Publish Date:May 25, 2023
ఏదీ ఏమైనా కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి అదృష్టవంతుడే అంటూ సామాజిక మాధ్యమంలో ఓ రేంజ్ లో ట్రోల్ అవుతోంది. అవినాష్ రెడ్డి జైల్లో ఉంటే తన తండ్రి భాస్కరరెడ్డితో ఉంటాడని... అదే జైలు బయట ఉంటే తన తల్లి శ్రీలక్ష్మీతో ఉంటాడని.. అయినా ఎక్కడ ఉన్నామా? అన్నది ముఖ్యం కాదని.. తల్లిదండ్రులతో ఉన్నామా? లేదా? అన్నదే ముఖ్యమంటూ నెటిజన్లు.. పోకిరి సినిమాలో బాగా బాపులర్ అయిన డైలాగ్.. ఎప్పుడు వచ్చామన్నది కాదన్నయ్యా.. బుల్లెట్ దిగిందా? లేదా? తరహాలో కామెంట్ చేస్తున్నారు.
అవినాష్ అరెస్ట్ చేసేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ కర్నూలులోని విశ్వభారతీ ఆసుపత్రి చుట్టూ కాలు కాలిన పిల్లిలా చక్కర్లు కొడుతూ, కర్నూలు జిల్లా ఎస్పీతో భేటీ అయి.. అవినాష్ రెడ్డి లొంగిపోవాలని చెప్పాలంటూ ఆ దర్యాప్తు సంస్థ అధికారులు బాబ్బాబు అంటూ బతిమాలడం చూస్తుంటే.. అవినాష్ రెడ్డి అదృష్టవంతుడు అని పక్కాగా కన్ఫర్మ్ అవుతోందని నెటిజన్లు వ్యాఖ్యలు చేస్తున్నారు. అంతేకాదు సీబీఐ దూకుడుకు కళ్లెం వెయ్యగల మోనగాళ్లు ఈ దేశంలో ఎక్కడైనా ఉన్నారంటే.. అది కేవలం ఆంధ్రప్రదేశ్లోని అధికార పార్టీ శ్రేణులే అన్నది సుస్పష్టమని తాజా పరిణామాల నేపథ్యంలో అర్థమవుతోందని వారు అంటున్నారు.
ఇక జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో విశాఖ ఎయిర్పోర్ట్లో కోడికత్తి దాడి జరిగితే.. తనకు ఆంధ్రప్రదేశ్ పోలీసులపై నమ్మకం లేదంటూ... పక్క రాష్ట్రం తెలంగాణలోని హైదరాబాద్కు ఆగమేఘాల మీద వచ్చేశారని.. అలాంటి వ్యక్తి నేడు అదే రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండగా.. సదరు పోలీసులు ఆయన నమ్మకం కోసం శాయ శక్తులా శక్తివంచన లేకుండా కష్టపడి పని చేసుకొంటూ.. ఫ్యాన్ పార్టీ రెక్కలే కాదు.. వైసీపీకి కళ్లు, చెవులు అన్నీ అయిన.. జగన్ పార్టీ శ్రేణులపై ఈగ కూడా వాలనివ్వకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. అలాంటిది ఆంధ్రుల తొలి రాజధాని.. నేడో రేపో న్యాయ రాజధానిగా రూపుదిద్దుకొనున్న కర్నూలు నగరంలో.. అదీ విశ్వ భారతి ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న తల్లిని జాగ్రత్తగా కాపాడుతోన్న అవినాష్ రెడ్డిపై సీబీఐ నీడ కాదు కదా.. ఈగ సైతం వాలకుండా పార్టీ కేడర్ కంటికి రెప్పలా కాపాడుకుంటుంటే.. ఆ క్యాడర్ కు పోలీసులు రక్షణ కవచంగా నిలిచారని సెటైర్లు వేస్తున్నారు.
మరోవైపు వైయస్ వివేకా హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి వైయస్ భాస్కరరెడ్డిని సీబీఐ గతంలో అరెస్ట్ చేసి.. చంచల్గూడ జైలుకు తరలించిందని.. ఇదే కేసులో అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు సీబీఐ తన వంతు ప్రయత్నాలు చేస్తున్నా.. అవినాష్ రెడ్డి మాత్రం.. ముందస్తు ప్రణాళికలతో సీబీఐకి చిక్కకుండా తిరుగుతున్నారని అంటున్నారు.
