తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరి ణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ అడిషనల్ ఎస్పీ భుజంగ రావు నివాసంలో ఎసీబీ అధికారులు బుధవారం (జూన్ 3) సోదాలు నిర్వహించారు. ఆయన నివాసం
తో పాటు పాటు ఆయనకు సంబంధించిన పలు ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు బుధవారం (జూన్ 3)ఉదయం నుంచి సోదాలు చేపట్టారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణల నేపథ్యంలో ఈ దాడులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. భుజంగరావు నివాసంతో పాటు ఆయన బంధువులు, సన్నహితు లకు చెందిన ఇళ్ళు ల్లో ఏసీబీ బృందాలు ఏకకా లంలో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా భూములు, భవనాలు, బ్యాంకు ఖాతాలు, పెట్టుబ డులు, వ్యాపార లావాదేవీ లకు సంబంధించిన పత్రాలను అధికారులు పరిశీలిస్తు న్నట్లు సమాచారం.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి ఈ కేసు రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ, పరిపాలనా వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఈ కేసులో పలువురు మాజీ పోలీసు అధికారులు విచారణను ఎదుర్కొంటుండగా, భుజంగ రావు పాత్రపై కూడా దర్యాప్తు సంస్థలు ప్రత్యేకం గా దృష్టి సారించాయి. తాజాగా ఆదాయానికి మించిన ఆస్తుల అంశంపై ఏసీబీ రంగంలోకి దిగడంతో కేసు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. సోదాల అనంతరం స్వాధీనం చేసు కున్న పత్రాలు, డిజిటల్ ఆధారాల పరిశీలన తర్వాత భుజంగరావుపై మరిన్ని కేసులు నమోదయ్యే అవకా శాలు ఉన్నాయని అధికార వర్గాలు భావిస్తున్నాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/acb-raids-former-additional-sp-bhujanga-raos-house-36-221602.html
ఒడిశా రాష్ట్రంలో వెలుగుచూసిన ఒక ప్రభుత్వ ఇంజనీర్ అవినీతి ఉదంతం ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.
కూకట్పల్లి మంజీరా మాల్లోని కింగ్ & క్వీన్స్ పబ్ రాత్రి సాధారణంగా హడావుడిగా ఉండే ప్రదేశమే.
గతంలో కంప్యూటర్లు కొత్తగా వచ్చినప్పుడు కూడా ఇలాంటి భయాలే వ్యక్తమయ్యాయి. కంప్యూటర్లు వస్తే అకౌంటెంట్లు, క్లర్కుల ఉద్యోగాలు పోతాయని అంతా భావించారు. కానీ వాస్తవంగా జరిగిందేమిటి? కంప్యూటర్ల వల్ల పాత ఉద్యోగ పద్ధతులు మారాయి తప్ప ఉద్యోగాలు తగ్గలేదు.. సరికదా మరిన్ని అవకాశాలు వచ్చాయి. సాఫ్ట్వేర్ అనే రంగం తెరమీదకు వచ్చింది. కోట్లాది మందికి సరికొత్త ఉపాధి లభించింది.
గచ్చిబౌలిలోని ఓ ఎలైట్ కోలివింగ్లో ఒక యువతి తన జీవితానికి చివరి అధ్యాయం రాసుకున్నది.
బీఆర్ఎస్ నేత సురేష్ రెడ్డి ఇంట్లో భారీ చోరి జరగడం తో హైదరాబాద్ సనత్ నగర్ జెడ్ కాలనీ ఇప్పుడు ఒక్క సారిగా చర్చల కేంద్రంగా మారింది.
ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల నడుమ ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ తన రష్యా పర్యటనను యథావిధిగా కొనసాగించాలని సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. డ్రోన్ల దాడుల వార్త వెలువడే సమయానికి ఆయన మాస్కో నుండి సెయింట్ పీటర్స్బర్గ్కు ప్రయాణిస్తున్నారు. అక్కడ నెలకొన్న భద్రతా ఏర్పాట్లు, తాజా పరిస్థితులపై ఉన్నతాధికారులతో సమీక్షించిన అనంతరం, లోకేష్ తన షెడ్యూల్లో ఎలాంటి మార్పులు చేయకూడదని నిశ్చయించుకున్నారు.
మలేషియా దేశంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి.
మధ్యతరగతి, సామాన్య కుటుంబాలపై మరోసారి చమురు భారం పడింది.
తమిళనాట బీజేపీకి ఆ పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, మాజీ ఐపీఎస్ అధికారి కె.అన్నామలై మూడు రోజుల క్రితం రాజీనామా చేశారు.
రంగారెడ్డి జిల్లా కోహెడలో నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధి, వ్యవసాయం, సంక్షేమ పథకాలపై విస్తృతంగా మాట్లాడారు.
అమెరికాలోని న్యూయార్క్ సిటీలోలో తెలుగు యువకుడు కుంచా అన్షుల్ దారుణ హత్యకు గురైనాడు.
తెలంగాణ భవన్లో ఖైరతాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతల సమావేశం నిర్వహించారు.
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో మరో పెను సంచలనం చోటుచేసుకుంది.