Publish Date:Nov 12, 2024
ఆంధ్రప్రదేశ్ లో జగన్ ఐదేళ్ల అరాచక పాలన అంతమై.. చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కొలువుదీరి నిండా ఐదు నెలలు పూర్తికాకుండానే.. సన్ రైజ్ స్టేట్ గా ప్రపంచ వ్యాప్త గుర్తింపును సాధించింది. పెట్టుబడులకు గమ్యస్థానంగా మారింది. దేశంలోనే మోస్ట్ హ్యాపెనింగ్ సిటీగా ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. బాబు దార్శనికతపై ఇన్వెస్టర్లలో, పారిశ్రామిక వేత్తలలో ఉన్న నమ్మకం ఏ స్థాయిలో ఉందో తెలుస్తోంది. చంద్రబాబు అంటే సంపదసృష్టికర్త, ఆ సృష్టించిన సంపదను సమాజంలోని అణగారిన వర్గాలకు సంక్షేమంగా అందించాలన్న దృక్ఫథం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, ఆ తరువాత విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు తన మార్క్ అభివృద్ధిని ప్రపంచానికే రోల్ మోడల్ గా మార్చింది. అయితే 2019 ఎన్నికలలో వైసీపీ అధికారంలోకి వచ్చి జగన్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టడంతో ఏపీ అభివృద్ధి తిరోగమనంలో పడింది. అస్తవ్యస్థ విధానాలు, అరాచక పాలన, దోపిడీ, దౌర్జన్యం, కక్ష సాధింపు ఇవే ఆంధ్రప్రదేశ్ లో ఐదేళ్ల పాటు సాగాయి. పరిశ్రమలు తరలివెళ్లిపోయాయి. ఇన్వెస్టర్లు ఆంధ్రప్రదేశ్ వైపే చూడటం మానేశారు. నవ్యాంధ్రప్రదేశ్ ను పెట్టుబడుల గమ్యస్థానంగా మార్చేందుకు 2014 నుంచి 2019 వరకూ ముఖ్యమంత్రిగా చంద్రబాబు చేసిన కృషి బూడిదలో పోసిన పన్నీరు చందంగా మారిపోయింది. ఏపీ ఇమేజ్ దెబ్బతింది.
2024 ఎన్నికలలో జగన్ సర్కార్ పతనమై తెలుగుదేశం కూటమి కొలువుదీరిన తరువాత కూడా సర్వత్రా అనుమానాలే. చంద్రబాబు ఏపీకి పోయిన బ్రాండ్ ఇమేజ్ ను మళ్లీ తీసుకురాగలరా? సంపదసృష్టితో అభివృద్ధి సంక్షేమాలను జోడుగుర్రాళ్లీ పరుగులెత్తించగలరా? అన్న సందేహాలను పరిశీలకులు సైతం వ్యక్తం చేశారు. ఎందుకంటే జగన్ ఐదేళ్ల హయాంలో ఆంధ్రప్రదేశ్ ఇక ఎన్నటికీ తేరుకోలేదన్నంతగా విచ్ఛిన్నమైంది. కానీ చంద్రబాబు తన అనుభవంతో అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తున్నారు. అన్ని విధాలుగా అధోగతి పాలైన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నారు.
ఏపీకి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా రాష్ట్రంలో 65 వేల కోట్ల రూపాయల పెట్టుబడులకు రిలయెన్స్ ముందుకు వచ్చింది. అంటే దేశంలో గుజరాత్ రాష్ట్రం తరువాత రిలయెన్స్ ఏపీలోనే భారీగా పెట్టుబడులు పెట్టడానికి రెడీ అయ్యింది. రాష్ట్రంలో 500 బయోగ్యాస్ ప్లాంట్స్ ఏర్పాటు చేయడానికి రిలయెన్స్ ముందుక వచ్చింది. ఇటీవల ముంబైలో పర్యటించిన మంత్రి నారా లోకేష్ అనంత్ అంబానీతో భేటీ అయ్యారు. ఆ భేటీ ఫలితమే ఇప్పుడీ పెట్టుబడులు. అలాగే టాటా పవర్ కూడా ఆంధ్రప్రదేశ్ లో సౌర, పవన్ విద్యుత్ రంగంలో 40 వేల కోట్ల పెట్టుబడులకు ముందుకు వచ్చింది. అంతే కాకుండా విశాఖ టిసీఎస్ కంపెనీ కొత్తగా ఐటి డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయబోతోంది. అలాగే టాటా గ్రూప్ ఏపీలో ఫైవ్ స్టార్ హోటల్స్ ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చింది. అలాగూ ఉమ్మడి ఉత్తరాంద్ర జిల్లాల నడిబొడ్డున భోగాపురం వద్ద అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. వచ్చే ఏడాది డిసెంబర్లోగా అక్కడి నించి విమానసేవలు ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకొని పనులు చేస్తున్నారు. ప్రస్తుతం దేశంలోనే మోస్ట్ హ్యాపెనింగ్ స్టేట్ గా ఆంధ్రప్రదేశ్ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ap-developement-unstopable-25-188238.html
పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనకు ముందే తెలుసని, నాయకత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు. అయితే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి.. క్షేత్రస్థాయిలో కేడర్ను కాపాడుకుంటూ వచ్చిన తనకు ఈ పరిణామం మనస్తాపానికి గురిచేసిందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు.
బాబు కూటమిని ఎందుకంత విలువైనదిగా భావిస్తున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూటమి ఎప్పుడెప్పుడు చీలిపోతుందాని కాచుకుని కూర్చుని ఉంది. ఏ అవకాశం వచ్చినా వారు వదిలిపెట్టినట్టే కనిపించదు. మొన్న కోట వినుత ఘటన, నిన్న అరవ శ్రీధర్ వ్యవహారం, ఇవాళ వర్మ ఇష్యూ.. ఇలా సమయం దొరికినపుడల్లా ఆయా అంశాలను బాగా హైలెట్ చేసి.. కూటమిలో ఏదో ఒక చిచ్చు రాజేయాలని చూస్తోంది వైసీపీ అధినాయకత్వం.
అతి కొద్ది మంది నేతలు జగన్ ప్రకటనను సమర్దిస్తూ.. అనుకూల ప్రకటనలు చేస్తుండగా.. మెజారిటీ లీడర్, క్యాడర్ మాత్రం జగన్ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
టీవీకే అధినేత విజయ్తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్రబాబు ఫొటోలేదని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వర్మ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జనసేన నేత, మాజీ ఎమ్మెల్యే దొరబాబు జోక్యం చేసుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వర్మ దురుసు వ్యాఖ్యలపై పార్టీలో అంతర్గతంగా చర్చించిన అధిష్టానం.. వర్మ వ్యవహారాన్ని తప్పుబట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.