Publish Date:May 19, 2023
వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వివేకానందరెడ్డి సీబీఐ విచారణకు మళ్లీ డుమ్మా కొట్టారు. ఈ సారి తన తల్లి ఆరోగ్యం బాలేదంటూ సీబీఐ విచారణకు హాజరు కాలేదు. విచారణకు హాజరు కవాల్సిన సమయంలో ఆయన హైదరాబాద్ నుంచి పులివెందుల బయలుదేరి వెళ్లారు. అంతకు మందు ఈ రోజు సీబీఐ అవినాష్ ను అరెస్టు చేయడం ఖాయమన్న వార్తల నేపథ్యంలో అటు సీబీఐ కార్యాలయం వద్ద, ఇటు హైదరాబాద్ లోని అవినాష్ ఇంటి వద్ద కూడా హై డ్రామా నడిచింది. సీబీఐ కార్యాలయం వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించగా, అవినాష్ నివాసం వద్దకు ఆయన అనుచరులు భారీ సంఖ్యలో చేరుకున్నారు.
సీబీఐ కార్యాలయం వద్ద భారీగా పోలీసులు మోహరించడంతో అవినాష్ అరెస్టు ఖాయమనీ అందుకే భద్రత కట్టుదిట్టం చేశారనీ అంతా భావించారు. మరో వైపు అవినాష్ నివాసం వద్ద ఆయన అనుచరులు పెద్ద ఎత్తున మోహరించారు. నివాసంలో అవినాష్ న్యాయనిపుణులతో చర్చించి తల్లి అనారోగ్యం కారణంగా విచారణకు హాజరు కాలేనన్న సమాచారాన్ని తన న్యాయవాది ద్వారా సీబీఐకి పంపించారని సమాచారం. కాగా అవినాష్ హైదరాబాద్ నుంచి పులివెందులకు బయలు దేరుతున్న సమయంలో ఆయన అనుచరులు అక్కడ ఉన్న మీడియా ప్రతినిథులపై దాడికి పాల్పడ్డారు.
కాగా ఈ నెల 16న కూడా సీబీఐ విచారణకు హాజరు కాకుండా తన నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలకు హాజరు కావాల్సి ఉందని సమాచారం ఇచ్చారు. దీంతో సీబీఐ శుక్రవారం (మే 19)న విచారణకు రావాల్సిందిగా మరో నోటీసు ఇచ్చింది. వాట్సాప్ ద్వారా నోటీసు ఇవ్వడమే కాకుండా అదే నోటీసును పులివెందులలోని ఆయన నివాసంలో డ్రైవర్ కు అందజేసింది.
దీంతో అవినాష్ ఏదో సాకు చెప్పి విచారణకు రాకుండా తప్పించుకోవడాన్ని సీబీఐ సీరియస్ గా తీసుకుందని అందరూ భావించారు. దాంతో 19న అవినాష్ అరెస్టు ఖాయమన్న భావన సర్వత్రా వ్యక్తం అయ్యింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు కూడా తన తల్లి అనారోగ్యం కారణం చెప్పి అవినాష్ సీబీఐ విచారణకు డుమ్మా కొట్టడంతో ఇప్పుడు సీబీఐ ఏం చేస్తుందన్న ఆసక్తి, ఉత్కంఠ సర్వత్రా వ్యక్తం అవుతోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/avinash-skip-cbi-inquiry-39-155576.html
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!