Publish Date:May 22, 2023
వైయస్ వివేకా హత్య కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి.. తన తల్లీ శ్రీలక్ష్మీకి తీవ్ర అనారోగ్యమంటూ... మే 19వ తేదీన కర్నూలులోని విశ్వభారతి ఆసుపత్రిలో చేర్పించారు. అయితే అదే ఆసుపత్రిలో తల్లితో పాటే వైయస్ అవినాష్ రెడ్డి కూడా ఉండడంతో.. సదరు ఆసుపత్రి చుట్టు రాజకీయం వేడిక్కెంది. ఇక మే 22వ తేదీ.. తమ విచారణకు హాజరుకావాలంటూ సీబీఐ నోటీసులు జారీ చేసినా... ప్రస్తుతం తన తల్లీ తీవ్ర అనారోగ్యం దృష్ట్యా ... ప్రస్తుతం తాను విచారణకు రాలేనని.. కొద్ది రోజుల తర్వాత హాజరవుతానంటూ సీబీఐకి ఆయన సందేశం పంపించడం.. అందుకు సీబీఐ ససేమీరా అనడమే కాదు.. ఎట్టి పరిస్థితుల్లోనూ మే 22వ తేదీ అంటే సోమవారం విచారణకు హాజరుకావాలని స్పష్టం చేసింది.
కానీ ఈ హత్య కేసులో వైయస్ అవినాష్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు పట్ల సందేహం వ్యక్తం చేస్తున్న సీబీఐ.. సోమవారం తెల్లవారుజామున.. కర్నూలు జిల్లా ఎస్పీని కలిసి.. వైయస్ అవినాష్ రెడ్డి లొంగిపోయేలా చూడమని కోరింది. అయితే శాంతి భద్రతల పరిస్థితి అదుపుచేయలేమంటూ ఎస్పీ చేతులెత్తేయడంతో కేంద్ర బలగాలను రంగంలోకి దింపాలని నిర్ణయించుకుంది.
ఇంకోవైపు.. విశ్వభారతి ఆసుపత్రి వద్దే కాదు.. ఆ పరిసర ప్రాంతాలంతా వైసీపీ శ్రేణులతో నిండిపోయింది. ఇంకాచెప్పాలంటే... ఆ పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు వారి వారి వర్గాలు ఇప్పటికే అక్కడ భారీగా మోహరించి ఉన్నారు. ఆదివారం రాత్రి ఆ ఆస్పత్రి సమీపంలో ఉన్న మీడియా ప్రతినిధుల అవినాష్ రెడ్డి అనుచరులు దాడి చేశారు.
అలాగే మే 19వ తేదీన హైదరాబాద్లోని తన నివాసం నుంచి బయలుదేరిన అవినాష్ రెడ్డి.. ఆ తర్వాత సీబీఐ కార్యాలయానికి కాకుండా.. పులివెందులకు పయనమయ్యారు. దీంతో ఆయన వాహనాలను అనుసరించిన కొన్ని మీడియా ఛానెళ్ల వాహనాలతో పాటు జర్నలిస్ట్లపై అవినాష్ రెడ్డి అనుచరులు దాడి చేసిన విషయం విదితమే.
ఇక ఇప్పటికే సీబీఐ అరెస్ట్ చేసిన.. గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డితోపాటు అవినాష్ రెడ్డి తండ్రి వైయస్ భాస్కరరెడ్డిలను విచారించి.. కీలక విషయాలను రాబట్టిన సీబీఐ ఆ క్రమంలో అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్దం చేసుకోవడాన్ని గమనించిన అవినాష్ రెడ్డి.. ఆంధ్రప్రదేశ్ సరిహద్దులు దాటితే.. ప్రమాదంలో పడే అవకాశాలు నూటికి నూరు శాతం ఉన్నాయనే భావనతో విశ్వభారతి ఆసుపత్రిలో తల్లిని చేర్చారనిన్న చర్చ సాగుతోంది. అదీకాక.. వైయస్ వివేక దారుణ హత్యను గుండెపోటుగా చిత్రీకరించిన నాటి నుంచి అవినాష్ రెడ్డి తల్లి గుండెపోటు వరకు వరుస సంఘటనలలో అవినాష్ పాత్రపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయంటే అందుకు కారణం ఈ అన్ని సందర్భాలలోనూ అవినాష్ వ్యవహరించిన తీరే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/avinash-shelter-in-viswa-bharati-25-155731.html
నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం త్వరలోనే విమానాల్లో ఉపయోగించే ఏవియేషన్ టర్బైన్ ఇంధనం (ఏటీఎఫ్)లో కూడా ఇథనాల్ను మిశ్రమం చేయడానికి సన్నాహాలు చేస్తోందంటూ ఆయన బాంబు పేల్చారు.
రాహుల్ గాంధీ నీట్ లీకేజీ వ్యవహారం కేవలం కేంద్ర విద్యాశాఖ వైఫల్యం మాత్రమే కాదంటున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విద్యార్థుల పోరాటానికి లభించిన తొలి విజయమేనంటూ, ఢిల్లీలో గత నెల 20న శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై జరిగిన పోలీసుల లాఠీఛార్జ్, పెల్లెట్ తుపాకుల వినియోగానికి నేరుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
గత కొన్ని నెలలుగా ఇరాన్, ఒమన్ మధ్య ఉన్నత స్థాయి సంప్రదింపుల ఫలితంగా కొత్త రూట్ ప్రతిపాదనపై ఓ ఒప్పందం కుదిరింది. సాంకేతిక, చట్ట, భద్రతా కోణాల్లో సమగ్ర సమీక్షలు జరిపిన అనంతరం, ఈ కొత్త రూట్ కు సంబంధించి ఇరు దేశాలు ఓ అవగాహనకు వచ్చాయి.
