Publish Date:Mar 22, 2026
ఏ రాజకీయపార్టీ నుంచైనా అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయాలంటే ఆ పార్టీ టికెట్ ఇవ్వాలి. అలా టికెట్ దక్కించుకోవాలంటే ఆ పార్టీలో పై స్థాయి నాయకుల ఆశీస్సులు, అలాగే సమాజిక సమీకరణాలూ కీలకం. అయితే తమిళనాడులో మాత్రం అధికార పార్టీ అందుకు భిన్నంగా రానున్న అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపిక విషయంలో వినూత్న పంధా అనుసరిస్తోంది. త్వరలో రాష్ట్ర అసెంబ్లీకి అధికార డీఎంకే పార్టీ టికెట్ దక్కాలంటే వారు నేరుగా ముఖ్యమంత్రి స్టాలిన్ ఎదుట ఇంటర్వ్యూకు హాజరు కావాల్సిందే. ఇందు కోసం సదరు ఆశావహ అభ్యర్థులు నిర్ణీత రుసుము చెల్లించి అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇలా అప్లికేషన్ పెట్టుకోవడానికి విభాగాల వారీగా రెండు రకాల ఫీజులను డీఎంకే నిర్ణయించింది. అదెలా అంటే రిజర్వుడు నియోజకవర్గాల నుంచి పార్టీ టికెట్ ఆశిస్తున్న అభ్యర్థులు 15వేల రూపాయలు, జనరల్ స్థానం నుంచి టికెట్ ఆశిస్తున్న వారు పాతిక వేల రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇది నాన్ రిఫండబుల్.
ఇలా ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకున్న వారికి నిర్దిష్ట తేదీ, నిర్దిష్ట సమయం కేటాయించి ఇంటర్వ్యూలకు పిలుస్తారు. ఈ ఇంటర్వ్యూకు అభ్యర్థులు తమ సొంత ఖర్చుతో రావాలి. ఇంతకీ ఈ ఇంటర్వ్యూ ఎందుకంటే.. సీఎం స్టాలిన్ స్వయంగా చేసే ఈ ఇంటర్వ్యూలో అభ్యర్థుల సమార్థ్యాన్ని, అతడికి రాజకీయాల పట్ల ఉన్న అవగాహనను, ప్రజాసేవ పట్ల ఉన్న తపనను పరిశీలిస్తారు. అలాగే సదరు క్యాండిడేట్ ఆర్థిక నేపథ్యం తదితర విషయాలను కూడా పరిశీలిస్తారు. ఈ ఇంటర్వ్యూ ఐదారు నిముషాల పాటు ఉంటుంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు కొత్తగా రాజకీయాల్లోకి రావాలనుకునే యువత, విద్యావంతులు కూడా ఈ ఇంటర్వ్యూల కోసం బారులు తీరుతున్నారు.
గతంలో దివంగత నేత కరుణానిధి కూడా అభ్యర్థుల ఎంపిక విషయంలో ఇదే పంథా అవలంబించేవారు. ఇప్పుడు సీఎం స్టాలిన్ కూడా తండ్రి బాటనే అనుసరిస్తున్నారు. ఇదే తరహాలో అభ్యర్థులను వడపోసేవారు. ఇప్పుడు స్టాలిన్ అదే సంప్రదాయాన్ని మరింత పక్కాగా అమలు చేస్తున్నారు. అర్హులైన, సమర్థులైన నాయకులను గుర్తించడమే కాకుండా ఇంటర్వ్యూల కోసం వసూలు చేసే ఫీజు ద్వారా పార్టీకి నిధులు సమకూర్చుకోవడం కూడా జరుగుతుందని స్టాలిన్ ఈ పద్ధతిని ఎంచుకున్నారని డీఎంకే వర్గాలు చెబుతున్నాయి.
కాగా పొలిటికల్ సర్కిల్స్ లో మాత్రం డీఎంకే అనుసరిస్తున్న ఈ అభ్యర్థుల ఎంపికపై మిశ్రమ స్పందన కనిపిస్తోంది. అభ్యర్థులను సీఎం ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయడం అన్న పద్ధతి పారదర్శకతకు నిదర్శనంగా కొందరు, ఫీజుల వసూలు అంటూ సొమ్ములు దండుకునే వ్యూహంగా మరి కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తం మీద పార్టీ అభ్యర్థుల ఎంపిక కోసం స్వయంగా ముఖ్యమంత్రి స్టాలినే ఇంటర్వ్యూ చేయడం తమిళనాట హాట్ టాపిక్ గా మారింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/assembly-ticket-only-upon-selection-in-interview-25-215931.html
అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ మధ్య పోరు హోరాహోరీగా సాగే అవకాశం ఉంది, దీని ఫలితాన్ని అనేక నిర్మాణాత్మక మరియు రాజకీయ అంశాలు ప్రభావితం చేస్తున్నాయి.
కాపు రిజర్వేషన్ ఉద్యమ నేతగా ముద్రగడ పద్మనాభం తన చోటుకు ఎసరు వస్తున్నదా అన్న అనుమానంతో.. ఆ కాపు నేత తానేనని చాటుకోవడానికి తన వంతు ప్రయత్నాలు మొదలెట్టేశారంటున్నారు. నేను సైతం అంటూ ఆయన రంగంలోకి దిగినట్లు వైసీపీ వర్గీయులే అంతర్గత సంభాషణల్లో చెప్పుకుంటున్నారు. ఇందుకు తార్కానాలు కూడా చూపుతున్నారు.
