గంజాయి స్మగ్లింగ్ కు కేంద్రంగా మారిన ఆంధ్రా అటవీప్రాంతం
Publish Date:Apr 20, 2012
Advertisement
ఆంధ్రా అతవీప్రాంతాల్లోని విశాఖ, తూర్పుగోదావరి, ఖమ్మం ప్రాంతాల్లోని కారడవుల మీదుగా పెద్దఎత్తున గంజాయి అక్రమంగా రవాణా అవుతోంది. ఒరిస్సాలోని కొరాపుట్, ఆ చుట్టుపక్కల అటవీప్రాంతాల్లో వందలాది ఎకరాల్లో గంజాయి సాగు జరుగుతోంది. మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాలైన ఈ జిల్లాలో చుట్టుపక్కల ప్రదేశాలకు ప్రవేశించే సాహసం ఒరిస్సా పోలీసులు చేయటం లేదు. దీంతో ఇక్కడ కోట్లాది రూపాయల విలువైన గంజాయిని సేద్యం చేస్తున్నారు. ఈ గంజాయిని వివిధ మార్గాలద్వారా మన రాష్ట్రంలోకి, ఇక్కడి నుండి కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రలకు తరలిస్తున్నారు. స్మగ్లర్లు ఈ గంజాయిని తరలించేందుకు రాష్ట్రంలోని గిరిజనుల సహకారం తీసుకుంటున్నారు. కేవలం దట్టమైన అటవీమార్గం ద్వారానే దీన్ని తరలిస్తున్నారు. ఒక్కొక్క గిరిజనుడికి ఒక్కొక్క గంజాయిబస్తాను అప్పగించి నాలుగురోజుల ప్రయాణానికి మూడువేల రూపాయలు కిరాయి ఇస్తున్నారు. గిరిజనులు ఒక్కొక్కబస్తాను నెత్తిన పెట్టుకుని కాలినడకన నాలుగురోజుల పాటు ప్రయాణించి గమ్యస్థానానికి చేరుస్తున్నారు. అక్కడ నుంచి దీనిని కార్లలో లోడు చేసి గమ్యస్థానాలకు చేరుస్తున్నారు. గిరిజనులు ఎంచుకుంటున్న మార్గాలు రాష్ట్రంలోని పోలీసులకు గానీ, ఎక్సయిజ్ సిబ్బందికిగానీ అంతుబట్టడం లేదు. స్మగ్లర్లు వాహనాల ద్వారా సరుకును రవాణా చేస్తున్నప్పుడు మాత్రమే అప్పుడప్పుడు వాటిని గుర్తించగలుగుతున్నారు. అంతేగాని దట్టమైన అటవీమార్గం ద్వారా జరుగుతున్న గంజాయి రవాణాను మాత్రం అరికట్టలేకపోతున్నారు.
http://www.teluguone.com/news/content/andhrapradesh-forest-area-24-13500.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





