ఇటు నుంచి బాబు.. అటు నుంచి పవన్.. జగన్ ఉక్కిరి బిక్కిరి

Publish Date:Jun 20, 2022

Advertisement

ఓ వంక రాష్ట్రంలో తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్ర నుంచి ప్రారంభించిన జిల్లాల పర్యటనలు సక్సెస్ఫుల్’గా సాగుతున్నాయి. జననీరాజనాలు అందుకుంటూ, చంద్రబాబు ముందుకు సాగుతున్నారు. స్వచ్చందంగా తరలి వస్తున్న జనం వైసీపీ ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్త పరుస్తున్నారు. జగన్మోహన్ రెడ్డికి ‘ఒక్క ఛాన్స్’ ఇచ్చి తప్పు చేశామని, మళ్ళీ ఆ తప్పు చేయబోమని అంటున్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా, ఈసారి ‘మా ఓటు, సైకిల్ గుర్తుకే’ అని ఓపెన్’గా చెపుతున్నారు. చంద్రబాబు  పర్యటనకు ప్రజల నుంచి వస్తున్న అద్భుత స్పందన సహజంగానే  తెలుగు దేశం కార్యకర్తలు, నాయకుల్లో కొత్త ఉత్సాహం నింపుతోందని, గెలుపు మీద విశ్వాసం పెచుతోంది

అందుకే ఇంతకాలం కొంత స్తబ్దుగా ఉన్న కార్యకర్తఃలు, నాయకులు ఇప్పుడు రెట్టించిన ఉత్సాహంతో జనంలోకి వెళుతున్నారు. రైతులు, యువత, ఉద్యోగులు, మహిళలు ఒకరని కాదు, జగన్ రెడ్డి బాదుడుతో విసిగిపోయిన అందరూ,  అన్నివర్గాల ప్రజలు మళ్ళీ చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు,అవుతారన్న విశ్వాసం వ్యక్త  పరుస్తున్నారు.ఆదలా ఉంటే, ఇటు నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కౌలు రైతు భరోసా యాత్ర వైసీపీ నేతలలో వణుకు పుట్టిస్తోంది. పవన్ కళ్యాణ్, కౌలు రైతుల భరోసా’ యాత్రాలో  కౌలు రైతులకు ఆర్థిక సహాయం అందించడంతో పాటుగా జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని పొట్టుపొట్టుగా తూర్పార పడుతున్నారు.

కౌలు రైతులకు ఆర్థిక సహాయం చేయడం రాజకీయ జిమ్మిక్’గా చులకన చేసి చూపే ప్రయత్నం చేస్తున్న వైసీపీ నేతలకు సినిమాటిక్’గా చురకలు అంటిస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి, వైసీపీ నేతలకు ఎక్కడ తగలాలో అక్కడతగిలేలా పదునైన వ్యంగ్య విమర్శనాస్త్రాలు  సంధిస్తున్నారు. సర్కార్’ ను, అధికార పార్టీని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. పవన్ కళ్యాణ్, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రాబు దత్తపుత్రుదంటూ, వైసీపీ నేతల చేస్తున్న  విమర్శలను తిప్పుకోడుతూ, ‘నేను ప్రజల దత్తపుత్రుడినే కానీ, ఇంకెవరి దత్తపుత్రుడినో కాదు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మాత్రం ఖచ్చితంగా సీబీఐ దత్తపుత్రుడే” అంటూ ఘాటుగా చురకలు అంటించారు. 

 అలాగే జగన్ రెడ్డి ప్రభుత్వం నవరత్నాలను ఎరగా వేసి, ప్రజలను అడ్డగోలుగా దోచుకుంటోందని తీవ్ర పదజాలంతో విమర్శించడమే కాకుండా, జనసేన అధికాంలోకి వస్తే, సర్కార్ దోపిడి ఉండదని, భరోసా ఇస్తున్నారు. తాజాగా బాపట్ల జిల్లాలో 80 మంది కౌలు రైతులకు రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించైనా సందర్భంగా పర్చూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవన్‌ కల్యాణ్‌ జగన్ రెడ్డి ప్రభుత్వ నిర్వకాలను, ప్రభుత్వం ప్రజలను ఏ విధంగా దోచుకుంటోంది వివరించారు. జనసేన అధికారంలోకి వస్తే దోపిడిని అరికట్టి  యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు.వైకాపా నాయకులకు లక్ష కోట్లు దోపిడీ చేసే సత్తా ఉంటే,  జనసేనకు 2.5లక్షల ఉద్యోగాలు ఇచ్చే సత్తా  ఉందని అన్నారు.  

