నిధుల లేమితో ఐ అండ్ వీఆర్ విలవిల
Publish Date:Jun 20, 2012
Advertisement
ప్రభుత్వ పథకాల ప్రచారానికి సమాచార పౌరసంబంధాల శాఖ వెనకడుగు వేస్తున్నది. అసలు ప్రచారం నిర్వహించేందుకు ఈ శాఖ వద్ద ఏ ప్రతిపాదనా లేదని తేలిపోయింది. నిధుల లేమితో ఈ శాఖ సతమతమవుతున్నది. వివిధ పత్రికలకు ఇచ్చిన ప్రకటనలకు సంబంధించి గత ఏడాది జులై నుంచి బిల్లులు చెల్లించలేదని తెలుస్తున్నది. గత రెండు నెలలుగా ఉపఎన్నికల కొడ్ ఉన్నదని వివిధ పత్రికలకు ప్రకటనలు వాయిదా వేస్తూ ఆ శాఖ వచ్చింది. ఉప ఎన్నికల ఫలితాలు వచ్చాక పత్రికలకు ప్రకటన ఇవ్వాలంటే ఆ శాఖకు నిధుల విషయం గుర్తుకు వచ్చింది. కొత్త కమీషనర్ వచ్చిన తరువాత డైరెక్టర్ స్థాయిలోనే ప్రకటనలు తీసుకోవాలని ఆదేశించినట్లు తెలుస్తుంది. ఐ అండ్ ఆర్ శాఖకు వందకోట్ల బడ్జెట్ కు బదులు కేవలం 50 కోట్లు మాత్రమే విడుదల చేశారని, దీంతో బకాయిలు కోట్ల రూపాయల్లో పేరుకుపోయాయి. కొత్త అడ్వర్టయిజ్ మెంట్స్ ఇవ్వాలంటే నిధులు లేక విడుదల చేయడం లేదని తెలుస్తున్నది. ఈ విషయమై ఆ శాఖ ప్రభుత్వానికి లేఖ రాసింది. ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తే తప్ప ఈ శాఖ నుంచి ప్రభుత్వ ప్రకటనలు రావని తేలిపోయింది. చిన్న పత్రికలకు కనీసం 25,000 రూపాయలు ప్రకటనలు ఇచ్చి వాటిని ఆదుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి పోటీ విపరీతంగా పెరగడంతో గ్రేడింగ్స్ ఇవ్వాలని గత ఏడాది ఆ శాఖ నిర్ణయించింది. ఈ గ్రేడింగ్ వ్యవహారం ఇప్పటివరకూ తేలలేదు. కొన్ని పత్రికలకు రేట్ కార్డు మంజూరు చేసినా వాటికి కూడా ఈ శాఖ నుంచి ప్రకటనలు విడుదల కాలేదు. అన్ని శాఖల్లో ఉండే ప్రకటనల నిధులను సమీకరించి ఐ అండ్ పిఆర్ ద్వారా విడుదల చేసి ఆ శాఖల ద్వారా బిల్లు చెల్లించాలన్న ప్రతిపాదన ముందుకు సాగలేదు, నిధుల లేమితో ఆ శాఖ కుదేలవుతోంది. అయితే పత్రికల్లో ప్రకటనలు పక్కకు పెట్టి హోర్డింగ్ లకు మాత్రం ప్రకటనలు ఇవ్వడం గమనార్హం. ఏది ఏమైనప్పటికీ ఈ శాఖలో నిధులు లేనప్పటికీ క్షేత్ర స్థాయిలో ఔట్ సోర్సింగ్ ద్వారా ప్రభుత్వ పథకాలను ప్రచారం చేసేందుకు గ్రీన్ సిగ్నల్ లభించడం గమనార్హం.
http://www.teluguone.com/news/content/-congress-schemes-24-15002.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





