నాలుగుగోడల మధ్యా తొడగొట్టిన చందంగా జగన్ ప్రెస్ మీట్లు.!
Publish Date:Aug 14, 2026
Advertisement
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ బాయ్ కాట్ నిర్ణయంపై ఇప్పుడు హాట్ హాట్ చర్చ జరుగుతోంది. డిస్ క్వాలిఫై చేయాలి. జీత భత్యాలు నిలిపివేయాలి అంటూ వెల్లువెత్తుతున్న డిమాండ్లను పక్కన పెట్టినా.. జగన్ శైలి, తీరు పట్ల పొలిటికల్ సర్కిల్స్ లో హా పెద్ద ఎత్తున జరుగుతోంది. అసెంబ్లీ వేదికగా ప్రజా సమస్యలపై గళమెత్తాల్సిన వైసీపీ.. ప్రతిపక్ష హోదా అంటూ సభా సమావేశాలను బాయ్ కాట్ చేయడం.. యుద్ధ రంగంలోకి దిగకుండా నాలుగు గోడల మధ్యా కూర్చుని తొడగొడుతున్న చందంగా ఉందని పరిశీలకులు అంటున్నారు. యుద్ధ భూమిలో వెన్ను చూపడం ఎలాంటిదో.. రాజకీయ సమరంలో ప్రజాస్వామ్య దేవాలయం అసెంబ్లీకి గైర్హాజరు కావడం కూడా అలాంటిదేనని పరిశీలకులు అంటున్నారు. ప్రజలు ఇవ్వని11 మంది ఎమ్మెల్యేలతో విపక్ష హోదా అన్నది నిబంధనల ప్రకారం అవకాశం లేదు. ఆ సంగతి తెలిసికూడా ప్రతిపక్ష హోదా కోసం మంకుపట్టు పడుతూ సభా సమావేశాలకు దూరంగా ఉండటం ఆయన పరిణితి లేమికి, పలాయనవాదానికీ నిదర్శనంగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. ఇదే ఆయనలోని నాయకత్వసమర్థతపై కూడా సందేహాలకు తావిస్తోందంటున్నారు. చట్టసభ వేదికగా ప్రజల సమస్యలను వినిపించడం, ప్రభుత్వ పథకాలు, విధానాలలో ఉన్న లోపాలను ఎండగట్టాల్సిన ఆయన.. ప్రతిపక్ష హోదా కోసం సభా బహిష్కరణకు నిర్ణయించుకోవడం సమజసం కాదన్న అభిప్రాయమే సర్వత్రా వ్యక్తమౌతోంది. నియమ నిబంధనల ప్రకారం అసెంబ్లీలో మొత్తం స్థానాలలో కనీసం పది శాతం సభ్యుల బలం ఉన్న పార్టీకే అధికారికంగా ప్రతిపక్ష నేత హోదా దక్కుతుంది. 2024 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో వైకాపా కేవలం 11 స్థానాలకే పరిమితం కావడంతో.. ఏ రకంగా చూసినా, ఆయన ఎంతగా పట్టుబట్టినా ప్రతిపక్ష హోదా దక్కే అవకాశం ఇసుమంతైనా లేదు. ఐదేళ్లు రాష్ట్రానికి సీఎంగా పని చేసిన జగన్ కు ఆ విషయం తెలియని భావించలేం. ఒక వేళ విపక్ష హోదా లేకపోయినా.. జగన్ పులివెందుల ఎమ్మెల్యేగా అయినా సభకు హాజరై నియోజకవర్గ సమస్యలను ప్రస్తావించాలి. తనను నమ్మి గెలిపించిన పులివెందుల ప్రజల పట్ల ఆ మాత్రమైనా బాధ్యత వహించాలి. పులివెందుల నియోజకవర్గ ప్రజాప్రతినిధిగా, వైసీపీ అధినేతగా జగన్ సభకు హాజరై ప్రభుత్వాన్ని నిలదీయడం మాని తనకు వీలున్నప్పుడు, వీలైనప్పుడు మాత్రమే బెంగళూరు ప్యాలెస్ నుంచి తాడేపల్లి ప్యాలెస్ కు వచ్చి మీడియాకు ముఖం చూపించి తన పని ఇంతే అన్నట్లు వ్యవహరించడంపై పార్టీ శ్రేణుల్లోనే అసంతృప్తి వ్యక్తం అవుతోంది. అసెంబ్లీకి దూరంగా ఉంటూ తాడేపల్లి ప్యాలెస్ లో మీడియా సమావేశాలకు పరిమితమై, ఆ ప్రెస్ మీట్ లలో కూడా రాసుకొచ్చిన స్క్రిప్ట్ చదివేసి అంతేనని చుతులు దులుపుకుపోతున్న జనగ్ తీరు పట్ట వైసీపీ క్యాడర్ లో సైతం అసంతృప్తి వ్యక్తమౌతోంది. ప్రభుత్వ నిర్ణయాలను సభలో నిలదీస్తే వచ్చె ఎఫెక్ట్ ప్రోస్ మీట్ లో ప్రసంగాల వల్ల రాదని పరిశీలకులు అంటున్నారు. శాసనమండలిలో వైసీపీకి సంఖ్యాబలం ఉన్నందున, అక్కడ గట్టిగా పోరాటం చేయాలని జగన్ తన ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు సరే.. కానీ , అసెంబ్లీలో స్వయంగా పార్టీ అధినేత జగన్ పోరాడకుండా ప్యాలెస్ కే పరిమితం అవ్వడం పార్టీ శ్రేణులకే కాదు ప్రజలకు కూడా తప్పుడు సంకేతాలే ఇస్తున్నాయి. ఇక పార్టీ శ్రేణుల్లో విశ్వాసాన్ని నిలుపుకోవాలనుకునే నాయుడు ప్రజా పోరాటాల్లో వారిని ముందుండి నడిపించాలే కానీ, పిలుపు ఇచ్చాను చాలదా అన్న తీరున వ్యవహరిస్తే... పార్టీ శ్రేణులు డీలా పడతాయనీ, కంచె చేను సామెత చెప్పినట్లు తాడేపల్లి ప్యాలస్ నుంచే పార్టీని నడిపిస్తానంటే.. ఆ పార్టీ నేతలూ, శ్రేణులూ కూడా కడపదాటకుండానే మమ అనిపించేస్తారని అంటున్నారు. AP Assembly Sessions, YS Jagan Mohan Reddy Assembly Boycott, Chandrababu Naidu Leadership, AP Political News Telugu, Opposition Status Issue AP
http://www.teluguone.com/news/content/ap-assembly-sessions-39-228925.html





