మైగ్రేన్ వేధిస్తోందా? ఈ అలవాట్లతో మాయమవుతుంది..!

Publish Date:Aug 26, 2025

Advertisement

 


నేటి వేగవంతమైన జీవితంలో చాలా బాధ్యతలు ఉంటాయి. ఇల్లు, ఆఫీస్, పిల్లలు,  రిలేషన్స్  మధ్య సమతుల్యతను కాపాడుకోవడం ఇవన్నీ చాలా ముఖ్యమైనవి, తప్పించుకోలేనివి. ఇవన్నీ ఎప్పుడైనా కాస్త ఒత్తిడిగా అనిపిస్తే చాలామంది విపరీతమైన తలనొప్పితో బాధపడుతుంటారు.  అన్ని తలనొప్పులు మైగ్రేన్ కాకపోయినా  మైగ్రేన్‌ అనేది ఒక విధమైన తలనొప్పి. ఈ మైగ్రేన్ వల్ల ప్రతి రోజు చాలా ఛాలెంజింగ్ గా అనిపిస్తుంది. ఎందుకంటే మైగ్రేన్ తలనొప్పికి మాత్రమే కాకుండా వికారం, అలసట,  కాంతి లేదా శబ్దాన్ని భరించలేకపోవడం వంటివి కూడా జరుగుతాయి.  దీనిని మందులు మరియు సరైన జీవనశైలితో నియంత్రించవచ్చు.

మంచి ఆరంభం..

మంచి ఆరంభం మొత్తం రోజు శక్తిని నిర్ణయిస్తుంది. కాబట్టి ప్రతిరోజూ  నిర్దిష్ట సమయంలో మేల్కొలపడం అలవాటు చేసుకోవాలి. అది రోజు మొత్తం శక్తిని నిర్ణయిస్తుంది. మేల్కొన్న వెంటనే ఫోన్ లేదా స్క్రీన్ వైపు చూడకూడదు. కొన్ని నిమిషాలు గడిచిన తరువాత  యోగా లేదా ధ్యానం కోసం కనీసం  10-15 నిమిషాలు సమయం కేటాయించాలి. అనులోమ-విలోమ,  భ్రమరి వంటి ప్రాణాయామాలు ఒత్తిడిని తగ్గించడం ద్వారా మైగ్రేన్ తీవ్రతను నియంత్రించడంలో సహాయపడతాయి.

అల్పాహారం చాలా ముఖ్యం..

ఖాళీ కడుపుతో ఎక్కువ సేపు ఉంటే మైగ్రేన్ త్వరగా వస్తుంది. కాబట్టి అల్పాహారం మిస్ అవ్వకూడదు. ఓట్స్, జావ, పండ్లు లేదా మొలకలు లేదా ఇతర టిఫిన్స్  వంటి పోషకమైన అల్పాహారం మాత్రమే తినాలి. టీ-కాఫీ,  ఎనర్జీ డ్రింక్స్ మానుకోవాలి. ఎందుకంటే అధిక కెఫిన్ కూడా ఈ తలనొప్పిని పెంచుతుంది.

స్క్రీన్ కు దూరం..

నిరంతరం స్క్రీన్ వైపు చూడటం మైగ్రేన్‌ను ప్రేరేపిస్తుంది. కానీ ఆఫీసులో నిరంతరం స్క్రీన్ వైపు చూడటం  తప్పనిసరి. అటువంటి పరిస్థితిలో ప్రతి 30 నిమిషాలకు 1-2 నిమిషాలు మీ కళ్ళను స్క్రీన్ నుండి మరల్చాలి.  వీపు నిటారుగా ఉండాలి, స్క్రీన్ కంటి స్థాయిలో ఉండాలి.  పాదాలు నేలపై ఉండాలి.

నీరు..  

మైగ్రేన్‌లో రోజంతా తగినంత నీరు త్రాగడం ముఖ్యం.  ఎందుకంటే డీహైడ్రేషన్ మైగ్రేన్‌ను పెంచుతుంది. ఒత్తిడి మధ్య ప్రశాంతంగా ఉండటానికి, లోతైన శ్వాస తీసుకోవాలి.  వాకింగ్ లేదా ఇష్టమైన సంగీతాన్ని వినడం వంటివి మానసిక స్థితిని మెరుగుపరచడంలో అలాగే మైగ్రేన్ తీవ్రతను తగ్గించడంలో సహాయపడతాయి.

ట్రిగ్గర్‌లు.

మైగ్రేన్ ట్రిగ్గర్‌లు ప్రతి వ్యక్తికి భిన్నంగా ఉంటాయి.  ఎక్కువ వెలుగు, పెద్ద శభ్దాలు,  ఆకలి, కాలానుగుణ మార్పులు,  ఎక్కువ స్క్రీన్ చూడటం వంటివి. మైగ్రేన్ వచ్చినరోజు ఆహారం, నిద్ర సమయం, ఒత్తిడి, వాతావరణం,  స్క్రీన్ సమయం గమనించాలి. ఇది మైగ్రేన్ ట్రిగ్గర్‌ను తెలుసుకోవడానికి  సహాయపడుతుంది.

సాయంత్రం..

రోజంతా  హడావిడిగా గడిచిన  తర్వాత విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం. కాబట్టి తేలికపాటి నడక, తోటపని, పెయింటింగ్ లేదా  విశ్రాంతినిచ్చే ఏదైనా ఇతర పని చేయాలి.

నిద్ర..