వచ్చినది పోగాకు రైతుల కష్టాలు విని, వారికి అండగా ఉన్నానని సంఘీభావం తెలపడం. అయితే ఈ పర్యటనలో జనగ్ రైతులను కలవడం, వారి కనీస హామీ ధర డిమాండ్ల కోసం పోరాడటం కంటే, బల ప్రదర్శనకే ప్రాధాన్యత ఇచ్చారు. ఇక తన ప్రసంగం కూడా పరమ రొట్టకొట్టుడు పద్ధతిలో సాగింది.
2024 అసెంబ్లీ ఎన్నికలలో ఆముదాలవలస నియోజకవర్గం నుంచి ఓటమి పాలైనప్పటి నుంచీ తమ్మినేని రాజకీయంగా ఒకింత ఇన్ యాక్టివ్ గానే ఉంటూ వస్తున్నారు. వైసీపీ అధినేత జగన్ కూడా తమ్మినేనిని ఆముదాలవలస నియోజకవర్గ బాధ్యతల నుంచి తప్పించి శ్రీకాకుళం పార్లమెంట్ పరిశీలక బాధ్యతలను అప్పగించారు. ఈ నిర్ణయం తమ్మినేనిలో తీవ్ర అసంతృప్తికి కారణమైందని ఆయన అనుచరులు చెబుతున్నారు.
వైఎస్ జగన్ ఆదేశిస్తే ఏమైనా చేస్తానంటూ సంచలన ప్రకటనలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలిచారు. అలాగే బోరుగడ్డ అనిల్ తన నోటి దురుసు, అనుచిత వ్యాఖ్యల కారణంగా తొమ్మిది నెలలపాటు జైలు జీవితం కూడా గడపాల్సి వచ్చింది.
తంజావూరు వేదికగా కావేరీ జలాల వివాదంపై మాట్లాడుతున్న సమయంలో ఉదయనిధి స్టాలిన్ సీఎం విజయ్, నటి త్రిషను ఉద్దేశించి పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. తమ అధినేత విజయ్ను అవమానించారంటూ టీవీకే శ్రేణులు తంజావూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడమే కాకుండా, జాతీయ మహిళా కమిషన్కు కూడా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందిన వెంటనే చెన్నైలోని ఉదయనిధి నివాసానికి వెళ్లిన పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.
రాష్ట్రం వెనుకబాటుతనం నుంచి బయటపడాలంటే.. క్షేత్రస్థాయిలో ఉద్యోగాల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. దశాబ్దాలుగా బీహార్ యువత ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన దుస్థితి నెలకొందనీ, ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం సంక్షేమ పథకాలు, రాజకీయ పొత్తులతో కాలక్షేపం చేస్తే రాష్ట్ర భవిష్యత్ అంధకారం అవుతుందన్నారు.
రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లు, నిధుల కొరత నడుమ ఈ బడ్జెట్ను రూపకల్పన చేయడం ప్రభుత్వానికి సవాలుగా మారింది. ఒకవైపు ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం, మరొకవైపు అభివృద్ధి లక్ష్యాలను సమర్థవంతంగా సాధించడం మధ్య సమతుల్యత పాటించాల్సి ఉంది. పరిమితమైన ఆర్థిక వనరులను దృష్టిలో ఉంచుకుని, ఏ రంగాలకు ఎంత మేరకు నిధుల కేటాయింపులు చేయనున్నారనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.
దేశంలో ఇటీవల వెలువడిన ఉప ఎన్నికల ఫలితాలు భారత రాజకీయ యవనికపై కొత్త సమీకరణాలకు నాంది పలుకుతున్నాయి.
వైసీపీలో నెలకొన్న నిస్తేజాన్నీ, నిరుత్సాహాన్నీ ఆసరాగా చేసుకుని, ఆ పార్టీకి పట్టు ఉన్న ప్రాంతాలలో కూడా తెలుగుదేశం కూటమి పాగా వేస్తోంది. ప్రధానంగా వైసీపీకి కంచుకోటగా భావించే రాయలసీమలో వైసీపీ బలాన్ని ఛేదిస్తూ, అభివృద్ధి మంత్రంతో క్షేత్రస్థాయిలో బలం పెంచుకుంటోంది.
తెలంగాణలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ఇకపై టీ-ఫైబర్ ద్వారానే ఇంటర్నెట్ సేవలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ ఫలితాలు మోదీ బ్రాండ్ ను మసకబార్చాయి. మోడీ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతకు నిదర్శనంగా నిలిచాయి. ఈ ఫలితాలు కేవలం ఉప ఎన్నికలో తగిలిన ఎదురుదెబ్బగా కంటే బీజేపీపై ప్రజా వ్యతిరేకత పెచ్చరిల్లుతుందన్న భావననే ఎక్కువగా ఆవిష్కరించాయి.