ఆసియా క‌ప్‌..   భార‌త్  హ్యాట్రిక్ సాధిస్తుందా?

Publish Date:Aug 25, 2022

Advertisement

త్వ‌ర‌లో ఆసియాక‌ప్ టి-20 టోర్నీ ఆరంభానికి దుబాయ్ సిద్ధ‌మ‌యింది. ఐసిసి పురుషుల టి20 ప్ర‌పంచ క‌ప్ కూడా ఆట్టే దూరంలో లేదు గ‌నుక ఈ టోర్నీకి ప్రాధాన్య‌త ఉంది. ఈ టోర్నీలో భార‌త్, పాకిస్తాన్ మ‌ధ్య‌నే ఎక్కువ పోటీ క‌న‌ప‌డుతుంది. ఆసి యా అన‌గానే ఈ రెండు దిగ్గ‌జాల‌కే క్రికెట్ వీరాభిమానులు అమితంగా ఇష్ట‌పడ‌తారు. గ‌తేడాది ఐసిసి ప్ర‌పంచ‌క‌ప్ పురుషుల టి 20 క‌ప్‌తో ఇప్ప‌టివ‌ర‌కూ భార‌త్ 19 ప‌ర్యాయాలు గెలిచింది. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌, కోచ్ రాహుల్ ద్రావిడ్‌ల సార‌ధ్యం మ‌ద్ద‌తు అమితంగా ప‌నిచేశాయ‌ని క్రికెట్ పండితులు, విమ‌ర్శ‌కుల మాట‌. అయితే ఈసారి ఆసియాక‌ప్‌కు ద్రావిడ్ స్థానంలో వి.వి. ఎస్‌.లక్ష్మ‌ణ్‌ను కోచ్‌గా నియ‌మించారు.  భార‌త్ హ్యాట్రిక్ సాధిస్తుంద‌న్న ఆశ‌లు యావ‌త్ ప్ర‌పంచ క్రికెట్ అభిమానులూ వ్య‌క్తం చేస్తున్నారు. 

ఈ ప‌ర్యాయం కూడా భార‌త్‌కే ఎక్కువ అవ‌కాశాలున్నాయ‌ని ఆసీస్ మాజీ కెప్టెన్ రికీపాటింగ్‌తో పాటు వాట్స‌న్ కూడా అభిప్రాయ ప‌డ‌టం గ‌మ‌నార్హం. ఆగ‌ష్టు 28న భార‌త్‌, పాక్ త‌ల‌ప‌డ‌నున్నాయి. పాకిస్తాన్ కంటే భార‌త్ బ్యాటింగ్‌, బౌలింగ్‌లోనూ గ‌ట్టి స‌త్తా ప్ర‌ద ర్శించ‌డానికే అవ‌కాశాలున్నాయంటున్నారు. ముఖ్యంగా భార‌త్ రెట్టింపు ఉత్సాహంతో, గెలుస్తామ‌న్న గొప్ప కాన్ఫిడెన్స్ ప్ర‌ద‌ర్శి స్తూ, ప‌ట్టుద‌ల‌తో ఆడ‌టం గ‌మ‌నిస్తాం. ముఖ్యంగా విరాట్ కోహ్లీ, రోహిత్ శ‌ర్మ‌, సూర్య‌కుమార్ యాద‌వ్ వంటివారు ఎంతో ధాటిగా ఆడి జ‌ట్టు శ‌క్తి సామ‌ర్ధ్యాల‌ను రెండింత‌లు పెంచే తీరు చూడ‌చ‌క్క‌నిది. అయితే ఇటీవ‌ల అంత‌గా ఫామ్‌లో లేని కోహ్లీ ఈ టోర్నీలో త‌ప్ప‌కుండా పాత విరాట్ విశ్వ‌రూపం ప్ర‌ద‌ర్శించ‌గ‌ల‌డ‌ని వీరాభిమానులు వేయి క‌ళ్ల‌తో ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది అత‌ను భార‌త్‌కి కేవ‌లం 16 మ్యాచ్‌లే అడాడు. వాటిలో ఒక్క‌టే టీ 20 కావ‌డం గ‌మ‌నార్హం. అదీ జూలై లో ఇంగ్లాండ్ మీద ఆడింది.  ఈ మ‌ధ్య సిరీస్‌ల‌కు విశ్రాంతి తీసుకోవ‌డం కోహ్లీకి ఒక‌విధంగా మంచిదేన‌ని, ఇపుడు ఫ్రెష్‌గా బ‌రిలోకి దిగి ఎంతో కాన్ఫిడెన్స్‌గా ఆడ‌టానికి అవ‌కాశం ఉంద‌ని ప్ర‌పంచ క్రికెట్ సీనియ‌ర్లు న‌మ్ముతున్నారు. 

