75 రోజులు పూర్తయిన ‘వస్తున్నా...మీ కోసం’
Publish Date:Dec 20, 2012
Advertisement
ప్రజల కష్ట సుఖాలు తెల్సుకోవాలని, వారి కష్టాల్లో భాగస్వామి కావాలనే ఉద్దేశ్యంతో తెలుగు దేశం అధినేత చంద్ర బాబు నాయుడు ఎంతో చిత్తశుద్దితో మొదలు పెట్టిన ‘వస్తున్నా...మీ కోసం’ పాద యాత్రకు నిన్నటితో 75 రోజులు పూర్తయ్యాయి. అనంతపురం జిల్లా ఓ ఆంజనేయ స్వామి గుడి నుండి గత అక్టోబర్ 2 వ తేదీన బాబు తన పాద యాత్రను ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారు. ఈ 75 రోజుల్లో ఆయన ఆరోగ్యం నానా రకాలుగా దెబ్బతింది. ఒంట్లో షుగర్ స్థాయిలు గణనీయంగా పెరిగాయి. ఆయన కాళ్ళకు సగటు వ్యక్తి దాదాపు నడవలేని స్థితిలో ఉండే విధంగా బొబ్బలు కట్టాయి. అయినా, ఆయన ఇవేమీ ఆయన లెక్క చేయలేదు. ఈ యాత్రలో బాబు ఇప్పటివరకూ అనంతపురం, కర్నూలు, మహబూబ్ నగర్, రంగా రెడ్డి, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలు పూర్తి చేశారు. ప్రస్తుతం బాబు కరీంనగర్ జిల్లాలో తన యాత్రను సాగిస్తున్నారు. ఈ యాత్ర 74 రోజులు పూర్తయ్యేటప్పటికి బాబు 1251 కిలోమీటర్ల మేర తన యాత్రను పూర్తి చేశారు. ఆయన యాత్ర ప్రారంభమయి ఇప్పటికి 79 రోజులయింది. అయితే, మధ్యలో కాలికి గాయం అయిన కారణంగా ఓ సారి, ఎర్రన్నాయుడు మృతి కారణంగా మరో సారి మొత్తం నాలుగు రోజులు ఈ యాత్రకు బ్రేక్ పడింది. ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా బాబు ఎంతో సాహసోపేతంగా తన యాత్రను కొనసాగిస్తున్నారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
http://www.teluguone.com/news/content/-chandra-babu-naidu-pada-yatra-24-19880.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





