Publish Date:Oct 29, 2024
నందమూరి బాల కృష్ణ తాను హోస్ట్ చేస్తున్న అన్ స్టాపబుల్ షో ద్వారా అల్లు అర్జున్ నంద్యాల పర్యటన రేపిన రచ్చకు ఫుల్ స్టాప్ పేట్టేశారా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. అన్ స్టాపబుల్ విత్ బాలయ్య షో ద్వారా బాలకృష్ణ ఇప్పటికే మూడు సీజన్ లు సక్సెస్ ఫుల్ గా పూర్తి చేశారు. ఇప్పుడు నాలుగో సీజన్ గత సీజన్లకు మించి అన్నట్లుగా సాగుతోంది. ప్రతి శుక్రవారం ఆహా లో ప్రసారమౌతున్న ఈ అన్ స్టాపబుల్ షో సీజన్ ఫోర్ తొలి ఎపిసోడ్ కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గెస్ట్ గా వచ్చిన సంగతి తెలిసిందే. ఆ షో అంచనాలకు మించి విజయవంతమైంది.
ఇప్పుడు నాలుగో సీజన్ తరువాతి ఎపిసోడ్లకు గెస్ట్ లుగా ఎవరు వస్తారు అన్న ఆసక్తి సర్వత్రా వ్యక్తం అవుతోంది. తాజాగా ఈ షోలో పుష్ప 2 మూవీ ప్రమోషన్లలో భాగంగా అల్లు అర్జున్ పాల్గొననున్నారు. డిసెంబర్ 5న పుష్ప 2 రిలీజ్ అవుతుంది. అంతకు ముంది అన్ స్టాపబుల్ విత్ బాలయ్య షోలో అల్లు అర్జున్ సందడి చేయనున్నారు. ఇటీవలే అన్ స్టాపబుల్ ఫోలో అల్లు అర్జున్ తో ఎపిసోడ్ కు సంబంధించిన షూట్ కూడా జరిగింది.
దీంతో ఈ ఎపిసోడ్ లో బాలకృష్ణ కచ్చితంగా అల్లు అర్జున్ నంద్యాల పర్యటనపై ముప్పిరిగొన్న వివాదంపై ప్రశ్నలు సంధించడం ఖాయమని అంతా భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ నంద్యాల వెళ్లి ఆ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీలో ఉన్న శిల్పా రవిచంద్రకిషోర్ కు ఓటు వేయాలని పిలుపు నిచ్చిన సంగతి తెలిసిందే. అప్పట్లో అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థికి మద్దతు పలకడం మెగా అభిమానులకు తీవ్ర ఆగ్రహం తెప్పించిన సంగతి తెలిసిందే. ఒక వైపు పవన్ కల్యాణ్ వైసీపీకి వ్యతిరేకంగా కూటమి తరఫున బరిలో ఉన్నారు. అటువంటి సమయంలో వైసీపీ అభ్యర్థిగా మద్దతుగా అల్లు అర్జున్ మాట్లాడటంతో మెగా, అల్లు ఫ్యామిలీల మధ్య రిలేషన్స్ బాగా లేవా అన్న ప్రచారం కూడా జరిగింది. అది ఇప్పటికీ అలాగే ఉంది. బాలయ్య తన అన్ స్టాపబుల్ షో ద్వారా ఆ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టే అవకాశాలున్నాయని అంటున్నారు. ఇటు అల్లు అర్జున్ కూడా తాను నంద్యాల ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో, తన ఉద్దేశమేంటో అల్లు అర్జున్ క్లారిటీ చెప్పే అవకాశం ఉంది. ఈ ఎపిసోడ్ ప్రసారం తరువాత అల్లు అర్జున్ నంద్యాల పర్యటన వివాదానికి ఫుల్ స్టాప్ పడే అవకాశాలు మెండుగా ఉన్నాయని అటు బన్నీ అభిమానులు, ఇటు మెగా అభిమానులూ కూడా భావిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/allu-arjun-as-guest-in-balayya-unstopable-show-39-187620.html
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.