Publish Date:Apr 24, 2026
ఇప్పటి వరకూ ఒక నటుడు పార్టీ పెట్టి పోటీ చేసిన తొలి ఎన్నికల్లో తెచ్చుకున్న ఓట్ల శాతం ఎంత? వీరిలో అత్యధిక ఓట్ల శాతం తెచ్చుకున్న ఆ గొప్ప నటుడు ఎవరు? అన్నదిప్పుడు చర్చనీయాంశంగా మారింది. కారణం విజయ్ టీవీకే పార్టీ పెట్టి ఆ పార్టీని ప్రస్తుతం ఎన్నికల పరీక్షకు నిలపడంతో.. ఇతర నటుల పార్టీలు, అవి తొలి సారి ఎన్నికల్లో పాల్గొన్నపుడు సాధించిన ఓట్ల శాతం ఎంత? అన్న ఆసక్తికరమైన చర్చకు తెరలేచింది. వారిలో టాప్ మోస్ట్ ఎవరని చూస్తే.. డౌటెందుకు అన్న ఎన్టీఆర్. ఇదిరా తెలుగోడి సత్తా అన్న మాట వినిపిస్తోంది. మిగిలిన వారి ఓటింగ్ శాతమెంత? ఎన్టీఆర్ సాధించిన ఓట్ షేర్ ఏమిటి అని చూస్తే..
ఎన్టీఆర్.. పార్టీ స్థాపించిన 9 నెలలలో వచ్చిన ఎన్నికలలో తొలి సారి పోటీ చేసి.. 46.30శాతంతో పార్టీని 201 స్థానాలలో గెలిపించారు. ఇక ఎంజీఆర్ తన తొలి ప్రయత్నంలో 33.52శాతంతో 130 స్థానాలు, చిరంజీవి 16.32శాతంతో 18స్థానాలనూ దక్కించుకున్నారు. ఆ తరువాత తమిళనటుడు విజయకాంత్ తన పార్టీని తొలి ప్రయత్నంలో 8.38 ఓట్ల శాతంతో శాతంతో ఒక స్థానంలో మాత్రమే విజయం సాధించారు. ఇక జపవన్ కళ్యాణ్- 5.53శాతంతో ఒక స్థానం, కమలహాసన్- 2.52శాతంతో జీరో స్థానాలు సాధించారు. ఇక ఇప్పుడు విజయ్.. తన తొలి ప్రయత్నంలో ఎంత శాతం ఓట్లు సాధిస్తారు? ఎన్ని సీట్లలో ఆయన పార్టీ విజయం సాధిస్తుంది అన్న ఆసక్తి సర్వత్రా వ్యక్తం అవుతోంది. సర్వేలను బట్టీ చూస్తే ఆయనకు 15- 19 శాతం ఓట్ షేర్ రావచ్చనీ.. ఆయన సాధించబోయే సీట్ల సంఖ్య ఓ డజను వరకూ ఉండొచ్చనీ అంటున్నారు సెఫాలజిస్టులు.
ఏది ఏమైనా ఒక నటుడు పెట్టిన పార్టీ తొలి ఎన్నికల్లో సాధించిన ఓట్ల శాతం, గెలిచిన సీట్ల సంఖ్యలో ఇప్పటి వరకూ ఎన్టీఆరే టాప్. ఇది మరో నటుడికి ఎప్పటికీ సాధ్యం కాదంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఎన్టీఆర్ ఆల్ టైం గ్రేట్ రికార్డ్ ని బ్రేక్ అయ్యే అవకాశాలే లేవని విశ్లేషిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/anna-ntrs-record-is-unbreakable-39-218142.html
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై చార్జ్షీట్ విడుదల చేశారు.
మ్మెల్యేగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీకి ఆయన గైర్హాజరుపై రేవంత్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి హాజరుకాకుంటే కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు. తనను ఎన్నుకున్న నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
ఆయన పులివెందులపైనే ఎక్కువగా కాన్సట్రేట్ చేయడంతో ఆయనకు పులివెందులలో పట్టు జారుతోందన్న భయం పట్టుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అలాంటి భయమే లేకపోతే.. మాజీ సీఎంగా రాష్ట్రం మొత్తం తిరగాల్సిన ఆయన అది మానేసి సొంత నియోజకవర్గానికే ఎక్కువగా పరిమితం అవ్వరని అంటున్నారు.
ప్రకాశం జిల్లాలో మరీ ముఖ్యంగా ఒంగోలులో గట్టి పట్టు, రాజకీయ పలుకుబడి ఉన్న సీనియర్ నేత అయిన బాలినేనికి, జనసేనలో ఏ మాత్రం ప్రాధాన్యత లభించడంలేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు, స్థానిక పరిస్థితులు కూడా ఆ ప్రచారానికి బలం చేకూర్చేవిగానే ఉంటున్నాయి.
భారత రాజకీయాల్లో ఇప్పుడు పార్లమెంట్ సీట్ల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లుల చుట్టూ తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.