విజయసాయిరెడ్డి ఆంతర్యం ఏమిటి?
Publish Date:May 1, 2012
.png)
Advertisement
జగన్ అక్రమాస్తుల కేసులో అరెస్టు అయి బెయిల్ పై విడుదలైన ఆడిటర్ విజయసాయిరెడ్డి త్వరలో తాను రాజకీయాల్లో ప్రవేశిస్తానని ప్రకటించడం వెనుక అసలు ఉద్దేశ్యం ఏమిటన్న దానిపై రాజకీయ వర్గాల్లో చర్చలు సాగుతున్నాయి. వై.ఎస్. కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన విజయసాయి రెడ్డి సిబీఐపైనే పోరాటం సాగించాడు. ఆ విచారణ సంస్థను ధిక్కరిస్తూ మాట్లాడాడు. కానీ, ఇటీవల విడుదలైన ఆయన సిబీఐ విచారణ చట్టబద్ధంగా కొనసాగుతోందని కితాబు ఇవ్వటం విశేషం. ఈ కితాబు వెనుక ఏమి జరిగి ఉంటుందీ? అన్న అంశంపై తర్జనభర్జనలు జరుగుతున్నాయి. కారణాలు ఏవైనా జగన్ కేసులో సిబీఐ దర్యాప్తు ఇటీవల మందగించింది. దీనికి తోడు కేంద్రమంత్రి ప్రణబ్ ముఖర్జీ, జగన్ కు మద్దతు ఇస్తున్నట్లు వార్తలు వచ్చాయి.
దీంతో ఈ కేసు నిర్వీర్యం అవుతుందనే భావనతోనే విజయసాయిరెడ్డి త్వరలో తాను రాజకీయాల్లోకి రాబోతున్నట్లు ప్రకటించి ఉంటారని భావిస్తున్నారు. సిబీఐ దర్యాప్తు సజావుగా సాగితే జగన్ ను ఈపాటికే అరెస్టు చేసి ఉండేవారు. విజయసాయిరెడ్డికి బెయిల్ కూడా లభించి ఉండేది కాదు. ఈ విషయం విజయసాయిరెడ్డికి కూడా బాగా తెలుసు. సిబీఐపై జగన్ వర్గం పైచేయి సాధించి ఉంటుందని అందుకే తాను మళ్ళీ జైలుకు వెళ్ళవలసిన అవసరం ఉండదని విజయసాయిరెడ్డి భావిస్తున్నట్లు తెలిసింది. ఈ ధీమాతోనే ఆయన తాను రాజకీయాల్లో ప్రవేశిస్తున్నానని ప్రకటించి ఉంటారన్న ప్రచారం జరుగుతోంది.
http://www.teluguone.com/news/content/auditor-vijayasai-reddy-to-join-politics-24-13771.html

సుబ్రతో రాయ్ అరెస్ట్ ...

ఖరారైన రాష్ట్రపతి పాలన ...

రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...

విఫలమైన 'టి' కాంగ్రెస్
.jpg)
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
.jpg)
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
.jpg)
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
.jpg)
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
.jpg)
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
.jpg)
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
.jpg)
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
.jpg)
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
.jpg)
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.