Publish Date:Apr 30, 2022
తెలంగాణ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశంసల వర్షం కురిపించి నెల రోజులు గడిచిందో లేదో.. తెలంగాణ సీఎస్ పనితీరుపై తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేశారు సీజేఐ ఎన్వీ రమణ. ఆర్బిట్రేషన్ సెంటర్ ప్రారంభోత్సవానికి హైదరాబాద్ వచ్చిన సీజేఐ ఎన్వీ రమణ దేశంలోనే మొట్టమొదటి ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ ఏర్పాటుకు కేసీఆర్ సహకారం కారణమన్నారు. అలాగే న్యాయాధికారుల పోస్టుల మంజూరులో ఆయన చూపిన చొరవను బహుదా ప్రశంసించారు. అంతలోనే ఏమైందో ఏమో శనివారం హస్తినలో జరిగిన ముఖ్యమంత్రులు, హైకోర్టు సీజేల సదస్సులో తెలంగాణ సీఎస్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం, హైకోర్టు సీజేలు తీసుకున్న నిర్ణయాల అమలులో సీఎస్ అలక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
ఈ సదస్సుకు సీఎం కేసీఆర్ డుమ్మా కొట్టారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హాజరయ్యారు. సీజేఐ సీఎస్ పై ఆగ్రహం వ్యక్తం చేయడానికీ, సీఎం ఈ సదస్సుకు హాజరు కాకపోవడానికి ఏమైనా సంబంధం ఉందా అన్న సందేహాన్ని పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.
ఢిల్లీలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు, రాష్ట్రాల ముఖ్యమంత్రుల సదస్సు కు చీఫ్ జస్టిస్ ఎన్.వి. రమణతో పాటు ప్రధానమంత్రి నరేంద్రమోడీ, కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు ఢిల్లీ, ఆంధ్ర ప్రదేశ్ సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ డుమ్మా కొట్టారు. చీటికీ మాటికీ హస్తిన బయలుదేరే సీఎం కేసీఆర్ ఈ సదస్సుకు డుమ్మా కొట్టడానికి కారణమేమిటన్న విషయంపై సర్వత్రా ఆసక్కి నెలకొంది. రాజకీయ కారణాల వల్లనే కేసీఆర్ ఈ సదస్సుకు డుమ్మా కొట్టారని అంతా భావిస్తున్నారు. అయితే సీజేఐ తెలంగాణ సీఎస్ తీరుపై చేసిన వ్యాఖ్యలతో కేవలం రాజకీయ కారణాలే కాకుండా ఇతరేతర కారణాలు కూడా సీఎం కేసీఆర్ ఈ సదస్సుకు గైర్హాజర్ కావడానికి కారణమై ఉంటుందన్న విశ్లేషణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాని మోడీని ఫేస్ చేయడం ఇష్టం లేదన్న ఒక్క కారణంతో ఇంత కీలకమైన సదస్సుకు సీఎం డుమ్మా కొట్టారా అన్న సందేహాలూ వ్యక్తం అవుతున్నాయి.
తెలంగాణలోని న్యాయవ్యవస్థ సమస్యల పరిష్కారంపై సీఎం, హైకోర్టు సీజే పలు నిర్ణయాలు తీసుకున్న
ప్పటికీ అవి అమలు కాకపోవడం.. దానిపై సీజేఐకు వివరణ ఇచ్చుకోవలసిన పరిస్థితిని దాటవేయడానికే సీఎం ఈ సదస్సుకు గైర్హజరయ్యారని పరిశీలకులు అంటున్నారు. తెలంగాణ కోర్టుల్లో దయనీయ పరిస్థితులపై రమణ చేసిన వ్యాఖ్యలు కేసీఆర్ డుమ్మాకు ఇది కూడా ఒక కారణమన్న భావన వ్యక్తం అవుతోంది. ఆర్భాటంగా నిర్ణయాలు ప్రకటించడం, ఆ తరువాత వాటి గురించి పట్టించుకోకపోవడం కేసీఆర్ శైలి.. ఆ కారణంగానే కోర్టులలో సదుపాయాలు, సౌకర్యాలపై కేసీఆర్ నిర్ణయాలు అమలు కాకపోవడంపై సమాధానం ఇచ్చుకునే పరిస్థితిని తప్పించుకోవడానికి కూడా కేసీఆర్ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు, రాష్ట్రాల ముఖ్యమంత్రుల సదస్సు గైర్హాజర్ కావడానికి ఒక కారణమై ఉంటుందని పరిశీలకులు అంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/-cm-absent-cji-furious-on-telangana-cs-39-135281.html
టీవీకే అధినేత విజయ్కు కాంగ్రెస్ మద్దతు తెలపడంపై ఆగ్రహంగా ఉన్న డీఎంకే.. కాంగ్రెస్కు కటీఫ్ చెప్పేసింది. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, లోక్సభలో తమ పార్టీ సభ్యులకు కాంగ్రెస్ ఎంపీలతో కాకుండా విడిగా సీటింగ్ కేటాయించాలని డీఎంకే ఎంపీ కనిమొళి స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
తాజా సమాచారం ప్రకారం.. విజయ్ తన పార్టీకి ఉన్న బలానికి తోడుగా మరో మూడు పార్టీల మద్దతును కూడగట్టుకున్నారు. ఆ పార్టీల మద్దతుతో అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118ని ఆయన సాధించారు.
తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవ్వగా.. మెజారిటీ నిరూపణ విషయంలో రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కచ్చితమైన నిబంధనలు పాటించాలని పట్టుబడుతున్నారు. విజయ్ కు తన పార్టీ ఎమ్మెల్యేలు 107 మందికి అదనంగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది.
పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనకు ముందే తెలుసని, నాయకత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు. అయితే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి.. క్షేత్రస్థాయిలో కేడర్ను కాపాడుకుంటూ వచ్చిన తనకు ఈ పరిణామం మనస్తాపానికి గురిచేసిందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు.
బాబు కూటమిని ఎందుకంత విలువైనదిగా భావిస్తున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూటమి ఎప్పుడెప్పుడు చీలిపోతుందాని కాచుకుని కూర్చుని ఉంది. ఏ అవకాశం వచ్చినా వారు వదిలిపెట్టినట్టే కనిపించదు. మొన్న కోట వినుత ఘటన, నిన్న అరవ శ్రీధర్ వ్యవహారం, ఇవాళ వర్మ ఇష్యూ.. ఇలా సమయం దొరికినపుడల్లా ఆయా అంశాలను బాగా హైలెట్ చేసి.. కూటమిలో ఏదో ఒక చిచ్చు రాజేయాలని చూస్తోంది వైసీపీ అధినాయకత్వం.
అతి కొద్ది మంది నేతలు జగన్ ప్రకటనను సమర్దిస్తూ.. అనుకూల ప్రకటనలు చేస్తుండగా.. మెజారిటీ లీడర్, క్యాడర్ మాత్రం జగన్ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
టీవీకే అధినేత విజయ్తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్రబాబు ఫొటోలేదని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వర్మ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జనసేన నేత, మాజీ ఎమ్మెల్యే దొరబాబు జోక్యం చేసుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వర్మ దురుసు వ్యాఖ్యలపై పార్టీలో అంతర్గతంగా చర్చించిన అధిష్టానం.. వర్మ వ్యవహారాన్ని తప్పుబట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.