భారత్ అంటే భగ్గుమంటున్నారు ట్రంప్. అంతేనా ఇండియాపై యాభై శాతం సుంకాల మోత మోగిస్తున్నారు. దీంతో భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అవ్వాల్సిన సరుకంతా ఇండియాలోనే డెడ్ చీప్ గా అమ్ముకుని అసలైనా సరే రాబట్టుకోవాల్న ఆలోచన చేస్తున్నారు మన వ్యాపారులు. 2024- 25 నాటికి భారత్ యూఎస్ ద్వైపాక్షిక వాణిజ్యం విలువ 131 బిలియన్ డాలర్లు కాగా.. దీనిని 2030 నాటికి 500 బిలియన్ డాలర్లకు పెంచాలని ఇరు దేశాలూ లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఈలోగా ట్రంప్ రెండో సారి పీఠమెక్కడంతో ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల కంటే భారత్ నే టార్గెట్ గా పెట్టుకున్నారు ట్రంప్. ప్రస్తుతం అమెరికాలో కంపెనీలకు సీఈఓలుగా, ఇతర ఉన్నత స్థానాల్లో ఉన్న భారతీయుల నుంచి మొదలు పెడితే.. సాదా సీదా ఉద్యోగుల వరకూ అందరినీ అమెరికన్ కంపెనీలు తొలగించాలని ట్రంప్ పిలుపునిచ్చారు. ఇక్కడ వాస్తవ పరిస్థితి చూస్తే ఇందుకు భిన్నంగా ఉంది. అమెరికాలో అమ్ముడు పోతున్న ఐఫోన్లు సగానికి సగం భారత్ లో తయారవుతున్నవే.
అలాగే.. భారత్ వల్ల ఏయే అమెరికన్ కంపెనీలు, ఎంతేసి లాభాలు పొందుతున్నాయో.. లిస్ట్ చూస్తే గూగుల్, మెటా అమేజాన్, యాపిల్, మైక్రోసాఫ్ట్ కంపెనీలు ఏటా భారత్ డిజిటల్ రంగం నుంచి 15 నుంచి 20 బిలియన్ డాలర్ల మేర లబ్ధి పొందుతున్నాయి. అదే విధంగా మెక్ డొనాల్డ్, కోకాకోలా సహా ఇతర కంపెనీలు ఇక్కడి నుంచి మరో 15 బిలియన్ డాలర్ల మేర సంపాదిస్తున్నాయి. జేపీ మోర్గాన్, మెకస్సీ, గోల్డ్ శాక్స్ వంటి వాల్ స్ట్రీట్ ఫైనాన్షియల్ కన్సెల్టెన్సీలు కేవలం ఫీజుల రూపంలోనే 15 బిలియన్ డాలర్ల మేర వెనకేస్తున్నాయ్. ఇక ఔషధ రంగ పేటెంట్లు, హాలీవుడ్ సినిమాలు, స్ట్రీమింగ్ సర్వీసులు, రక్షణ ఒప్పందాల నుంచి వచ్చే ఆదాయం అదనం.
ఇదే కాకుండా సుమారు రెండున్నర లక్షల మంది భారతీయ విద్యార్ధులు ఏటా అమెరికాలో పై చదువుల పేరిట అక్కడికి వెళ్లి పెడుతున్న ఖర్చు అక్షరాలా 25 బిలియన్ డాలర్లు. దీన్నిబట్టీ చూస్తే భారత్ అమెరికా నుంచి ఏటా 85 బిలియన్ డాలర్ల మేర ఎగుమతుల రూపేణా పొందుతుంటే.. అంతే సమాన స్థాయిలో మన నుంచి ఏదో ఒక రూపంలో లబ్ధిం పొందుతోంది అమెరికా.
ఈ లెక్కన మనం కూడా ట్రంప్ లాగే.. వ్యవహరిస్తే.. దెబ్బకు దెబ్బ..చెల్లుకు చెల్లు అన్నట్లుగా సరిపోతుంది. దీంతో గ్లోబల్ మార్కెట్ దాదాపు స్ట్రక్ అయిపోతుంది. ఈ విషయం గుర్తించని ట్రంప్ పిచ్చిపిచ్చి నిర్ణయాలు తీసుకుంటూ.. దేశ ఆర్ధిక వ్యవస్థను దివాళా తీయిస్తున్నారని సాక్షాత్తూ అమెరికా అప్పీళ్ల కోర్టు అక్షింతలు వేసింది. ట్రంప్ నిర్ణయాలను తప్పుపట్టింది. అయితే ట్రంప్ సుప్రీం కోర్టును ఆశ్రయించి తన పంతం నెగ్గించుకునే పనిలో బిజీగా ఉండటంతో.. పాపం ఈ కంపెనీలకు ఏం చేయాలో పాలుపోవడం లేదట. మనం ఎలా చేశామో సరిగ్గా భారత్ కూడా అదే చేస్తే.. మా ఆదయం ఏం కాను దేవుడా అంటూ గుండెలు బాదుకుంటున్నాయట!