జట్టు విష‌యానికి వ‌స్తే.. రోహిత్ శ‌ర్మ నాయ‌క‌త్వంలో రాహుల్,విరాట్‌,సూర్య‌కుమార్ యాద‌వ్‌, రిష‌బ్‌,దీప‌క్ హుడా,దినేష్ కార్తి క్‌, హార్దిక్ పాండ్యా,ర‌వీంద్ర‌జ‌డేజా, ఆర్‌.అశ్విన్‌, య‌జువేంద్ర‌ఛాహ‌ల్‌, ర‌వి విష్ణోయ్‌, భువ‌నేశ్వ‌ర్‌,అర్ష‌దీప్‌సింగ్, ఆవేశ్‌ఖాన్ ఆడ‌ను న్నారు. స్టాండ్‌బైలుగా శ్రేయాష్ అయ్య‌ర్‌, ఆక్ష‌ర్‌ప‌టేట్‌, దీప‌క్ చాహ‌ర్ ఉన్నారు. కాగా వీరిలో ర‌న్‌మిష‌న్ రాహుల్ మంచి ఫామ్‌లో ఉండటం జ‌ట్టుకు కొండంత అండ‌గా చెప్పాలి. చిత్రమేమంటే ఎప్పుడూ అంత‌గా క‌నిపించ‌ని దూకుడు త‌త్వం ప్ర‌ద‌ర్శిం చ‌డం గ‌మనార్హం. ఇది ప్ర‌స్తుత టోర్నీకి ఎంతో అవ‌స‌ర‌మ‌న్న అభిప్రాయాలు ఉన్నాయి. ఈ పంజాబ్ కింగ్స్ కెప్టెన్ స్ట్ర‌యిక్ రేట్ కూడా 142 ఉండ‌టం ఈ టోర్నీకి ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంది. కెప్టెన్‌ శ‌ర్మ‌తో పాటు ఓప‌నింగ్ కి దిగితే ప‌వ‌ర్‌ప్లే అత్యంత ఆస‌క్తిక‌ రంగా సాగు తుంద‌నే అనాలి. ప్రేక్ష‌కుల‌కు త‌ప్ప‌కండా వీరిద్ద‌రూ దీపావ‌లి ఆనందాన్నిస్తారు. విశ్రాంతి త‌ర్వాత తిరిగి జ‌ట్టులోకి వ‌చ్చిన కోహ్లీ, ఇప్ప‌టికే ఉత్త‌మ ఫామ్‌లో ఉన్న సూర్య‌కుమార్‌లు మిడిల్ ఆర్డ‌ర్‌ను మ‌రింత దూకుడుగా ముందుకు తీసికెళ్లి మంచి స్కోర్ ఖాయిలా చేయ‌వ‌చ్చు. చివ‌ర‌లో దినేష్ కార్తిక్ బ్యాటింగ్ విధానం ప్ర‌త్యేకించి చెప్ప‌న‌వ‌స‌రం లేదు. ఐపిఎల్‌లో అత‌ను ఆ స‌త్తాను ఇప్ప‌టికే ప్ర‌ద‌ర్శించాడు. అందువ‌ల్ల దినేష్‌, రిష‌బ్‌ల మ‌ధ్య మంచి పోటీనే చూడ‌గ‌ల‌మ‌ని అనాలి. వారిద్ద‌రూ ఐపిఎల్‌లో ధాటిగా ఆడ‌టం, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకున్న‌వారే. వారిద్ద‌రికి ప్ర‌త్య‌ర్ధుల బౌలింగ్‌ను నీరుగార్చ‌డంలో ఎంతో పేరుంది. ఇక బౌలింగ్ విభాగానికి వ‌స్తే, చాహ‌ల్ త‌ప్ప‌కుండా లీడ్ బౌల‌ర్‌గా క‌న‌ప‌డ‌తాడు. అత‌ను కేవ‌లం 7.06 ఎకాన‌మీతో 13 మ్యాచ్‌లో ఏకంగా 16 వికెట్లు తీసుకున్నాడు. ఇంగ్లండ్ తో త‌ల‌ప‌డిన సిరీస్‌లో త‌న స‌త్తాను చాట‌డంలో ఇంగ్లీష్ బ్యాట‌ర్ల‌ను వ‌ణికించాడు. అయితే, పేస్ అటాక్‌లో బుమ్రా, పాండ్యాలు మ‌రిం విజృంభించాల్సి ఉంది. అలాగే పేసర్ల‌లో లీడ్‌గా ఉన్న భువ‌నేశ్వ‌ర్‌పైనా ఎన్నో ఆశ‌లు ఉన్నాయి. ఈ ఏడాది ఎలాంటి గాయాల‌కు గురికాలేదు గ‌నుక అత‌ను ఐపీఎల్‌లోనూ ఎంతో ఉత్త‌మ ప్ర‌ద‌ర్శ‌న ఇచ్చాడు గ‌నుక అత‌ని మీదా ఆశ‌లు ఉన్నాయి.

