మరో ఏడుగురు ఐఎఎస్ ల అరెస్టు తప్పదా?
Publish Date:May 21, 2012
Advertisement
ఎమ్మార్, జగన్ అక్రమాస్తులు, ఓబులాపురం మైనస్ కేసుల్లో నిబంధనలకు విరుద్ధంగా జి.వో.లు జారీ చేశారన్న ఆరోపణలపై రాష్ట్రానికి చెందిన మరో ఏడుగురు ఐ.ఎ.ఎస్. ఆఫీసర్లను సిబీఐ అరెస్టు చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులకు సంబంధించి ఇప్పటికే సీనియర్ ఐఎఎస్ బిపి ఆచార్, వు శ్రీలక్ష్మీ జైలులో ఉన్నారు. వీరుకాక మరో ఏడుగురు ఐఎఎస్ అధికారులకు కూడా ఈ కుంభకోణంలో ప్రమేయం ఉన్నట్లు సిబీఐ నిర్థారణకు వచ్చినట్లు తెలిసింది. వై.ఎస్. హయాంలో మౌలికసదుపాయాలూ, పెట్టుబడుల శాఖ కార్యదర్శిగా ఉన్న డాక్టర్ మన్మోహన్ సింగ్, రెవెన్యూ ముఖ్యకార్యదర్శిగా ఉన్న ఎస్,శామ్యూల్, నీటిపారుదల శాఖ కార్యదర్శిగా ఉన్న ఆదిత్యనాథ్, రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శిగా ఉన్న జె.ఎస్.వి. ప్రసాద్, రెవెన్యూ రిజిస్ట్రేషన్ ముఖ్యకార్యదర్శిగా ఉన్న కె.రత్నప్రభ, మున్సిపల్, పట్టణాభి వృద్ధిశాఖ ప్రిన్సిపాల్ సెక్రెటరీ డాక్టర్ పి.వీ.ఎస్.కె.శర్మ, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జి.శ్యాంబాబు పై సిబీఐ త్వరలోనే కేసులు నమోదు చేయబోతున్నట్లు తెలిసింది. జగన్ పై దర్యాప్తు ముమ్మరం చేసిన తరుణంలో తాజాగా ఈ ఏడుగురు ఐ.ఎ.ఎస్. అధికారులను ప్రాసిక్యూట్ చేయటానికి అనుమతి ఇస్తే అది ఈ ఉప ఎన్నికల్లో తమకు అనుకూలంగా మారగలదని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిసింది. నేరస్తులు ఎంతటి వారైనా తమ ప్రభుత్వం ఉపేక్షించదనే భావన ప్రజల్లో కలిగించాలని కిరణ్ ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఐ.ఎ.ఎస్.ల ప్రాసిక్యూషన్ ఫైలుపై సంతకాలు చేసి ఢిల్లీ పంపి అనుమతులు వచ్చేలా చూడాలనుకున్నట్లు సమాచారం.
http://www.teluguone.com/news/content/another-7-ias-officers-to-be-arrested-24-14171.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