అయినా ప్రజల పన్నుల రూపంలో చెల్లించిన సొమ్మును జీతాలుగా తీసుకునే ఈ పోలీసులు.. ఇలా విశ్వభారతీ ఆసుపత్రికీ, అందులో ఉన్న అధికార పార్టీ ఎంపీ ప్లస్ ముఖ్యమంత్రి కజిన్ అవినాష్ రెడ్డికి, ఆయన తల్లితోపాటు ఆసుపత్రి వద్ద ఉన్న పార్టీ కేడర్కు రక్షణగా ఇలా చెమటోడ్చి.. కష్ట పడడం చూస్తుంటే.. అనినాష్ రెడ్డి నిజంగా అదృష్టవంతుడేనని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/avinash-reddy-lucky-fellow-25-155852.html
సువేందు అధికారి రాజకీయ నేపథ్యాన్ని పరిశీలిస్తే.. కాంగ్రెస్ సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన సువేందు, రాజకీయ ఓనమాలు అక్కడే నేర్చుకున్నారు. ఆయన తాత కెనరామ్ అధికారి స్వాతంత్ర్య సమరయోధుడు కాగా, తండ్రి శిశిర్ అధికారి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా రాణించారు. సువేందు అధికారి మమతా బెనర్జీ స్థాపించిన తృణమూల్ కాంగ్రెస్లో చేరి ఆ పార్టీలో కీలక నేతగా ఎదిగారు.
కరీంనగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై జరిగిన దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకత్వం బంద్ పిలుపునిచ్చిన నేపథ్యంలో . శనివారం ( మే 9) ఉదయం నుండే నగరంలోని ప్రధాన కూడళ్లలో పోలీసులు భారీగా మోహరించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నిరసనలో పాల్గొనకుండా పోలీసులు ఆయన ఇంటి వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీనిపై బీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ముఖ్యంగా పార్టీలో అభిషేక్ బెనర్జీ పెత్తనం పెరగడం వల్లే సువేందు అధికారి వంటి బలమైన నేతలు టీఎంసీని వీడారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పట్టున్న నాయకులను కాదని, కార్పొరేట్ తరహా రాజకీయాలకు అభిషేక్ బెనర్జీ ప్రాధాన్యత ఇవ్వడం తృణమూల్కు ప్రతికూలంగా మారిందంటున్నారు.
ఆంధ్రోళ్లను తిట్టి ఓట్లు దండుకున్న బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రాజెక్టుల పేరుతో దోపిడీకి పాల్పడిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుత ఎన్నికల ఫలితాలు కేరళలో పెను మార్పులకు నాంది పలికాయి. యూడీఎఫ్ స్పష్టమైన మెజారిటీ సాధించడంతో.. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై కసరత్తు జరుగుతోంది. కేసీ వేణుగోపాల్ అనుభవం, రాహుల్ గాంధీతో ఉన్న సాన్నిహిత్యం ఆయనకు ప్రధాన బలంగా మారాయి.
టీవీకే అధినేత విజయ్కు కాంగ్రెస్ మద్దతు తెలపడంపై ఆగ్రహంగా ఉన్న డీఎంకే.. కాంగ్రెస్కు కటీఫ్ చెప్పేసింది. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, లోక్సభలో తమ పార్టీ సభ్యులకు కాంగ్రెస్ ఎంపీలతో కాకుండా విడిగా సీటింగ్ కేటాయించాలని డీఎంకే ఎంపీ కనిమొళి స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
తాజా సమాచారం ప్రకారం.. విజయ్ తన పార్టీకి ఉన్న బలానికి తోడుగా మరో మూడు పార్టీల మద్దతును కూడగట్టుకున్నారు. ఆ పార్టీల మద్దతుతో అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118ని ఆయన సాధించారు.
తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవ్వగా.. మెజారిటీ నిరూపణ విషయంలో రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కచ్చితమైన నిబంధనలు పాటించాలని పట్టుబడుతున్నారు. విజయ్ కు తన పార్టీ ఎమ్మెల్యేలు 107 మందికి అదనంగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది.
పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనకు ముందే తెలుసని, నాయకత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు. అయితే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి.. క్షేత్రస్థాయిలో కేడర్ను కాపాడుకుంటూ వచ్చిన తనకు ఈ పరిణామం మనస్తాపానికి గురిచేసిందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు.
బాబు కూటమిని ఎందుకంత విలువైనదిగా భావిస్తున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూటమి ఎప్పుడెప్పుడు చీలిపోతుందాని కాచుకుని కూర్చుని ఉంది. ఏ అవకాశం వచ్చినా వారు వదిలిపెట్టినట్టే కనిపించదు. మొన్న కోట వినుత ఘటన, నిన్న అరవ శ్రీధర్ వ్యవహారం, ఇవాళ వర్మ ఇష్యూ.. ఇలా సమయం దొరికినపుడల్లా ఆయా అంశాలను బాగా హైలెట్ చేసి.. కూటమిలో ఏదో ఒక చిచ్చు రాజేయాలని చూస్తోంది వైసీపీ అధినాయకత్వం.
అతి కొద్ది మంది నేతలు జగన్ ప్రకటనను సమర్దిస్తూ.. అనుకూల ప్రకటనలు చేస్తుండగా.. మెజారిటీ లీడర్, క్యాడర్ మాత్రం జగన్ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.