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/america-appeals-court-find-fault-trump-decessions-39-205607.html
ఈ విమానాశ్రయం కోసం పార్లమెంటులో తాను పలుమార్లు గట్టిగా గళమెత్తానని చెప్పుకున్నారు. ఇప్పుడూ విమానాశ్రయం దాదాపుగా పూర్తై.. త్వరలో ఆపరేషన్స్ ప్రారంభం కావడానికి రెడీ అవుతుండటం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. అంతే తప్ప ఈ విమానాశ్రయం విషయంలో జరుగుతున్న రాజకీయ రచ్చ గురించి ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడలేదు. అలాగే ఈ విమానాశ్రయానికి రెండో సారి శంకుస్థాపన చేసిన జగన్ ఊసెత్తలేదు.
తెలంగాణలో మరో కొత్త పార్టీ రాబోతోంది.
ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఎలాగైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలని అధికార డీఎంకే, బీజేపీతో పొత్తు ఉపయోగించుకుని రాష్ట్రంలో అధికారపగ్గాలు చేజిక్కించుకోవాలని ప్రతిపక్ష అన్నాడీఎంకే వ్యూహాలు రచిస్తున్నాయి. ఇక రాజకీయ పార్టీ స్థాపించి సినీ రంగం నుంచి రాజకీయరంగంలోకి దూకిన హీరో విజయ్ తన టివీకే పార్టీ తరఫున ఒంటరిగా ఎన్నికల రణరంగంలోకి దిగనున్నారు.
రండవాణేలోని కల్మాడీ హౌస్లో ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. ఆ తరువాత సాయంత్రం మూడున్నర గంటలకు పుణెలోని వైకుంఠ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ఫోన్ ట్యాపింగ్ ఎక్విపిమెంట్ కొనుగోలుకు అవసరమైన డబ్బును సమకూర్చింది నవీన్ రావే అని సిట్ విచారణలో తేలింది. అంతే కాకుండా, పాల్ రవి కుమార్ ద్వారా ట్యాపింగ్ ఎక్విపిమెంట్ను సమకూర్చినట్లు సిట్ నిర్ధారణకు వచ్చింది. పోన్ ట్యాపింగ్ కు ఒక ప్రైవేటు వ్యవహారంగా కాకుండా అది వ్యవస్థీకృతంగా పని చేసిందని నవీన్ రావు విచారణలో బయటపడినట్లు తెలుస్తోంది.
ఈ కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ను సుప్రీం ధర్మాసనం డిస్మిస్ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు.
రద్దు చేసిన కమిటీల స్థానంలో నెల రోజుల పాటు ఉండేలా అడ్ హాక్ కమిటీలను నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కమిటీలు రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించి అందజేసే నివేదిక ఆధారంగా కొత్త కమిటీలను ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత మరోసారి హరీష్ రావుపై హాట్ కామెంట్స్ చేశారు.
కొత్త సంవత్సరం చేతినిండా, నోటి నిండా పని పెట్టనుంది. ఎందుకంటే ఈ ఏడాది పలు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలన్నీతమతమ వ్యూహాలు, ఎత్తుగడలకు పని చెప్పనున్నాయి. పెద్ద రాష్ట్రాలుగా ఉన్న పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల అసెంబ్లీలకు 2026 తొలి అర్ధ భాగంలోనే ఎన్నికలు జరగనున్నాయి.
అందె శ్రీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందనీ, ఇందుకోసం చట్టపరమైన మద్దతు అవసరమని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో 1994పబ్లిక్ సర్వీస్ కమిషన్ చట్టంలోని నిబంధనలు సవరించాల్సి ఉందని తెలిపారు. అందె శ్రీ కుమారుడికి ఉద్యోగ అవకాశం కల్పించడం కోసం చేసిన సవరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టామన్నారు.
దేశంలో మోడీ పాలన అంతమవ్వాలంటే.. పొరుగు దేశాలైన శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్లలో జరిగిన ఉద్యమాల వంటివి ఇక్కడ కూడా రావాలని ఆయన అన్నారు.
ఏపీలో వైసీపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ రాష్ట్రంలో ప్రజలు తమకు ఇవ్వని ప్రతిపక్ష హోదా కోసం వైసీపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేస్తే.. తెలంగాణలో ప్రతిపక్ష హోదాలో ఉన్న బీఆర్ఎస్ అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యులను దీటుగా ఎదుర్కోవడంలో వైఫల్యం కారణంగా బాయ్ కాట్ చేస్తున్నదన్న చర్చ జరుగుతోంంది.