జగన్ రెడ్డి పై ఉన్న అవినీతి, అక్రమాస్తుల కేసులను పరోక్షంగా ప్రస్తావిస్తూ, ఆయనకు అధికారంలో కొనసాగే అధికారమే లేదని అన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ యువకులకు ఏదైనా ఉద్యోగం రావాలంటే ఎలాంటి క్రిమినల్‌ కేసులు ఉండకూడదు.కానీ,  క్రిమినల్‌ కేసులు ఉన్న వారు ఎమ్మెల్యేలు ఎలా అవుతున్నారు? ప్రజా ప్రతినిధులకు ఒక రూల్‌.. సామాన్యులకు మరొక రూలా? అంటూ అర్హత లేని వారు రాష్ట్రాన్ని పలిస్తున్నారని ఎద్దేవాచేశారు. 

అదే విధంగా ముఖ్యమంత్రి పదవి తనకు ముఖ్యం కాదని, ముఖ్యమంత్రి కాకపోతే  రాజకీయాల్లోంచి వెనక్కి వెళ్లి పోయేందుకు పార్టీ పెట్టలేదన్నారు. పొత్తుల గురించి మాట్లాడే సమయం కాదు. పొత్తు ప్రజలతోనే, 2009లో ఏం చెప్పానో అదే చేస్తా. ప్రజల కోసం, ప్రత్యేక హోదాకోసం ప్రధానమంత్రితో విభేదించా. వ్యక్తిగతంగా నష్టపోయా. రాజకీయాల్లో ప్రజలు ముందుకెళ్లేలా చేయడమే నా తపన. నాకు ఎలాంటి వ్యక్తిగత స్వార్థం లేదు. దసరా తర్వాత వైకాపా నాయకుల సంగతి చూస్తాం. అప్పటి వరకు మీరేం మాట్లాడినా భరిస్తాం’ అని పవన్‌ కల్యాణ్‌ హెచ్చరించారు. 

ఇలా ఇటు నుంచి చంద్రబాబు, అటు నుంచి పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వంపై సాగిస్తున్న దండయాత్ర ముఖ్యమంత్రికి మింగుడు పడడం లేదు.దీంతో ప్రభుత్వం అడకత్తెరలో పోక చెక్కాలా నలిగిపోతోంది.మరో వంక గడపగడపన ప్రజల నుంచి ఎదురవుతున్న ప్రతిఘటన, ప్రశ్నల వర్షానికి సమాదానం చెప్పలేక ఎమ్మెల్యేలు, మంత్రులు బిక్క ముఖం వేస్తునారు.

అలాగని,వాస్తవ పరిస్థితిని వివరించే ప్రయత్నం చేసినా ముఖ్యమంత్రి వినేందుకు సిద్దంగా లేరు. ఆయన అంతా బాగుంది అనే భ్రమల్లో ఉన్నారు. అదొకటి అలా ఉంటే... చంద్రబాబు, పవన్ కళ్యణ్ కలిసి పోవడం ఖాయమని తేలిపోవడంతో సిట్టింగ్ ఎమ్మెల్యేలు సహా వైసీపీ నేతలు దారులు వెతుక్కుంటున్నారని వైసీపీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేకాదు   ‘అధికారాంతమునందు చూడవలె నయ్యంగారి సౌభాగ్యముల్’ పద్యాన్ని గుర్హ్తు చేసుకుంతూ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పరిస్థితి అక్షరాలా అలాగే ఉందని  అంటున్నారు.

సొంత  పార్టీలోనే పరిస్థితి అలా ఉంటే, ఇక సామాన్య ప్రజల్లో, జగన్ రెడ్డి పలుకుబడి ఏమిటో వేరే చెప్పనక్కరలేదు. ఎన్నికలు ఎప్పుడు వస్తాయా? ఎప్పుడు, ‘ఒక్కచాన్సు’ భారాన్ని దించుకుందామా .. అని జనం ఎదురు చూస్తున్నారు. ఇది జనవాక్యం.

