తెలంగాణ కొత్త సీఎస్ గా అజయ్ మిశ్రా?

Publish Date:Dec 4, 2019

Advertisement

 

తెలంగాణకు కొత్త ప్రధాన కార్యదర్శి రాబోతున్నారు. ప్రస్తుత సీఎస్ జోషి పదవీ కాలం త్వరలో ముగియనుండటంతో ఆ స్థానంలో ఎవరు వస్తారన్నది ఆసక్తికరంగా మారింది. సీనియారిటీ ప్రకారం చూస్తే జోషి తర్వాత అజయ్ మిశ్రా ఉన్నారు. 1984 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన మిశ్రా, 1960 జూలై 16 న జన్మించటంతో ఆయన పదవీ విరమణ 2020 జూలై వరకు ఉంటుంది. ప్రస్తుతం ఆయన ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. అజయ్ మిశ్రాను సీఎస్ గా నియమిస్తే ఆయన కేవలం 7 నెలలే ఆ పదవిలో కొనసాగే అవకాశముంది.

ఇక తెలంగాణ కేడర్ కు చెందిన ఐఏఎస్ అధికారులు కూడా రేసులో ఉన్నారు. ఇందులో వీపీ ఆచార్య టాప్ లో ఉన్నారు. అయితే జోషి కంటే ఆచార్య సీనియర్ అయినప్పటికీ గతంలో అతని పక్కన పెట్టారు కేసీఆర్. జోషిని సీఎస్ గా నియమించారు. దీంతో ఈసారైన ఆచార్యకు అవకాశం కల్పిస్తారా లేక పక్కనపెడతార అన్నది ఆసక్తికరంగా మారింది.

పలువురు కేంద్ర సర్వీసుల్లో ఉన్న ఐఏఎస్ అధికారులు కూడా సీఎస్ రేసులో ఉన్నారు. వినయ్ కుమార్, పుష్పా సుబ్రమణ్యం, హీరాలాల్ పేర్లను కూడా సీఎం కేసీఆర్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో కొత్త సీఎస్ గా ఎవరు బాధ్యతలు చేపడతారన్నది త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశముంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి సీఎస్ గా రాజీవ్ శర్మ నియమితులయ్యారు. ఆయన తర్వాత ప్రదీప్ చంద్ర సీఎస్ గా వచ్చారు. అయితే కేవలం నెల రోజులు మాత్రమే ప్రధాన కార్యదర్శిగా పని చేశారు.

By
en-us Political News

  
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్రంతో కయ్యానికి కాలు దువ్వుతున్నారా? మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రూట్ లో ఢిల్లీతో యుద్ధానికి సిద్దమవుతున్నారా? ఇంతవరకూ భడేభాయి ప్రధాని మోదీతో అంతో ఇంతో సయోధ్యగా ఉన్న రేవంత్ రెడ్డి ఇక పై అందుకు విరుద్ధంగా యుద్దానికి సిద్దమవుతున్నారా?
కాంగ్రెస్ మంత్రుల మధ్య విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. నెల్లూరు జిల్లాకే చెందిన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిల మధ్య విభేదాలు రచ్చకెక్కియి. నాగార్జున సాగర్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసే కార్యక్రమం సందర్భంగా ఈ విభేదాలు బహిర్గతమయ్యాయి.
వైసీపీ హయాంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అప్పులకుప్పలా మారిన రాష్ట్రాన్ని అభివృద్ధి అభివృద్ధిలో అగ్రగామిగా తీర్చిదిద్దుతున్నామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు.
అగ్రరాజ్యం అమెరికాలో మరో సారి కాల్పుల కలకలం రేగింది. న్యూయార్క్ లో జరిగిన ఈ కాల్పుల ఘటనలో ఓ పోలీసు అధికారి సహా ఐదుగురు మృత్యువాత పడ్డారు. న్యూయార్క్ లోని మన్ హట్టన్ లో ఆగంతకుడు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు.
వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌కు ఎన్‌సీఎల్‌టీలో భారీ ఊరట లభించింది. సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ వాటాల బదిలీపై జగన్‌ వేసిన పిటిషన్‌ను ఎన్‌సీఎల్‌టీ అనుమతించింది.
భారత్-ఇంగ్లండ్ మధ్య కీలకమైన చివరి, ఐదో టెస్ట్‌ లండన్ కెన్నింగ్టన్ ఓవల్‌ వేదికగా ఈ నెల 31 నుంచి ప్రారంభమవుతుంది. ఈ సిరీస్‌లో ఇప్పుడు ఇంగ్లండ్ 2-1తో ముందంజలో ఉన్నప్పటికీ, కెన్నింగ్టన్ వేదికలో ఇప్పటికే టీమ్ ఇండియా ఓ అరుదైన రికార్డ్ సాధించింది.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో కీలక భారీ రాకెట్ ప్రయోగానికి సిద్దమైంది.
మరో ప్రతిష్ఠాత్మక ప్రయోగానికి భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) నాసాతో కలిసి చేయనున్న ఈ కీలక ప్రయోగానికి మంగళవారం మధ్యాహ్నం నుంచి కౌంట్ డౌన్ ప్రారంభం కానుంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా సింగపూర్ లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. తన పర్యటనలో భాగంగా చంద్రబాబు మంగళవారం మూడో రోజు షెడ్యూల్ దాదాపు పది సమావేశాలతో బిజీబిజీగా ఉంది.
ప్రజాప్రతినిథి ప్రజా సేవలో 24 X7 పని చేయాలని జనం భావిస్తారు. ఆ నమ్మకంతోనే ఓట్లేసి గెలిపిస్తారు. అయితే చాలా మంది ఎన్నికలకు ముందు ప్రజా సేవ పట్ల చూపిన ఆసక్తిని ఆ తరువాత చూపించరు.
కుల ధ్రువీకరణ పత్రాల జారీ ప్రక్రియను వేగవంతం చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కుల ధృవీకరణ పత్రాల జారీ కోసం ఇంటింటి సర్వే చేపసట్టాలని నిర్ణయించింది.
ఎస్ బీఐ లో భారీ చోరీ జరిగింది. శ్రీసత్యసాయి జిల్లా తూముకుంట పారిశ్రామికవాడలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచిలో ఆదివారం అర్ధరాత్రి దాటిన తరువాత దుండగులు చోరీకి పాల్పడ్డారు.
కేరళ నర్సు నిమిషప్రియ మరణ శిక్షను యెమెన్‌ ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు యెమెన్ ప్రభుత్వం సోమవారం అర్ధరాత్రి దాటిన తరువాత భారత గ్రాండ్‌ ముఫ్తీ, సున్నీ లీడర్‌ అబూబకర్‌ ముస్లియార్‌ కార్యాలయం ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.