ఈ నాలుగు పనులు చేస్తే  100ఏళ్ల ఆయుష్షు గ్యారెంటీ అంట..!

Publish Date:Nov 26, 2024

Advertisement


 

కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో మంచివి.  ఎక్కువ కాలం బ్రతకాలంటే శరీరం దృఢంగా ఉండాలి.  ఇందుకోసం మంచి పౌష్టికాహారం తీసుకోవాలని అంటుంటారు. అయితే ఆహారం వివిధ రకాలుగా ఉంటుంది.  శాకాహారం,  మాంసాహారం అనే వర్గాలు అందరికీ తెలిసినవే.. శరీరం బాగా దృఢంగా ఉండాలంటే మాంసాహారం బాగా తినాలని అంటుంటారు కొందరు. కానీ 114ఏళ్ల  వయసున్న ఒక బామ్మ తన ఆయుష్షు వెనుక రహస్యాన్ని బయట పెడుతూ నాలుగు పనులు చేయడం  వల్లే తనకు దీర్ష ఆయుష్షు లభ్యమైందని, తను వాటిని ఫాలో అవుతున్నానని చెప్పుకొచ్చింది. ఇంతకీ అంత శక్తి వంతమైన ఆ నాలుగు పనులు  ఏంటో తెలుసుకుంటే..


నవోమి వైట్ హెడ్ అనే వృద్ధురాలి వయసు అక్షరాలా 114 ఏళ్ళు.  ఆమె పెన్సిల్వేనియాలో నివసిస్తుంది.  అమెరికా దేశంలోకెల్లా జీవించి ఉన్న అతిపెద్ద వయస్కురాలు ఈమెనె. ఈ ఏడాది సెప్టెంబర్ 28వ తేదీన ఆమె తన 114వ పుట్టినరోజును కుటుంబ సభ్యుల సమక్షంలో  జరుపుకుంది. 1910లో జన్మించిన ఈమె అన్నేళ్లు జీవించడం వెనుక నాలుగు రకాల కూరగాయల తో పాటు కొన్ని పనులు కూడా సహాయపడ్డాయట.

ఇంటి కూరగాయలు..

బామ్మగారు తను ఆహారంలో తినే కూరగాయలను తనే తన ఇంటి పెరట్లో పండించుకునేవారట.  ప్రతి కూరగాయను తన ఇంటి వెనుక ఉన్న స్థలంలో ఒక చిన్న తోట పెంచి అందులో పండించుకునే వారట. దీని వల్ల రసాయలనాలు లేని కూరగాయలను ఆహారంలో సాధ్యమైంది.  ఒక వేళ ఇంటి పెరడు లేకపోతే కనీసం మిద్దెతోట వంటివి ఏర్పాటు చేసుకుని ఆరోగ్యాన్ని సంరక్షించుకోవచ్చని అంటున్నారు.

చెడు అలవాట్లు..

చాలామంది చెడు అలవాట్ల కింద మద్యపానం, ధూమపానం ను చెబుతుంటారు.  ఇవి మనిషి ఆయుష్షును తగ్గిస్తాయి.  మద్యపానం., ధూమపానానికి దూరం ఉండేవారు దీర్ఘకాలం జీవించవచ్చని అంటున్నారు.

చురుకుదనం..

శారీరకంగా చురుకుగా ఉండటం ఎంతో ముఖ్యం.  ఎంత ఫిజికల్ యాక్టివిటీ ఉంటే అంత ఆయుష్షు అంటున్నారు.  ప్రతి రోజూ వ్యాయామం చేయడమే కాకుండా వీలైనన్ని పనులు సొంతంగా చేసుకోవడం వల్ల శరీరం బాగా ఫిట్ గా తయారవుతుంది.  ఇది ఎక్కువ కాలం జీవించడానికి సహాయపడుతుంది.

ఆహారం..

శరీరానికి శక్తికి మూల వనరు ఆహారమే.. తీసుకునే ఆహారం ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలి. సొంతంగా పండించుకున్న కూరగాయలను వండుకోవాలి.  ఇంటి ఆహారమే తినాలి.  బయటి ఆహారం అస్సలు తినకూడదట.  ముఖ్యంగా ఇప్పట్లో బాగా అమ్ముడుపోతున్న పిజ్జాలు,  బర్గర్లు,  ఫాస్ట్ ఫుడ్ అస్సలు తినకూడదని బామ్మగారు చెప్పారు.  సమతుల ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు.


                                 *రూపశ్రీ.

