిగా ఉన్నవాడు రేపు పేదవాడిగా కూడా మారవచ్చు. చిన్న ఉద్యోగాలలో చేరి, వ్యాపారాలు మొదలు పెట్టి ఈ రోజు అపర కుభేరులుగా మారినవారున్నారు. అలాగే ఒకప్పుడు భవంతులలో నివసించి అన్నీ పోగొట్టుకుని పేదలుగా నివసిస్తున్నవారు కూడా ఉన్నారు. అయితే మనిషి తన దగ్గరున్న డబ్బును నిలుపుకోవడం అనేది అతని వ్యక్తిత్వం, అతని అలవాట్లపైనే ఆధారపడి ఉంటుంది. ఆచార్య చాణక్యుడి ప్రకారం కింది అలవాట్లున్నవారు ఎంత ధనవంతులైనా సరే పేదవాడిగా మారడం ఖాయమంటున్నారు.

 అపరిశుభ్రంగా ఉండేవారు..

అపరిశుభ్రంగా మురికి బట్టలతోనూ, ఇల్లంచా అస్తవ్యస్తంగానూ ఉండే వారు ఎప్పటికీ పేదరికంతోనే జీవిస్తారట. దీనికి కారణం డబ్బున్నా బయటకు తీయకపోవడం, దాన్ని అలాగే దాచడం, తనూ సుఖపడక, డబ్బును సరైన అవసరాలకు వినియోగించక పేదవాడిగానే ఉండిపోవడం.

చెడుగా మాట్లాడేవారు

మాటతీరు మంచిగా లేని వ్యక్తులు ఎప్పటికీ డబ్బును  నిలుపుకోలేరు. అబద్దాలు చెప్పడం, చెడుగా మాట్లాడటం చేస్తుంటే ఆ వ్యక్తి ఆర్థిక స్థోమత ఎప్పటికి మెరుగుపడదు. లక్ష్మీదేవి కూడా ఇలాంటి వ్యక్తుల వద్ద ఉండటానికి ఇష్టపడదట.

సూర్యాస్తమయం తరువాత నిద్రపోవడం

చాలామంది సాయంత్రం సూర్యుడు అస్తమించగానే నిద్రపోతుంటారు. అయితే ఈ సమయాన్ని లక్ష్మీదేవికి పవిత్రమైనదిగా భావిస్తారు. అలాంటి సమయంలో నిద్రపోవడం వల్ల లక్ష్మీదేవి ఆ ఇంట్లో నిలవదని అంటారు.

సోమరితనం

సోమరితనం ఉన్నవారు ఏ పనులను సరిగా చేయరు. పనులను వాయిదా వేడయం, ఏవో ఒక సాకులు చెప్పడం,  తప్పించుకోవడం చేస్తుంటారు. ఇలాంటి వ్యక్తులు జీవితంలో ఎదగలేరు. తమ దగ్గరున్న డబ్బును మెల్లిగా కరిగించి చివరికి పేదవాడిగా మారిపోతాడు. తరాలు కూర్చుని తిన్నా తరగనంత ఉంది అని డాంబికాలు పలికేది ఇలాంటి వారే. ఇలాంటి వారు తమ ముందు తరాలను పేదరికంలోకి చాలా సులువుగా నెట్టేస్తారు.

ఖర్చుల విషయంలో జాగ్రత్త లేకుంటే..

డబ్బు సంపాదించడం  ఒక కళ. అయితే ఆ డబ్బును ఎలా ఖర్చుపెట్టాలనేది కూడా కళే. ఆదాయానికి అనుగుణంగా డబ్బు ఖర్చు పెట్టడం, పొదుపుకు కొంత కేటాయించడం, ఎమర్జెన్సీ ఫండ్స్ అరెంజ్ చేసుకోవడం వంటి మనీ మేనేజ్మెంట్ ప్లాన్స్ లేకుండా పేదవాడిగానే ఉండిపోతాడు.

                                       *నిశ్శబ్ద.
 