By
en-us Political News

  
తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడు కార్యక్రమాన్ని ఈసారి రెండు రోజుల పాటు వర్చువల్
భారతీయ రాజకీయాల్లో సాధారణంగా కనిపించే శత్రుత్వాలు,
ఈ ప్రాజెక్టు ద్వారా రాయలసీమ ప్రాంతంలో సుమారు 15 వేల‌ నుంచి 20 వేల‌ మంది వ‌ర‌కూ ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఒక‌ అంచనా. అయితే ఈ ప‌రిశ్ర‌మ ఇక్క‌డ స్థాపించ‌డంపై మాజీ మంత్రి పేర్ని నాని చేసిన కామెంట్లు ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.
కాంగ్రెస్ హైకమాండ్ కు, మరీ ముఖ్యంగా గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందిన వీహెచ్ రాజ్యసభకు మూడు పర్యాయాలు ఎంపికయ్యారు. అయితే 2016 తర్వాత ఇంత వరకూ ఆయనకు పార్టీ పరంగా ఎటువంటి పదవీ దక్కలేదు.
కేరళం ప్ర‌జ‌ల‌కు దశాబ్దాలుగా సేవ చేస్తూ, విలువలతో కూడిన‌ రాజకీయాలు చేసే సతీశన్‌కు ఈ పదవి రావడం సముచిత గుర్తింపని రేవంత్ పేర్కొన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం, సమగ్రాభివృద్ధికి మద్దతుగా నిలిచిన కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్‌కు అధికార బాధ్యతలు అప్పగించారని అన్నారు.
ఎల్‌డీఎఫ్ హయాంలో వి.డి.సతీశన్ ప్రతిపక్ష నేతగా ఉన్నారు. క్లిష్ట సమయలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం కోసం ఆయన తీవ్రంగా శ్రమించారు. అంతే కాకుండా కాంగ్రెస్ పార్టీని ప్రతిపక్షం నుంచి అధికార పక్షంలోకి తీసుకు రావడంలో సతీశన్ కీలక పాత్ర పోషించారు. కేరళం కాంగ్రెస్ కేడర్‌లో కూడా ఇదే అభిప్రాయం బలంగా ఉంది. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకున్న అధిష్ఠానం సీఎంగా సతీశన్ ను ఎంపిక చేసింది.
సాధారణంగా ముఖ్యమంత్రులు, మంత్రుల పర్యటనల సమయంలో భద్రతా కారణాల రీత్యా పెద్ద సంఖ్యలో వాహనాలు కాన్వాయ్‌లో ఉంటాయి. అయితే.. దీనివల్ల భారీగా ఇంధన వ్యయం అవ్వడమే కాకుండా.. ట్రాఫిక్ ఇబ్బందులు కూడా తలెత్తుతున్నాయని భావించిన సీఎం, డిప్యూటీ సీఎం.. ఖజానాపై అనవసర భారం పడకూడదనే ఉద్దేశంతో, భద్రతకు విఘాతం కలగకుండానే వాహనాల సంఖ్యను తగ్గించాలని నిర్ణయించారు.
తీవ్రమైన పోక్సో కేసు విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్ మధ్య రహస్య ఒప్పందం కుదిరిందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ఆ కారణంగానే బండి కుమారుడిపై పోక్సో కేసు నీరుగారిపోయిందని ధ్వజమెత్తారు.
హైదరాబాద్‌ను ఏ విధంగా ఐటీ, హెల్త్ హబ్‌గా మార్చానో గుర్తు చేస్తూ.. అమరావతిని అంతకంటే అద్భుతమైన నగరంగా నిర్మిస్తానని చంద్రబాబు చెప్పారు. హైదరాబాద్ గతమైతే, అమరావతి భవిష్యత్తు అని ఆయన వ్యాఖ్యానించారు.
ఇటీవల శస్త్ర చికిత్స చేయించుకుని దాదాపు మూడు వారాల పాటు విధులకు దూరంగా హైదరాబాద్ లో విశ్రాంతి తీసుకున్న ఆయన బుధవారం ఉదయం అమరావతిలోని తన క్యాంపు కార్యాలయానికి చేరుకుని విధుల్లో నిమగ్నమయ్యారు.
ఈ బలపరీక్షలో విజయ్ ప్రభుత్వానికి అనుకూలంగా 144 మంది శాసనసభ్యులు మద్దతు పలకగా.. 22 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. మరో ఐదుగురు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు.
అయితే 2024 ఎన్నికలలో తెలుగుదేశం కూటమి అధికార పగ్గాలు చేపట్టిన నాటి నుంచి అమరావతి నిర్మాణ వేగం పెరిగింది. అయినా వైసీపీ అధినేత మావిగన్ ప్రతిపాదన, అమరావతి పురోగతిని అడుగడుగునా అడ్డుకోవడమే లక్ష్యంగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలు, వ్యవహరిస్తున్న తీరు మాత్రం అమరావతి అనిశ్చితి మేఘాలు పూర్తిగా తొలగిపోకుండా ఉండేందుకు కారణమయ్యాయి.
బండి బగీరథ ఈ కేసు నుంచి పులుకడిగిన ముత్యంలా బయటపడితేనే.. తిరిగి బండి సంజయ్ కు పార్టీలో ప్రాధాన్యత, గుర్తింపు ఉంటాయని అన్యాపదేశంగానే అయినా విస్పష్ట సందేశం ఇచ్చింది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వమైతే.. చట్టం ముందు అంతా సమానమేనని స్పష్టం చేసింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.