Publish Date:Jul 22, 2020
మనదేశం లో కరోనా ఉధృతి తీవ్రంగానే ఉంది. ప్రతి నిత్యం రికార్డ్ స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కేంద్రం ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ లెక్కల ప్రకారం ఇప్పటి వరకు సుమారు 12 లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు గా తెలుస్తోంది. ఐతే 12 లక్షలు కాదు.. ఇప్పటి వరకు ఇండియాలో దాదాపు 18 కోట్ల మందికి కరోనా సోకి ఉండవచ్చని థైరో కేర్ ల్యాబ్స్ అనే ప్రయివేట్ డయాగ్నస్టిక్స్ సంస్థ సంచలన రిపోర్టును బయటపెట్టింది. మన దేశంలో ఇప్పటికే 15 శాతం మంది ప్రజలు కరోనా బారినపడ్డారని తమ అధ్యయనం ద్వారా తేలిందని ఆ సంస్థ ఛైర్మన్ డాక్టర్ వేలుమణి ట్విట్టర్ ద్వారా తెలిపారు.
ప్రఖ్యాత డయాగ్నస్టిక్స్ సంస్థ అయిన థైరో కేర్ ల్యాబ్స్ దేశవ్యాప్తంగా 600 పిన్కోడ్స్లో సుమారు 60వేల మంది పై యాంటి బాడీ పరీక్షలు చేసింది. ఇందులో యావరేజ్ గా 15 శాతం మంది ప్రజల లో యాంటీ బాడీలు కనిపించాయని ఆ నివేదికలో పేర్కొన్నారు. మన శరీరంలో కరోనా వైరస్ ప్రవేశిస్తే.. దాన్ని ఎదుర్కొనేందుకు యాంటీ బాడీలు తయారవుతాయి. దీని ఆధారంగా టెస్టులో యాంటీబాడీలు కనిపించాయంటే వారికి కరోనా సోకినట్లేనని నిపుణులు చెబుతున్నారు. మన దేశం మొత్తంగా 15 శాతం అంటే దాదాపు 18 కోట్ల మందికి కరోనా సోకి ఉంటుందని థైరో కేర్ సర్వే తెలిపింది. ఐతే దీనికి 3 శాతం అటూ ఇటూగా వాస్తవ పరిస్థితులు ఉండవచ్చని ఆ సర్వే వెల్లడించింది.
ఇదే సర్వేలో హైదరాబాద్లోని వివిధ పిన్ కోడ్లలో పరిస్థితి ఈ విధంగా ఉంది. 500002,500060,500036,500026 పిన్కోడ్ కలిగిన ప్రాంతాల్లో వరుసగా 37.3 శాతం, 30.6శాతం, 23.5శాతం, 23.3 శాతం మందిలో యాంటీ బాడీలు కనిపించాయని ఆ సంస్థ సర్వే రిపోర్టులో పేర్కొన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/18-crore-indians-already-have-antibodies-against-the-novel-coronavirus-39-101758.html
దేశరాజకీయాల్లో ప్రతిపక్ష ఇండియా కూటమి అత్యంత కీలకమైన అడుగులు వేస్తోంది.
రాజ్యసభ ఎంపీ అభ్యర్థులుగా తెలుగు దేశం పార్టీ తరుపున సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ లు నామినేషన్ లు దాఖలు చేశారు.
కేవలం తన కోటరీ మాటలు నమ్మి ప్రజా క్షేత్రానికి దూరం కావడం వల్లే ఘోర పరాజయాన్ని చవిచూశారు. అయితే 2024 ఎన్నికలలో విజయం సాధించి అధికారం చేపట్టిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నిత్వం ప్రజలకు చేరువగానే ఉంటోంది. ఇక తాజాగా ఈ నెల 9 నుంచి 15 వరకూ ప్రజాబాట కార్యక్రమాలను నిర్వహించనుంది.
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పై తన విమర్శల మోతాదు పెంచారు. ఒక భూమి విషయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పెరు లాగి మీడియా దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నించారు. ఆ క్రమంలో కల్వకుంట్ల కవిత ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాలకు సంబంధించి అధికార తెలుగుదేశం పార్టీ (టీడీపీ) తమ అభ్యర్థుల ఎంపికను అధికారికంగా పూర్తి చేసింది.