ఈసారి బాబ‌ర్ అజామ్‌, మొహ‌మ్మ‌ద్ రిజ్వాన్‌లతో ప‌టిష్టంగా ఉన్న పాకిస్తాన్‌తో పాటు శ్రీ‌లంక జ‌ట్టు కూడా భార‌త్‌కు గ‌ట్టి పోటీ నిచ్చే అవ‌కాశాలున్నాయ‌ని క్రికెట్ మేధావులు అంటున్నారు. అలాగే అంత‌ర్జాతీయ కూన‌లుగా పేర్కొంటున్న ఆప్ఘ‌నిస్తాన్ జ‌ట్టు బౌలింగ్ లైన్ ఆప్ ఈసారి ఇబ్బందిపెట్టే అవ‌కాశాలున్నాయి. ఇటీవ‌ల ఇర్లాండ్ తో త‌ల‌ప‌డిన సిరీస్‌లో ఓట‌మి చ‌విచూసిన‌ప్ప‌టికీ ఆఫ్ఘ‌న్ ను త‌క్కువ అంచ‌నా వేయ‌న‌వ‌స‌రం లేదు. 

By
en-us Political News

  
కేంద్రకేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే ఏకైక డిమాండ్‌తోనే ఈ కాక్రోచ్ ఉద్యమకారులు ముందుకు వెళ్తున్నారన్న డోలేంద్ర ప్రసాద్.. దీనికి ఆర్గనైజ్డ్ పద్ధతి లేకపోవడం వల్ల ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోతోందన్నారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే ఏకైక డిమాండ్‌తోనే ఈ కాక్రోచ్ ఉద్యమకారులు ముందుకు వెళ్తున్నారన్న డోలేంద్ర ప్రసాద్.. అయితే దీనికి నిర్దిష్టమైన ఆర్గనైజ్డ్ పద్ధతి లేకపోవడం వల్ల ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోతోందన్నారు.
జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఈ హడావిడి వెనుక సాయికృష్ణ కుటుంబంపై ప్రేమ ఎంతమాత్రం లేదని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అప్పసాని రాజేష్ స్పష్టం చేశారు. జగన్ అసలు టార్గెట్ సీఐ నాగరాజు కాదనీ.. ఆయన ప్రధాన లక్ష్యం విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు అని విశ్లేషించారు.
అధికార కూటమికి చెందిన నాయకులు, చివరికి హోం మంత్రి సైతం క్షేత్రస్థాయికి వెళ్లి బాధితులను పరామర్శించకపోవడం, సరైన క్లారిటీ ఇవ్వకపోవడంపై సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ప్రతిష్టను మసకబార్చేలా ప్రవర్తిస్తున్న అధికారుల తీరుపై ఆయన మండిపడ్డారు. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ బాస్ ను ఆదేశించారు.
ఒక బలమైన ప్రజాధారణ కలిగిన సరికొత్త వేదిక ఏర్పడితే ప్రజలు ఆదరించేందుకు సిద్ధంగా ఉన్నారా? అన్న చర్చ జోరుగా సాగుతోంది.
లకమైన రాజ్యాంగ సవరణ బిల్లులను ప్రతిపక్షాల మద్దతుతో సంబంధం లేకుండా.. స్వతంత్రంగా ఆమోదింప చేసుకోవడమే ఈ వ్యూహం వెనుక ఉన్న అసలు రహస్యం.
ఉభయ తెలుగు రాష్ట్రాలలో కలిపి ఇప్పటికే దాదాపు 20 లక్షల మందికి పైగా సభ్యులు జనసేనలో చేరారనీ.. ఈ బలంతో తెలంగాణ రాజకీయాల్లో తమ ఉనికిని గట్టిగా చాటుతామని పవన్ కల్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. రాబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలతో పాటు, 2028లో జరగబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీకి దిగుతుందని పవన్ ప్రకటించడం తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది.
