Publish Date:Apr 28, 2020
సినీ సెలెబ్రిటీలు, వ్యాపారవేత్తలు.. కాస్ట్ లీ కారులు కొనడం, ఖరీదైన బట్టలు, వాచ్ లు ధరించడం కామన్. ఆ సెలబ్రిటీ కొన్న కారు ఇంత!! ఆ సెలబ్రిటీ పెట్టుకున్న వాచ్ ఇంత!! అని కామన్ పీపుల్ కూడా వాటి గురించి ఆశ్చర్యంగా చర్చింకుంటారు. కానీ రాజకీయ నాయకులు ఇలాంటి ఆడంబరాలకు పోతే విమర్శలు ఎదుర్కోక తప్పదు. రాజకీయ నాయకులు చాలా నిరాడంబరంగా జీవించాలి. వారు చేసే ప్రతి ఖర్చు ప్రజాసేవకే ఉపయోగించాలి. అయితే ఈ జనరేషన్ లో అలాంటి నాయకులు చాలా అరుదనే చెప్పాలి. నాయకులు కూడా దాదాపు సెలబ్రిటీల లాగానే జీవిస్తున్నారు. చూసి చూసి ప్రజలకు కూడా అలవాటు అయిపోతోంది. అయితే కొందరు నాయకులు మాత్రం.. సినీ సెలెబ్రిటీలు, వ్యాపారవేత్తలు కంటే విలువైనవి ధరించి విమర్శలు ఎదుర్కొంటున్నారు. అలాంటి వారిలో పీఎం మోడీ నుండి ఏపీ సీఎం జగన్ వరకు చాలా మంది ఉన్నారు.
మోడీ పేరు వింటే మనకి ముందుగా గుర్తొచ్చేది చాయ్ వాలా. ఓ చాయ్ అమ్మిన కుర్రాడు ప్రధాని స్థాయికి ఎదగడం గర్వకారణం. అయితే మోడీ సాధారణ స్థాయి నుండి వచ్చినా ఆయన జీవశైలి మాత్రం విలాసవంతంగా ఉంటుందని పలువురు విమర్శిస్తుంటారు. దానికి కారణం ఆయన ధరించే ఖరీదైన బట్టలు. మోడీ చాలా ఖరీదైన బట్టలు ధరిస్తాడని, అది కూడా ఒకసారి వేసిన డ్రెస్ మరోసారి వేయడని విపక్ష నేతలు ఆరోపిస్తుంటారు. ఓ సారి ఆయన సూట్ పై కాంట్రవర్సీ కూడా అయింది. మోడీ ధరించిన సూట్ పది లక్షలు అని, ఆయనకు సూట్ల మీదున్న శ్రద్ద సొసైటీ మీద లేదని, ఆ డబ్బుని పేదవారి కోసం ఖర్చు చేస్తే బాగుండేదని విపక్షాలు విరుచుకుపడ్డాయి. అయినా మోడీ డ్రెస్సింగ్ స్టైల్ లో మాత్రం మార్పు రాలేదనే చెప్పాలి.
ఇక 2016 సమయంలో కర్ణాటకలో అయితే ఖరీదైన వాచ్ ల చుట్టూ రాజకీయం తిరిగింది. అప్పటి సీఎం సిద్దరామయ్య చేతి వాచ్ రూ.70 లక్షలు అని విపక్షాలు ఆరోపించాయి. అప్పట్లో ఇది బాగా కాంట్రవర్సీ అయింది. ఇక మాజీ సీఎం కుమారస్వామి వద్దనైతే చాలా ఖరీదైన వాచ్ లు ఉన్నాయని ప్రచారం జరిగింది. వజ్రాలు పొదిగిన 50 లక్షల నుంచి కోటి విలువైన వాచ్ లు ఉన్నాయని వార్తలొచ్చాయి. అదేవిధంగా, సిద్దరామయ్య ఖరీదైన పెన్ను గురించి కూడా అప్పట్లో బాగా కాంట్రవర్సీ అయింది.