ఈ గ్లోబల్ ఎక్స్పోజర్, కమ్యూనికేషన్ స్కిల్స్ నేడు ఆయనను జాతీయ స్థాయి రాజకీయాలకు, ముఖ్యంగా రాజ్యసభ కు సమర్థుడైన అభ్యర్థిగా నిలబెడుతున్నాయి. 2019 ఎన్నికలలో తెలుగుదేశం ఓటమి తరువాత టీడీపీ తీవ్ర సంక్షోభంలో ఉన్న తరుణంలో.. సాంప్రదాయ మీడియా కంటే డిజిటల్ మీడియా ద్వారా అధికార పక్షాన్ని ఎదుర్కోవడం ముఖ్యమని పార్టీ గుర్తించింది
ప్రస్తుత జాతీయ రాజకీయాల పరిస్థితులు, పార్టీ భవిష్యత్ ను పరిగణనలోకి తీసుకుని చింతకాయల విజయ్ రాజ్యసభకు పంపడమే సముచితమని ఆయన నిర్ణయించారు.
ప్రస్తుతం కేంద్రంలో తెలుగుదేశం పార్టీ అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తోంది. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న తరుణంలో పార్లమెంట్లో పార్టీ గళాన్ని బలంగా వినిపించగల యువ, విద్యావంతులైన నాయకత్వం అవసరమని చంద్రబాబు భావించినట్లు కనిపిస్తోంది.
అన్నామలై ఇప్పుడు నేరుగా సూపర్స్టార్ రజనీకాంత్తో చేతులు కలపబోతున్నారనే వార్త దావానలంలా వ్యాపిస్తోంది. వీరిద్దరూ కలిసి తమిళనాడులో ఒక సరికొత్త ప్రాంతీయ పార్టీని స్థాపించేందుకు సన్నాహాలు చేస్తున్నారనే వదంతులు తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి.
అలాగే అంతర్జాతీయ వాణిజ్యాన్ని ఊహించని రేంజ్లో పెంచడానికి ఈ ప్రాజెక్ట్ దేశానికి ఎంతో రక్షణ, ఆర్థిక ప్రయోజనకరమని కేంద్ర ప్రభుత్వం బలంగా చెప్తోంది. అయితే ఈ మెగా ప్రాజెక్టుపై లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తూ, ఇది దేశ చరిత్రలోనే అతి పెద్ద స్కామ్ అంటూ సంచలన ఆరోపణలు చేశారు.
తెలంగాణలో జనసేన పోటీ చేస్తుందన్న పవన్ కల్యాణ్ ప్రకటనపై స్పందించిన ప్రకాశ్ రాజ్ సింగిల్ గానా, పొత్తుతోనా అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు.
గతంలో ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రప్రదేశ్ నుండి గానీ, అంతకుముందు రెండుసార్లు గెలిచిన జార్ఖండ్ నుండి గానీ, లేదా ఆయన సొంత రాష్ట్రమైన గుజరాత్ నుండి గానీ ఈసారి అభ్యర్థిత్వం లభించలేదు. దేశంలోనే అత్యంత శక్తిమంతమైన రిలయన్స్ కార్పొరేట్ లాబీయింగ్ పప్పులు మారిన రాజకీయ సమీకరణాల ముందు ఉడకలేదు.
పవన్ రాజకీయ అవగాహనారాహిత్యానికి ఆయన వ్యాఖ్యలే తార్కానమన్నారు. ప్రపంచ పరిణామాలు ఏదిశగా నడుస్తున్నాయో కూడా ఆయనకు అర్థం కావడం లేదన్న వీ శ్రీనివాసరావు. . తమిళనాడులో సినీ నటుడు విజయ్ గెలుపు తర్వాత పవన్ కల్యాణ్పై ఒత్తిడి తీవ్రంగా ఉండడంతో ఆయన నిస్పృహనకు లోనవుతూ.. దీనివల్ల ఆయన ఏదేదో మాట్లాడుతున్నారన్నారు.
తమిళనాట విజయ్ సునామీ ప్రకంపనలు సద్దుమణగక ముందే, తమిళనాట మరో సీనియర్ సూపర్ స్టార్ రజినీకాంత్ పేరు పొలిటికల్ స్క్రీన్ పైకి రావడం పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది.