Publish Date:Jan 30, 2025
ఆంధ్రప్రదేశ్ కొత్త డీజీపీగా హరీశ్ గుప్తాను నియమిస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత డీజీపీ ద్వారకా తిరుమలరావు పదవీకాలం ఈ నెల 31వ తేదీతో ముగియనున్న నేపథ్యంలో హరీశ్ గుప్తాను కొత్త డీజీపీగా నియమించింది. ఈయన గతంలో కూడా ఒక సారి రాష్ట్ర డీజీపీగా పని చేశారు. గత ఏడాది ఎన్నికల సమయంలోనూ హరీశ్ గుప్తాను ఎన్నికల సంఘం డీజీపీగా నియమించిన సంగతి తెలిసిందే. ఆ తరువాత కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తరువాత ద్వారకా తిరుమలరావును డీజీపీగా నియమించింది.
ఇప్పుడు మళ్లీ రాష్ట్ర ప్రభుత్వం హరీష్ గుప్తాను డీజీపీగా ఎంపిక చేసింది. 1992 బ్యాచ్కు చెందిన ఈయన ప్రస్తుతం విజిలెన్స్ డీజీగా ఉన్నారు. ఒక సారి డీజీపీగా పని చేసిన అధికారికి మరోసారి డీజీపీగా బాధ్యతలు అప్పగించడం చాలా చాలా అరుదుగా జరుగుతుంటుంది. ఈ కారణంగా ఏపీ డీజీపీగా హరీష్ కుమార్ పగ్గాలు చేపట్టనుండటం ప్రత్యేకతను, ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రస్తుతం కొత్తగా డీజీపీ బాధ్యతలు చేపట్టనున్న హరీష్ కుమార్ గుప్తాను గత ఎన్నికల సమయంలో ఎన్నికల సంఘం ఏపీ డీజీపీగా ఎంపిక చేసింది. అప్పటి వరకూ రాష్ట్ర డీజీపీగా ఉన్న కేవీ రాజేంద్రనాథ్ రెడ్డిని తప్పించి హరీష్ కుమార్ ను ఎంపిక చేసింది. దీంతో హరీష్ కుమార్ 2024 మే 6 నుంచి 2024 జూన్ 19 వరకు ఆయన డీజీపీగా ఉన్నారు.
హరీష్ కుమార్ గుప్తా 1992 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ అధికారి. జమ్మూ కాశ్మీర్ కు చెందిన ఈయన కెరీర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఖమ్మం జిల్లా ఏఎస్పీగా మొదలైంది. ఆ తరువాత ఆయన మెదక్, పెద్దపల్లి లలొఏఎస్పీగా పని చేశారు. అదనపు ఎస్పీగా కరీంనగర్లో పని చేశారు. కృష్ణా, నల్గొండ జిల్లాల్లో ఎస్పీగా పని చేసిన ఆయన ఆ తరువాత సీఐడీలో ఎస్పీగా పని చేశారు.
ఇక 2017 నుంచి 2019 వరకు లా అండ్ ఆర్డర్ విభాగంలో అడిషనల్ డీజీగా పని చేసిన హరీష్ కుమార్ గుప్తా ఆ తరువాత పోలీసు రిక్రూర్మెంట్ బోర్డు చైర్మన్గాను, హోం శాఖ ముఖ్య కార్యదర్శిగాను పని చేశారు. ప్రస్తుతం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం డీజీగా ఉన్నారు. ఈ మధ్యలో ఆయన హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో సౌత్జోన్ డీసీపీగా పని చేశారు. తర్వాత విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మంట్ విభాగానికి డీఐజీగా కూడా విధులు విర్వర్తించారు. అలాగే గుంటూరు రేంజ్ ఐజీగాను బాధ్యతలు నిర్వర్తించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ap-new-dgp-harish-kumar-gupta-career-progressed-like-25-192064.html
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై చార్జ్షీట్ విడుదల చేశారు.
మ్మెల్యేగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీకి ఆయన గైర్హాజరుపై రేవంత్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి హాజరుకాకుంటే కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు. తనను ఎన్నుకున్న నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
ఆయన పులివెందులపైనే ఎక్కువగా కాన్సట్రేట్ చేయడంతో ఆయనకు పులివెందులలో పట్టు జారుతోందన్న భయం పట్టుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అలాంటి భయమే లేకపోతే.. మాజీ సీఎంగా రాష్ట్రం మొత్తం తిరగాల్సిన ఆయన అది మానేసి సొంత నియోజకవర్గానికే ఎక్కువగా పరిమితం అవ్వరని అంటున్నారు.
ప్రకాశం జిల్లాలో మరీ ముఖ్యంగా ఒంగోలులో గట్టి పట్టు, రాజకీయ పలుకుబడి ఉన్న సీనియర్ నేత అయిన బాలినేనికి, జనసేనలో ఏ మాత్రం ప్రాధాన్యత లభించడంలేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు, స్థానిక పరిస్థితులు కూడా ఆ ప్రచారానికి బలం చేకూర్చేవిగానే ఉంటున్నాయి.
భారత రాజకీయాల్లో ఇప్పుడు పార్లమెంట్ సీట్ల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లుల చుట్టూ తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
వైసిపి సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి.. రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చొక్కా పట్టుకుని దాడి చేసి కొట్టారని.. ఇదే విషయాన్ని ఇటీవల విజయసాయి ఓ బహిరంగ లేఖ ద్వారా వెల్లడించిన విషయాన్ని కన్ ఫర్మ్ చేశారు.
ఇండియా కూటమి తరఫున రాహుల్ గాంధీనే ప్రధానమంత్రి అభ్యర్థి అని కుండబద్దలు కొట్టారు. ఆ విషయాన్నే తమిళనాడు కాంగ్రెస్ శాసనసభాపక్ష నాయకురాలు తారాహై కత్బర్ట్ మరింత క్లారిటీ ఇస్తూ.. విజయ్ ప్రధాని అవుతారంటూ కొందరు ప్రచారం చేయడం కేవలం టీవీకే శ్రేణుల ఉత్సాహం వల్ల జరుగుతున్న ప్రచారమే తప్ప, అది ఆ పార్టీ అధికారిక వైఖరి కాదన్నారు.
Publish Date:Aug 31, 2026
రాజకీయ క్షేత్రంలో ముందస్తు ఊహాగానాలు, భవిష్యత్ ఎన్నికల అంచనాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే సాగుతుంటాయి. ఈ నేపథ్యంలో సపోజ్ ఫర్ సపోజ్ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందన్న చర్చ జోరందుకుంది. రానున్న రాజకీయ సమీకరణాలపై చర్చోపచర్చలు మొదలయ్యాయి.