By
en-us Political News

  
తెలివి లేని వెధవ.. ఇలా ఎవరైనా అంటే వెంటనే కోపం వస్తుంది. చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఫీలవుతారు. మరీ ముఖ్యంగా తాము తెలివైన వాళ్లం అని నిరూపించడానికి ఏదో ఒకటి చేస్తారు.  సమయం సందర్భం...
గణితం ప్రతి వ్యక్తి జీవితంలో చాలా ముఖ్యమైన అంశం. చిన్న పిల్లల నుండి చదువు రాని వారి వరకు ప్రతి ఒక్కరు రోజువారి జీవితంలో గణితాన్ని ఉపయోగిస్తూనే ఉంటారు. కానీ పెద్దవుతున్న కొద్ది చాలామందిలో గణితం అనేది ఒక భయం కింద నాటుకుపోతుంది. కానీ గణితంతో గమ్మత్తులు చేసి ప్రపంచ చరిత్రలో భారతదేశానికి ప్రత్యేక స్థానం సంపాదించి పెట్టిన గణిత మేథావి, శాస్త్రజ్ఞుడు శ్రీనివాస రామానుజన్. శ్రీనివాస రామానుజ్ డిసెంబర్ 22వ తేదీన జన్మించారు. ఈ సందర్బంగానే ప్రతి సంవత్సరం డిసెంబర్ 22వ తేదీని జాతీయ గణిత దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. దీని గురించి తెలుసుకుంటే....
ఎన్ని గొడవలు వచ్చినా, ఎన్ని అపార్థాలు ఎదురైనా, ఎంత అరుచుకున్నా.. బంధాలు విడిపోకుండా వాటిని కలిపి ఉంచేది ప్రేమ మాత్రమే.  ప్రేమ లేనప్పుడు అన్ని ఉన్నా ఏమీ లేనట్టే ఉంటుంది...
పెళ్లయ్యాక భార్యభర్తల మద్య గొడవలు అనేవి చాలా సహజం.  చాలా మంది భార్యాభర్తల మధ్య జరిగే గొడవలు ఇంటి గొడవలు అని చెబుతారు. అవి ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే గొడవలే అయినా,  ఇంటికి, కుటుంబానికి సంబంధించినవి అయినా టోటల్ గా ప్రతి భార్యభర్త జంట..
నేటి కాలంలో అమ్మాయిలు అబ్బాయిలతో సహా అన్ని రంగాలలో రాణిస్తున్నారు.  అన్ని పనులు చేయగలుగుతున్నారు. కొన్ని సందర్బాలలో అబ్బాయిల కంటే ధైర్యాన్ని చూపగలుగుతున్నారు. అయినా సరే అమ్మాయిల విషయంలో సమాజం నుండి ఇంటి వరకు ప్రతి చోట ఒక చిన్నతనం కనిపిస్తుంది....
ఉద్యోగం చేస్తున్నాం అయినా సంపాదన సరిపోవడం లేదు.. ఈ మాట చాలామంది చెబుతూ ఉంటారు.  ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలలో అవసరాలు,  ఖర్చు,  కలలు ఎక్కువ.. కానీ సంపాదన మాత్రం అరకొరగానే ఉంటుంది. వచ్చే సంపాదన సరిపోక మెరుగైన సంపాద వచ్చే  ఉద్యోగాల కోసం వెతుకుతూ ఉంటారు.
తల్లిదండ్రులను, తోడబుట్టిన వారిని ఎవరూ ఎంచుకోలేరు.  అవి దేవుడు ఇచ్చే బందాలు.  కానీ ప్రతి వ్యక్తి స్నేహితులను ఎంచుకునే వెసులుబాటు ఉంటుంది. మంచి స్నేహితులు ఉన్న వారి జీవితం చాలా బాగుంటుంది. ముఖ్యంగా క్లిష్ట పరిస్థితులు...
ప్రతి మనిషి వేర్వేరు వ్యక్తిత్వం కలిగి ఉంటాడు.  ఒకే ఇంట్లో, ఒకే తల్లి కడుపున పుట్టిన వ్యక్తులే వేర్వేరు స్వభావాలను కలిగి ఉన్నప్పుడు బయటి వ్యక్తుల స్వభావం ఒకే విదంగా ఉండటం అనేది జరగదు.  అయితే బయట కొందరిని చూస్తే వీళ్లు అచ్చు మనలాగే ఉన్నారే...
ప్రేమ,  భార్యాభర్తల బంధం,  సహజీవనం.. ఏదైనా సరే.. మనసులు ఇచ్చిపుచ్చుకోవడం అనేది కీ పాయింట్ గా ఉంటుంది. నేటికాలంలో బంధాలు చాలా పెళుసుగా మారాయి.  చాలా తొందరగా బ్రేకప్ లు  జరుగుతున్నాయి...
పెళ్లి ప్రపంచంలో ప్రజలందరూ సాగించే ఒక పవిత్రమైన  బంధం. భారతీయులు పెళ్లికి అధిక ప్రాధాన్యత ఇస్తారు.  సాధారణంగా వయసు రాగానే పెళ్లి వయసు వచ్చింది అని అంటుంటారు.  దానికి తగ్గట్టే పెళ్ళిళ్లు చేస్తుంటారు....
గొడవలు లేని భార్యాభర్తల బంధం అంటూ ఉండదు. వాస్తవానికి భార్యాభర్తల మధ్య  జరిగే గొడవలు చాలా వరకు వారి బంధాన్ని మరింత బలంగా మార్చడంలో సహాయపడతాయి.  భార్యాభర్తల మధ్య జరిగే చిన్న చిన్న గొడవలు  ఒకరి మీద ఒకరికి ఉండే ప్రేమను స్పష్టం చేస్తాయి...
అత్తాకోడలు ఇద్దరూ వేరే ఇంట్లో తమ తల్లిదండ్రుల మధ్య గారాభంగా పెరిగి వివాహం పేరుతో ఒక ఇంటిని చేరే వారు.  అయితే ఏ ఇంట్లో చూసినా అత్తాకోడళ్లు అంటే ఒకానొక శత్రుత్వమే కనిపిస్తుంది, వినిపిస్తుంది...
కష్టాలు, సమస్యలు ఎదురైనప్పుడు, ఇతరుల నుండి అన్యాయాన్ని ఎదుర్కుంటున్నప్పుడు, ఇతరుల తప్పులకు తాము నష్టాన్ని  అనుభవిస్తున్నప్పుడు చాలా మంది న్యాయం కోసం న్యాయ స్థానాన్ని ఆశ్రయిస్తారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.