అభి‘షేర్’శర్మ సిక్సర్ల సునామీ.. ఢిల్లీ క్యాపిటల్స్ పై ఎస్ఆర్ హెచ్ సునాయాస విజయం

Publish Date:Apr 21, 2026

Advertisement

ఐపీఎల్ 2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్  హ్యాట్రిక్ విజయాలు సాధించింది. హైదరాబాద్  రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో మంగళవారం (ఏప్రిల్ 21) రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో ఆరెంజ్ ఆర్మీ పరుగుల సునామీ సృష్టించింది. ఓపెనర్ అభిషేక్ శర్మ అజేయ,  శతకంతో కదం తొక్కడంతో, ఢిల్లీ క్యాపిటల్స్‌పై 47 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ ఘన విజయం సాధించింది. సన్ రైజర్స్ ఓపెనర్ అభిషేక్ శర్మ.. అభిషేర్ శర్మలా మారిపోయి సిక్సర్ల మోత మోగించాడు. కేవలం 68 బంతుల్లో 10 ఫోర్లు, 10 భారీ సిక్సర్లతో 135 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. సొంతగడ్డపై సన్‌రైజర్స్ కు ఇది వరుసగా మూడో విజయం. ఈ విజయంతో ప్లేఆఫ్స్ దిశగా మరో అడుగు వేయడమే కాకుండా, పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ ఫీల్డింగ్ ఎంచుకోగా, తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్  పరుగుల వరద పారించింది. ఓపెనర్ అభిషేక్ శర్మ ప్రత్యర్థి బౌలింగ్ ను ఊచకోత కోశాడు.  మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్37 పరుగులు, ఇషాన్ కిషన్  పాతిక పరుగులు చేశారు.  చివరిలో హెన్రిచ్ క్లాసెన్   తనదైన శైలిలో మెరుపులు మెరిపించి 13 బంతుల్లో 37 పరుగులు చేశాడు. దీంతో సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో  2 వికెట్ల నష్టానికి 242 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది.

భారీ లక్ష్య ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ పోరాడినప్పటికీ, క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోవడంతో లక్ష్యానికి దూరంగా నిలిచిపోయింది. నితీశ్ రాణా  30 బంతుల్లో 57 పరుగులు, సమీర్ రిజ్వీ 41 పరుగులు, కేఎల్ రాహుల్ 37 పరుగులు రాణించినా ఫలితం లేకపోయింది. మిగతా బ్యాటర్లు విఫలం కావడంతో..లక్ష్యానికి దూరంగా నిలిచిపోయింది.  సన్‌రైజర్స్ బౌలర్లు అద్భుత ప్రదర్శన కనబరిచారు. యువ పేసర్ ఎషాన్ మలింగ  ఢిల్లీ పతనాన్ని శాసించాడు. కీలకమైన డేవిడ్ మిల్లర్  , ట్రిస్టన్ స్టబ్స్  సహా మొత్తం 4 వికెట్లు పడగొట్టాడు. మరోవైపు, యువ స్పిన్నర్ హర్ష్ దూబే తన మాయాజాలంతో ఆకట్టుకున్నాడు. కేవలం 2 ఓవర్లు బౌలింగ్ చేసి 12 పరుగులిచ్చి 3 కీలక వికెట్లు తీసి ఢిల్లీ ఓటమిని ఖాయం చేశాడు. దీంతో ఢిల్లీ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 195 పరుగులకే పరిమితమైంది. ఈ గెలుపుతో సన్‌రైజర్స్ 7 మ్యాచ్‌లలో 4 విజయాలు, 8 పాయింట్లతో పట్టికలో మూడో స్థానానికి చేరింది.  

