ప్రణబ్ను ఆహ్వానిస్తున్న రాష్ట్రపతి భవన్
Publish Date:Jul 24, 2012
Advertisement
పదమూడవ రాష్ట్రపతిగా ఎన్నికైన ప్రణబ్ ముఖర్జీకి స్వాగతం పలకడానికి రాష్ట్రపతి భవన్ను ముస్తాబు చేస్తున్నారు. నిజానికి ఆనాటి బ్రిటీషు పాలకులు తమ వైస్రాయి నివాసానికి ఈ భవనాన్ని కట్టారు. ఈ భవనం రెండులక్షల చదరపు అడుగుల స్థలంలో కట్టిన నాలుగంతస్తుల నిర్మాణం. 340 గదులున్న భవనమే ఇండియా ప్రధమపౌరుడు నివసించే భవనం .ఇండియా, యూరప్ సంస్కృతులు కలగలసిన అపూర్య కట్టణంగా ఇది ప్రసిధ్దికెక్కింది. దీన్ని నిర్మించడానికి. మూడు మిలియన్ కూబిక్ అడుగుల రాయి దీని నిర్మాణానికి వాడారు.తొలుత దీన్ని 4 సంవత్సరాలలో 4లక్షల పౌండ్లతో నిర్మించాలనుకున్నారు. కాని 17ఏళ్ల సుదీర్ఘ కాలం ఈ నిర్మాణానికి వెచ్చించవలసి వచింది.దానితో పాటే ఖర్చూ 12.4 లక్షల పౌండ్లకు పెరిగింది.ఈ అద్బుత కట్టడానికి 1931లో ప్రారంభోత్సవం జరిగింది. విశేషం ఏమంటే దీన్ని కట్టిన 18 ఏళ్లకు మనకు స్వాతంత్య్రం సిద్దించింది. దీనిలోని ఎల్లో డ్రాయింగ్రూమ్లో చిన్న ఫంక్షన్లు జరుగుతాయి. అంటే ఆడిటర్జనరల్, చీఫ్ ఎలక్షన్ కమీషన్ వారి పదవీభాద్యతలు చేపట్టే కార్యక్రమాలు ఇక్కడ జరుగుతాయి. దీని ప్రక్కనే ఉన్న గ్రే డ్రాయింగ్రూమ్ను ఎల్లో డ్రాయింగ్రూమ్ లోని అతిధుల సౌకర్యాల కోసం వినియోగిస్తారు. అశోకా హాల్ 32 మీటర్ల పొడవు, 20 మీటర్ల వెడల్పుతో హాలు క్రింద భాగం అంతా చెక్కతో ఉంటుంది. పైభాగం అంతా పెయింటిగ్స్తో అందంగా అలంకరించబడి ఉంటుంది.ఉత్తర డ్రాయింగ్ హాల్లో కింగ్జార్జి5, క్వీన్మేరి నిలువుటెత్తు, బస్ట్ సైజు ఫోటోలు ఉంటాయి. సెంట్రల్ హాలు ప్రక్కనే బిలియార్డు, బాల్రూము, 8 సింహాల నీళ్ల పంపులు దాని క్రింద సింకులతో బిగింపబడిఉంటుంది. దర్బారు హాలులో 2టన్నుల బరువైన షాడ్లియర్స్ 33 మీటర్ల పైనుండి వ్రేలాడుతూ ఉంటుంది. ఇక్కడే పద్మ అవార్డులు ఇస్తుంటారు. దీనిలో మరొక ముఖ్యమైన హాలు బ్యాంకెట్ హాలు ఒక పెద్ద బోజనపు బల్ల ఎదురుగా కుర్చీలు ఉంటాయి. దీనిలో ఒకే సారి 104 మంది కూర్చొని భోజనం చేయవచ్చు. ఈ హాలులో మాజీ రాష్ట్రపతుల ఫోటోలను వరుసగా ఉంచారు.రాష్ట్రపతి భవనానికి వెనుక పేరు గాంచిన మొఘల్ గార్డెన్ను చూడవచ్చు .దీనిలో ఉత్తర, దక్షిణభాగంగా విభజించారు. దీనిలోని పూలు మనల్ని కట్టిపడేస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు. వేలాడే ఉద్యానవనాన్నికూడా మనమిక్కడ చూడగలం. అత్యంత సౌందర్యవంతమయిన గులాబీతోట మన మనసులను విహరింపచేస్తాయి. దీనిలో ఉన్న వాటర్ఫాల్స్ పర్యాటకుల మనసు దోచుకుంటుంది. బోన్సాయ్ మొక్కలకు పేరుగాంచింది.దీన్నిమీకు చూడాలని ఉందా అయితే ప్రతి ఏడాది ఫిబ్రవరిలో ప్రజల సందర్శనం కొరకు తీసి వుంచుతారు. తాజ్మహల్, కుతూబ్మీనార్ల తరువాత దీన్ని సందర్శించడానికే ప్రజలు ఇష్టపడుతున్నారు.
http://www.teluguone.com/news/content/13th-president-of-india-pranab-24-15919.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