తగినంత నిద్ర మైగ్రేన్ రోగులకు ఔషధం కంటే తక్కువ కాదు. కాబట్టి 7–8 గంటలు నిద్రపోవాలి. నిద్రపోయే ముందు స్క్రీన్ కు దూరంగా ఉండాలి. గది వెలుతురు మసకగా,  వాతావరణం సౌకర్యవంతంగా ఉండేలా చూసుకోండి. ఇవన్నీ ఫాలో అయితే మైగ్రేన్ మాయమవుతుంది.

                         *రూపశ్రీ.

By
en-us Political News

  
ఉప్పు లేని వంట అస్సలు తినలేము. కానీ ఆహారంలో ఉప్పు ఎక్కువ తీసుకోవడం వల్ల శరీరంలో సోడియం స్థాయిలు పెరిగి రక్తపోటు లేదా బీపి సమస్యను తీసుకొస్తాయి. చాలామంది ఆహారంలో ఉప్పు తక్కువగానే తీసుకుంటారు...
ఆరోగ్యకమైన ఆహారాలలో పల్లీలు కూడా ఒకటి.  పల్లీలు అటు ఆరోగ్యాన్ని ఇస్తూనే ఇటు మంచి స్నాక్స్ గా కూడా ఉంటాయి.  పల్లీలలో మంచి కొవ్వులు..
శరీరం ఆరోగ్యంగా ఉంటే సరిపోదు. మానసికంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే శరీరం కూడా పూర్తీ ఆరోగ్యంగా ఉన్నట్టు అనిపిస్తుంది.  అయితే నేటి కాలంలో మానసిక  ఆరోగ్యం చాలా క్లిష్టమైన సమస్యగా మారింది. అధిక శాతం మంది మానసిక ఇబ్బందులు పడుతున్నారు...
రక్తంలో  చక్కెర శాతం ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఉండటాన్ని చక్కెర వ్యాధి లేదా డయాబెటిస్ అని అంటారు. ప్రపంచ దేశాలలో చక్కెర వ్యాధి బాధితులు భారతదేశంలోనే ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగించే అంశం...
భారతీయులకు టీ అంటే ఒక ఎమోషన్. అయితే టీ తో పాటు స్నాక్స్ కూడా తినడం చాలామంది అలవాటు. టీ పాటు తీసుకునే స్నాక్స్ లో చాలా వరకు బిస్కెట్లు తినేవారు ఎక్కువ.  అయితే పోషకాహార నిపుణులు మాత్రం..
ప్రతి ఒక్కరూ ఎక్కువ కాలం బ్రతకాలని అనుకుంటారు. కానీ చాలామందికి అది కలగా ఉంటోంది. నేటికాలంలో సగటు మానవుడి ఆయుష్షు చాలా క్షీణించింది.  ఒకప్పుడు మన ఋషులు, మహర్షులు కేవలం వంద కాదు.. కొన్ని వందల ఏళ్ళు బ్రతికారు....
మందారం పువ్వులు ప్రతి ఇంటి పెరట్లో  ఖచ్చితంగా ఉంటాయి.  ఎర్రగా ముద్దొచ్చే మందారాలలో బోలెడు ఔషద గుణాలు కూడా ఉంటాయి.  మందారాలను ఎక్కువగా పూజలలోనూ,  హెయిర్ కేర్ లోనూ ఉపయోగిస్తుంటారు. అయితే కేవలం జుట్టులో పెట్టుకోవడానికో లేదా జుట్టు సంరక్షణ కోసం మందారం నూనె లేదా హెయిర్ ప్యాక్ లోనో మాత్రమే కాదు....
శరీరంలో ముఖ్యమైన అవయవం గుండె.  ఏ ఇతర అవయవాలు సరిగా పని చేయకపోయినా ప్రాణం నిలబడుతుందేమో కానీ.. గుండె కొట్టుకోవడం కొన్ని నిమిషాల పాటు ఆగిపోతే శరీరం నిర్జీవం అవుతుంది...
భారతీయులు రిఫ్రెషింగ్ కోసం తీసుకునే పానీయాలలో టీ చాలా  ముఖ్యమైనది.  ఉదయం లేవగానే బ్రష్ చేసి టీ తాగాలి,  టిఫిన్ తినగానే టీ తాగాలి,  స్నేహితులతో బయట కలిస్తే టీ తాగాలి,  ఆఫీసు వర్క్ లో కాసింత బ్రేక్ కావాలంటే టీ తాగాలి...
ప్రతి మనిషి శరీరానికి సహజ ధర్మాలు ఉంటాయి.  ఆకలి వేసినప్పుడు ఆహారం తినడం,  దాహం వేసినప్పుడు నీరు త్రాగడం ఎలాగో.. మలమూత్ర విసర్జన కూడా అలాగే జరగాలి.  కానీ చాలామందికి మూత్రాన్ని ఆపుకునే అలవాటు ఉంటుంది...
ప్రతి ఏడాది ఎండలు పెరుగుతున్నట్టే చలి కూడా పెరుగుతోంది.   చివరి ఏడాది కంటే ఈ ఏడాది చలి తీవ్రత కూడా పెరిగింది.  చలి ఉదయం, రాత్రి వేళల్లో చాలా ఎక్కువగా ఉంటుంది.  ఇది నిజానికి చాలా మంది నిద్రించే సమయం...
లవంగాలు వంటింట్లో ఉండే ఒక మసాలా దినుసు.  
ఆయుర్వేదంలో ఉసిరికాయను "అమృతఫలం" అని పిలుస్తారు.  అంటే అమృతంతో సమానమైన ఔషద గుణాలు కలిగిన ఫలం. అమృతంలాగా శరీరానికి గొప్ప ఆరోగ్యాన్ని చేకూర్చుతుంది అని అర్థం.  ఉసిరికాయలో అనేక విటమిన్లు, ఖనిజాలు...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.