ఇలా లక్షల విలువైన వస్తువులు వాడుతూ చాలా మంది నాయకులు విమర్శలు ఎదుర్కొన్నారు. వారిలో ఏపీ సీఎం వైఎస్ జగన్ కూడా ఉన్నారు. ఆయన కాస్ట్ లీ వాచ్ కాంట్రవర్సీలో చిక్కుకున్నారు. జగన్ చేతికున్న వాచ్ ఖరీదు రూ.13 లక్షల 31 వేలు. కాస్ట్ లీ సీఎం అంటూ ఇప్పటికీ ఆయనపై పలువురు ట్రోల్ల్స్ చేస్తుంటారు. అంతేకాదు, జగన్ ధరించే చొక్కాలపై కూడా కాంట్రవర్సీ జరిగింది. ఆయన ధరించే చొక్కా ధర చాలా ఎక్కువగా ఉంటుందని, ఆ క్లాత్ ని ప్రత్యేకంగా తెప్పిస్తారని అంటుంటారు. మొత్తానికి పీఎం మోడీ నుండి సీఎం జగన్ వరకు పలువురు నాయకులు ఆడంబరాలకు పోయి విమర్శలు ఎదుర్కొన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ap-cm-ys-jagan-watch-becomes-talk-of-town-39-98454.html
రెండు స్థానాలు ఖాళీ అయి.. కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫకేషన్ జారీ చేయగానే.. బీఆర్ ఎస్ మైనారిటీ నాయకుడు, మాజీ హోం మంత్రి మహమూద్ అలీని రంగంలోకి దింపుతామన్న సంకేతాలు ఇచ్చింది. అలాగే రేవంత్ రెడ్డి వేంనరేందర్ రెడ్డి అభ్యర్థిత్వం కోసం పట్టుబడుతుండటంతో.. బీఆర్ఎస్ బీసీ నాయకుడిని రంగంలోకి దింపడం ద్వారా, రేవంత్ బీసీలకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పుకోవడాన్ని నిలదీసి ఇరుకున పెట్టాలని కూడా భావించినట్లు చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు ఆయన గురువారం విచారణకు హాజరయ్యారు. ఈ నెల 9 వరకూ ప్రతిరోజూ విచారణకు హాజరవ్వాల్సిందే. ఈ నేపథ్యంలోనే సీనియర్ జర్నలిస్టు డీవీ శ్రీనివాసరావు తెలుగువన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ కేసు పూర్వాపరాలు, పర్యవశానాలపై విశ్లేషించారు.
రేవంత్ ని అంచెలంచెలుగా ఎదిగేలా చేసి ఎంపీగా, ఆ తర్వాత సీఎంగా అవ్వడానికి దారి తీసింది. ఎవరిని ఎమ్మెల్సీ చేయాలని ఆనాడు రేవంత్ భావించారో, అదే వేం నరేందర్ రెడ్డి.. నేడు ఆయన రాజకీయ సలహాదారుగా క్యాబినేట్ ర్యాంకులో ఉంటూనే.. ఇప్పుడు పెద్దల సభలోకి సగర్వంగా అడుగు పెడుతున్నారు.
సీట్ల సర్దుబాటుపై డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్తో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఫోనులో మాట్లాడినట్టు తెలిసింది. తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలు ఉండగా, డీఎంకేతో కూటిమిలో భాగంగా 30 సీట్లకు తగ్గేది లేదని కాంగ్రెస్ ఇంత వరకూ పట్టుబడుతూ వచ్చింది. దీంతో సీట్ల పంపకాలపై పరిష్కారానికి డీఎంకేతో సంప్రదింపులు జరిపే బాధ్యతను కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరానికి పార్టీ అధిష్ఠానం అప్పగించింది.
హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి పోలీసు కమిషనరేట్ల పునర్వ్యవస్థీకరణతో పాటు కొత్తగా ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ ఏర్పాటు చేసిన విషయాన్నికేంద్ర హోంమంత్రికి వివరించిన సీఎం రేవంత్.. వేగంగా పెరుగుతున్న జనాభా, పట్టణ విస్తరణ, పరిశ్రమల వృద్ధి దృష్ట్యా రాష్ట్రానికి మరిన్ని ఐపీఎస్ అధికారుల అవసరం ఉందని, తెలంగాణ ఐపీఎస్ క్యాడర్ సంఖ్యను పెంచాలని కోరారు.
సంక్రాంతి సంబరాలు నుంచి ఏ కార్యక్రమం చేపట్టినా ఈ రెండు వర్గాల మధ్యా పోటీ కొనసాగుతున్నది. సీతం రాజు సుధాకర్ ఇందిరా ప్రియదర్శిని స్టేడియం వద్ద ముగ్గుల పోటీ నిర్వహిస్తే.. సిట్టింగ్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ కనకమాలక్ష్మి ఆలయం వద్ద ముగ్గుల పోటీ నిర్వహించారు. ఇది ఒక్కటే కాదు, కార్పొరేషన్ పదవుల విషయంలో కూడా తలో దిక్కు అడుగులు వేస్తున్నారు.
కొద్దికాలం కిందట శరద్ పవార్ తాను రాజ్యసభకు పోటీ చేసే ప్రశక్తే లేదని ప్రకటించారు. అయితే ఇటీవల ఆయన అన్న కొడుకు, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మరణించడంతో మనసు మార్చుకున్నట్లు చెబుతున్నారు. మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 స్థానాలు ఉండగా, ఒక రాజ్యసభ సీటు గెలవాలంటే 37 మంది ఎమ్మెల్యేల ఓట్లు అవసరం.
తెలంగాణలో ఖాళీగా ఉన్న రెండు రాజ్యసభ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను అధికారికంగా ప్రకటించింది.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత ప్రపంచ రాజకీయ పరిణామాలపై ఆసక్తికర చర్చ జరిగింది.
ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం నెమలి వేణుగోపాలస్వామి వారి కళ్యాణోత్సవం సందర్భంగా సోమవారం (మార్చి 2) దేవుడికి సమర్పించే పట్టువస్త్రాలను సమర్పించే విషయంలో కొలికపూడి దురుసుగా వ్యవహరించారు.
నెమలి వేణుగోపాలస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన కల్యాణోత్సవానికి ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావులు కుటుంబాలతో కలిసి హాజరయ్యారు. ఆలయ మర్యాదల ప్రకారం, ప్రోటోకాల్ అనుసరించి అధికారులు స్వామివారికి సమర్పించే పట్టువస్త్రాలను ఎంపీ కేశినేని చిన్ని చేతికి అందించారు.
వాస్తవానికి మల్లు భట్టి విక్రమార్క్ జగన్ ను తన కుమారుడి వివాహానికి జనగ్ ను బెంగళూరు వెళ్లి ఆహ్వానించాల్సి ఉంది. అయితే జగన్ స్వయంగా తాను మంగళవారం తాడేపల్లి వస్తాననీ, అప్పుడు ఆహ్వానిస్తే సరిపోతుందనీ కబురు పంపారు.
ఐదుగురు వైసీపీ ఎమ్మెల్సీలు తమ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అయితే మండలి సభ్యత్వానికి వారు చేసిన రాజీనామాలను చైర్మన్ ఇప్పటి వరకూ ఆమోదించలేదు.
మంత్రివర్గ విస్తరణ మాత్రమే అంటే కేబినెట్ లోకి ఒకరిని మాత్రమే తీసుకునే అవకాశం ఉంది. అలా కాకుండా.. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి సర్కార్ కొలువుదీరి రెండేళ్లు కావస్తున్నందున మంత్రివర్గంలో సమూల మార్పులు చేసే దిశగా చంద్రబాబు యోచిస్తున్నట్లు చెబుతున్నారు. తన కేబినెట్ నుంచి కొందరికి ఉద్వాసన పలికి కొత్తవారికి అవకాశం ఇవ్వాలన్న దిశగా చంద్రబాబు యోచిస్తున్నట్లు చెబుతున్నారు.