ఉభయ సభలలో ఆమోదం పొందిన ఆ బిల్లు ఇప్పుడు దేశ ప్రథమ పౌరురాలు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వద్దకు చేరింది. ఇక ఆమె సంతకం పెట్టడానూ ఈ బిల్లు చట్టంగా మారుతుంది. ఆమె నేడో, రేపో ఈ బిల్లుపై సంతకం చేయడం ఖాయమని అంటున్నారు.
తమిళనాడులో 2026 ఎన్నికలు హోరాహోరీగా సాగే పోరుగా రూపుదిద్దుకుంటున్నాయి, ఇందులో స్పష్టమైన విజేత ఎవరూ లేరు. స్వల్ప ఓట్ల మార్పులు సీట్ల ఫలితాలపై నిర్ణయాత్మక ప్రభావాన్ని చూపవచ్చు.
రాజకీయం అంటే కేవలం అధికారంలో ఉండటం మాత్రమే కాదని, ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తూ ముందుకు సాగాలని వైసీపీకి హితవు పలుకుతున్నట్లుగా మాట్లాడుతూనే.. ఆ పార్టీకి కర్తవ్యబోధ చేశారు.
బిజెపికి 1951లో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ స్థాపించిన భారతీయ జనసంఘ్తో పునాదులు పడ్డాయి. అక్కడి నుంచి ఈ పార్టీ అంచలంచలుగా ఎదిగి నేడీ స్థితికి చేరుకుంది. గతంలో వాజ్ పేయి ఈ పార్టీకి అధికార వాసన రుచి చూపడంతో.. ఇప్పుడు వరుసగా మూడు పర్యాయాల పాటు అధికారం చేజిక్కించుకుని.. ప్రస్తుతం అప్రతిహాత జైత్ర యాత్ర చేస్తోంది.
చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక పోలవరం జిల్లా చింతూరు, ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు, ఇబ్రహీంపట్నం మండలాల్లో ఎండలు మండిపోతాయి. వడగాలుల ప్రభావం కూడా తీవ్రంగా ఉంటుంది.
రాఘవ్ చద్దా, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య తలెత్తిన అంతర్గత విభేదాలు ఇప్పుడు బహిరంగ యుద్ధంగా మారాయి.
న్ని ఎన్నికలలో విచిత్రాలు జరగవు. ప్రతిసారీ ఒకటే జరిగితే, దాన్ని విచిత్రం అనరు కదా? ఎన్నికలు జరిగి నిండా రెండేళ్లు కాకముందే నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఓటి పలుకు వినపడుతున్నది. కొందరు ప్రముఖులు పక్కదారులు చూస్తున్నారని, పక్క పార్టీతో బేరసారాలు జరుపుతున్నారని కూడా వినపడుతున్నది.
అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో.. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన పంథాను మార్చుకోలేదనేది స్పష్టమవుతోంది. ఐదేళ్ల పాలనలో మూడు రాజధానుల మంత్రం జపించిన జగన్.. ఇప్పుడు మచిలీపట్నం-విజయవాడ-గుంటూరును కలిపి ఒక మెగా సిటీగా మార్చాలనే సరికొత్త ప్రతిపాదనను ముందుకు తెచ్చారు.
మూడు రాజధానుల అంశం గత ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయానికి ప్రధాన కారణాలలో ఒకటి అన్న విషయాన్ని విస్మరించి.. మళ్ళీ అదే తరహా ప్రత్యామ్నాయ వాదనలు వినిపించడం పట్ల రాజకీయవర్గాలలో విస్మయం వ్యక్తమౌతోంది. పార్టీ కేడర్ సైతం మావిగన్ ఏంటి అదేదో పంటకు పట్టే తెగుల్లా ఉందని నెత్తీ నోరూ బాదుకుంటోంది.
ఆ రోజు సభలో ఓ మంత్రి తనపై చెయ్యి చేసుకున్నారని పేర్కొన్నారు. మరో మంత్రి ఏకవచనంతో తిట్టిపోశారు, కులం పేరుతో దూషిస్తూ తన పుట్టుకను నిందించారన్నారు. శాసనమండలిలో తన సిబ్బందినీ దగ్గరికి రాకుండా వైసీపీ సభ్యులు అడ్డుపడ్డారని, తన చుట్టూ చేరి బెదిరింపులు, ప్రలోభాలతో రకరకాలుగా ఇబ్బంది పెట్టారన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలకు 5 కోట్ల మంది ప్రజల తరఫున కృతజ్ణతలు తెలిపారు. దేశం మొత్తానిది ఒక దారైతే... తమదో దారి అన్నట్లు వైసీపీ వ్యవహరించిందని దుయ్యబట్టారు. రాష్ట్రం, దేశం నాశనమైనా పర్వాలేదు.. మాకు స్వార్థ రాజకీయమే ముఖ్యమన్నట్లుగా వైసీపీ వ్యవహరించిందని విమర్శించారు.