ఏపీ రాజకీయాలలో కాపు సామాజికవర్గం ఓటు బ్యాంకుకు ఎన్నికల ఫలితాలను తారుమారు చేయగలిగే సత్తా ఉంది. అటువంటి కాపు సామాజికవర్గం విషయంలో జగన్ అనుసరిస్తున్న వ్యూహం మొదటికే మోసం తెచ్చేలా ఉందన్న ఆందోళన వైసీపీ వర్గాలలో వ్యక్తం అవుతున్నది.
శివసేన ఏక్ నాథ్ షిండే, శివసేన ఉద్ధవ్ థాక్రే వర్గాల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. పార్టీ వ్యవస్థాపకుడు బాలాసాహెబ్ థాకరే అసలైన వారసులం తామేనంటూ మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే వర్గం, మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని యూబీటీ వర్గం పోటాపోటీగా భారీ బహిరంగ సభలను నిర్వహించడంతో ముంబైలో ఉద్రిక్తతలు పీక్స్ కు వెళ్లాయి.
విజయవాడ కృష్ణలంక ప్రాంతానికి చెందిన సాయికృష్ణ అదృశ్యం కేసు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. 2024 ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత దిక్కుతోచని స్థితిలో ఉన్న వైసీపీకి సాయికృష్ణ అదృశ్యం ఘటనను అందివచ్చిన అవకాశంగా భావించి.. పొలిటికల్ మైలేజీ గెయిన్ చేయడానికి శతధా ప్రయత్నించింది. అయితే చంద్రబాబు తన చాణక్యంతో ఆ ప్రయత్నాలకు చెక్ పెట్టారు.
తెలంగాణ రాజకీయాల్లో మల్కాజ్‌గిరి నియోజకవర్గం మరోసారి తీవ్ర ఉత్కంఠకు వేదికగా మారింది.
వైసీపీ హయాంలో మంత్రిగా ఉన్న సమయంలో కొడాలి నాని అప్పటి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్, అప్పటి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌లపై తీవ్రస్థాయిలో వ్యక్తిగత దూషణలు, అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యాఖ్యలు రాజ్యాంగ నిబంధనలకు, చట్టానికి వ్యతిరేకంగా ఉన్నాయంటూ దాఖలైన ఫిర్యాదులపై సుదీర్ఘంగా సమీక్షించిన ప్రభుత్వం.. తాజాగా ప్రాసిక్యూషన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం గమనార్హం. దీనితో ఆయన అరెస్టయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు.
కేసుకు కులాన్ని ఆపాదిస్తూ వైసీపీ నాయకులు అంబటి రాంబాబు, కొరసాల కన్నబాబు, తోట త్రిమూర్తులు వంటి పెద్దలు కాపు కుల మీటింగ్‌లు పెట్టాలని చూడటంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సాయికృష్ణపై గతంలో దాదాపు 22 క్రిమినల్ కేసులు, పోక్సో చట్టం కింద కేసులు ఉన్నాయని, సమాజానికి హానికరమైన ఒక నేరచరిత్ర ఉన్న వ్యక్తిని తీసుకువచ్చి కాపు యువకుడిగా ముద్ర వేయడం ద్వారా మొత్తం కులానికి అప్రతిష్ట తెస్తున్నారని మండిపడ్డారు.
ఏపీ రాజకీయాల్లో గత కొన్నేళ్లుగా సాగుతున్న కులాల వ్యూహాలను విశ్లేషించారు. దేశంలో రాజ్యాంగం కల్పించిన రక్షణలు, సామాజిక మార్పుల వల్ల నేడు పల్లెల్లో సైతం కుల వివక్ష దాదాపు అంతరించిపోయిందన్నారు. కానీ.. ఒక వ్యూహం ప్రకారం కొన్ని రాజకీయ పార్టీలు నిర్దిష్ట సామాజిక వర్గాలను టార్గెట్ చేస్తూ, మిగిలిన వర్గాల్లో వారిపై ద్వేషం పెంచేలా వాటిని బూచి గా చూపిస్తూ రాజకీయ పబ్బం గుడుపుకోవాలని చూస్తున్నాయన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.