దస్పల్లా భూములకు దొంగడాక్యుమెంట్లు?
Publish Date:Sep 23, 2012
Advertisement
విశాఖ నగరంలోని దసపల్లాభూములకు కొందరు ఆక్రమణదారులు దొంగడాక్యుమెంట్లు సృష్టించారు. ఈ డాక్యుమెంట్ల సాయంతో వేలాది కోట్ల విలువైన ఆ భూముల అమ్మకాలు జరుగుతున్నాయి. యథేశ్ఛగా రిజిస్ట్రేషన్లు కూడా జరిగిపోతున్నాయి. వందల కోట్ల రూపాయలు ఆక్రమణదారులు సొమ్ము చేసుకున్నారు. అయితే ప్రభుత్వపరంగా స్పందన వచ్చేప్పటికే ఆలస్యమైంది. దీంతో వారు చెలరేగుతున్నారు. గతంలో ఈ భములన్నీ ప్రభుత్వానివేనని ఆక్రమణదారులకు అవకాశం కల్పించిన అధికారులూ ధృవకకరిస్తున్నారు. అయితే వీరు ప్రస్తుతం ఉద్యోగవిరమణ చేసినందున ప్రస్తుత సిబ్బంది సాయంతో ముందుకు వెళ్లాలని సూచిస్తున్నారు. అయితే శాసనమండలిలో ఈ అంశం తీవ్రదుమారం లేపింది. వెయ్యికోట్లకు పైచిలుకు ఉన్న ఈ భూములను రక్షించుకుంటామని రెవెన్యూశాఖ మంత్రి రఘవీరారెడ్డి స్పష్టం చేశారు. విజిలెన్స్ సహాయంతో దర్యాప్తు జరిపిస్తామన్నారు. అయితే ఈ విషయంలో సుప్రీంకోర్టులో ప్రభుత్వపరంగా కౌంటర్ దాఖలు చేయటంలో జరిగిన ఆలస్యాన్ని ప్రతిపక్షనేత దాడివీరభద్రరావు తదితరులు గుర్తు చేశారు. ఎకరం వంద కోట్ల రూపాయలు విలువ చేసే ఈ భూములను వదిలేస్తే ఎలా అని నిలదీశారు. దీనిపై సభాకమిటీని కూడా వేయాలని పాలడుగు వెంకట్రావు తదితరులు డిమాండు చేశారు. రెవెన్యూ మంత్రి తన వివరణలో 1958లో గ్రౌండ్రెంట్ పట్టా ఇవ్వటంతో మొదలైన ఆక్రమణలు కొనసాగాయని స్పష్టం చేశారు. అన్ని చర్యలూ చేపట్టి ఆ భూమిని ఆక్రమణదారుల నుంచి వెనక్కి తీసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.
http://www.teluguone.com/news/content/-daspalla-property-24-17592.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





