కెసీఆర్ ఎక్కడున్నావ్?
Publish Date:Jul 25, 2012
Advertisement
ఇక నెక్ట్స్ తెలంగాణానే అంటూ కాలం గడుపుతూ వచ్చిన తెరాస అథ్యక్షుడు కెసీఆర్ ఇటీవల ఎక్కడా కనిపించటం లేదు. వార్తల్లో లేకుండా విశ్రాంతి జీవితం గడుపుతున్న కెసీఆర్కు వైకాపా గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయలక్ష్మి వచ్చి వెళ్లిందన్న విషయం కూడా తెలిసినట్లు లేదు. అంతేకాకుండా తెరాస నేతలు కూడా కెసీఆర్ ప్రస్తావన లేకుండా పనులు చేసుకుంటూ పోతున్నారు. తమకు కెసీఆర్ అవసరమే లేదన్నట్లు ఆ పార్టీ నేతలు వ్యవహరిస్తున్నారు. విజయమ్మ కెసీఆర్ కుమారుడు కెటిఆర్ ప్రాతినిథ్యం వహించే సిరిసిల్ల వస్తే కెసీఆర్ మాట వినిపించలేదేంటని యావత్తురాష్ట్రం ఆశ్చర్యపోయింది. ఉద్యమం చేయాల్సిన అవసరం లేదని ఇటీవల కెసీఆర్ చేసిన ప్రకటన అటు తెలంగాణావాదులకు, ఇటు సీమాంథ్రవాసులకు కోపం తెప్పించింది. ఎందుకంటే మామూలుగా లొంగని కేంద్రం ఉద్యమం మానేస్తే ఎలా లొంగుతుందని తెలంగాణావాదులు ప్రశ్నించారు. అలానే తెలంగాణా వచ్చేస్తుందన్న ధీమాతో కెసీఆర్ మాట్లాడటం సీమాంథ్రులను కలవరపెట్టింది. సరైన సమాచారం ఏదైనా వచ్చిందేమో అని సమైక్యాంథ్ర ఆందోళన చెందే సమయంలో ప్రణబ్ముఖర్జీ రాష్ట్రపతిగా ఎన్నికవటం కొంత ఊరట కలిగించింది. అయితే తెలంగాణావాదులు మాత్రం రాష్ట్రపతి ఎన్నికపై మండిపడుతున్నారు. తమను వ్యతిరేకించే ప్రణబ్కు పట్టడం కట్టడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నా కెసీఆర్ లేకపోవటం వల్ల ఆత్మహత్యలు తప్పాయని, ఉండి ఉంటే సిరిసిల్ల ఘటనపై విద్యార్థుల ఆత్మహత్యలకు హైడ్రామా ఆడిరచేవారని తెరాసలోని కొందరు నేతలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. కెసీఆర్ అందుబాటులో లేరన్న సంగతి తెలిసే తెరాస ఎంపీ, సినీనటి విజయశాంతి, హోంశాఖామంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిసి కొంత హడావుడి చేశారు. తెలంగాణా ఉద్యమాన్ని తప్పుపడుతున్నారని ఆమె హోంమంత్రికి వివరించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రౌడీలదని, వారు గూండాయిజం చేసైనా అనుకున్నది సాధిస్తారని, అనవసరంగా విజయమ్మకు సిఎం అధిక ప్రాధాన్యత కల్పించారని విమర్శించారు. ప్రత్యేక తెలంగాణాకు మద్దతు ఇస్తారు కదా అని విజయశాంతి మంత్రిసబితను ప్రశ్నించి తన అనుమానాలను తీర్చుకుంది. ఏమైనా కెసీఆర్ కనిపించకుంటే విజయశాంతికి పండుగేనేమో!
http://www.teluguone.com/news/content/-kcr-telangana-24-15957.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