By
en-us Political News

  
చలికాలంలో చలి సహజమే.. కానీ కొందరికి సాధారణం కంటే ఎక్కువ చలి పెడుతూ ఉంటుంది. ఇంత చలి పెడుతుంటే ఇతరులు ఎలా భరిస్తున్నారో ఏంటో అనే ఫీలింగ్ కూడా కలుగుతుంది. మందం పాటి దుస్తులు దరించినా, స్వెట్టర్లు వేసుకున్నా కూడా కొందరికి లోపల వణుకు పుడుతూనే ఉంటుంది. అయితే ఇది చలి కారణంగా వచ్చే చలి కాదని, దీని వెనుక వేరే కారణాలు ఉంటాయని అంటున్నారు వైద్యులు. అసలు కొందరిలో అధికంగా చలి ఎందుకు పెడుతుంది? శరీరంలో కలిగే మార్పులు ఏంటి? తెలుసుకుంటే..
అల్పాహారం ప్రతి ఒక్కరూ తప్పకుండా ఉదయాన్నే తీసుకునే ఆహారం.  ప్రతి రోజూ ఉదయం 8 నుండి 9 గంటలలోపు అల్పాహారం తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుందని, రోజంతా చురుగ్గా ఉండటానికి సహాయపడుతుందని..
ఆహారం శరీరానికి ఎంతో అవసరం.  నేటి ఉరుకుల పరుగుల జీవితాలలో ఆహారం వండుకోవడానికి సమయం సరిపోక ఇబ్బంది పడేవారు చాలామంది ఉన్నారు.  ఇంట్లోనూ,  బయటా రెండు చోట్లా ఒత్తిడితో కూడుకున్న పనులు...
ఇనుప పాత్రలలో వండిన పదార్థాలు   ఆరోగ్యానికి ఎంతో మంచివి. నాన్ స్టిక్,  అల్యూమినియం తో ఇనుప పాత్రలలో వండిన ఆహారం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు.  ఇనుప పాత్రలలో వంట చేయడం..
తిప్పతీగ గురించి ఈ మధ్యకాలంలో చాలా సమాచారం వ్యాప్తి అవుతోంది.  ఒకప్పుడు గ్రామాల్లో రహదారులకు ఇరువైపులా పెరిగేవి తిప్పతీగ మొక్కలు.  ఇప్పుడు ఇళ్ళలో పెంచుకోవడం లేదా ఆన్లైన్ లో తిప్పతీగ పొడర్స్..
శరీరంలో ఏదైనా అవయవం లేదా ప్రాంతం అసౌకర్యానికి లోనైనప్పుడు, లేదా ఏదైనా దెబ్బ తగిలినప్పుడు నొప్పి కలుగుతుంది.  సాధారణంగా శరీరంలో కలిగే నొప్పులు  ఒకటి రెండు రోజులలో వాటికవే తగ్గిపోతాయి....
బాదం పప్పు రోజూ తినడం ఎంతవరకు ఆరోగ్యం? ఆరోగ్యం బాగుండాలంటే రోజుకు ఎన్ని బాదం పప్పులు తినాలి? తెలుసుకుంటే..
కార్పెల్ టన్నెల్ సిండ్రోమ్ అనేది ఒక సాధారణ చేతి సమస్య. అరచేతి వైపు ఎముకలు, స్నాయువులతో చుట్టుముట్టబడిన ఇరుకైన మార్గం అయిన కార్పల్ టన్నెల్‌లో ఉన్న నాడిని చేతిపై ఒత్తిడి చేసినప్పుడు ఇది సంభవిస్తుంది. చేతులలో తిమ్మిరి రావడం, వేళ్లలో జలదరింపు లేదా నొప్పి ఉండటం, రాయడంలో లేదా టైప్ చేయడంలో సమస్య ఉండటం, పదే పదే వస్తువులు చేతులలో పట్టుకోలేక జారవిడచడం, వస్తువులను పట్టుకోవడంలో ఇబ్బంది ఎదురుకావడం ఈ కార్పెల్ టన్నెల్ సిండ్రోమ్ ప్రధాన లక్షణాలు.
సోంపు నీటిని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకుంటే అద్బుతమైన ఆరోగ్యప్రయోజనాలు చేకూరుతాయంటున్నారు వైద్యులు, ఆహార నిపుణులు. అసలు సోంపు నీటిలో ఉండే శక్తి ఏంటి? దీని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?
ప్రకృతి ప్రసాదించిన అద్బుతమైన ఆహారాలు ఎన్నో ఉన్నాయి. సీజన్ వారిగా లభిస్తూ ఇవి ఆరోగ్యాన్ని ఎంతో గొప్పగా సంరక్షిస్తాయి...
ఆరోగ్యం కోసం,  శరీరానికి కావలసిన ప్రోటీన్,  పోషకాల కోసం డ్రై ఫ్రూట్స్, డ్రై నట్స్ తింటుంటారు.  వీటిలో వాల్నట్స్ కూడా ముఖ్యమైనవి...
సాయంత్రం అనగానే పనులన్నీ ముగించుకుని హాయిగా ఇంట్లో కూర్చుని కాఫీ, టీ, పాలు.. లాంటి పానీయాలు తాగుతూ ఎంచక్కా  ఏవైనా స్నాక్స్ తినడం గుర్తు వస్తుంది అందరికీ.  అవకాశం దొరకాలే కానీ ప్రతి ఒక్కరూ ఇంట్లో కూర్చుని సాయంత్రం స్నాక్స్ ఎంజాయ్ చేయాలని అనుకుంటారు...
వైట్ బ్రెడ్, బ్రౌన్ బ్రెడ్, మల్టిగ్రైన్ బ్రెడ్ అంటూ వివిధ రకాలు తీసుకుంటారు. ఇక మరి కొందరు సింపుల్ బ్రేక్ పాస్ట్ పేరుతో బ్రెడ్ ను అల్పాహారంగా తీసుకుంటారు. అయితే ప్రతి రోజూ బ్రెడ్ ను ఆహారంలో బాగంగా తీసుకోవడం మంచిదేనా అంటే.. అస్సలు మంచిది కాదని అంటున్నారు ఆహార నిపుణులు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.