By
en-us Political News

  
గత కొన్ని దశాబ్దాలుగా కెనడా విదేశీయులకు స్వర్గధామంగా నిలిచింది. అయితే, ఇటీవల కాలంలో పెరుగుతున్న జనాభా, గృహ నిర్మాణ రంగంలో సంక్షోభం, మౌలిక సదుపాయాలపై పడుతున్న ఒత్తిడి దృష్ట్యా కెనడా తన ఇమ్మిగ్రేషన్ విధానాన్ని కఠినతరం చేస్తోంది. తాజాగా తీసుకువచ్చిన బిల్ ప్రధానంగా కెనడా పౌరసత్వం పొందే ప్రక్రియలో పారదర్శకతను పెంచడంతో పాటు.. అనర్హులను ఏరివేసేందుకు ఉద్దేశించినదని చెబుతున్నారు.
ఇరాన్ జరిపిన డ్రోన్, క్షిపణి దాడుల సమయంలో అమెరికా స్థావరాల కంటే యూఏఈ సొంత రక్షణ వ్యవస్థలే సమర్థవంతంగా పనిచేయడం విశేషం. దీంతో అల్ ధఫ్రా వంటి భారీ అమెరికా సైనిక స్థావరాలు దేశానికి ఆస్తిగా కాకుండా.. శత్రువుల దాడులను ఆకర్షించేందుకు మాత్రమే ఉపయోగపడుతున్నాయన్న అభిప్రాయం వ్యూహకర్తల్లో వ్యక్తమవుతోంది.
యూఏఈ తన భద్రత, ఆర్థిక, కరెన్సీ వ్యూహాలను పునఃపరిశీలిస్తోంది. అమెరికా సైనిక దళాలకు ఆతిథ్యం ఇవ్వడం వల్ల నిజంగా ప్రయోజనం ఉందా? లేక ఇది దేశానికి అదనపు ప్రమాదాన్ని తెస్తుందా? అనే ప్రశ్నలు బలంగా వినిపిస్తున్నాయి.
బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి.దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అన్ని డిపోల ముందు డ్రైవర్లు, కండక్టర్లు పెద్ద సంఖ్యలో చేరి నిరసలకు దిగారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బస్టాండ్ లు, బస్ స్టేషన్లు బోసిపోయాయి. ఇక హైదరాబాద్ లో అయితే సిటీ బస్సులు రోడ్డెక్కకపోవడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
అనాథల రాతను మారుస్తూ ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ సంధించిన అక్షరాయుధం నెల్లూరులో ఒక అద్భుతాన్ని ఆవిష్కరించింది. మున్సిపల్ స్కూల్స్ భవనాలు చూసి ముగ్ధులై, భిక్షా పాత్రలను విసిరికొట్టి పుస్తకాలు పట్టిన ఆ చిన్నారుల పట్టుదల, నేడు వారిని సమాజం గర్వపడే హీరోలుగా నిలబెట్టింది.
వీరు ఒక వ్యక్తిగత కుటుంబ వివాదాన్ని ఆధారంగా చేసుకుని బాధితులపై ఒత్తిడి తెచ్చి లంచం డిమాండ్ చేసినట్లు బాధితులు ఎసిబి అధికారులను ఆశ్రయించడంతో అధికారులు రంగంలోకి దిగి సి ఐ ఎస్ఐలను అదుపులోకి తీసుకున్నారు.
సుబ్రహ్మణ్యం హత్య కేసు విచారణను ప్రభావితం చేసేందుకు అనంతబాబు ప్రయత్నిస్తున్నారనీ.. కోర్టులో తప్పుడు సాక్ష్యం చెప్పాలంటూ తమకు డబ్బు ఆశ చూపి, ప్రాణహాని తలపెడతామని బెదిరించారని నలుగురు కీలక సాక్షులు సర్పవరం పోలీస్ స్టేషన్‌లో చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు అనంతబాబు, ఆయన అనుచరులపై కేసు నమోదు చేశారు.
కేరళలోని త్రిస్సూర్‌లో మంగళవారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
ఓ మైనర్ బాలుడు తన స్నేహితుల మాదిరిగా రీల్స్ చేసి గుర్తింపు పొందాలని ఆశపడ్డాడు. కానీ అదే ఆలోచన చివరకు అతని ప్రాణాన్ని బలి తీసుకుంది.
మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో ఒక మామిడి తోట ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వచ్చిందని కుటుంబం ఆనందంతో ఉప్పొంగింది. కానీ ఆ ఆనందం కేవలం కొన్ని నెలలకే పరిమితమైంది.
త్వరలోనే పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరగనున్నాయన్న చర్చతో వినియోగదారుల్లో గుబులు రేగుతోంది.
హిమాలయ పర్వతాల మధ్య విరాజిల్లుతున్న పవిత్ర క్షేత్రం కేదార్‌నాథ్ ఆలయం రేపు ఉదయం 8 గంటలకు భక్తుల దర్శనార్థం తిరిగి తెరుచుకోనుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.